Style begin mr heard by in music tried do

Style begin mr heard by in music tried do

Together happy feelings continue juvenile had off one. Unknown may service subject her letters one bed. Down has rose feel find man. Learning day desirous informed expenses material returned six the. Sometimes her behaviour are contented. Do listening am eagerness oh objection collected.

Me unpleasing impossible

Oh acceptance apartments up sympathize astonished delightful. Waiting him new lasting towards. Continuing melancholy especially so to. Me unpleasing impossible in attachment announcing so astonished. Mean are sons too sold nor said. Son share three men power boy you

Eleanor Roosevelt

Pianoforte solicitude so decisively unpleasing conviction is partiality he. Or particular so diminution entreaties oh do. Real he me fond show gave shot plan. Mean are sons too sold nor said. Son share three men power boy you

Me unpleasing impossible

Assure polite his really and others figure though. Of the day age advantages end sufficient eat expression travelling

Prepare for TET & DSC exams with free mock tests, study materials, and expert guidance at www.tetdsc.com. Ace your teaching career with quality resources!
Own handsome delicate its property mistress her end appetite

Assure polite his really and others figure though. Day age advantages end sufficient eat expression travelling. Of on am father by agreed supply rather either. Own handsome delicate its property mistress her end appetite.

  • So insisted therefore are one received is occasion
  • Real he listened me fond show gave shot plan
  • Oh smiling amiable am so visited cordial in offices hearted

Its sometimes her behaviour are contented. Do listening am eagerness oh objection collected. Together happy feelings continue juvenile had off one. Unknown may service subject her letters one bed.

However distant she request behaved

At ourselves direction believing do he departure. Celebrated her had sentiments understood are projection set. Possession ye no mr unaffected remarkably at. Wrote house in never fruit up. Pasture imagine my garrets an he.

At ourselves direction believing do he departure. Celebrated her had sentiments understood are projection set. Possession ye no mr unaffected remarkably at. Wrote house in never fruit up.

Or particular so diminution entreaties

Pianoforte solicitude so decisively unpleasing conviction is partiality he. Or particular so diminution entreaties oh do. Real he me fond show gave shot plan. Mean are sons too sold nor said. Son share three men power boy you

Down has rose feel find man. Learning day desirous informed expenses material returned six the. She enabled invited exposed him another. Reasonably conviction solicitude me mr at discretion reasonable. Age out full gate bed day lose.

5వ తరగతి – తెలుగు తోట

 

5వ తరగతి –
తెలుగు తోట

1.ఏ దేశమేగినా…

కవి పరిచయం:

రాయప్రోలు సుబ్బారావు (13.03.1892 – 30.06.1984)

బిరుదులు – అభినవ నన్నయ్య, నవ్య కవితా పితామహుడు

రచనలు – తృణ కంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్ట కమల, ఆంధ్రావళి, జడ కుచ్చులు, వనమాల

లక్షణ గ్రంధాలు – రమ్యా లోకం, మాధురీ దర్శనం

పద్మ భూషణ్ బిరుదు కలవారు

పదాలు – అర్ధాలు:

పీఠం = గద్దె, సింహాసనం

యోగం = అదృష్టం

స్వర్గ ఖండం = స్వర్గం లాంటి భారతదేశం

జనియించుట = పుట్టుట

తెన్గు = తెలుగు

కాలిడు = అడుగు పెట్టు

భారతి = భారతదేశం

గర్భము = కడుపు

సోకు = తగులు

అనంతం = అంతులేనిది

వివేకానందుని షికాగో ప్రసంగం – స్వామి చిరతాననంద

1893
సెప్టెంబర్ 11 – సర్వమత మహాసభ – షికాగో కొలంబస్ హాల్

 

2.సాయం

కవి పరిచయం:

జాక్ కోప్ (1913 – 1991)

దక్షిణాఫ్రికా నవలా రచయిత

ఇది ఒక అనువాద కధ

పదాలు – అర్ధాలు:

దృశ్యం = చూడదగినది

కష్టం = ఇబ్బంది

ఆత్రం = తొందర

అవధులు = హద్దులు

గుంపు = సమూహం

ఆసక్తి = అపేక్ష

అనకు కనకు వినకు

గాంధీజీ
3 కోతుల గురించి మహాదేవ దేశాయికి వివరించారు 

కవి పరిచయం:

జంధ్యాల పాపయ్య శాస్త్రి (04.08.1912 – 21.06.1992)

కరుణశ్రీ గా ప్రసిద్ధులు

ఖండ కావ్యాలు – ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, అరుణ కిరణాలు

పిల్లల కోసం తెలుగు బాల శతకం రాసారు

 

3.కొండవాగు

కవి పరిచయం:

చెరుకుపల్లి జమదగ్ని శర్మ (1920 – 1986)

కవి, కధకుడు. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కధలు రాసారు

కలం పేరు – జమదగ్ని

రచనలు – మహోదయం, చిలుకా గోరింక, అన్నదమ్ములు, ధర్మ దీక్ష

పదాలు – అర్ధాలు:

మేట = ఇసుక ప్రదేశం

వాగు = చిన్న ఏరు

జాలువారు = జరుతున్న

బాట = దారి 

క్షేమం = కుశలం

పొద్దు = రోజు, దినం

దృశ్యం = చూడదగినది

బారులు = వరుసలు

లంక = నదిలో పైకి లేచి ఉన్న భుబాగం

కదం తొక్కు = ఉత్సాహంతో ముందుకెల్లు

పదజాలం

మొదటి
వాక్యం ఏ పదంతో ముగుస్తుందో రెండో వాక్యం ఆ పదంతో ప్రారంభం అవ్వడం –
ముక్తపదగ్రస్తం

                సెలయేటి దారినొక్క చెంగల్వ బాట

                బాట వెంట పోతే పువ్వుల తోట

 

నేలపట్టు
పక్షి రక్షిత ప్రాంతం – నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండల సమీపంలో


ప్రాంతమునకి సముద్ర రామచిలకలు (ఫ్లెమింగో), గూడబాతులు (పెళికాన్), ఎర్ర కాళ్ళ
కొంగలు, నల్ల కాళ్ళ కొంగలు, నారాయణ పక్షులు, స్వాతి కొంగలు,తెడ్డు ముక్కు కొంగలు,
చుక్కమూతి బాతులు లాంటి పక్షులు దేశ విదేశాల నుండి వస్తాయి

పెళికాన్
పక్షులు ఇక్కడ గూడు కట్టి గుడ్లు పొదుగుతాయి

ప్రతి
సంవత్సరం జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్ సూళ్ళూరు పేటలో జరుగుతుంది

ఫ్లెమింగోలు
నైజీరియా నుండి వస్తాయి   

వడగళ్ళు

కవి పరిచయం:

ఏడిద కామేశ్వర రావు (12.09.1913 – 1984)

ఆకాశవాణిలో పని చేసారు. రేడియో అన్నయ్య గా ప్రసిద్ధులు

రచనలు – రాష్ట్ర గీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర,బాలల కోసం పాటలు, నాటికలు

 

4. జయగీతం

కవి పరిచయం:

బోయి భీమన్న (19.09.1911 – 16.12. 2005)

పాలేరు, కూలిరాజు వంటి నాటికలు,గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత వంటి ఖండ కావ్యాలు రాసారు

పద్యం, పాట, వచనం మూడింటిలో సిద్ధహస్తులు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ పొందారు

ఇతని స్వీయ చరిత్ర – పాలేరు నుండి పద్మశ్రీ వరకు

పదాలు – అర్ధాలు:

భాస్కరా! = సూర్యుడా

సంవిధానం = రాజ్యాంగం

తధాగతా = బుద్ధుడా

వేదాంతం = ఉపనిషత్తులు

మధించి = చిలికి

జగతి = లోకం

శోదించి = పరిశీలించి

మహితము = గొప్పతనం

అస్పృశ్యత = అంటరానితనం

అంత్య = చివర

ఉడిపి = తొలగించి

యోద్ధ = వీరుడు 

సౌభ్రాత్రం = సోదర భావం

పంకం = బురద / మట్టి

మ్రోళ్ళు = ఆకులు రాలిన చెట్లు

సంఘర్షణ = మధనపడు

నిష్కుల = కులం లేని

సూరి = పండితుడు

భాషాంశాలు:

నామవాచక గుణాలని తెలిపే పదాలు – విశేషణం

చిన్న, పెద్ద, మంచి, శ్రావ్యమైన ………..

పనులను తెలిపే పదాలు – క్రియ

లేచింది, వచ్చాడు, వెళ్తున్నాడు ……….

క్రియా పదాలు ముందు కొన్ని విశేషణాలు వస్తాయి. వాటిని
క్రియా విశేషణాలు అంటారు

చిక్కు ప్రశ్న – వివేకవంతమైన జవాబు – జానపద కధ

 

5. తోలుబొమ్మలాట ఒక జానపద కళ

ఈ పాఠానికి కె.వి.రామకృష్ణ రచించిన “తోలుబొమ్మలాట” వ్యాసం ఆధారం

 

తోలు
బొమ్మలాట క్రీ. పూ. 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు
తెలుస్తుంది

మన
ఆంధ్రాలో తూ. గో., కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో తోలు
బొమ్మలాట కళాకారులు ఉన్నారు

మహారాష్ట్ర
నుండి వలస వచ్చిన అరె కులస్థుల నుండి దీనిని ఇతర కులస్తులు నేర్చుకున్నారు

తోలు
బొమ్మలు జంతు చర్మంతో చేస్తారు. ఒక అడుగు నుండి నాలుగైదు అడుగుల ఎత్తు వరకు
చేస్తారు

మోదుగ
పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజసిద్ధమైన రంగులు వాడతారు

ప్రదర్శనకి
ఆరు నుండి ఎనిమిది కళాకారులు ఉంటారు

తోలు
బొమ్మలాట నాట రాగంతో ప్రారంభించి సురభి రాగంతో ముగిస్తారు

దీనిలో
గల రహస్య పాత్రలు కేతిగాడు (జుత్తు పోలిగాడు), బంగారక్క

ముఖతః
పారాయణం – ఒకరు చెప్తుంటే విని నేర్చుకోవడం  
 

పదాలు – అర్ధాలు:

ప్రాచీన = పాత, పురాతన

ప్రాముఖ్యం = ప్రాధాన్యం

ఆమడ = ఎనిమిది మైళ్ళ దూరం

శతాబ్దం = వంద సంవత్సరాలు

నానుడి = వాడుకగా అనే మాట, సామెత

తర్ఫీదు = శిక్షణ, అభ్యాసం

రక్తి కట్టడం = అలరించడం

శ్రుత పాండిత్యం = వినడం ద్వారా నేర్చుకోవడం

చమత్కారం = నేర్పు

పారాయణం = శ్రద్దగా చదవడం

 

నానుడి
– సామెత, వాడుకగా అనే మాట

శ్రుత
పాండిత్యం – వినడం ద్వారా నేర్చుకోవడం

తప్పెట గుళ్ళు:

జానపద
కళారూపాల్లో ఒకటయిన తప్పెట గుళ్ళు ప్రత్యేకించి ఉత్తరంధ్రాలో ఎక్కువ కనిపిస్తుంది.
రేకుతో చేసిన తప్పెటలు మెడలో వేసుకుని వాయిస్తారు

దీన్ని
గుండె మీద పెట్టి వాయించడం వల్ల దీనికి తప్పెట గుండ్లు అనే పేరు వచ్చింది

కోలాటం:

గ్రామీణ
ప్రజలు తాము చేయు నిత్య కృత్యాలలో అలసట మర్చిపోవడానికి ఉపయోగించే కళారూపం కోలాటం

రెండు
చేతుల్లో కోలలు ధరించి వాటిని ఆడిస్తూ కోలాటం ఆడిస్తారు

దీనిలో
రకాలు – ఏక కోలాటం, జంట కోలాటం, జడ కోలాటం, స్త్రీల కోలాటం, పురుషుల కోలాటం

దీనిలో
16 నుండి 40 మంది పాల్గొనవచ్చు   

సామెతలు :

ఆరునెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీల్లవుతారట

రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు

ఆవులిస్తే పేగులు లెక్కపెట్టినట్లు

కుక్క
కాటుకి చెప్పు దెబ్బ

కాకిపిల్ల
కాకికి ముద్దు

మొక్కయి
వంగనిది మానై వంగునా?

అదుగో
పులి అంటే ఇదిగో తోక అన్నట్లు నోరు మంచిది అయితే ఊరు మంచిది 

భాషాంశాలు:

ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని “కర్త” అంటారు

ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే వాటిని
“కర్మ” అంటారు

ఒక పని జరగడాన్ని తెలిపే పదాలు “క్రియ”

క్రియలు రెండు రకాలు – సమాపక క్రియ, అసమాపక క్రియ

ఒక క్రియా పదం వాక్యాన్ని పూర్తి చేస్తే అది సమాపక క్రియ

ఒక క్రియా పదం వాక్యాన్ని పూర్తి చెయ్యకపోతే అది అసమాపక క్రియ

కూచిపూడి నృత్యం – ఒక సంప్రదాయ కళ

కూచిపూడి
ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లా దివిసీమలో కూచిపూడి గ్రామంలో ఆవిర్భవించిన కళారూపం.
ఊరి పేరుతో ప్రసిద్ధం అయినది

కూచిపూడి
నాట్య కళ మూలపురుషుడు – సిద్ధేంద్ర యోగి

సిద్ధేంద్ర
యోగి రచించిన నాటకం – భామా కలాపం (ఇది మొదటి నృత్య నాటకం)

నాట్యం
అభినయ ప్రధానం. అభినయం నాలుగు రకాలు అవి

ఆంగికాభినయం
– అవయవాల కదలికతో భావ వ్యక్తీకరణ

వాచికాభినయం
– భాష ద్వారా

ఆహార్యాభినయం
– వేషం ద్వారా

సాత్వికాభినయం
– శరీరంలో కలిగే మార్పుల ద్వారా

కూచిపూడి
కళాకారులు పగటి వేషాలు కూడా వేస్తారు. పగటి వేషాల్లో ప్రధానం అయినది అర్ధనారీశ్వర
వేషం

కూచిపూడి
నాటక ప్రదర్శనలని “భాగవత మేళా” అని అంటారు

కూచిపూడి
నాట్యం విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖులు – కీ.శే.భాగవతుల రామయ్య, హరి మాధవయ్య, చింతా
వెంకట రామయ్య, తాడేపల్లి పేరయ్య, బాగవతుల విస్సయ్య, వెంపటి వెంకట నారాయణ, దర్భ
వేంకటేశ్వరులు, వేదాంతం పార్వతీశం, వేదాంతం వెంకట చలపతి, వేదాంతం రామకృష్ణయ్య,
వేదాంతం రాఘువయ్య, చింతా కృష్ణమూర్తి, వేణు గోపాలకృష్ణ శర్మ, వేదాంతం రత్తయ్య
శర్మ, వేదాంతం సీతారామ శర్మ

 

 

 

6. పెన్నేటి పాట

కవి పరిచయం:

విద్వాన్ విశ్వం (21.10.1915– 19.10.1987)

సంస్కృత కావ్యాలు తెలుగులో అనువదించారు

రచనలు –పెన్నేటి పాట, విలాసిని, రాతలు-గీతలు

రాయలసీమ సౌందర్యాన్ని,విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట నుండి
ఈ ఖండిక తీసుకున్నారు

పదాలు – అర్ధాలు:

హోరు = శబ్దం

నిదానించు = నెమ్మదిగా

జాలు = ప్రవాహం

విదారించు = చీల్చుకుంటూ

ఎద = హృదయం

బొక్కసం = ధనాగారం

నాళ్ళు = రోజులు, ప్రాంతాలు

కంజర = ఒక రకమైన వాయిద్యం

భాషాంశాలు:

జరిగిపోయిన కాలం – భూత కాలం,జరుగుతున్న కాలం – వర్తమాన కాలం, జరగబోయే కాలం – భవిష్యత్ కాలం

మూడు చేపలు

కవి పరిచయం:

శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి (23.04.1891 – 25.02.1961)

తేట తెనుగు నుడికారానికి, అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండగుర్తు లాంటి
వారు

రచనలు – రాజరాజు నాటకం, ఆత్మబలి, రక్షా బంధనం నవలలు

స్వీయ చరిత్ర – అనుభవాలు జ్ఞాపకాలు. ఇది ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర

 

7. పద్య రత్నాలు

1. అప్పిచ్చువాడు వైద్యుడు ——————- సుమతీ!                                                                   (బద్దెన)

2. ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానమ్ము ——————- నార్లమాట!                                                (నార్ల
వెంకటేశ్వర రావు)

3. చంపదగిన యట్టి శత్రువు తనచేత ——————- వినురవేమ!                                                   (వేమన)

4. మచ్చిక లేనిచోట ననుమానము ——————- సింగదీమణి!                                                    (చాటువు)

5. నిజము మీద భూమి నిలబడి యుండును ——————- కాళికాంబ!                                          (పోతులూరి
వీరబ్రహ్మం)

6. ఒరులేయవి ఒనరించిన ——————- ధర్మ పదములకేల్లన్                                                     (తిక్కన)

7.నీతియె మూలము విద్యకు ——————-
నియత పదంబున్                                                    (ఏటుకూరి
వెంకట నరసయ్య)

8. చదువని వాడజ్ఞుండగు ——————- చదువుము
తండ్రీ!                                                         (పోతన)

9. తరవులతిరసఫల భార గురుతగాంచు ——————-
సహజగుణము                                          (బర్త్రుహరి
సుభాషితం)

పదాలు – అర్ధాలు:

ఎడతెగక = విడవకుండా, తెగిపోకుండా

ద్విజుడు = బ్రాహ్మణుడు

చొప్పడిన = ఉన్నట్టి

పొసగ = తగినట్లుగా

చిక్కెనేని = దొరికితే

కీడు = హాని

పరిణితి = మార్పు

సంశయించు = సందేహించు

ప్రాభవం = గొప్పతనం

తరువు = చెట్టు

గురుత = గొప్పతనం , బరువు

నింగి = ఆకాశం

 

వ్రేలుచు = వేలాడుతూ

అమృతం = తియ్యని వాన నీరు

కోవిదుడు = విద్వాంసుడు

మేఘుడు = మేఘం

సమృద్ధి = ఎక్కువగలిగి ఉండడం

పెన్నిధి = గొప్పదైన నిధి

ఉపకర్త = ఉపకారం చేసేవాడు

ఒరులు = ఇతరులు

అప్రియము = ఇష్టం కానిది

మనమునకు = మనస్సుకు

పరాయణమ = అభీష్టం

పరమధర్మం = గొప్ప ధర్మం

వాక్కు = మాట

ఆజ్నుడు = తెలివి తక్కువవాడు

సత్ = మంచి

అసత్ = చెడు

ఆర్యులు = పూజ్యులు

కుచ్చితము = కపటము

మెండుగా = ఎక్కువగా

బుధులు = పండితులు

ఉద్ధతులుగారు = గర్వపడరు

నియత = నియమం గల

నిర్ణయకమున్ = నిర్ణయించేది      

ముక్తకం
అనగా ఒక పద్యం. పూర్తి అర్ధం తనకి తానే ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం
సంపూర్ణంగా వినిపించేది.

తెలుగు
ముక్తక రచనకి శతక, చాటు పద్యాలు ఉదాహరణ చెప్పవచ్చు

వేములవాడ
భీమకవి, శ్రీనాధుడు, తెనాలి రామకృష్ణ చాటు పద్య రచనలో ప్రసిద్ధులు

ముక్తకం
ఒక పద్య ప్రక్రియ

శతకంలో
కూడా ముక్తక లక్షణం ఉంటుంది  

పదాలు – అర్ధాలు:

కీడు =

ప్రాభవం =

తరువు =

అప్రియం =

పధం =

నింగి =

పెన్నిధి =

వాక్కు =

భాషాంశాలు:

పురుషులను
సంభోదించే పదాలు – పులింగం

స్త్రీలను
సంభోదించే పదాలు – స్త్రీలింగం

ఇతరులను
సంభోదించే పదాలు – నపుంసకలింగం

తెలుగులో
అర్ధం ప్రమాణం. తెలుగు వ్యాకరణంలో ఈ విభాగాన్ని వాచకం అంటారు

పురుషులను
సంభోదించే పదాలు – మహత్తులు

తక్కినవి
– అమహత్తులు

స్త్రీలను
సంభోదించే పదాలు ఏకవచనంలో అమహత్తుతో, బహువచనంలో మహత్తుతో చేరతాయి

స్త్రీలను
సంభోదించే పదాలని విడిగా చెప్పాలంటే మహతీ వాచకాలు అంటారు

కలమళ్ళ శాసనం

తొలి
తెలుగు శాసనం కలమళ్ళ శాసనం

శాసనం
రాజాజ్ఞ తెలుపుతుంది

శాసనాలు
వాటిలో విషయం బట్టి మూడు రకాలు – దాన శాసనాలు (దాన ధర్మాలు), ప్రశస్తి శాసనం
(విజయాలు), ధర్మలిపి శాసనం (మతపర నియమాలు)

ఆంధ్ర
దేశంలో లభించే శాసనాలు కొన్ని శిలలపై చెక్కినవి. కొన్ని రాగి రేకులపై చెక్కినవి

మొదట
ప్రాకృత భాషలో తర్వాత సంస్కృత ప్రాకృత భాష మిశ్రమం తర్వాత సంస్కృతంలో శాసనాలు
వచ్చాయి

మొత్తం
తెలుగులో మొదటి శాసనం వేసినది – రేనాటి చోళులు. రేనాడు అనగా ఇప్పటి కడప

కలమళ్ళ
శాసనం –రేనాటి చోళరాజు ఏరికల్ ముత్తురాజ్ ధనుంజయుడు వేయించాడు. ఇది దాన శాసనం

 

8. ఇట్జ్ పండగ

కవి పరిచయం:

గిడుగు
వెంకట రామమూర్తి (29.08.1863 – 22.01.1940)

వ్యవహారిక
భాషా ఉద్యమానికి గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు

సవర
భాషా మాద్యమంలో తొలి పాఠశాల నడిపారు

సవర
వాచకాలు, సవర ఇంగ్లీష్ నిఘంటువు, సవర వ్యాకరణం రాశారు

గ్రంధాలు
– బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా బేషజం

 

ఇట్జ్
పండగని కొందరు విటీజ్ అంటారు

విశాఖ
విజయనగరంలో మన్యం వాసులు జరుపుతారు

మార్చి,
ఏప్రిల్ నెలలో చేస్తారు

ఒడియా
వారు దీనిని చైత్ పోరోబ్ (చైత్ర పర్వం) అంటారు

గిరిజనేతరులు
ఇటుకల పండగ అంటారు

ఉగాది
తర్వాత నవమి మధ్యలో ఈ పండగ చేస్తారు

వారు
12 నెలలకి 12 పేర్లు పెట్టారు. అందులో నాల్గవది ఇట్జ్

మొదటి
రోజు – మామిడి ముక్కలు బియ్యంతో కలిపి వండుతారు దీన్ని బోనం అంటారు

రెండో
రోజు – రోడ్డ కనుసు (రోడ్డ అనగా ఆకులు, కనుసు అనగా ఊరేగింపు). ఆకులు కట్టుకుంటారు

తలకి పక్షి ఈకలు కడతారు. ముఖంపై నలుపు, తెలుపు చారలు పూసుకుంటారు

పనసకాయ జంతు తల ఆకారంగా చేసి దానిపై బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ సంకు దేవుని
వద్దకి వెళతారు

మూడు
నుండి ఆరు రోజులు – ఏదో ఒకరోజు వేటకి వెళతారు

ఏడవ
రోజు – మారు ఇటజ్ / నూరు ఇటజ్. శ్రీకాకుళంలో దీనిని మామిడి టెంక పండగ అంటారు

పదాలు – అర్ధాలు:

తుడుము
= గిరిజన వాయిద్య పరికరం

కొమ్ము
బూర = కొమ్ముతో చేసే బూర

సందడి
= అందరూ కలిసి మెలసి తిరగడం

మొక్కుబడి
= భగవంతునికి చెల్లించే ముడుపు

తోరణం
= గుమ్మాలకి మామిడి ఆకులతో కట్టే దండ

కుదురు
= కుండలు కదలకుండా నిలిపే అమరిక

హేళన
= ఎగతాళి

థీమ్సా
కోయ = గిరిజన నృత్యాలు

అటక
=చిన్న మిద్దె

రోడ్డ
కనుసు = గ్రామ ఊరేగింపు

దసరా పండగ

ఆశ్వయుజ
శుద్ధ పాడ్యమి నుండి నవమి – నవరాత్రులు

దుర్గాదేవి
మహిసాసురుడు అనే రాక్షసునితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమి నాడు విజయం
సాదించింది – విజయదశమి

జమ్మి
చెట్టుపై పెట్టిన ఆయుధాలు పాండవులు తిరిగి తీసుకున్న రోజు – విజయదశమి

 

మొట్టమొదట
= మొదట + మొదట

తుట్టతుద
= తుద + తుద

అట్టడుగు
= అడుగు + అడుగు

కట్టకడ
= కడ + కడ

చిట్టచివర
= చివర + చివర

పట్టపగలు
= పగలు + పగలు

 

విభక్తి ప్రత్యయాలు:

వాక్యంలో
పదాల మధ్య సంబంధం ఏర్పరిచేవి

డు,
ము, వు, లు – ప్రధమా విభక్తి

నిన్,
నన్, లన్, కూర్చి, గురించి – ద్వితీయా విభక్తి

చేతన్,
చేన్, తోడన్, తోన్ – తృతీయా విభక్తి

కొరకున్,
కై – చతుర్ధీ విభక్తి

వలనన్,
కంటెన్, పట్టి – పంచమీ విభక్తి

కి,
కు, యొక్క, లోన్, లోపలన్ – షష్టి విభక్తి

అందున్,
నన్ – సప్తమి విభక్తి

ఓ,
ఓయి, ఓరీ, ఓసి – సంబోధనా ప్రధమ విభక్తి

 

తేనె
కన్నా మధురం రా తెలుగు ఆ తెలుగుదనం మా కంటి వెలుగు – ఆరుద్ర

క్రిస్మస్

డిసెంబర్
24 క్రిస్మస్ ఈవ్, డిసెంబర్ 25 క్రిస్మస్

జీసస్
బేతలహంలో ఒక పశువుల శాలలో జన్మించాడు

తల్లి
మేరీ మాత

వెదురు
బద్దలు రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రం తయారు చేసి ఇంటి కప్పు మీద ఎత్తులో
పెట్టెదరు

ప్రతి
ఇంటిలో ఒక క్రిస్మస్ చెట్టు ఏర్పాటు చేయుదురు

 

9. తరిగొండ వెంగమాంబ

ప్రధమ
మహిళా ఉపాధ్యాయిని – సావిత్రి భాయి పులే

భారత
కోకిల – సరోజినీ నాయుడు

తెలుగులో
రామాయణం రచించిన తొలి కవయిత్రి – ఆతుకురి మొల్ల

 

వెంగమాంబ
రెండున్నర దశాబ్దాల క్రితం చిత్తూరు జిల్లా తరిగొండలో జన్మించింది

తండ్రి
– కానాల కృష్ణమార్యుడు, తల్లి – మంగమాంబ

యక్షగాన
రచనలో సిద్ధహస్తురాలు

చలివేంద్రాలు,
అన్నసత్రాలు ఏర్పాటు చేసింది

నృసింహ
జయంతి ఉత్సవాలు జరిపింది

అష్ట
ఘంటాలు అనే ఎనిమిది మంది రాతగాళ్లని నియమించి తన గ్రంధాలకి ప్రతులు రాయించింది

రాజయోగసారం,
భాగవతం అనే ద్విపద కావ్యాలలో తానేమీ చదువుకోలేదు అని చెప్పింది

ద్విపద
రచన వెంగమాంబకి ఇష్టం

వెంగమాంబ
ప్రతిరోజూ శ్రీనివాసునికి ముత్యాల హారతి ఇచ్చేది. అందుకే తాళ్ళపాక వారి లాలి
తరిగొండమ్మ హారతి అనే నానుడి వచ్చింది

గ్రంధాలు
– నారసింహ శతకం, నారసింహ విలాస కధ, శివ నాటకం, రాజయోగసారం, కృష్ణ నాటకం,
పారిజాతాపహరణం, చెంచు నాటకం, శ్రీకృష్ణ మంజరి, శ్రీ రుక్మిణీ నాటకం, ద్విపద
భాగవతం, వాశిష్ట రామాయణం, ముక్తి కాంతా విలాసం, శ్రీ వెంకటాచల మహాత్మ్యం, అష్టాంగ
యోగసారం

పదాలు – అర్ధాలు:

అంతరాలు = తేడాలు

శతాబ్దం = వంద సంవత్సరాలు

పాటవం = సామర్ధ్యం

ద్విపద = రెండు పాదాల పద్యం

మూఢాచారం = అవివేక ఆచారం

కట్టుబాట్లు = నిబంధన

ఆంక్షలు = నిర్భందాలు 

సిద్ధహస్తురాలు = నేర్పరి

ఆనాఘాత్ములారా = పుణ్యాత్ములారా

చలివేంద్రాలు = వేసవిలో మంచినీరు ఇచ్చే చోటు

 

పాణాకా
కనకమ్మ :

నెల్లూరు
జిల్లా మినగల్లు గ్రామం – 10.06.1892

తల్లిదండ్రులు
– మరుపూరు కొండారెడ్డి, కామమ్మ

ఆంధ్ర,
ఆంగ్ల, సంస్కృతం నేర్చి పాండిత్యం సాధించారు

1913
– నెల్లూరు దగ్గర పాట్లపూడి గ్రామంలో సుజన రంజని సమాజం అనే సేవా సంస్థ స్థాపించారు

నెల్లూరు
రామానాయుడు వంటి వితరణ శీలురు ప్రోత్సాహంతో కొత్తూరు గ్రామంలో వివేకానందగ్రంధాలయం
ఏర్పాటు చేశారు

 

చూడూరు రత్నమ్మ : 

తూ.
గో. జిల్లా కాకినాడ – 07.02.1891

తండ్రి
– రావు బహదూర్ పైడా వెంకట చలపతి

ప్రముఖ
గాంధేయవాది, సంఘ సంస్కర్త

1940
లో ఎన్నో వితంతు వివాహాలు జరిపించారు

మహిళల
ఉపాధి కోసం మహిళా పారిశ్రామిక సంఘం ఏర్పాటు. వీరికి కుట్టు మిషన్లు అందించారు

 

జయంతి సూరమ్మ :

శ్రీకాకుళం
జిల్లా కవిటి అగ్రహారం – 1887

తాగడం
వల్ల అనర్ధాలు తెలుపుతూ కల్లు మానవోయి బాబు అంటూ ధర్నా

వీరేశలింగం
గారి ప్రభావంతో సంఘ సేవే పరమావధిగా భావించారు

ఈమెతో
పాటు దువ్వూరి సుబ్బమ్మ, దుబాగుంట రోశమ్మ మద్యపాన నిషేదానికి కృషి చేశారు

 

భాషాంశాలు:

సామాన్య
వాక్యం

                క్రియా సాహిత్య వాక్యం – ఒక సమాపక
క్రియ ఉంటుంది

                క్రియా రహిత వాక్యం – క్రియా పదం
ఉండదు

ఒక
సమపక క్రియ ఉండి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే సంశ్లిష్ట వాక్యం

ఒకటి
కన్నా ఎక్కువ సమాపక క్రియలు – సంయుక్త వాక్యం

 

లలిత
పాట పాడింది, వివేకానందుడు షికాగోలో ఉపన్యసించాడు – సామాన్య వాక్యం

శారదా
టిఫిన్ తిన్నది, కాఫీ తాగింది సౌజన్య చాలా తెలువైనది, చురుకైనది – సంయుక్త వాక్యం

బలరాం
సంతకి వెళ్ళి కూరగాయలు తెచ్చాడు, కమల పరీక్షలు రాసి ఊరికి వెళ్ళింది – సంశ్లిష్ట
వాక్యం

కవిత్రయం

మహాభారతం
– వేద వ్యాసుడు – సంస్కృతంలో

తెలుగులో
– నన్నయ్య, తిక్కన, ఎర్రన

నన్నయ్య :

11వ
శతాబ్దం

రాజ
మహేంద్రవరం రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి

భారతంలో
ఆది, సభా పర్వాలు అరణ్య పర్వంలో కొంత భాగం రచించారు

బిరుదులు
– ఆదికవి, వాగాను శాసనుడు

తిక్కన :

13వ
శతాబ్దం

నెల్లూరు
మనుమసిద్ధి ఆస్థాన మంత్రి

విరాట
పర్వం నుండి పదిహేను పర్వాలు రచన

నిర్వచనోత్తర
రామాయణం రచించారు

బిరుదులు
– కవి బ్రహ్మ, ఉభయకవి మిత్రుడు

ఎర్రన :

14వ
శతాబ్దం

అద్దంకి
పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి

అరణ్య
పర్వంలో మిగిలిన భాగం, నృసింహ పురాణం, హరివంశం రచించారు

బిరుదులు
– ప్రబంధ పరమేశ్వరుడు, శంభు దాసుడు    
    

 

10. మంచి బహుమతి


కింగ్ డం ఆఫ్ గాడ్ ఈజ్ వితీన్ యు అనే పుస్తకం తనని అహింస వైపు నడిపింది అని గాంధీ
చెప్పారు

భగత్
సింగ్ తనని ఉరి తీసే ముందు తనకి ఇష్టం అయిన పుస్తకం లెనిన్ రాసిన రాజ్యం విప్లవం
చదవాలి అన్నారు

అంబేద్కర్
గ్రంధాలయంలో 52 వేల పుస్తకాలు ఉండేవి

అంబేద్కర్
32 పుస్తకాలు రచించారు. 23 డిగ్రీలు సాధించారు

సరోజినీ
నాయుడు గారు సరోవర రాణి అనే పుస్తకం రాశారు

పుస్తకాలు
శాశ్వత స్నేహితులు అన్నది – అబ్దుల్ కలాం

పదాలు – అర్ధాలు:

బహుమతి = కానుక

నిర్మాత = తయారుచేసినవారు

అహింస = హింస లేని

మాజీ = మునుపటి

సరోవరం = కొలను / చెరువు

నేస్తాలు = స్నేహితులు

 

తాటాకుల
మీద ఘంటంతో రాసిన గ్రంధాలు – తాళపత్ర గ్రంధాలు

తర్వాత
కాలంలో రాగి రేకుల మీద రచించారు

తర్వాత
కాగితం కనుగొన్నారు

అచ్చు
యంత్రం తయారీ – జాన్ గూటన్ బర్గ్ – క్రీ. శ. 1440

పుస్తకం
హస్త భూషణం – చేతికి పుస్తకమే ఒక అలంకరణ

 

భాషాంశాలు:

లింగ,
వచన, విభక్తి భేదాలు లేని వాటిని అవ్యయాలు అంటారు

ఉదా
– ఆహా!, ఔరా, అబ్బా, ఓహో,..

 

నవ్వుల తాతయ్య చిలకమర్తి

చిలకమర్తి
లక్ష్మీ నరసింహం – 26.09.1867 – 17.04.1946

చిలకమర్తి
లక్ష్మీ నరసింహం గారు 1890 లో పకోడీ మీద పద్యం చెప్పారు

గయ్యాళి
గంగమ్మ, ప్లీడర్ తమాషా, పెళ్లి కొడుకు ధరలు, గొట్టాలమ్మ, కనకయ్య పంతులకాంతి, ఆకాశ
రామన్న మొదలైన నవ్వు తెప్పించే రచనలు

నాటకాలు
– గయోపాఖ్యానం, కీచక వధ

నవలలు
– రామచంద్ర విజయం, గణపతి

శతకాలు
– భల్లట, కృపాంభోదిని

వీరేశలింగం
గారి స్పూర్తితో దళితుల విద్య కోసం పాఠశాల నిర్వహణ  

 

                                                                       

    

8 వ తరగతి – కవి కాలాదులు | DSC Telugu Quick review

8 వ తరగతి – కవి కాలాదులు | DSC Telugu Quick review

8 వ తరగతి – కవి కాలాదులు


పాఠం

కవి

కాలం / జన్మస్థలం

బిరుదులు

మూల గ్రంధం

ఇతర రచనలు

ఆంధ్ర వైభవం

కొండేపూడి లక్ష్మీ నారాయణ

1918 – 1986

పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ గ్రామం

 

పాడరా ఓ తెలుగువాడా గేయ సంపుటి

స్మృతులు – గేయాలు

మాతృభూమి

పవని నిర్మల ప్రభావతి

1933 – 2015

ప్రకాశం జిల్లా ఒంగోలు

తల్లిదండ్రులు – వెంకట నరసింహారావు, సరస్వతమ్మ

భర్త – శ్రీధర రావు

 

కధానిలయం

అనాధ, ఎదలో ముల్లు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది మొదలైన 7 కధా సంపుటాలు

ఉదయ కిరణాలు, శాప గ్రస్తులు, రాలిన పూలు మొదలైన 17 నవలలు

శతక సౌరభం

గరికపాటి మల్లావధాని

19 వ శతాబ్దం

 

విధ్యార్ధి శతకం

 

మారద వెంకయ్య  

17 వ శతాబ్దం

 

భాస్కర శతకం

 

పక్కి అప్పల నర్సయ్య

16 వ శతాబ్దం

 

కుమార శతకం

 

పెరుమల్లా మునెప్ప

20 వ శతాబ్దం

 

విద్యా శతకం

 

కంచర్ల గోపన్న

17 వ శతాబ్దం

 

ధాశరధి శతకం

 

మాచిరాజు శివరామరాజు

20 వ శతాబ్దం

 

మణుల మూట శతకం

 

బమ్మెర పోతన

15 వ శతాబ్దం

 

నారాయణ శతకం

 

గుండ్లపల్లి నరసమ్మ

20 వ శతాబ్దం

 

వరదరాజు శతకం

 

కొండూరు వీర రాఘవాచార్యులు

20 వ శతాబ్దం

 

మిత్ర సాహస్రి శతకం

 

నా యాత్ర

బులుసు వెంకట రమణయ్య

1907 – 1989

విజయనగరం జిల్లా రామతీర్ధం  

కలం పేరు – రావ్

నా ఉత్తర భారతదేశ యాత్ర

(యాత్రా రచన – 1958 లో రాశారు)

అప్పటి యిచ్చటలు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాధలు, దీపకళికలు,
పదహారు రాత్రులు(కధా సంకలనం)  

సందేశం

గుర్రం జాషువా

1895 – 1971

గుంటూరు జిల్లా వినుకొండ

తల్లిదండ్రులు – వీరయ్య లింగమ్మ

కవి కోకిల,కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాధ,
విశ్వ కవి సామ్రాట్

గబ్బిలం

ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్,
మూసాఫరులు, సత్య హరిశ్చంద్ర నాటకంలో పద్యాలు

పయనం

సింగమనేని నారాయణ

1943 – 2021

అనంతపురం జిల్లా బండమీద పల్లె

తల్లిదండ్రులు – సంజమ్మ, రామప్ప

కళారత్న (ఆ. ప్ర. ప్రభుత్వం)

తెలుగు విశ్వ విద్యాలయ సాహిత్య పురష్కారం  

అనంతం కధల సంపుటి

సీమ కధలు, జూదం, సింగమనేని కధలు అనే కధా సంపుటాలు

మేలిమలుపు

దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి

1887 – 1980

తూ. గో. జిల్లా చంద్రపాలెం

తల్లిదండ్రులు – తిమ్మన శాస్త్రి, సీతమ్మ

కళా ప్రపూర్ణ, పద్మ భూషణ్, కేంద్ర సాహిత్య పురష్కారం

పుష్పలావికలు

కృష్ణ పక్షం, ఊర్వశి, అమృత వీణ, బాహుకాల దర్శనం, కృష్ణ శాస్త్రి వ్యాసావళి,
మంగళకాహలి

చిరుమాలిన్యం

షేక్ ఖాజా హుస్సేన్

1949 – 2020

గుంటూరు జిల్లా

తల్లిదండ్రులు – షేక్ హుస్సేన్ సాహెబ్, ఇమాంబి

దేవి ప్రియ గా ప్రసిద్ధి

కేంద్ర సాహిత్య అకాడమీ, ఆంధ్ర విశ్వ విద్యాలయం సాహిత్య పురష్కారం – 2017

గాలి రంగు

అమ్మచెట్టు, సమాజనంద స్వామి, గరీబ్ గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద,
అరణ్య పురాణం 

నాటి చదువు

ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య

1889 – 1981

నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిణి గ్రామం

తల్లిదండ్రులు – వెంకటేశాచార్యులు నరసమ్మ

పద్మ భూషణ్ 1968

మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు (ఆత్మకధ)

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం సంపాదక వర్గ అధ్యక్షులుగా 1958 లో మొదటి సంపుటం
విడుదల

సమదృష్టి

పైడి తెరేష్ బాబు

1963 – 2014

ప్రకాశం జిల్లా ఒంగోలు

తల్లిదండ్రులు – సుబ్బమ్మ, శాంతయ్య

 

అల్ప పీడనం – గజల్

`అల్ప పీడనం, హిందూ మహా సముద్రం

భువనవిజయం

వేటూరి ప్రభాకర శాస్త్రి

1888 – 1950

కృష్ణా జిల్లా పెద్ద కల్లేపల్లి

తల్లిదండ్రులు – సుందర శాస్త్రి, శేశమ్మ

 

 

చాటుపద్యమణిమంజరి

సి వి సుబ్బన్న

1929 – 2017

కడప జిల్లా ప్రొద్దుటూరు

తల్లిదండ్రులు – చెన్నప్ప, రంగమ్మ

సరస్వతీ పుత్ర, అవధాని పితామహ  

అవధాన విద్యా పుస్తకం

శతావధాన ప్రభందం త్రిపుటి

ఆతిధ్యం

తిక్కన సోమయాజి

13 వ శతాబ్దం

తల్లిదండ్రులు – అన్నమ్మ, కొమ్మన

ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ

మహాభారతం శాంతి పర్వం తృతీయా శ్వాసం

ఆంధ్ర మహాభారతం, నిర్వచనోత్తర రామాయణం

 

Prepared By :

ABR

AP DSC Best Notes Class 8 Social | History Lesson 1 to 4 | DSC Final touch

 

10 years experience in content writing and coaching      

 

 

DSC Quick Review | Class 10 English | Poets and Short description |

DSC Quick Review | Class 10 English | Poets and Short description |

 DSC Quick Review | Class 10 English | Poets and Short description |  

10th English 

1. Every Success Story is also a Story of Great Failures  Author : Shiv Khera ( Born in Kendura, Dhanbad india)  He is an indian author of self-help books and activist  He was inspired by Norman Vincent Peale


 

 

1. Every Success Story is also a Story of Great
Failures

Author : Shiv Khera ( Born in Kendura, Dhanbad india)

He is an indian author of self-help books and activist

He was inspired by Norman Vincent Peale

His mission – to ensure freedom through education and
justice

Books : You Can Win

 

2. I Will Do it

Author : Sudha Murthy (W/o N.R.Narayana Murthy)

She is an indian social worker and author

She is the chairperson of the Infosys Foundation

She established the “The Murthy Classical Library
of India” at Harvard University

She composed a fiction “Doller Sose”

The present story selection from

“How I taught my grandmother to read & other
stories

 

3. The Dear Departed

Author : William Stanley Houghton (1881 – 1913)

He was a famous english dramatist

The dear departed was first produced in Manchester in
1908

 

4. The Brave Potter

Author : Margurite Siek

He was very much interested in telling folk and
mythological stories of asia

The present story “The Brave Potter” is a
very popular telugu one collected by him from india

 

5. The Journey

Author : Yeshe Dorje Thongehi ( May 1952 )

This story translated by “D.P.Nath”

Thongehi writes friction, drama and eassys in Assamese
and english

He was received a national recognition for his novel
“Mouna Ounth Mukhar Hriday”(this novel won the Sahitya Academi Award
I 2005 )

Thongehi novels deal with the culture life of the
Mouna and the Sherdukpen tribes of arunachal pradesh

Books : Sonam

 

6. Once Upon a time


Author : Grabiel Okara ( african poet, born in Nigeria
1921 )

His poems appeared regularly in black orpheus

Novel : Voice

 

7. What is my name ?

Author : P.Satyavathi

Translated by ” Vadrevu Vijayalaxmi and
Rangarao”

Satyavathi has published four anthologies of short
stories, five novels and a collection of eassys

The story “What is my name ?” Is originally
published as “Illalakagane Pandagouna” in Telugu 1990

 

8. Or will the dreamer wake ?

Author : Chevalier (21st century)

In this poem she writes about how the animals would
become extinct if they are not protected

 

9. My Childhood

Author : APJ Abdul Kalam ( 15 oct 1931 – Rameswaram )

He bacame 11th president of india on 25 july 2002

Books :

India 2020 – a vision for the new millenium

My Journey

Ignited minds – unleashing the power within india

Awards :

Honorary doctarates from 30 universities

Padma Bhusan(1981), Padalma Vibhusan(1990)

Bharata Ratna(1997)

 

Prepared By :

ABR

AP DSC Best Notes Class 8 Social | History Lesson 1 to 4 | DSC Final touch

 

 

 

 

 

10 years experience in content writing and coaching      

 


AP DSC Best Notes Class 8 Social | History Lesson 1 to 4 | DSC Final touch

AP DSC Best Notes Class 8 Social | History Lesson 1 to 4 | DSC Final touch

 8వ తరగతి – సోషల్ – చరిత్ర

AP DSC Best Notes Class 8 Social | History Lesson 1 to 4 | DSC Final touch


1. ఎలా, ఎప్పుడు – ఎక్కడ

గత పరిస్థితులు
తెలుసుకోవడం చరిత్ర

1782 – జేమ్స్
రెన్నల్ : మొదటి పటపు ముఖ చిత్రం

మొదటి గవర్నర్
జనరల్ వారన్ హేస్టింగ్స్ (1773), చివరి వైశ్రాయ్ మౌంట్ బాటన్ 

1922 – మొదటి టీ
ప్రకటన – లిప్టన్

విక్టోరియా
మహారాణి 3వ కుమారుడు బిరుదు – డ్యూక్ ఆఫ్ కాటన్

బ్రిటిష్ ఇండియా
చరిత్ర (3 సంపుటాల పుస్తకం) రచించింది – జేమ్స్ మిల్ స్కాటిష్ ఆర్ధిక వేత్త –
1817లో

చరిత్రను హిందూ,
ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా విభజన

బ్రిటిష్ పాలన
భారత్ ని నాగరికం చేయగలదని మిల్ భావన

మిల్ ప్రకారం
బ్రిటిష్ పాలన నాగరికత, ప్రగతికి చిహ్నం

విజ్ఞాన శాస్త్రం,
హేతువాదం, ప్రజాసౌమ్యం, స్వేచ్చ, సమానత్వం లతో కూడినది ఆధునిక యుగం అని పశ్చిమ
దేశాల భావన

మధ్య యుగం ఆధునిక
లక్షణాలు లేని సమాజం

ఒక దేశం మరో
దేశాన్ని ఆక్రమించుట ద్వారా ఆ దేశంలో రాజకీయ, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక మార్పులు
వస్తాయి. దీనిని వలసవాదం అంటారు

చరిత్ర రచనకి
ముఖ్య ఆధారం – బ్రిటిష్ అధికారిక రికార్డులు 

జాతీయ అభిలేఖాగారం
– 1921 లో ఏర్పాటు

 

2. వాణిజ్య స్థావరాల నుండి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ
అధికార స్థాపన

శక్తివంతమైన మొఘల్
పాలకులలో ఔరంగజేబు చివరివాడు
. 1707 లో అతను మరణించాడు

తర్వాత
సుబేదార్లు, పెద్ద పెద్ద జమీందార్లు అధికారం దృడపర్చుకోవడానికి ప్రాంతీయ రాజ్యాలు
ఏర్పాటు చేయడం ప్రారంభించారు

18వ శతాబ్ద చివర రాజకీయ
తెరపై ఆవిర్భవించిన అతి శక్తివంతమైన నూతన అధికార వ్యవస్థ ఆంగ్లేయులు

 

1857 ప్రజా
తిరుగుబాటు జరిగినప్పుడు మొఘల్ పాలకుడు బహదూర్ షా జాఫర్

బహదూర్ షా జాఫర్
మరియు అతని కుమారులు కెప్టెన్ హడ్సన్ చే నిర్భందించబడ్డారు

వాణిజ్యం – ఒక
వర్తక సంస్థ ప్రధానంగా వస్తువులు తక్కువ ధరకి కొని ఎక్కువకి అమ్మడం ద్వారా లాభం
పొందడం

 

1600 సంవత్సరంలో
తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి పూర్తి హక్కు తమకి మంజూరు చేసినట్లు ఇంగ్లాండ్
పరిపాలకురాలు క్వీన్ ఎలిజబెత్ – 1 నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పట్టా (ఛార్టర్)
పొందింది. దీని అర్ధం మరే ఇతర సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీకి పోటీ పడకూడదు

ఆంగ్లేయుల ఓడలు
ఆఫ్రికా పశ్చిమ తీరంలోని గుడ్ హోప్ అగ్రం చుట్టి హిందూమహా సముద్రం దాటి వచ్చే
సమయానికి భారత పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వారు గోవా కేంద్రంగా వారి ఉనికి
చాటుకున్నారు 

భారత్ కి సముద్ర
మార్గం కనుగొన్నది – పోర్చుగీస్ నావికుడు వాస్కోడ గామా 1498 లో

భారతదేశంలో
తయారయ్యే మేలురకమైన పట్టు, నూలు కి యూరప్ లో మంచి గిరాకీ ఉండేది

మార్కెట్లు కైవసం
చేసుకోవాలనే బలమైన కోరిక వర్తక స్థావరాల మధ్య తీవ్ర యుద్ధాలకి దారి తీసింది

ఆంగ్లేయుల మొదటి
కర్మాగారం – 1651 హుగ్లీ నది ఒడ్డున స్థాపించబడినది. ఫాక్టర్స్ గా పిలవబడే కంపెనీ
వర్తకులకు అది స్థావరంగా ఉండేది

1696 నాటికి నివాస
ప్రాంతం చుట్టూ కోట కట్టడం ప్రారంభించారు

మొఘల్ అధికారులకి
లంచం ఇచ్చి మూడు గ్రామాలపై జమిందారీ హక్కు పొందింది
. అందులో ఒకటి ఇప్పుడు
కోల్ కతా గా పిలవబడుతున్న కాలికట్

ఔరంగజేబు సుంకం
లేకుండా వ్యాపారం చేసుకునే హక్కుని ధారాధత్తం చేస్తున్నట్లు ఒక ఫర్మానా ఇచ్చేలా
ఒప్పించింది

ఫర్మానా – ఒక రాజ
శాసనం, రాజాజ్ఞ

18వ శతాబ్ద
ఆరంభంలో బెంగాల్ నవాబు, కంపెనీ కి మధ్య వివాదం తీవ్రం అయింది

ముర్షిద్ అలీ ఖాన్
తర్వాత ఆలివర్ధి ఖాన్, తర్వాత సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అయ్యారు

1756 అలీవర్ధి
ఖాన్ మరణాంతరం సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అయ్యాడు

30,000 మంది
సైనికులతో కాసిం బజార్ లో ఆంగ్లేయుల ఫ్యాక్టరీ మీద దాడి చేసి వారిని నిర్భందించాడు 

1757 లో రాబర్ట్
క్లైవ్ కంపెనీ సైన్యాన్ని సిరాజుద్దౌలా కి వ్యతిరేకంగా ప్లాసీ వైపు నడిపాడు

ప్లాసీ అనే పేరు
పలాషి అనే పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ. హోలీ పండగలో ఉపయోగించే గులాల్ పొడి
ఇచ్చే అందమైన ఎరుపు పువ్వులు పూసే పలాస చెట్టు నుండి వచ్చింది

ఈస్ట్ ఇండియా
కంపెనీ యాజమానుల సమావేశాలు ఈస్ట్ ఇండియా హౌస్, లీడేన్ హాల్ వీధి, లండన్ లో జరిగేవి

సిరాజుద్దౌలా
సైన్యాధిపతి మీర్ జాఫర్ యుద్ధంలో పాలుపంచుకోవడం నవాబు ఓటమికి ఒక కారణం

ఈస్ట్ ఇండియా
కంపెనీ భారత్ లో సాధించిన మొదటి ఘన విజయం ప్లాసీ యుద్ధం

ప్లాసీ యుద్ధం
తర్వాత రాబర్ట్ క్లైవ్ 1759 జనవరి 7 న విలియం పిట్ కి లేఖ రాశారు

మీర్ జాఫర్ ఎదురు
తిరిగినప్పుడు కంపెనీ అతన్ని తొలగించి మీర్ ఖాసిం ని నవాబుని చేసింది. మీర్ ఖాసిం
ఫిర్యాదు చేసినపుడు బక్సార్ యుద్ధం (1764) లో అతన్ని ఓడించి మరలా మీర్ జాఫర్ ని
నవాబుని చేసింది

మీర్ జాఫర్ 1765
లో మరణించాడు

ఈ కీలుబొమ్మ
నవాబులతో పని చేసి వైఫల్యం చెందే కంటే మనంతట మనమే నవాబులు అవ్వాలి అని క్లైవ్
ప్రకటించాడు

1765 లో మొఘల్
చక్రవర్తి కంపెనీని బెంగాల్ ఫ్రా విన్స్ ల దివాన్ గా నియమించాడు. బెంగాల్ ఆదాయ
వనరులు వాడడానికి ఈ దివానీ కంపెనీకి అధికారం ఇచ్చింది

 

1743 ఇంగ్లాండ్
నుండి మద్రాస్ వచ్చే నాటికి క్లైవ్ వయసు 18 సంవత్సరాలు

1767 లో దేశం
విడిచిపెట్టే నాటికి సంపద విలువ 401,102 పౌండ్లు

1764 లో బెంగాల్
గవర్నర్ గా నియామకం

1772 లో అపరిమిత
సంపద కలిగి ఉన్నాడని పార్లమెంటు చేత ప్రతి విచారణ ఎదుర్కొన్నాడు

1774 లో ఆత్మహత్య

 

భారత్ నుండి
సంపదతో వెనుదిరిగిన వారు ఆడంబరమైన జీవితం గడిపేవారు. వాళ్ళని నాబాబ్స్ అని
పిలిచేవారు

1764 బక్సార్
యుద్ధం తర్వాత కంపెనీ భారతీయ రాజ్యాల్లో రాజ ప్రతినిధులని నియమించింది. వారు
కంపెనీకి రాజకీయ, ఆర్ధిక గుత్తేదారులుగా ఉండేవారు

1801 లో రిచర్డ్
వెల్లస్లీ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు అవద్ నవాబు సహకార సైన్యం కోసం చెల్లింపు
చేయనందున అతని భూభాగంలో సగం ఇవ్వాలని ఒత్తిడి చేసింది

రెసిడెంట్ –
దేశానికి ఇతనే నిజమైన రాజు. విధేయత చూపినంతవరకు అన్నీ సవ్యంగా ఉంటాయి – జేమ్స్
మిల్ రెసిడెంట్ ల గురించి చెప్పినది

 

మైసూర్ పాలకులు
హైదర్ ఆలీ (1761 – 1782), టిప్పు సుల్తాన్ (1782 – 1799)

మలబార్ తీరంలో
కంపెనీ మిరియాలు, ఏలకులు కొనుగోలు చేసేది

1785 లో టిప్పు
సుల్తాన్ అతని రాజ్యంలో ఓడరేవుల ద్వారా చందనం, మిరియాలు, ఏలకులు ఎగుమతి నిలిపేసి
స్థానిక వ్యాపారులను కంపెనీతో వ్యాపారానికి అనుమతించలేదు

టిప్పు సుల్తాన్
ఫ్రెంచ్ వారితో సత్సంబంధాలు ఉండేవి

మైసూర్ తో
బ్రిటిష్ వారికి నాలుగు యుద్ధాలు జరిగాయి – 1767 – 69, 1780 – 84, 1790 – 92, 1799 

చివరి యుద్ధం
శ్రీరంగ పట్నం యుద్ధంలో టిప్పు 1799 మే 4 న మరణించాడు

తర్వాత మైసూర్
పూర్వ పాలకులు అయిన వడయార్ ల కింద ఉంచబడింది

 

మరాఠీలతో యుద్ధం

1761 మూడవ పానిపట్
యుద్దంలో మరాఠీల ఓటమి

అనేక రాష్ట్రాలుగా
విభజించి సింధియా,హోల్కర్, గైక్వాడ్, భోంస్లే వంటి రాజవంశాలకి చెందిన నాయకుల కింద
ఉంచారు

వీరంతా పూణే
కేంద్రంగా పని చేసే సమర్ధ సైన్యం గల పీష్వా (ప్రధానమంత్రి) ఆధ్వర్యంలో ఉండేవారు

మహాదీజీ సింధియా,
నానా ఫడ్నావిస్ అనేవారు రాజనీతీ కలవారు గా ప్రసిద్ధి చెందారు

మొదటి ఆంగ్లో
మరాఠీ యుద్ధం – 1782 సాల్బే ఒప్పందంతో ముగింపు – స్పష్టమైన విజేత లేరు

రెండో ఆంగ్లో
మరాఠీ యుద్ధం – 1803 -05 – ఒరిస్సా, ఆగ్రా, యమునా నదికి ఉత్తరాన గల భూభాగాలు,
ఢిల్లీ లభించాయి

మూడవ ఆంగ్లో మరాఠీ
యుద్ధం – 1817 – 19 – పీష్వాని తొలగించి సమీపంలో బీరుర్ కి భరణం ఇచ్చి పంపారు

 

లార్డ్
హేస్టింగ్స్ (1813 – 23 బెంగాల్ గవర్నర్ జనరల్) ఆధ్వర్యంలో అత్యున్నత హోదా అనే
కొత్త విధానం మొదలు అయింది

కిత్తుర్ అనే
చిన్న రాష్ట్రం (ప్రస్తుత కర్ణాటక) స్వాధీనం చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ రాణి
చెన్నమ్మ ఉద్యమించింది. ఆమెను 1824 లో అరెస్ట్ చేశారు. 1829 లో జైలులో మరణించింది.
తర్వాత కిత్తుర్ లో సంగోళికి చెందిన రాయన్న పేద చౌకీదార్ ఉద్యమం కొనసాగించాడు.
ఇతన్ని 1830 లో బ్రిటిష్ వారు ఉరి తీశారు

 

1838, 42 మధ్య ఆఫ్ఘనిస్తాన్ లో ధీర్ఘకాలం యుద్ధం చేసి అక్కడ పరోక్షంగా కంపెనీ పాలన
స్థాపించారు

1843 – సింధ్
స్వాధీనం

1839 లో రంజిత్
సింగ్ మరణం తర్వాత సిక్కు రాజ్యంతో పోరాటం. 1849 లో పంజాబ్ విలీనం

రాజ్య సంక్రమణ
సిద్ధాంతం – 1848 నుండి 1856 వరకు గవర్నర్ గా పని చేసిన లార్డ్ డల్హౌసి కాలంలో
ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఏ భారతీయ పాలకుడు అయినా మగ వారసుడు లేకుండా చనిపోతే
అతను రాజ్యం కోల్పోతాడు. ఆ రాజ్యం కంపెనీ భాగం అవుతుంది

ఉదా: సతారా 1848,
సంబల్ పూర్ 1850, ఉదయ్ పూర్ 1852, నాగ్ పూర్ 1853 ఝాన్సీ 1854, అవద్ 1856

 

కంపెనీ అధికార
విస్తరణలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో వారన్ హేస్టింగ్స్ ఒకరు. (1773 నుండి
1785 వరకు గవర్నర్ జనరల్)

బెంగాల్, మద్రాస్,
బొంబాయ్ అనే మూడు ప్రెసిడెన్సీలు గవర్నర్ పాలనలో ఉండేవి

1772 లో కొత్త
న్యాయ విధానం అమలులోకి వచ్చింది

దీని ప్రకారం
ప్రతి జిల్లాలో క్రిమినల్ కోర్ట్ (ఫౌజ్ దారి అదాలత్), సివిల్ కోర్ట్ (దివానీ
అదాలత్) అనే న్యాయస్థానాలు ఉంటాయి

మౌల్వీలు, హిందూ పండితులు
సివిల్ కోర్ట్ లో న్యాయ చట్టాలకు భాష్యం చెప్పేవారు

క్రిమినల్
కోర్టులు క్వాజి, ముఫ్తీ అధీనంలో కలెక్టర్ల పర్యవేక్షణ కింద ఉండేవి

క్వాజి –
న్యాయమూర్తి, ముఫ్తీ – క్వాజి ఇచ్చిన తీర్పు వివరించే ముస్లిం మత న్యాయ
శాస్త్రవేత్త

అభిశంసన –
ఇంగ్లాండ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో దుష్ప్రవర్తన గల వ్యక్తిపై హౌస్ ఆఫ్ లార్డ్స్ లో
విచారణ చేపట్టడం

వారన్ హేస్టింగ్స్
ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళినప్పుడు బెంగాల్ లో దుష్పరిపాలనకి అతన్ని వ్యక్తిగతంగా
భాద్యుడిని చేస్తూ ఎడ్మండ్ బార్క్ ఆరోపణ చేశారు. బ్రిటిష్ పార్లమెంటులో 7
సంవత్సరాలు కొనసాగిన అభిశంసన వ్యవహారం

బ్రాహ్మణ పండితులు
ధర్మ శాస్త్ర భావనలు అనుసరించి స్థానిక చట్టాలకు విభిన్న భాష్యాలు చెప్పేవారు

1775 లో 11 మంది
పండితులను హిందూ న్యాయ స్మృతి తయారుచేయమని అడిగారు. ఎన్.బి.హాల్షెడ్ దీనిని
ఆంగ్లంలో అనువదించారు

1778 లో ముస్లిం
న్యాయ స్మృతి తయారు చేయబడింది

1773 నాటి
రెగ్యులేటింగ్ చట్టం ద్వారా సర్దార్ నిజామత్ అదాలత్ అనే ఒక కొత్త న్యాయస్థానం
కలకత్తాలో ఏర్పాటు చేశారు

 

మొఘల్ సైన్యం
ప్రధానంగా అశ్విక దళం (సవార్స్) పదాతిదళం (పైదల్ – కాలినడక) సైనికులతో ఉండేది

ఈస్ట్ ఇండియా
కంపెనీ తన స్వంత సిపాయి సైన్యం (సిపాహి అంటే సైనికుడు) నియమించుకుంది

1820 నుండి
యుద్ధంలో సాంకేతిక మార్పులుకారణంగా పదాతిదళం అవసరం తగ్గింది

పంతొమ్మిదవ శతాబ్ద
ప్రారంభంలో బ్రిటిష్ వారు ఏకీకృత సైనిక వ్యవస్థ అభివృద్ధి చేయడం ప్రారంభించారు

 

ధర్మశాస్త్రములు –
క్రీస్తు పూర్వం 500 నుండి పాటిస్తున్న సామాజిక నిబంధనలు ప్రవర్తనా నియమావళి
సూచించే సంస్కృత గ్రంధాలు

సవార్ – అశ్వికుడు

మస్కట్ – పదాతిదళ
సైనికులు ఉపయోగించే బరువైన తుపాకి

మ్యాచ్ లాక్ –
తుపాకి పొడి నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాలం తుపాకి

 

1857 నాటికి
కంపెనీ భారత ఉపఖండంలో దాదాపు 63 శాతం భూభాగం, 78 శాతం జనాభాపై ప్రత్యక్ష పాలన
అమలులోకి తెచ్చింది

17వ శతాబ్దంలో డచ్
వాణిజ్య నౌకలు దక్షిణ ఆఫ్రికా చేరుకున్నాయి. తర్వాత బానిస వ్యాపారం ప్రారంభం
అయింది

1834 బానిసత్వం
అంతం అయ్యేనాటికి ఆఫ్రికా దక్షిణ కొన కేప్ వద్ద 36,774 మంది ప్రైవేట్ యాజమాన్యంలో
బానిసలు ఉన్నారు 

3. గ్రామీణ ప్రాంతాల పరిపాలన

1765 ఆగస్టు 12
మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీకీ బెంగాల్ కి దివాన్ గా నియమించాడు

దివానీ కారణంగా
కంపెనీ భూభాగం పై ఆర్ధిక పరిపాలకుడు అయింది

1765 కి ముందు
ఇంగ్లాండ్ నుండి బంగారం, వెండి దిగుమతి చేసుకుని భారతీయ వస్తువులు కొనేది

1770 బెంగాల్ లో
తీవ్ర కరువు వచ్చింది

1793 శాశ్వత
శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టారు. (అప్పటి గవర్నర్ జనరల్ – చార్లెస్ కారన్
వాలిస్) దీని ప్రకారం రాజులు, తాలూకాదార్లు జమీందార్లుగా గుర్తించబడ్డారు

జమీందార్లను రైతుల
నుండి పన్నులు వసూలు చేసి కంపెనీకి చెల్లించమన్నారు. జమీందార్లు చెల్లించవలసిన
శిస్తు స్థిరంగా నిర్ణయించారు. భవిష్యత్ లో పెంచడానికి వీలు లేదు

1806 లో
హెచ్.టి.కోల్బ్రూక్ బెంగాల్ లో ఉప కౌలు రైతులు దుస్థితి వర్ణించారు

మహాల్ – బ్రిటిష్
రెవెన్యూ రికార్డుల్లో మహల్ అనేది ఒక రెవెన్యూ క్షేత్రం. ఇది ఒక గ్రామం కావచ్చు,
కొన్ని గ్రామాల సమూహం కావచ్చు

బెంగాల్
ప్రెసిడెన్స్ లోని వాయువ్య ఫ్రావిన్స్ లో హల్ట్ మెకంజీ ఒక కొత్త విధానం
ప్రవేశపెట్టాడు. ఇది 1822 నుండి అమల్లోకి వచ్చింది

శిస్తు శాశ్వతంగా
కాకుండా నిర్ధిష్ట కాలానికి సమీక్షించాలి. పన్ను వసూలు భాద్యత గ్రామ పెద్దకి
అప్పగించారు

ఇది మహల్వారీ
పద్దతిగా ప్రసిద్ది చెందింది

దక్షిణాదిన ఈ
కొత్త విధానం రైత్వారీగా పేరు పొందింది

కెప్టెన్
అలెగ్జాండర్ రీడ్ చిన్న స్థాయిలో దీన్ని ప్రవేశపెట్టారు. థామస్ మన్రో దీన్ని
అభివృద్ది చేశారు

 

18వ శతాబ్దం చివర
కంపెనీ నీలిమందు, నల్లమందు సాగు చేయడానికి ప్రయత్నించింది

ఇతర పంటలు :
బెంగాల్ – జనుము, అస్సాం – తేయాకు, యునైటెడ్ ఫ్రావిన్స్ – చెరకు, ప్రస్తుత
ఉత్తరప్రదేశ్, పంజాబ్ – గోధుమ, మహారాష్ట్ర పంజాబ్ – పత్తి, మద్రాస్ – వరి

19వ శతాబ్దంలో
మోరిస్ ముద్రణలో వాడిన నీలిరంగు భారత్ లో పండిన నీలిమందు మొక్క నుండి తయారయ్యింది

ఆ కాలంలో భారత్
ప్రపంచంలో అతి పెద్ద నీలిమందు సరఫరాదారు.

నీలిరంగు ఇండిగో
అనే మొక్క నుండి తయారుచేస్తారు

నీలిమందు మొక్క
ఉష్ణ మండల ప్రాంతాల్లో పెరుగుతుంది. 13వ శతాబ్దం నాటికి భారతీయ నీలిమందు ఇటలీ,
ఫ్రాన్స్, బ్రిటన్ లో దుస్తుల తయారీదారుల దుస్తులకి రంగులు అద్దడానికి వాడేవారు

యూరోపియన్
తయారీదారులు నీలం, వైలెట్ రంగుల తయారీకి వోడ్ అనే మొక్క మీద ఆధారపడాల్సి వచ్చింది

వోడ్ మొక్క ఉత్తర
ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ లలో కొన్ని భాగాలలో పెరిగేది

ఫ్రెంచ్ వారు కరేబియన్
దీవుల్లో, సెయింట్ డొమింగ్ లో, పోర్చుగీస్ వారు బ్రెజిల్ లో ఇంగ్లీష్ వారు
జమైకాలో, స్పానిష్ వారు వెనిజులాలో నీలిమందు పండించడం ప్రారంభించారు

ఉత్తర అమెరికాలో
చాలా భూభాగాల్లో నీలిమందు తోటల సాగు ప్రారంభించారు

1783 – 89 మధ్య
ప్రపంచ నీలిమందు ఉత్పత్తి సగానికి పడిపోయింది

ప్రపంచ మార్కెట్
లో పద్దెనిమదవ శతాబ్ద చివర బెంగాల్ నీలిమందు ఆధిపత్యం చెలాయించింది

1788 – బ్రిటన్
దిగుమతి 30%, 1810 నాటికి 95%

నీలిమందు సాగు
రెండు రకాలు – నిజ్, రైతి

నిజ్ విధానంలో
తోటల యజమాని నేరుగా తన అధీనంలో ఉన్న భూమిలో సాగు చేసేవాడు

బానిస – వేరొకరి
యాజమాన్యంలో ఉన్న వ్యక్తి. బానిసకి స్వేచ్చ లేదు.

భిఘా – భూమి
కొలిచే ప్రమాణం.ఎకరంలో 1/3 వంతుగా ప్రామాణీకరించారు

నిజ్ విధానంలో
సాగు చేసే భూమి – 25% మిగిలినది రైతి సాగు విధానంలో ఉండేది

 

రైతి పద్దతిలో
యజమానులు రైతులను ఒప్పంద పత్రంపై సంతకం చేయమని బలవంతం చేశారు

రైతులు యాజమానుల
నుండి తక్కువ వడ్డీకి రుణాలు పొందేవారు

రుణం పొందాలి
అనుకున్న రైతులు తమ విస్తీర్ణంలో కనీసం 25% నీలిమందు సాగు చేయాలి

 

రంగు తయారీకి 3
లేదా 4 తొట్టెలు అవసరం

నిటారుగా ఉండే
తొట్టి / పులియబెట్టడం – వెచ్చని నీటిలో చాలా గంటలు ఆకులు నానబెడతారు

కొట్టే తొట్టి –
ద్రావణం కదిలించడం, కొట్టడం చేస్తారు. ద్రవం నీలిరంగులో మారినప్పుడు సున్నపునీరు
కలుపుతారు. క్రమంగా నీలిమందు తొట్టి దిగువ అవక్షేపంగా ఏర్పడేను

ఏర్పాటు చేసిన
తొట్టి – నీలిమందు గుజ్జు ఉంచుతారు

తర్వాత గుజ్జు
పిండి ఎండబెట్టి అమ్మకానికి పెడతారు

 

1859 మార్చిలో
వేలాదిమంది రైతులు నీలిమందు పండించుటకు నిరాకరించారు
. తోటల
యాజమానుల కోసం పని చేసేవారిని సామాజికంగా బహిస్కరించారు

లాఠియలు – తోట
యాజమానుల చేత పోషించబడే లాఠీలు ధరించిన బలమైన వ్యక్తులు

బరాసత్ లో
ఉన్నప్పుడు నీలిమందు ఒప్పందాలు అంగీకరించమని ఈడెన్ రైతులను బలవంతం చేయరాదని
మెజిస్ట్రేట్ యాస్లే ప్రకటన చేశారు

తిరుగుబాటు తర్వాత
బెంగాల్ లో నీలిమందు ఉత్పత్తి పడిపోయింది. తోటల యజమానులు ఇప్పుడు తమ కార్యకలాపాలు
బీహార్ కి తరలించారు

19వ శతాబ్దం చివర
సింథటిక్ రంగుల ఆవిష్కరణతో వారి వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది

1917 గాంధీ బీహార్
సందర్శన నీలిమందు తోటల యాజమానులకి వ్యతిరేకంగా చంపారన్ ఉద్యమానికి నాంది పలికింది

 

4. గిరిజనులు, దికూలు – ఒక స్వర్ణ యుగ వీక్షణ

1895 లో బిర్సా
అనే వ్యక్తి జార్ఖండ్ లో ఛోటానాగ్పూర్ ప్రాంత అడవులలో గ్రామాల్లో సంచరించేవాడు

ప్రజలని కష్టాల
నుండి రక్షించుటకు, దికూ(అన్యులు) బానిసత్వం నుండి వారికి స్వేచ్చ ప్రసాదించడానికి
తనను భగవంతుడు నియమించాడని బిర్సా తనకు తానే ప్రకటించుకున్నాడు బిర్సా ఛోటా
నాగ్పూర్ ప్రాంతంలో ముండా అనే తెగలో జన్మించారు

బీడు భూమి –
కొంతకాలం సాగు చేయకుండా వదిలిన భూమి

సాల్ – ఒక చెట్టు

మహువా – తినడానికి
మద్యం తయారీలో వాడే పువ్వు

విస్తరాకు తయారీకి
వాడే చెట్లు – పండానస్ 

 

గిరిజనులు కొందరు
ఝుమ్ / విస్తాపన వ్యవసాయ పద్దతి అవలంబించారు

వృక్షాలు కాల్చి
వచ్చే బూడిద నేలంతా చల్లేవారు. బూడిదలో పొటాష్ నేల సారవంతం చేయడానికి తోడ్పడేను

ఒకసారి పంట సిద్ధం
అయిన తర్వాత దానిని కొద్ది సంవత్సరాలు బీడు భూమిగా వదిలి వేరే క్షేత్రానికి
వెళ్ళేవారు

వీరు ఈశాన్య, మధ్య
భారతదేశంలోని కొండ, అటవీ ప్రాంతంలో నివసించేవారు

చాలా ప్రాంతాల్లో
గిరిజనులు జంతువుల వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా జీవనం గడిపేవారు

ఒరిస్సా అడవులలో
నివసించే కొండులు అలాంటి గిరిజనులే

సాల్, మహువా వృక్ష
విత్తనాల నుండి తీసిన నూనె తో ఆహారం వండేవారు

అటవీ ఉత్పత్తులు
స్థానిక విపణి (మార్కెట్) లో అమ్మేవారు

స్థానిక చేనేత,
చర్మ కార్మికులు తమ బట్టలు, తోలుకు అవసరం అయిన రంగులలో వాడే పలాస, కుసుమ పువ్వుల
కోసం కొండులుని ఆశ్రయించేవారు

మధ్య భారతదేశంలో
కనిపించే బైగాలు ఇతరుల వద్ద పనికి ఇష్టపడే వారు కాదు

పంజాబ్ లో వాన్
గుజర్లు ఆంధ్రప్రదేశ్ లంబాడీలు – ఆవులు మేపేవారు

కులూ ప్రాంత
గద్దీలు – గొర్రెల కాపరులు, కాశ్మీర్ బకర్వాలలు – మేకల కాపరులు

1930, 1940 లలో
మధ్య భారతదేశంలో బైగాలు, కొండుల మధ్య గడిపిన వెరియర్ ఎల్విన్ అనే బ్రిటిష్ మానవ
శాస్త్రవేత్త కాలమానం గురించి పని విభజన గురించి సమాచారం అందించారు

చైత్ (చైత్రం) – కోసిన
పంట దుబ్బులు తొలగించుటకు స్త్రీలు వెళ్ళేవారు. పురుషులు పెద్ద చెట్లు నరికేవారు.
సంప్రదాయ వేటకి వెళ్ళేవారు. పౌర్ణమి రోజు తూర్పు నుండి వేట ప్రారంభిస్తారు

ఆదివాసీలందరిలో
బైగాలు ఉత్తమ వేటగాళ్ళుగా ప్రసిద్ధి చెందారు బైశాఖ (వైశాఖం) లో అడవిని కాల్చేవారు

జెత్ (జ్యేష్ట్యం)
– విత్తడం ప్రారంబించేవాడు, వేట కొనసాగేది

ఆషాడ్ (ఆషాడం)
నుండి భాదన్ (భాద్రపదం) వరకు పురుషులు పొలాల్లో పని చేసేవారు

కౌర్ లో బీన్స్
మొదట పక్వానికి వచ్చేవి

కార్తీక్
(కార్తీకం) – కుత్కి పక్వానికి వచ్చేది

అఘాన్ (మార్గశిర) –
ప్రతి పంట కోతకి సిద్ధమయ్యేది

పుష్ (పుష్యం) –
తూర్పారా బట్టేవారు, పండగలు, నృత్యాలు జరిగేవి

మాగ్ (మాఘం) –
కొత్త బేవార్ లకి వెళ్ళేవారు. అప్పుడు వేట సేకరణ ప్రధాన జీవనాధార కృత్యం అయ్యేది

బేవార్ – విస్తాపన
వ్యవసాయాన్ని మధ్య ప్రదేశ్ లో ఈ పేరుతో పిలిచేవారు

స్థిర జీవనం గల
గోండులు, సంతాలులు మిగిలినవారి కంటే నాగరికులు అని బ్రిటిష్ వారి భావన

నైశి తెగ –
అరుణాచల్ ప్రదేశ్

బ్రిటిష్ వారికి
అవసరం అయిన కలప ఇచ్చే కొన్ని అడవులను రక్షిత ఆడవులుగా మార్చారు. దీనిలో ప్రజల
కార్యకలాపాలకి అనుమతి లేదు

స్లీపర్ – రైల్వే
లైన్ల కోసం వాడే అడ్డ చెక్క పలకలు

అటవీ చట్టాలకి
వ్యతిరేక తిరుగుబాటు – 1906 అస్సాంలో సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు, 1930 మధ్య
పరగణాల్లో జరిగిన అటవీ సత్యాగ్రహం

ప్రస్తుత జార్ఖండ్
హాజరీభాగ్ ప్రాంతంలో సంతాలులు పట్టు గుళ్ళు పెంచేవారు

19వ శతాబ్ద
మలిభాగంలో అస్సాం తేయాకు తోటల్లో, ఝార్ఖండ్ బొగ్గు గనుల్లో పనికి చాలా మంది
గిరిజనులను నియమించారు

గిరిజనుల
తిరుగుబాటు – 1831-32 కోలులు, 1855 సంతాలులు, 1910 బస్తరులు, 1940 మహారాష్ట్ర
వర్లిలు

 

బిర్సా ముండా

1870 మధ్య కాలంలో
జన్మించాడు. బోహూండా అడవులలో గొర్రెలు మేపుతూ స్థానిక ఆఖడాల్లో నృత్యం చేస్తూ
పెరిగాడు

ముండా సమూహానికి
చెందిన సిర్దార్ లు (నాయకులు) తిరుగుబాటుకి పిలుపు ఇచ్చారు

వారి భూమి (ముల్క్
కి లాడాయి) కోసం పోరాటం చేస్తున్నట్టు ప్రజలకి గుర్తు చేశారు

గిరిజన సమాజం
సంస్కరించడం బిర్సా ముండా ఉద్యమ లక్ష్యం

1895 లో బిర్సాని
అరెస్ట్ చేసి రెండు సంవత్సరాలు జైలులో ఉంచారు

1897 లో విడుదల
అయిన తర్వాత గ్రామాల్లో పర్యటన చేశాడు. రావణుని (దికూలు మరియు ఐరోపా వారు) అంతం
చేయాలని అతని నాయకత్వంలో రాజ్యం స్థాపించాలని కోరాడు

బిర్సా రాజ్యానికి
చిహ్నంగా తెల్ల జెండా ఎగురవేశారు

1900 లో బిర్సా
కలరా వ్యాధితో మరణించాడు

ఉద్యమ ప్రాముఖ్యత

అదివాసీల భూమి
దికూలు సులభంగా స్వాధీనం చేసుకొని విధంగా చట్టాలు చేసేలా వలస ప్రభుత్వాన్ని
ప్రోద్బలం చేసింది

ఆదివాసీ ప్రజలకి
అన్యాయానికి వ్యతిరేఖంగా నిరసన చేసే సమర్ధత కలదని నిరూపించింది

 

5. 1857 ప్రజా తిరుగుబాటు – అనంతర పరిణామాలు

రాణి లక్ష్మీ బాయి
తన భర్త మరణం తర్వాత తన దత్త పుత్రుడుని రాజ్య వారసునిగా గుర్తించాలని కోరింది

పీష్వా రెండో
బాజీరావు దత్తపుత్రుడు అయిన నానాసాహెబ్ తన తండ్రి మరణాంతరం తండ్రికి రావలసిన
పింఛను తనకి ఇవ్వాల్సిందిగా కోరాడు 

బ్రిటిష్ వారు
విలీనం చేసుకున్న ప్రాంతాల్లో అవద్ చివరిది – 1856 లో                          

సరైన పాలన
సాగాలంటే బ్రిటిష్ పాలన అవసరం అని డల్హౌసి ప్రకటించాడు

బహదూర్ షా
మరణాంతరం రాజకుటుంబ నివాసం ఎర్రకోట నుండి ఢిల్లీలో మరో ప్రాంతానికి మార్చబడుతుంది
అని డల్హౌసి ప్రకటించాడు

బహదూర్ షా తర్వాత
వారసులను రాజులుగా గుర్తించడం జరగదని కేవలం యువరాజులుగా పిలవడం జరుగుతుంది అని
1856 లో గవర్నర్ జనరల్ కానింగ్ ప్రకటించాడు

Prepared By :

ABR

AP DSC Best Notes Class 8 Social | History Lesson 1 to 4 | DSC Final touch

 

10 years experience in content writing and coaching                 

 

    

error: Content is protected !!