అతి ప్రాచీన కాలం నుండి భారతదేశం విద్యాకేంద్రంగా ఉండేది. ప్రపంచంలోని అన్ని దేశాలకంటే భారతదేశంలోనే ముందుగా విద్యావ్యవస్థ ప్రారంభమైనదని, విద్యచేత ఇంత పటిష్టంగాను, శాశ్వతంగాను ప్రభావితమైన దేశం మరొకటి లేదని ఎఫ్.డబ్ల్యు. థామస్ భావన, అనేక దేశాల నుండి భారతదేశాన్ని సందర్శించిన యాత్రికులు భారతీయ విద్య గురించిన వివరాలు తెలియజేశారు. వారు భారతదేశాన్ని ఒక అద్భుత భూమిగా పేర్కొన్నారు. ఎన్నో దేశాల నుండి విద్యార్థులు వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించేవారు.
ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల. ఇది ప్రస్తుతం పాకిస్థాన్లో ఉంది. ఇక్కడ వేల మంది విద్యార్థులు, ఆచార్యులు ఉండేవారు. ఇది కొన్ని వందల సంవత్సరాలపాటు విలసిల్లింది. ప్రపంచంలోనే ఈనాటికీ గొప్ప వ్యాకరణవేత్తగా పరిగణింపబడుతున్న పాణిని ఇక్కడి ఆచార్యుడు. ఆ కాలంలో గొప్ప వైద్యుడుగా పేరుగాంచిన ‘జీవకుడు’, అర్థశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు ఇక్కడ ఆచార్యులుగా పనిచేశారు.
తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యాబోధనలో ఉపాధ్యాయునికి పూర్తి స్వేచ్ఛ ఉండేది. పాఠ్యప్రణాళిక నిర్ణయించడంలోను, బోధన పద్ధతిలోను, పరీక్షా విధానంలోను, విద్యాలయ నిర్వహణలోను ఆచార్యులదే తుది నిర్ణయం. విద్య వికేంద్రీకృతంగా ఉండేది. ఆచార్యుడు అత్యంత పవిత్రునిగా, అనుకరణీయునిగా, ఆదర్శవంతునిగా, నిస్వార్థపరునిగా ఉండేవాడు. విద్యార్థులను కన్నబిడ్డలుగా చూసుకొనేవాడు. విద్యార్థి విద్యాలయంలో ప్రవేశించినప్పటి నుండి విద్య పూర్తయ్యే వరకు విద్యాలయంలోనే ఉండేవాడు. దేవాలయాలు కూడా విద్యాకేంద్రాలుగా ఉండేవి.
బీహార్లోని నలంద విశ్వవిద్యాలయం క్రీ.శ.5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు 700 సం॥ల పాటు విలసిల్లింది. ఈ విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తీసుకొనిరావడానికి ప్రస్తుత భారత ప్రభుత్వం కృషి చేస్తున్నది.
అప్పటిరోజుల్లో విద్య డిగ్రీల కోసం కాక, జీవితం కోసం ఉండేది. విద్యను అభ్యసించిన వ్యక్తి సమాజంలో సమర్థునిగా రాణించేవాడు. విద్య జీవితం కోసం అనేది ప్రధాన సూత్రం. విద్య వ్యక్తిలో సమగ్ర వికాసాన్ని పెంపొందించేది. అంటేవిద్యా దృక్పధాలు
శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక వికాసాన్ని పెంపొందించేది. విద్యార్థులలో వినయం, సత్యం, త్యాగం, సేవ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆత్మనిర్భరత మొదలైన గుణాలను పెంపొందించేవారు..
విద్యార్థుల అభ్యసనాన్ని అంచనా వేయడానికి శాస్త్రార్థాలు (శాస్త్రాలపై చర్చ) నిర్వహించేవారు. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు బోధించేవారు. విద్యాలయ నిర్వహణలో సీనియర్ విద్యార్థులు ఆచార్యునికి సహకరించేవారు. తోటి విద్యార్థుల నుండి కూడా నేర్చుకొనేవారు. విద్య నియత, అనియత పద్ధతులలో ఉండేది. తరగతి గదిలోను, తరగతి గది బయట కూడా నేర్చుకొనేవారు. మత భేదాలు, ధనిక, పేద తేడాలు లేకుండా విద్యార్థులకు ప్రవేశం ఉండేది. గురు, శిష్యులు కలిసి విద్యాప్రక్రియలో భాగస్వాములుగా ఉండేవారు. గురుశిష్యులు కలిసి ఒకే ప్రాంగణంలో ఉండేవారు. గురుశిష్యుల సంబంధం అత్యంత పవిత్రంగా ఉండేది..
రాజులు, ధనికులు, సామాన్యులు విద్యాలయ నిర్వహణకు దానాలు చేసేవారు. విద్య ఉచితంగా అందించబడేది. విద్యార్థుల నుండి ఏవిధమైన రుసుము వసూలు చేసేవారు కాదు. జ్ఞానదానాన్ని పవిత్రంగా భావించేవారు. విద్యను అమ్ముకోరాదు అని భావించేవారు.
ఆర్యభట్టు, పతంజలి, కాత్యాయనుడు. పాణిని మొదలైనవారు ఆనాటి గొప్ప ఆచార్యులు. మైత్రేయి, గార్గి, విశ్వంభర, అపల, లోపాముద్ర మొదలైన మహిళా విద్యావేత్తలు ఉండేవారు.
చైనా, కొరియా, టిబెట్, బర్మా, సిలోన్, జావా, నేపాల్ మొదలైన దేశాల నుండి వచ్చి విద్యను అభ్యసించేవారు.
పాహియాన్, హ్యుయన్సాంగ్ మొదలగు చైనా యాత్రికులు ఇక్కడి విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించారు.
విద్య అంటే ఏమిటి? అన్న ప్రశ్న అనాదిగా చర్చించబడుతూనే ఉంది. వేదకాలం నుండి నేటికాలం వరకు అనేకమంది విద్యావేత్తలు, తత్త్వవేత్తలు అనేక విధాలుగా విద్యను గురించి తమ భావాలను తెలియజేశారు. మానవుడు సంపాదించుకున్న ఈ విజ్ఞానం ఈ అనంతలోకంలో అణుమాత్రమే. అందుకే ప్రకృతి రహస్యాలను కనుగొనడానికి మానవుడు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు. అదేవిధంగా నూతన సత్యాలను కనుగొంటూనే ఉన్నాడు. ఇది నిరంతరం కొనసాగే ఒక ప్రక్రియ. అందుకే విద్యకు ఒక స్థిరమైన, నిర్దిష్టమైన అర్థాన్ని చెప్పడం కష్టతరం.
విద్య గతిశీలమైనది. విద్య అనే పదం ఒక వజ్రం లాంటిది. వజ్రాన్ని వివిధ కోణాల నుంచి చూసినపుడు వివిధ రంగులలో కన్పిస్తుంది. అలాగే విద్యకు అనేక అర్థాలున్నాయి.
విద్య వ్యక్తి మూర్తిమత్వాన్ని, సత్ప్రవర్తనను అభివృద్ధి చేసే ఒక మహత్తర శక్తి. విద్యావంతుడు సర్వత్రా పూజనీయుడు. ప్రపంచంలో విద్యకన్నా విలువైనది మరొకటి లేదు.
విద్య అనేది శిశువుని అవాస్తవికమైన ప్రపంచం నుండి వాస్తవికమైన ప్రపంచం వైపు నడిపించాలి. చీకటి లేదా అంధకారం నుండి వెలుగులోనికి తీసుకెళ్లాలి. జీవితమనేది చావు పుట్టుకల దోబూచులాట అనే భావన నుండి అద్వితీయమైన
పురోగతి వైపునకు తీసుకుపోవాలి.
‘విద్య’ అనే పదం ‘విద్’ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. ‘విద్’ అంటే తెలియని విషయాలను తెలుసుకొనుట అని అర్ధం. దీనినే ఆంగ్లంలో Education అంటారు.
• ఋగ్వేదం (Rigveda) : వ్యక్తిని తన శక్తిపై తనకు నమ్మకమున్నవానిగాను, నిస్వార్థపరునిగాను తయారుచేసేదే విద్య.
భారతదేశం విద్యా చరిత్ర
• ఉపనిషత్తులు (Upanishads): విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన,
• కౌటిల్యుడు (Koutilya): విద్య అనగా దేశం పట్ల భక్తి, ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ.
• ఆది శంకరాచార్య (Sankaracharya): విద్య అనగా ఆత్మ సాక్షాత్కారం పొందటం.
• యాజ్ఞవల్యుడు (Yagnavalkya): మనిషిని శ్రీలవంతునిగాను, సమాజానికి ఉపయోగపడేవానిగాను తీర్చిదిద్దేదే విద్య,
– ఆధునిక యుగ భారతీయ విద్యావేత్తలు ఇచ్చిన నిర్వచనాలు:
• గాంధీజీ (Gandhiji) : మానవులలో, పిల్లలలో గల అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను సమగ్రముగా వెలికితీసేది విద్య, అన్ని రంగాలలోను అభివృద్ధి చెందేది విద్య.
• దయానంద (Dayananda): శీల నిర్మాణమే విద్య.
• గురునానక్ (Guru Nanak): విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందటం, ప్రజాసేవ చెయ్యడం,
• స్వామి వివేకానంద (Swami Vivekananda): శీల నిర్మాణానికి, నైతిక జీవనానికి విద్య మార్గం.
• రవీంద్రనాథ్ ఠాగూర్ (Rabindranath Tagore) విద్య మానవునికి ప్రకృతితో సంఘీభావం నెరపి నిజమైన సత్యములను కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి, ప్రేమను పెంచి జీవితానికి అర్ధం కల్పించడానికి తోడ్పడుతుంది.
• అరవింద ఘోష్ (Aurobindo Ghosh): వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడునది విద్య.
• జిడ్డు కృష్ణమూర్తి (Jiddu Krishnamurti): వ్యక్తి మంచిని తనయందు, ప్రేమయందు వికసించి రాణించడానికి సహాయపడేదే విద్య.
• డా॥ జాకీర్ హుస్సేన్ (Dr. Zakir Hussain): విద్య మానవుని పూర్తి మానసిక వికాసానికి దోహదకారి.
• డా|| రాధాకృష్ణన్ (Dr. Radhakrishnan): విద్య అనేది కేవలం జీవనాధార సాధనం కాదు. ఆలోచనలకు నిలయం కారాదు. పౌరసత్వ శిక్షణ నిలయం కారాదు. విద్య ఆధ్యాత్మిక జీవనానికి మార్గం కావాలి. సత్యాన్వేషణ, సదాచరణకు మానవులు ఆత్మకు ఇచ్చే శిక్షణ కావాలి. విద్య రెండవ జన్మ కావాలి.
పాశ్చాత్యుల (Western) విద్య నిర్వచనాలు
పాశ్చాత్య దేశాలలో విద్యా భావన రెండు ముఖ్యమైన తాత్త్విక దృక్పథాలపై రూపొందించబడింది. అవి మొదటిది : మానవుడు హేతుబద్ధమైన జీవి, ఇంద్రియ వాంఛలకు ప్రాధాన్యతను ఇచ్చువాడు అనేది గ్రీకు తాత్త్వికుల వాదన. రెండవది : మానవుడు దేవుని పుత్రుడు, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అనేది క్రైస్తవ వాదం. అయితే, ఇక్కడ పాశ్చాత్యులు ఆధ్యాత్మిక విషయాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదనేది నిర్వివాదాంశం.
• సోక్రటీస్ (Socrates) : ప్రతి మనిషిలోను నిక్షిప్తమైన విశ్వజనీన భావాలను వెలికితీసేదే విద్య.
• ప్లేటో (Plato): సరియైన సమయంలో సంతోషం మరియు బాధను అనుభవింపజేసే శక్తి గలదే విద్య, శారీరకంగాను, మానసికంగాను విద్యార్థిని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసేదే విద్య.
• అరిస్టాటిల్ (Aristotle) దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును ఏర్పరచునది విద్య.
• రూసో (Rousseau): మానవునికి విద్య పుట్టుకతోనే ప్రారంభమవుతుంది. అనుభవాలే మానసిక భావాలకు కారణాలు.
• ప్రోబెల్ (Proebel) : జీవిలో నిద్రాణమైన సహజ శక్తులను మేల్కొలిపేదే విద్య.
• రెడెన్ (Redden) : పరిణతి గల వ్యక్తి అపరిణతి గల వ్యక్తి మీద చూపించే ప్రభావమే విద్య. ఈ ప్రభావం వ్యక్తి సామాజిక అవసరాలను అనుసరించి వ్యక్తులకు బోధన, క్రమశిక్షణ ద్వారా భౌతిక, ఆధ్యాత్మిక, నైతిక విలువలన అనుసరింపజేసేది విద్య. దీని పరమార్ధం బ్రహ్మ సాక్షాత్కారం.
• కొమినియస్ (Comenius) సంపూర్ణ మానవ వికాసమే విద్య-
• డ్యూయీ (Dewey) : సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య.
• ఎమర్సన్ (Emerson): మనస్సును నియంత్రించేది విద్య.
• హెర్బర్ట్ (Herbart) : నైతిక వికాసాన్ని అభివృద్ధి చేసేది విద్య,
• స్పెన్సర్ (Spencer): సంపూర్ణ జీవనానికి తయారుచేసేది విద్య.
(విద్యా రకాలు)
విద్యా ప్రతినిధి సంస్థల ద్వారా వ్యక్తి విద్యా ప్రమాణాలను పొందుతాడు. చదువు నేర్చుకోనివారు కూడా తమ జీవితానికి అవసరమైన విజ్ఞానాన్ని సమాజంలోని వివిధ వ్యక్తుల ద్వారా మరియు సంస్థల ద్వారా పొందుతారు. విద్యాభ్యసన అనేది ఈ క్రింది విధాలుగా రూపొందించబడింది.
1. నియత విద్య (Formal Education) పాఠశాలలు లేదా కళాశాలల ద్వారా ప్రత్యక్షంగా పొందే విద్యను నియశ విద్య అంటారు. అంటే విద్య అనేది క్రమబద్ధంగా, నియమబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా ప్రత్యేక నిబంధనలతో ఏర్పాటు చేయబడి ఉంటుంది. విద్యా లక్ష్యాలు, ప్రణాళిక తప్పనిసరిగా పాటిస్తూ బోధన, అభ్యసన అనేది తరగతి గదిలో జరుగుతుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు క్రమశిక్షణను పాటిస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తారు. బోధనా విషయం, బోధన పద్ధతులు, బోధనా లక్ష్యాలు, బోధించువారు, బోధించే ప్రదేశం ముందే నిర్దేశించబడి ఉంటాయి. విద్యార్ధి వయస్సు, మానసిక పరిస్థితులను బట్టి పాఠ్యాంశాలు ఉంటాయి.
2. అనియత విద్య (Non-formal Education): నియత విద్యాకేంద్రాలైన పాఠశాల, కళాశాలలలో చదువును కొనసాగించలేనివారి కోసం, అదేవిధంగా కొంతవరకు చదువుకొని, విద్యను విరమించిన వారి కోసం తమ విద్యను కొనసాగించటానికి వయస్సుతో సంబంధం లేకుండా విద్యను పొందే అవకాశం కల్పించటాన్ని అనియత విద్య అంటారు. పాఠశాలలో ప్రవేశం లేని, పాఠ్యప్రణాళిక, విద్యా సమయం, బోధన అభ్యసన, బోధనా కాలపరిమితి, వయోపరిమితిలో విద్యార్థులకు అనువుగా ఉండటం కోసం నియమ నిబంధనలతో కూడిన సడలింపు ఉంటుంది. విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది. జీవనభృతికై వృత్తిలో నిమగ్నమైనవారు అనియత విద్యను పొందడం అనువుగా ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో ఈ తరహా విద్యా విధానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. దూర విద్యాకేంద్రాలు, పోస్టల్ ట్యూషన్, పరిచయ తరగతులు, వేసవి తరగతులు, టి.వి., రేడియో కార్యక్రమాలు, ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ స్కూల్, రాత్రి పాఠశాలలు, వయోజన విద్యాకేంద్రాలు మొదలైనవి వీటికి ఉదాహరణలు.
3. యాదృచ్ఛిక విద్య (Informal Education): వ్యక్తి కుటుంబంలోను, సంఘంలోను ఆయా నిర్ణయాలకు అనుగుణంగా జీవిస్తూ తనకు తెలియకుండానే సహజ పద్ధతులను అనుభవాల ద్వారా తన ప్రవర్తనను సరిదిద్దుకొనే విద్యను యాదృచ్ఛిక విద్య అంటారు. సామాజిక సంస్థలైన కుటుంబము, గ్రంథాలయాలు, సినిమాలు, టీవీ మొదలైన మాధ్యమాల ద్వారా మనిషి సంస్కరింపబడతాడు.
(మరొక వర్గీకరణ)
1. సామాన్య విద్య (General Education): వ్యక్తి కనీస అవసరాలు తీరేందుకు అవసరమైన విద్యను సామాన్య విద్య అంటారు. అంటే ఇక్కడ పిల్లవాడు అక్కడి పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ అతని జీవనాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ తరహా విద్యావిధానం 8వ తరగతి వరకూ ఉంటుంది.
2. ప్రత్యేక విద్య (Specific Education): సామాన్య విద్యను కొనసాగిస్తూ ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఆయా రంగాలలో రాణించుటకు ఉపయోగపడే విద్యను ప్రత్యేక విద్య అంటారు. అయితే ఈ తరహా విద్య మెడికల్ మరియు ఇంజనీరింగ్ కళాశాలలలో లభ్యమవుతుంది. ఇది ఖర్చుతో కూడుకున్న విద్య అవడంచేత అందరికీ అందుబాటులోకి రాదు.
(మరొక వర్గీకరణ)
1. ప్రత్యక్ష విద్య (Direct Education): ప్రత్యక్ష విద్య అంటే నియత విద్య. ప్రత్యక్ష విద్యలో ఎలాంటి అవకాశాలు ఉంటాయో ఇక్కడ కూడా అదేవిధమైన విద్యావకాశాలు ఉంటాయి.
2. పరోక్ష విద్య (Indirect Education) : అనియత, యాదృచ్ఛిక విద్యా విధానంలో జరిగే పద్ధతిలోనే పరోక్ష విద్య జరుగుతుంది.
(మరొక వర్గీకరణ)
1. వ్యక్తిగత విద్య (Individual Education): ఆధునిక మనస్తత్వవేత్తల దృష్టిలో వ్యక్తిగత విద్య అనేది విద్యార్థి యొక్క వ్యక్తిగత తారతమ్యాలను బట్టి ఒక ప్రత్యేక బోధన పద్ధతి ద్వారా మానసిక వైకల్యాలను అధిగమించడానికి ఇచ్చే తర్ఫీదు. ఉదా ॥ కిండర్ గార్టెన్, మాంటిస్సోరి మరియు ప్రాజెక్టు పద్ధతి.
2. సామూహిక విద్య(Collective Education): ఒక సమూహం మొత్తానికి సంబంధించిన పిల్లలకు ఒకేసారి అందించే విద్యను సామూహిక విద్య అంటారు. ఇది కూడా నియత విద్యా విధానం లాగానే ఉంటుంది.
(మరొక వర్గీకరణ)
1. చేతన విద్య (Conscious Education) : ఒక విషయం మీద పూర్తి జ్ఞానాన్ని, దాని లక్ష్యాలను సాధించేటట్లు విషయ అవగాహన చేసే విద్యా విధానాన్ని చేతన విద్య అంటారు. ఉదా కళాశాల విద్య,
2. అచేతన విద్య (Unconscious Education) : పరిసరాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి విద్యార్థి అన్ని విషయాలను అవగాహన చేసుకోలేడు. దానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. పిల్లవానిని అర్ధం చేసుకొనే క్రమంలో కొన్ని అవరోధాలు ఉండవచ్చు. ఈ తరహా అచేతన స్థితిలో పిల్లవాడు ఉన్నప్పుడు విద్యను ఎలా అందించాలి అనేది అక్కడి పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ తరహా విద్య యాదృచ్ఛిక విద్య తరహాలోనే ఉంటుంది.
AP DSC 2024 Telugu Content | Class 10 | Best Notes – AP & TS TET & DSC
1. మాతృభావన
పాఠ్యభాగ నేపధ్యం :
కళ్యాణి దుర్గం జయించిన తర్వాత అబ్బాజి సోన్ దేవుడు విజయోత్సాహంతో శివాజీ వద్దకి వస్తాడు. సోన్ దేవుడు శివాజీతో దేవా మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి దాని సర్దారులని పట్టి తెచ్చి సర్వస్వాన్ని రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చాను అని మనవి చేశాడు. ఇది విన్న శివాజీ పరస్త్రీలు తల్లులతో సమానం అని చెప్పి ఆమెకి అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ ఇలా చేయడం తగదని హితవు పలికిన సందర్భం లోది
పాఠ్యభాగ వివరాలు :
ఈ పాఠం చారిత్రక కావ్య ప్రక్రియకి చెందినది. చరిత్ర ఆధారంగా రచించిన కావ్యం. డా. గడియారం వెంకటశేష శాస్త్రి రచించిన శివభారతం తృతీయాశ్వాసం లోనిది
పర్యాయ పదాలు :
ఆజ్ఞ – ఆదేశము, ఆన, ఉత్తరువు, నిర్దేశము
కన్ను – అక్షి, చక్షువు, నేత్రము, నయనము
అనలము – అగ్ని, వహ్ని, జ్వలనము
సతి – మగువ, కొమ్మ, ఇంతి, పడతి
ప్రకృతి – వికృతి :
రాజ్ఞి – రాణి
ఆజ్ఞ – ఆన
ఛాయ – చాయ
రత్నము – రతనము
భక్తి – బత్తి
గౌరవము – గారవము
పుణ్యము – పున్నెం
రాశి – రాసి
అంబ – అమ్మ
దోషము – దోసము
బ్రహ్మ – బమ్మ
జ్యోతి – జోతి
గృహము – గీము
భాగ్యము – బగ్గేము
వ్యుత్పత్తి అర్ధాలు :
శివుడు – సాధువుల హృదయాన సయనించి ఉండువాడు, మంగళకరుడు – ఈశ్వరుడు
పతివ్రత – పతిని సేవించుటయే వ్రతముగా కలది – సాధ్వి
పురంధ్రి – గృహమును ధరించునది – గృహిణి
అంగన – చక్కని అవయవముల అమరిక కలది – అందగత్తె
నానార్ధాలు :
వాసము – ఇల్లు, వస్త్రము
సూత్రము – నూలిపోగు, తీగె
చరణము – పాదము, కిరణము, పద్య పాదము
హరి – యముడు, సింహము, ఇంద్రుడు
రత్నము – మణి, స్త్రీ, ముంత
AP DSC 2024 Telugu Content | Class 10 | Best Notes – AP & TS TET & DSC
2. జానపదుని జాబు
ఉద్దేశ్యం :
భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. అందువల్ల భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అంటారు. గ్రామంలో ప్రతి ఇల్లు విద్యాగంధంతో గుబాళించి అభివృద్ధి చెందితే మనదేశం సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంటుంది అని మహాత్మా గాంధీ అన్నారు. గ్రామాలు ఎలా ఉన్నాయి? వారి జీవితాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలు వివరిస్తూ గ్రామాల్లో పేదలు, దళితుల జీవితాలు చిత్రిస్తూ పల్లెటూరి లేఖలు పేరుతో 1932 లో జనవాణి పత్రికలో, 1933 లో జానపదుని జాబు పేరుతో ప్రజామిత్ర పత్రికలో బోయి భీమన్న ప్రచురించారు. చదువుకుని బీదతనం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరి పనుల్లో మునిగిపోయిన జనపదుడు పట్నంలో శ్రీమంతుడు అయిన తన మిత్రునికి తన అవస్థలను గ్రామాల్లో పరిస్థితులను లేఖల రూపంలో రాస్తాడు. గ్రామ పరిస్థితులు తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం.
పాఠ్యభాగ వివరాలు :
ప్రస్తుత పాఠం లేఖల రూపంలో ఉంది. జానపదుని జాబులు పేరుతో బోయి భీమన్న రాసిన లేఖల సంపుటి నుండి పాఠం ఎంపిక చేశారు. తూర్పు గోదావరి జిల్లా యాసలో లేఖ రచన సాగింది
పదాలు వివరణ :
పురిటి లోనే సంధి కొట్టడం – ప్రారంభంలో పాడైపోయిన పని గురించి వివరించడం
కలుపుదీయడం – సమాజంలో ఉంటూ సమాజాన్ని పాడు చేసే వారిని నివారించడం
గ్రామోద్దరణం – గ్రామ సమస్యలు పరిష్కరించడం (గ్రామోద్దరణమే దేశోద్ధారణం – గాంధీ)
ఉన్నదంతా ఊడ్చుకుపోవడం – పూర్తిగా నాశనం కావడం
3. వెన్నెల
నేపధ్యం :
హిరణ్యకశిపుడు వనవిహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును సాయం సమయాన్ని చంద్రోదయాన్ని కవి వర్ణించాడు. రోజంతా తీవ్ర ఎండ ప్రసరింపజేసిన సూర్యుడు ఇంకా ఉష్ణ తాపం పెంచితే అసుర నాయకుడైన హిరణ్యకశిపుడు సహింపడేమో అన్నట్లు నెమ్మదిగా పక్కకి తొలగిపోయాడు. తదనంతరం ప్రకృతిలో వచ్చే మార్పులు రమణీయంగా వర్ణించారు
పాఠ్యభాగ వివరాలు :
ఈ పాఠం కావ్య ప్రక్రియకి చెందినది. కావ్యం వర్ణన ప్రధానంగా సాగుతుంది. ప్రస్తుత పాఠం ఎర్రన నృసింహ పురాణం తృతీయాశ్వాసం లోనిది
మంచి మిత్రుల కలయిక మన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది. అందుకే ఎప్పుడు సన్మిత్రులను పొందాలని పెద్దవాళ్ళు చెప్తారు. సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిది అని చెప్పడం పాఠం ఉద్దేశ్యం
పాఠ్యభాగ వివరాలు :
ఈ పాఠం కధా ప్రక్రియకి చెందినది. సంస్కృతంలో విష్ణు శర్మ పంచతంత్రం విశ్వవిఖ్యాతి గాంచింది. దానిని అనుసరించి అనేక గ్రంధాలు వచ్చాయి. వాటిలో లక్ష్మీనారాయణ పండితుడు యొక్క హితోపదేశం ఒకటి. ఆది ఆధారంగా చిన్నయసూరి నీతిచంద్రిక తెలుగులో రచించాడు. ఇది గ్రాంధిక వచనంలో సాగుతుంది. పశుపక్ష్యాదులే పాత్రలుగా లోకరీతిని, నీతిని ప్రభోదిస్తూ కధనాలు సాగుతాయి. ప్రస్తుత పాఠ్యాంశం నీతిచంద్రికలో మిత్రలాభం నుండి గ్రహించినది.
పదాలు – అర్ధాలు :
బుద్ధిహీనత వల్ల సమస్త కార్యాలు నిదాఘ నదీపురములట్లు వినాశము నొందును
నిదాఘము అనగా వేసవి కాలం. నదీ పురములు అంటే నది నీటి ప్రవహాలు. నిదాఘ నదీపురములు అంటే మండు వేసవిలో నదులలో నీటి ప్రవహాలు
ధనమున బాసిన క్షణముననే లాతివాడగును
ధనం పోతే ఎవరూ పలకరించరు. పరిచయం లేనట్లు ఉంటారు. అందరికీ పరాయివాడు(లాతివాడు) అవుతాడు
పరాధనాపహరణము కంటే దిరియుట మంచిది
పరధనం దొంగలించడం మంచిది కాదు. అంతకంటే యాచించడం మంచిది
ఒక పుస్తకం తాత్వికతను, అంతస్సారాన్ని, ఆశయాల్ని, శ్రమను తెలిపేది ముందుమాట. ముందుమాట వల్ల పుస్తకం చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. మంచి పుస్తకం ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుస్తుంది. అలాంటి ముందుమాట పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశ్యం
పాఠ్యభాగ వివరాలు :
ఒక గ్రంధాన్ని, ఆ గ్రంధ నేపద్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంధ రచయిత గాని వేరే రచయిత, విమర్శకుడుగానీ రాసే పరిశీలనాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. దీనికి ముందుమాట, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లు కలవు. మహిళావరణం అనే పుస్తకంలో ముందుమాట ప్రస్తుత పాఠ్యాంశం
పర్యాయ పదాలు :
స్త్రీ – పడతి, వనిత, ముదిత
పద్ధతి – విధానం, కరణి, చందము
స్మరణ – జ్ఞప్తి, గుర్తు, తలపు
జాతీయాలు :
గుండెలు బరువెక్కడం – విపరీతమైన మానసిక భాద కలగడం
నీరు కారిపోవడం – పాడైపోవడం, నిరుత్సాహపడడం, ఆశలు అడుగంటిపోవడం
కనువిప్పు – జ్ఞానం కలగడం
కాలధర్మం చెందడం – మరణించడం
తునాతునకలు – ముక్కలు ముక్కలవడం, పూర్తిగా దెబ్బ తినడం
పదాలు – వివరణ :
సామాజిక మార్పు – సమాజంలో కలిగే మార్పు
విజయోత్సవం – విజయం లభించినందుకు చేసుకునే పండగ
సామాజికాభివృద్ది – సమాజపరమైన అభివృద్ధి
సాంస్కృతిక వారసత్వం – సంస్కృతికి సంబందించిన వాటి కొనసాగింపు
అగ్రతాంబూలం – ఒక రంగానికి, గ్రామానికి లేదా సమాజంలో ఉన్నతునిగా గుర్తించడం
7. సముద్ర లంఘనం
పాఠ్యాంశ నేపధ్యం :
సీతాన్వేషణలో రామలక్ష్మణులు కిష్కింద చేరుకుంటారు. సుగ్రీవునితో స్నేహం చేస్తారు. సుగ్రీవుడు సీతని వెతకడానికి వానర సైన్యాన్ని నఊగు దిక్కులు పంపుతాడు. అంజనేయుని బృందం దక్షిణ దిక్కుకి వెళుతుంది. జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు మహేంద్రగిరి నుండి సముద్ర లంఘనానికి సిద్ధం అవుతాడు. ప్రస్తుత పాఠ్యభాగం అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాబ్యూదయం అనే ప్రబంధం ఆరవ ఆశ్వాసం లోనిది
పాఠ్యభాగ వివరాలు :
వర్ణనా ప్రధానమైన కావ్యాలు ప్రబంధాలు. శ్రీకృష్ణ దేవరాయలు (16 వ శతాబ్దం) కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగం అంటారు. పురాణ ఇతిహాసల నుండి చిన్న కధ తీసుకుని వర్ణనలు కలిపి పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే దాన్ని ప్రబంధం అంటారు. వీటిలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి
సమానార్ధ పదాలు :
కొండ కొమ్మున – కూటాగ్రము
వివరము – రంధ్రము
నభము – ఉప్పరము, ఆకాశం
ప్రకృతి – వికృతి :
సముద్రం – సంద్రం
దిశ – దెస
గొనములు – గుణములు
నిముసము – నిమిషం
అగ్గి – అగ్ని
వ్యుత్పత్తి అర్ధాలు :
కార్ముకం – కర్మకారునిచే చేయబడినది
అమరులు – మరణం లేనివారు
ఉదది – ఉదకము దీనియందు ధరించబడును
ప్రభంజనం – వృక్ష శాఖాదులను విరగగొట్టేది
దానవులు – దనువు అనే స్త్రీ యందు పుట్టినవారు
కేసరి – జూలు కలిగినది
ధరాధరం – ధరను ధరించునది
పారావారాం – అపారమైన తీరం కలది
8. మాణిక్య వీణ
పాఠ్యాంశ ఉద్దేశ్యం :
ఆంధ్ర ప్రభ వార్తాపత్రికలో విద్వాన్ విశ్వం మాణిక్య వీణ శీర్షికన వ్యాసాలు కవితలు రచించారు. మాణిక్య వీణలో వీరు స్వీకరించని అంశం లేదని చెప్పవచ్చు. మానవ జీవన ప్రస్థానంతో కళ, కవిత్వం పెనవేసుకున్నాయి అని మనిషి నిరంతర జ్ఞాన అన్వేషి అని ఈ కవిత తెలుపుతుంది. మాణిక్య వీణను మీటి మానవీయ రాగాన్ని పలికించిన ఈ కవిత చారిత్రక ఘట్టాలని తరచి చూపి మనిషి శాశ్వతత్వాన్ని చూపుతుంది
సాంకేతిక రంగంలో అభివృద్ధి మాత్రమే అభివృద్ధి అనుకుంటూ కళలను సాహిత్యాన్ని ఉపేక్షిస్తుంది నేటితరం. మానవజీవితంతో ముడి వేసుకున్న కళలు సాహిత్యం అనాదిగా సంక్రమించిన ఆస్తి అని తెలుపుతూ విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడు అవుతాడాని తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం
పాఠ్యభాగ వివరాలు :
వచన కవిత అనే సాహిత్య ప్రక్రియ ఈ పాఠం. పద్య, గేయాల్లో ఉండే చందస్సుతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో రాసే కవిత వచన కవిత. చిన్న చిన్న పదాలు వాక్యాలతో ధ్వని గర్భితముగా ఉండే కవిత వచన కవిత. ఈ పాఠం విద్వాన్ విశ్వం రచనా సంపుటి లోది
అర్ధాలు :
రోదసీ – అంతరిక్షం
ఆయత్తమవుతున్నారు – సిద్ధపడుతున్నారు
రుగ్మత – రోగం
కళవలపడడం – కలవర పడడం
ఒకరిని చూసి మరొకరు చేయడం – అనుకరించడం
పని చేయడానికి సిద్ధం అవ్వడం – ఆయత్తమవడం
అద్భుతంగా నాట్యమాడడం – తాండవమాడడం
పనిని మొదలుపెట్టడం – తిన్నగా ఎదగడం
జాతీయాలు :
మంత్రాలకి చింతకాయలు రాలడం – పని చేయకుండా కబుర్లు చెప్తే ప్రయోజనం లేదని చెప్పడం
మిన్నందుకోవడం – చాలా అభివృద్ధి చెందడం
గజ్జె కట్టడం – పనిలో చురుకుగా పాల్గొని అన్నీ తానై చేసేవారిని గూర్చి చెప్పడం
పర్యాయ పదాలు :
మిన్ను – ఆకాశం, నింగి
తాండవం – నాట్యం, నృత్యం
రుగ్మత – రోగం, జబ్బు
జ్ఞానం – తెలివి, మేధ
ప్రకృతి – వికృతి :
భాష – బాస
కవితలు – కైతలు
విజ్ఞానము – విన్నాణము
గుహ – గొబ
9. గోరంత దీపాలు
నేపధ్యం :
సమాజంలో ఎంతో మంది అనాధ బాలలను మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి పిల్లల కనీస అవసరాలు అయిన తిండి, బట్ట, చదువు మొదలైనవాటికి నోచుకోకుండా ఉంటారు. అనాధ బాలలను చేరదీసి వారి ఆకలి తీర్చి విద్యా బుద్ధులు చెప్పిస్తే వీరు కూడా మట్టిలో మాణిక్యాలలా వెలుగొందుతారు. సమాజానికి సేవ చేసే గొప్ప మనసున్న వ్యక్తులు తమ ఆస్తిపాస్తులలో సంబంధం లేకుండా అనాధాలను చేరదీసి చదివించేవారు ఎంతో మంది ఉన్నారు. అటువంటి ఒక వ్యక్తి చేసిన పనే ఈ కధ.
ఉద్దేశ్యం :
రైలు ప్రయాణంలో తటస్థ పడిన ఓ బాలుడిని చేరదీసి విద్యా బుద్ధులు చెప్పిస్తే ఎదిగిన ఆ వ్యక్తి చూపే కృతజ్ఞతా భావం వాళ్ళ మధ్య ఉండే మానవ సంబంధాలను తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం.
పాఠ్యభాగ వివరాలు :
ఈ పాఠ్యభాగం కధానిక ప్రక్రియకు చెందినది. ఇది మానవ సంబంధాలు, సామాజిక సేవ ఇతివృత్తంతో కళ్ళకు కట్టినట్లు మనోభావాలను పలికించేలా ఉంటుంది. ఈ పాఠం పులికంటి వారి కధా వాహిని లోనిది
అర్ధాలు :
సంజవెలుగు – సంధ్యా సమయంలో వెలువడే కాంతి
ఆశీర్వాదం – దీవెన
తదేకంగా – ఒకటే పనిగా అన్నట్లు
కాలక్షేపం – సమయం గడపడం
పులుము – పూసు
ఆకళింపు – అవగాహన
నానార్ధాలు :
రాజు – ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు
సమయం – బుద్ధి, సంకేతం, ప్రతిజ్ఞ
కృషి – స్త్రీ, సేద్యం, కరిసనము
కన్ను – ఏరు, వలిపము, తీరు
కొమ్మ – శాఖ, ఆడది, కోటకొమ్మ
ఆశ – దిక్కు, కోరిక
పర్యాయ పదాలు :
పక్షి – నీడజము, ద్విజము, పతగము
నేత్రం – అక్షి, చక్షువు, నయనం
శిరస్సు – తలకాయ, నెత్తి, మస్తకం
సూర్యుడు – అహిమకరుడు, భానుడు, భాస్కరుడు
చెట్టు – తరువు, భూరుట్టు, వృక్షం
కొండ – ఆచలము, శైల్యము, ఆహార్యము
వ్యుత్పత్తి అర్ధాలు :
అతిధి – తిధి, వార, నక్షత్ర నియమం లేకుండా ఇంటికి బోజనముకి వచ్చేవాడు
అక్షరము – నాశనము పొందనిది (వర్ణము)
పక్షి – పక్షములు కలది (విహంగం)
మౌని – మౌనము దాల్చి ఉండువాడు (ఋషి)
10. బిక్ష
నేపధ్యం :
వేద విభజన చేసి పంచమ వేదంగా పేరున్న మహాభారతం రచించి అష్టాదశ పురాణాలు రచించిన బ్రహ్మ జ్ఞాని వేద వ్యాసుడు. కాశీలో వ్యాసుడు తన పదివేల మంది శిష్యులుతో కొంతకాలం నివశించాడు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ప్రాతర్మధ్యాహస్నిక విధులు పూర్తి గావించి శిష్యులతో కూడా కాశీ నగర వీధుల్లో బిక్షాటన చేసేవాడు. శిష్యులు తాము తెచ్చిన బిక్షలో సగం అతిధి అభాగ్యులకు సమర్పించి మిగిలినది భుజించేవారు. ఒకరోజు కాశీ విశ్వనాధునికి వ్యాసున్ని పరీక్షించాలనే సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన ఘటన ఈ పాఠం
పాఠ్యభాగ వివరాలు :
ఈ పాఠ్యాంశం కావ్య ప్రక్రియకి చెందినది. ఇది కాశీ ఖండం సప్తమశ్వాసం లోనిది
పర్యాయ పదాలు :
ద్వాఃకవాటంబు – ద్వారబంధం, ద్వారం తలుపు
వనిత – స్త్రీ, పురంధి, అంగన, పడతి, నారీ
పసిడి – బంగారం, సువర్ణం, కనకం, హిరణ్యం
పారాశర్యుoడు – వ్యాసుడు, బాదరాయణుడు, సాత్యవతేయుడు
ఆగ్రహము – కోపం, క్రోధం, రోషం, కినుక
అహిమకరుడు – సూర్యుడు, రవి, ఆదిత్యుడు, భాస్కరుడు
అర్ధాలు :
ద్వాఃకవాటము – ద్వారం తలుపు
వీక్షించు – చూచు
అంగన – స్త్రీ
మచ్చెకంటి – చక్కని ఆడది
కుందాడుట – నిందించుట
భుక్తిశాల – బోజనశాల
నానార్ధాలు :
వీడు – ఈ మనుష్యుడు, పట్టణం, వదులుట
లెస్స – మేలు, చక్కన, మంచిది
గురుడు – ఉపాధ్యాయుడు, తండ్రి, బలీయం
ప్రకృతి – వికృతి :
విద్య – విద్దె
బిక్షము – బిచ్చము
యాత్ర – జాతర
మత్స్యం – మచ్చెము
11. చిత్రగ్రీవం
ఉద్దేశ్యం / నేపధ్యం :
కలకత్తాలో ఓ పెంపుడు పావురం దానిని పెంచే ఓ బాలుడు వాళ్ళ కధను మనసుకి హత్తుకుపోయేలా చెప్పిన పుస్తకం చిత్రగ్రీవం. పావురాల జీవనానికి సంబంధించిన అతిసూక్ష్మ వివరాలు తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం
పాఠ్యభాగ వివరాలు :
ఈ పాఠ్యభాగం కధా ప్రక్రియకి చెందినది. ఇది అనువాద కధ. ప్రస్తుత పాఠ్యభాగం ధనగోపాల్ ముఖర్జీ రాసిన చిత్రగ్రీవం ఓ పావురం కధ అనే పుస్తకంలో స్వీకరించారు. దీనిని తెలుగులో అనువాదించినది దాసరి అమరేంద్ర. దీన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా సంస్థ ప్రచురించింది. చిత్రగ్రీవం ఓ పెంపుడు పావురం పేరు. ఈ పాఠం పక్షులకి సంబంధించి శాస్త్రీయ విజ్ఞానం అందిస్తుంది
పదాలు – వివరణ :
గద్దింపులు – కువకువ కూయడం
పావురాలు – రకరకాల రంగురంగుల పావురాలు
గువ్వలు – నీలికళ్ళతో కువకువలాడడం
పావురాల గుంపు – పెనుమేఘాలు
పావురం మెడ – హరివిల్లు
పుట్టిన పిల్ల పక్షి – బలహీనమైన, నిస్సహయమైన, అర్భకమైన
చిత్రగ్రీవం – ముక్కు – పొడవాటి, సూది లాంటి, బలమైన
చిత్రగ్రీవం ఒళ్ళు – సముద్ర నీలిరంగు
చిత్రగ్రీవం మెడ ప్రాంతం – ఇంద్రధనస్సు వర్ణాల పూసల గొలుసు
మానవులు చేసే ప్రతి పనికి ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైన సాక్షి. అంతరాత్మను చంపుకుంటే మనిషి తనని తాను వంచించుకున్నట్టే అవుతుంది. గృహస్త ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పదనాన్ని గురించి చెప్పడమే పాఠం ఉద్దేశ్యం.
నేపధ్యం :
విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేస్తున్నాడు. అతని తపస్సు భంగం చేయడానికి దేవతలు మేనకని పంపారు. వారిద్దరికీ ఒక బాలిక జన్మించింది. ఆ శిశువును శకుంత అనే జాతి పక్షులు కాపాడాయి. అందువల్ల ఆమెకి శకుంతల అని నామకరణం చేసి కణ్వ మహాముని పెంచుకున్నాడు. ఒక రోజు దుష్యంతుడు వేట కోసం వెళ్తూ కణ్వ మహాముని ఆశ్రమం దగ్గర ఆగాడు. శకుంతలని చూశాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. శకుంతలకి భరతుడు జన్మించాడు. తల్లి బిడ్డలను కణ్వ మహర్షి అత్తవారింటికి పంపాడు. నిండు కొలువులో దుష్యంతుడు ఆమెను తిరస్కరించాడు. దుష్యంతుడు మాటలు విని కలత చెందిన శకుంతల రాజుకి ధర్మబోధ చేయడమే ఈ పాఠం నేపధ్యం
ప్రక్రియ – ప్రాచీన పద్యం :
ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని అర్ధం. ఇతిహాసంలో కధకి అధిక ప్రాధాన్యం ఉంటుంది. రామాయణం, భారతం ఇతిహాసాలు. ఇతిహాసాల్లో మూలకధ తీసుకుని వర్ణనలతో ఛందోబద్దంగా పద్యాల రూపంలో కావ్యంగా మలచి రాయడమే ఇతిహాస కావ్యం. ఈ కావ్యాలు కవి ప్రతిభా విశేషాలుని వెల్లడిస్తాయి. అద్భుత కధాగమనంతో పాఠకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తాయి.
అర్ధాలు :
ఆచార్యుడు – గురువు
విపత్తు – ఆపద
నూనృత – సత్యం
హృద్యం – మనసుకి ఆహ్లాదం కలిగించడం
యశస్సు – కీర్తి
ఊత – ఆధారం
పర్యాయ పదాలు :
భూమి, వసుధ, పుడమి
ఆసరా, ఆధారం
భార్య, సతి, కళాత్రం, ధార
తనయుడు, పుత్రుడు, సుతుడు, కొడుకు
ఏనుగు, కరి, మాతంగం
నానార్ధాలు :
క్రమము, నీటిచాలు, వితరణ, కత్తి అంచు – ధార
పుణ్యం, స్వభావం, న్యాయం, ఆచారం, నీతి – ధర్మం
మానవుడు, అర్జునుడు – నరుడు
దిక్కు, కోరిక, నమ్మకం – ఆశ
కులం, వెదురు, పిల్లనగ్రోవి – వంశం
ప్రకృతి – వికృతి :
పుస్తకం – పొత్తం
నీరము – నీరు
యజ్ఞము – జన్నము
విద్య – విద్దె
గృహము – గీము
దీపము – దివ్వె
సత్యము – సత్తేము
ధర్మం – దమ్మము
రాజ – రేడు
కావ్యం – కబ్బం
వ్యుత్పత్తి అర్ధాలు :
పుత్రుడు – పున్నామ నరకము నుండి తప్పించేవాడు – కుమారుడు
ధర్మం – లోకం చేత ధరించబడేది
పతివ్రత – పతిని సేవించుటయే వ్రతముగా కలది – సాధ్వి
జ్యోత్స్న – కాంతిని కలిగి ఉండేది
వ్యతిరేక పదాలు :
చేసి – చేయక
వస్తాడు – రాడు
తింటే – తినకపోతే
వినండి – వినకండి
చెప్పి – చెప్పక
2. చైతన్యం
ఉద్దేశ్యం :
ప్రతి మానవ సమాజంలో అందరికీ అతీతంగా కొందరు ఉంటారు. వారు భవిష్యత్తును దర్శిస్తారు. ముందుచూపుతో ఆలోచిస్తారు. దారి దీపమై ముందుకు సాగుతారు. వారు తాత్వికులు. వారు తమ మాటల ద్వారా చేతల ద్వారా దిశానిర్ధేశం చేస్తారు. కవి కూడా ఈ కోవకి చెందినవాడే. అతని కవిత్వంలో సామాజిక చైతన్యం కలిగిస్తాడు. కవి తన రచనల ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తాడు. ఒక వంక మనిషిలో మంచితనం మెచ్చుకుంటూ కూటిలత్వాన్ని ఎండగడతాడు. ఆ నిబద్ధత తోనే కవి తన మనసులో భావాలు లోకానికి ఈ కవిత రూపంలో వెల్లడించారు. విధ్యార్ధులలో సామాజిక చైతన్యం కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడమే ఈ పాఠం ఉద్దేశ్యం
నేపధ్యం :
కవిత్వానికి ఉండవలసిన ప్రధమ లక్షణం సామాజిక ప్రయోజనం. సమాజంలో అసమానతలు రూపుమాపడానికి కవి తన కలాన్ని కదిలించాలి. ప్రజల గొంతుకగా కవి వినబడాలి. తోటి మానవాళికి అండగా నిలవాలంటే గుండె నిండా ధైర్యం నింపుకోవాలి. సొంత లాభం కోసం కాకుండా పరుల మేలు కోరి పని చేయాలి అని ప్రేరణ ఇస్తూ కవి తన ఆకాంక్ష వ్యక్తం చేస్తున్న సందర్భంలో కవి కలం నుండి జాలువారినదే ఈ గేయకవిత
మనిషికి ప్రకృతికి విడదీయరాని బంధం. ప్రకృతిని తరచి చూడడం మనిషి అలవాటు. ఉదయించే సూర్యుడు, రాలిపడే చినుకు, జల జల పారే నీరు, చిరుగాలి సవ్వడి, పూల పరిమళాలు, కిలకిలారావాలు, చిమ్మచీకటి, చల్లని వెన్నెల ఇలా ప్రతిదీ మనిషిని ఆకర్శించి ఆనందాశ్చర్యాలతో ఓలలాడిస్తుంది. ప్రకృతి అందాలకి పరవశించిన మనిషి మైమరిచిపోతాడు. ఆ తన్మయత్వంలో నుండి జరిగిన కావ్య సృష్టి ప్రకృతికి ప్రతిబింబం అవుతుంది. కవి తన మనసులో భావాలను అందంగా ఆకర్షణీయంగా చెప్పడమే వర్ణన. ఇది కవిలోని సృజనాత్మకతను వెలికి తీస్తుంది. ప్రకృతిలో అద్భుతాలు చూడడం అలవాటైతే మనిషి హృదయంలో సున్నితత్వం విరబుస్తుంది. మానవత్వం మొలకెత్తుతుంది. విచక్షణారహితంగా ప్రకృతిని ధ్వంసం చేసే ప్రవృత్తికి అడ్డుకట్ట పడుతుంది. రసార్ద్రరమైన కవి కలం లోనుంచి జాలువారిన భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ విధ్యార్ధులలో మానవీయత మేలుకొలపడం ఈ పాఠం ఉద్దేశ్యం
నేపధ్యం :
మానవుడు కల్పనాశిల్పి. అతని సౌందర్య తృష్ణ వల్ల తన చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి పులకించి పునరవ్యక్తీకరించగలిగాడు. తన ఎద నుండి పాఠకుని ఎదకి చెరవేయడానికి సాహిత్యాన్ని హేతువుగా చేసుకున్నాడు కవి. నన్నయ్య మొదలుకుని నేటి వరకు కవులు తమ కావ్యాలతో ప్రకృతి వర్ణనలకే పెద్దపీట వేశారు. ప్రబంధాలలో వర్ణనలదే పై చేయి. వర్ణనలు రెండు రకాలు. స్వాభావిక వర్ణనలు, భావాత్మక వర్ణనలు. స్వాభావిక వర్ణనలలో వర్ణించే వస్తువు స్వరూప స్వభావాలు మాటల రూపంలో ఉంటే భావాత్మక వర్ణనలలో అలంకారాలతో కూడి ఉంటాయి. వివిధ సందర్భాలలో కవులు కధానుగుణంగా వర్ణించిన ప్రకృతి దృశ్యాలను పరిచయం చేయడంతో పాటు పద్య రచనా శైలిలో వైవిధ్యాలను పరిశీలించేందుకు అనువుగా ఈ పాఠం రూపొందింది.
ప్రక్రియ – వర్ణన :
రచనా ప్రక్రియ ఏదైనప్పటికి కవి చెప్పిన విషయం పాఠకుని మనసు తాకేదిగా ఉండాలి. అతనిలో భావసంచాలనాన్ని కలిగించాలి. కవి తన రచనతో పాఠకునికి లంకె వేసుకుని తనతో పాటూ నడిపించాలి. ఇందుకోసం కవి వివిధ పద ప్రయోగాలతో తన రచన రసాత్మకం చేస్తాడు. దీనిని వర్ణన అంటారు. విషయాన్ని కేవలం విషయంగా కాకుండా సరైన పోలీకలతో కలిపి వివరిస్తాడు. కావ్యాలలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. ప్రబంధాలు వర్ణనలకు పుట్టినిల్లు. భావ కవిత్వమయినా, అభ్యుదయ కవిత్వమయినా వర్ణనతోనే రచనకి భావాపుష్టి కలుగుతుంది.
అర్ధాలు :
భానుడు – సూర్యుడు
తాండవం – నృత్యం, నాట్యం
మిక్కిలి – అధికం, ఎక్కువ
తత్తరపాటు – కలవరపాటు, తొందరపాటు
కనుమరుగు అవ్వడం – కనబడకపోవడం, మాయమవడం
పర్యాయ పదాలు :
నభం – ఆకాశం, గగనం
ధనువు – ధనస్సు, చాపము, విల్లు, హరివిల్లు
పయోధరము – మేఘము, జలదరము, అంబుదం
కేదారం – పొలం, క్షేత్రం, వరిమడి
సస్యము – పంట, పైరు
వెల్లువ – ప్రవాహం
నెచ్చెలి – స్నేహితుడు, మిత్రుడు
నానార్ధాలు :
ధర – భూమి, వెల, రక్తనాళం
పంక్తి – వరుస, గుంపు
తారక – నక్షత్రం, కంటి గుడ్డు
చుక్క – నక్షత్రం, బిందువు
వ్యుత్పత్తి అర్ధాలు :
సూర్యుడు – వ్యాపారములందు జీవులను ప్రేరేపించువాడు – రవి
ధర – విశ్వమును ధరించినది – భూమి
తోయజము – తోయమందు (నీటి యందు) పుట్టినది – పద్మం
శైలము – శిలలు దీనియందు కలవు – పర్వతం
ప్రకృతి – వికృతి :
సంధ్య – సందె
చంద్రుడు – చందురుడు
దిశ – దేస
ఆకాశం – ఆకసము
ముత్యము – ముత్తేము
మేఘము – మెయిలు
4. ఆత్మకధ
ఉద్దేశ్యం :
సామాజిక జీవితం సమస్యల వలయం. అందులో ఆటు పోట్లు ఉంటాయి. జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. తాము నమ్మిన జీవన సూత్రాలను అనుసరించి ఎదిగిన ఎందరో గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని వారి బాటలో నడిచి విజయ శిఖరాలు అధిరోహించిన వారిలో ఈ కవి ఒకడు. సమాజం అతని కృషిని గౌరవించి సమున్నతoగా సన్మానిస్తుంది. కానీ కవి ఆ సన్మానానికి పొంగిపోడు. గతంలో తన జాతి జనులకి జరిగిన అనేక అవమాన పరంపరలు అతని కళ్ల ముందు కదులుతూ ఉంటాయి. వాటి తాలూక దుఖం అతన్ని పట్టి భాదిస్తుంది. విద్య ద్వారానే వ్యక్తికి గౌరవం లభిస్తుంది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తాను ఎక్కడ నుండి వచ్చాడో గుర్తెరగాలి. తన మూలాలు మరువకూడదనే సత్యాన్ని తెలపడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశ్యం
నేపధ్యం :
స్వేచ్చ మానవ సహజాతం. వ్యక్తి తన స్వతంత్రానికి భంగం కలిగితే సహించడు. తన హక్కులను అణచవేయాలని ప్రయత్నిస్తే తిరగబడతాడు. పిల్లలు సైతం తమకి ఇష్టం లేకపోతే తల్లిపాలు తాగనంటారు. తల తిప్పుకుంటారు. ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. తనకి సాటి మనుషుల మధ్య గుర్తింపు కోరుకుంటాడు. సమాజంలో కొన్ని నిరంకుశ భావాలు, కట్టుబాట్లు మనిషి స్వేచ్చకీ సంకెళ్ళు వేస్తాయి. అతడు వాట్ని తెంచుకుని తనలో ఉన్న సృజనాత్మకత శక్తిని ప్రపంచానికి చాటుకుంటాడు. మనిషిలో మంచితనం మానవీయత ప్రపంచం గుర్తించి గౌరవిస్తుంది. అనేకానేక సమస్యలకు కుంగిపోక ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా జ్ఞాన శిఖరాలు అధిరోహించిన ఒకానొక కవి జీవితమే నేటి మన పాఠం
ప్రక్రియ – వచన కవిత :
ఈ పాఠం వచన కవిత అనే ప్రక్రియకి చెందినది. పద్య గేయాల్లో ఉండే ఛందో నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగే కవిత వచన కవిత. సరళమైన పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితముగా ఉండే కవిత వచన కవిత. రచయిత తాను చెప్పదలచుకున్న భావాన్ని సూటిగా స్పస్టంగా చెప్పడం వచన కవిత ప్రత్యేకత. ఆధునిక కవిత్వానికి కొత్త నెత్తురు ఎక్కించిన శ్రీ శ్రీ వచన కవితకి పట్టం కట్టారు. వారి బాటలో నడుస్తున్న ఆధునిక కవులందరు వచన కవితలోనే రచనలు చేస్తున్నారు.
అర్థాలు :
చౌరస్తా – కూడలి
అర్పణము – సమర్పించడం
చురకత్తులు – పదునైన కత్తులు
పర్యాయ పదాలు :
స్వర్ణం – బంగారం, పసిడి, హేమం, కనకం
సూర్యుడు – భాస్కరుడు, రవి, భానుడు, ఇనుడు
కళ్ళు – నేత్రాలు, నయనాలు, చక్షువులు
దేహం – తనువు, శరీరం, కాయం, మేను
నానార్థాలు :
తల – శిరస్సు, గుంపు, చోటు
కాలం – సమయం, మరణం, నలుపు
క్రియ – పని, చర్య
రామ – స్త్రీ, శ్రీరాముడు
ప్రకృతి – వికృతి :
బోజనము – బోనము
బ్రద్న – పొద్దు
కథ – కత
పుష్పం – పువ్వు
5. స్నేహం
ఉద్దేశ్యం :
విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అన్నారు గౌతమ బుద్ధుడు. మనిషికి అవసర కాలంలో ఆదుకున్న మిత్రుడు కన్నా ప్రియమైనది ఏది ఉండదు అన్నాడు గురునానక్. కష్టకాలంలో మనకి నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తుంది అన్నాడు గాంధీజీ. స్నేహం ప్రతి వ్యక్తి జీవితంలో మధురమైన అనుభూతిగా నిలుస్తుంది. ఆటపాటలు ఆడే వయసులో మొగ్గల ప్రారంభం అయ్యి మహావృక్షంలా ఎదిగి జీవితాంతం తోడుగా నిలుస్తుంది. కొందరితో స్నేహం మనల్ని అత్యున్నత శిఖరాలకి చేరిస్తే కొందరి స్నేహం అధః పాతాళానికి తొక్కేస్తుంది. ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది స్నేహం అయినప్పుడు మనం ఎలాంటి స్నేహం ఎంచుకోవాలి ఆ స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవో తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం
ప్రక్రియ – పద్యం :
సాహిత్య ప్రక్రియలో విశిస్టమైనది పద్యం. ఇది ఛందోబద్ధమైనది. లయాత్మకంగా, గాన యోగ్యముగా ఉంటుంది. ధారణకు అనువుగా ఉంటుంది. అందుకే మన ప్రాచీన కవులు మొదలు ఆధునిక కవుల వరకు పద్య రచనకి ప్రాధాన్యత ఇచ్చారు. కవి తన రచనలో భావ వ్యక్తీకరణకి అనువుగా కొన్ని ప్రత్యేక పద్య శైలులు ఎంచుకుంటాడు. ఉద్ధతికి విక్రీడిత పద్యాలు, సుకుమారతకు మాలా పద్యాలు, తాత్విక భావాలకు గీత పద్యాలు, పుష్పాపచయాది సందర్భాలకు రగడలు, పంచచామరాలు మొదలైన పద్య రీతులు కావ్యాలలో శోభిస్తాయి
అర్థాలు :
సంపద – ధనం
సౌధము – భవనము
తండులములు – అటుకులు
ప్రతిజ్ఞ – శపథం
సఖ్యత – స్నేహం
పర్యాయ పదాలు :
మిత్రులు, నేస్తాలు, స్నేహితులు
తల్పములు, శయ్యలు, పరుపులు
వసనములు, అంబరములు, వస్త్రాలు
ఉదకము, సలిలం, జలం
పత్రం, దళం, ఆకు
నానార్ధాలు :
విభుడు – ప్రభువు, శివుడు, బ్రహ్మ
కను – చూచు, వెదకు, జన్మనిచ్చి
దళం – ఆకు, భాగం, దండు
ఫలం – పండు, కార్యం, పరిణామం
వ్యుత్పత్తి అర్థాలు :
గురువు – అజ్ఞానం అనే అంధకారమును చేదించేవాడు – ఉపాధ్యాయుడు
మిత్రుడు – సర్వభుతాల పట్ల స్నేహభావం కలవాడు – సూర్యుడు
మోక్షం – జీవున్ని పాశం నుండి విడిపించేది – ముక్తి
పురంధ్రి – గృహాన్ని ధరించేది – ఇల్లాలు
అమృతం – మరణం లేనిది – సుధ
పదాలు – అర్థాలు :
బ్రహ్మానందం – అంతులేని ఆనందం
చక్రపాణి – చక్రము పాణి (చేయి) యందు కలవాడు
కుంభవృష్టి – కుంభం (కుండ) లతో కుమ్మరించినట్టు కురిసే వాన
తళతళలాడే – ప్రకాశించు
ప్రచండ వాయువు – తీవ్రమైన గాలి
ప్రకృతి – వికృతి :
కార్యము – కర్జము
గృహము – గీము
గౌరవం – గారవం
ధర్మము – దమ్మము
లక్ష్మి – లచ్చి
6. తీర్పు
ఉద్దేశ్యం :
బుద్ధుడు నడయాడిన భారతావని శాంతి, సహానాలకి పుట్టినిల్లు. పరోపకారం మనకి జీవనాడి. మనిషిగా జీవించడానికి కొన్ని విలువలు నియమ నిష్టాలు ఏర్పాటు చేసి దాన్ని మానవత్వం అన్నారు. మనిషి పురుషార్ధపరుడు కావాలి అంటారు పెద్దలు. ధర్మబద్ధంగా జీవితాలను కొనసాగిస్తూ జన్మ సాఫల్యం చేసుకోవాలన్నది దీని పరమ ఉద్దేశం. మనస్సు చంచలమైనది. చూచిన ప్రతీదీ తనకి కావాలని ప్రేరేపిస్తుంది. సాధనతో దీన్ని అదుపులో ఉంచుకోవాలి. కరుణ, సత్యం, ధర్మం, న్యాయం, భూతదయ, అహింస, క్షమాగుణం మొదలైన సాత్విక గుణాలను విధ్యార్ధులు అలవర్చుకుని ఉన్నతమైన జీవనం సాగిస్తూ మానవత్వం చాటుకోవాలని తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం.
నేపధ్యం :
ఒకరోజు సిద్ధార్ధుడు రాజకుమారులతో కలిసి వనవిహారానికి వెళ్ళాడు. సిద్ధార్ధుడు ప్రకృతి అందాన్ని సరోవరాలను పంటచేలను పశుకాపర్లను పశు పక్ష్యాదులను చూసి ఆనందిస్తున్నాడు. ఇంకో రాజకుమారుడు దేవదత్తుడు చేత ధనూర్భానాలు ధరించి జంతువుల వేటకి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో ఒక హంసల గుంపు క్రేంకారం చేస్తూ ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉండడాన్ని దేవదత్తుడు చూశాడు. బాణం సంధించి ఒక హంసను నేలకూల్చాడు. దీనిని చూసిన సిద్ధార్ధుడు మిక్కిలి వ్యధ చెంది ఆ హంసను రక్షించాడు. ఇది ఇద్దరి మధ్య వాదానికి దారి తీసింది. న్యాయం కోసం రాజస్థానానికి వెళ్లారు. చివరికి హంస ఇద్దరిలో ఎవరికి చెందిదో అనేది పాఠం ద్వారా తెలుస్తుంది
ప్రక్రియ – ఖండ కావ్యం :
చిన్న కధ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు గల రచన ఖండ కావ్యం. దీనిలో వ్యర్ధ పదాలకు, వర్ణనలకు అవకాశం ఉండదు. మహాకావ్యాల్లో రసవత్తరమైన ఘట్టాలను పాత్రలను చారిత్రక, దేశభక్తి సన్నివేశాలు మొదలైన వాటిని రమణీయంగా వ్యక్తీకరించడం దీని ప్రత్యేకత. దీనిలో పద్యాలు సంప్రదాయ వృత్తాలలో ఛందోబద్ధంగా ఉంటాయి.
అర్ధాలు :
అంకము – ఒడి
వినుత్రోవ – ఆకాశ మార్గం
ఆస్య – ముఖం
మారాళము – హంస
భాస్పములు – కన్నీళ్ళు
పర్యాయ పదాలు :
అంబరము – ఆకాశం, గగనం
శరం – బాణం, అమ్ము
సరోవరం – సరస్సు, తటాకం
వాక్కులు – మాటలు, పలుకులు
కరములు – చేతులు, హస్తాలు
నానార్ధాలు :
శ్రీ – లక్ష్మీ, సంపద
ఖగము – పక్షి, బాణం
మధు – తేనె, చైత్రం
ఘృతము – నెయ్యి, నీరు
సోమ – శ్రయము, పరాక్రమం
ప్రకృతి – వికృతి :
లక్ష్మీ – లచ్చీ
హంస – అంచ
న్యాయము – నాయము
రత్నము – రతనము
అంకము – అంకె
భీతి – బీతు
త్రోవ – తోవ
ప్రాణము – పానము
రాక్షసి – రక్కసి
సంతోషం – సంతసము
7. మాట మహిమ
ఉద్దేశ్యం :
నరం లేని నాలుక పరిపరివిధాల వదంతులు పుట్టిస్తుంది. దాని ఫలితంగా ధన, మాన, ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుంది. అవయవలన్నింటిలో ప్రధానమైనది మనకి గౌరవం తెచ్చి పెట్టేది నాలుక. విలువైన మాటలే బంధాలను స్నేహాలను పెంచుతాయి. వ్యక్తి సంస్కారానికి మాట గీటురాయి వంటిది. పెదవి దాటి వచ్చే మాటపై అదుపు, పొదుపు అవసరం. మాటతీరు బాగలేకపోతే ఎదురయ్యే కష్ట నష్టాలను తెలపడం, మాట విలువ తెలుసుకుని యోగ్యతతో కూడిన మాటలే మాట్లాడడం అలవరచుకునేలా చేయడం ఈ పాఠం ఉద్దేశ్యం
నేపధ్యం :
మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు. ఒక్కొక్కరి మాటతీరు ఒక్కోలా ఉంటుంది. కొందరి మాటలు ప్రేమని పంచితే, మరికొందరు మాటలు మనసు ముక్కలు చేస్తాయి. కొందరు మాటలు ధైర్యం నింపితే మరికొందరి మాటలు పిరికితనం నూరిపోస్తాయి. నాలుక అదుపులో ఉంచుకుని మాట్లాడే స్వభావం పెంపొందించుకోవడం ఎంత అవసరమో మోసపు మాటల మాయలో పడకుండా జగరుకతతో ఉండడం అంతే అవసరం
ప్రక్రియ – ఆధునిక పద్యం :
తెలుగు సాహిత్య ప్రక్రియలో విశిస్టమైన ప్రక్రియ పద్యం. పూర్వం సాహిత్య రచనలు అన్నీ పద్య ప్రక్రియలో జరిగేవి. పద్య ముఖ్య లక్షణం ఛందస్సు. పద్యాలలో వృత్తాలు, జాతులు, ఉపజాతులు ఉన్నాయి. ఆధునిక రచయితలపై కూడా ప్రాచీన పద్య ప్రభావం ఎంతైనా ఉంది. అందుకే ఆధునిక రచయితలు తమ భావాలను ప్రాచీన పద్య శైలిలో ఛందోబద్ధంగా రచించడం జరుగుతుంది. ఆధునిక పద్యంలో పద్యశైలి ప్రాచీన పద్య లక్షణాలతో ఉంటుంది. వస్తువు ఆధునికమైనది ఉంటుంది
అర్ధాలు :
పధమున – మార్గము
మితము – కొద్దిగా
కులాలుడై – కుమ్మరివాడు
దుర్గుణాలు – చెడుగుణాలు
గరళం – విషం
పర్యాయ పదాలు :
నేస్తాలు, మిత్రులు
జిహ్వా – నాలుక, రసజ్ఞ
తిలకించు – చూచు, వీక్షించు
సిరి – లక్ష్మీ, సంపద
నానార్ధాలు :
పయనము – ప్రస్థానం, గమనం
అమృతము – సుధ, నెయ్యి
కాంచుట – చూచుట, పొందు
ప్రకృతి – వికృతి :
భాష – బాస
పుస్తకాలు – పొత్తములు
దూరము – దువ్వు
వర్ణం – వన్నె
హృదయం – ఎద
సహాయం – సాయం
జాతీయాలు :
కంకణం దాల్చు – కార్యం నెరవేర్చే శపధం పట్టడం
గిల్లి జోలబాడటం – మనిషి కింద మంట పెట్టి మీద నీళ్ళు చల్లడం
జుట్టు ముడిపెట్టడం – తగాదా పెట్టడం
వంట జీర్ణించుకోవడం – పూర్తిగా విషయం అవగాహన చేసుకోవడం
8. ఇల్లలకగానే
ఉద్దేశ్యం :
ప్రతి మనిషికి కొన్ని అభిరుచులు ఉంటాయి. ఆడవాళ్ళు పెళ్లవగానే ఇల్లు చక్కదిద్దడంలో లీనమైపోతారు. బరువు బాధ్యతలతో వంటింటి కుందేళ్ళు ఐపోతారు. ఇంటి పనుల్లో పడి కోరికలకు కళ్ళెం వేసుకుంటారు. అభిరుచులు ఆటకెక్కిస్తారు. భర్త, పిల్లలను చూసుకోవడం భాగ్యం అనుకుంటారు. చివరికి తమ అస్తిత్వం కోల్పోతారు. వివాహితకు కుటుంబం అండగా నిలిస్తే వారు విజయ బావుటా ఎగురవేస్తారు. స్త్రీల ఆత్మాభిమానం పెంపొందించుకోవాలి అని తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం
ప్రవేశిక :
వివాహం అయిన స్త్రీ తన చదువు, సృజనాత్మకత, నైపుణ్యాలు పక్కన పెట్టాల్సి వస్తుంది. యంత్రంలా పని చేస్తున్న క్రమంలో తనకో పేరు ఉంది అని మర్చిపోతుంది. ఇంటి పనిలో మునిగి స్వీయ చైతన్యం ఆత్మ గౌరవం కోల్పోవడంలో అనౌచిత్యాన్ని ఈ కధ ద్వారా తెలుసుకుందాం
ప్రక్రియ – కధ :
తెలుగు సాహిత్యంలో కధ ఒక ప్రధాన ప్రక్రియ. వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలు వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో గుండెకి హత్తుకునేలా చెప్పే వచన రచనే కధ. ప్రస్తుతం కధ, కధానిక అనే రెండు పదాలు ఒకే అర్ధంలో వాడుతున్నాం. ఎందరో రచయితలు తమ కధల ద్వారా తెలుగు సాహిత్యం పరిపుష్టం చేస్తున్నారు
అర్ధాలు :
నేర్పరి – నైపుణ్యం, ప్రావీణ్యం
తీర్చి దిద్దిన – బాగుపరిచిన, రూపొందించిన
భుజం తట్టడం – ప్రోత్సహించడం, ప్రేరణ కలిగించడం
విధ్యార్జన – జ్ఞాన సంపాదన
పర్యాయ పదాలు :
గుర్తు – సంకేతం, జ్ఞాపకం, సంజ్ఞ
బట్టలు – వస్త్రాలు, వలములు, చెలములు
ఉత్తరాలు – జాబులు, లేఖలు
తపన – కోరిక, ఆశ, ఈప్పితం
ఇల్లాలు – భార్య, శ్రీమతి, సతి
ప్రకృతి – వికృతి :
తీరం – దారి
గౌరవం – గారవం
ప్రాణము – పానము
భాష – బాస
ఆశ్చర్యం – అచ్చెరువు
సామాన్య వాక్యాలు – సంయుక్త వాక్యాలు :
రాధ పాట పాడుతున్నది. రవి పాట పాడుతున్నాడు – రాధ, రవి పాట పాడుతున్నారు
సాందీపుడు గురువు. శ్రీకృష్ణుడు శిష్యుడు – సాందీపుడు, శ్రీకృష్ణుడు గురుశిష్యులు
భీముడు వీరుడు, అర్జునుడు వీరుడు – భీముడు, అర్జునుడు వీరులు
సామాన్య వాక్యాలు – సంశ్లిష్ట వాక్యాలు :
శైలజ నడుస్తున్నది. శైలజ పాట పాడుతున్నది – శైలజ నడుస్తూ పాట పాడుతున్నది
నెమలి వేగంగా వచ్చింది. నెమలి పాముని చూసింది – నెమలి వేగంగా వచ్చి పాముని చూసింది
నేను ఉదయాన్నే లేచాను, నేను వ్యాయామం చేశాను – నేను ఉదయాన్నే లేచి వ్యాయామం చేశాను
ఏనుగు తొండం ఎత్తింది, ఏనుగు ఘీంకరించింది – ఏనుగు తొండం ఎత్తి ఘీంకరించింది
9. రంగస్థలం
ఉద్దేశ్యం :
కళారూపాలు ఆస్వాదించే వారికి ఆనందం పంచుతాయి. మానవుడు సంఘ జీవనం మొదలు పెట్టిన నాటి నుండి మనోల్లాసం కలిగించే అనేక రకాల ఆటపాటలు జీవితంలో భాగం చేసుకున్నాడు. కాలక్రమంలో అవి కళారూపాలుగా రూపుదిద్దుకున్నాయి. హరికధ, బుర్రకధ, చిందు భాగవతం, యక్ష గానం మొదలైనవి అన్నీ ఈ కోవకి చెందినవే. అలాంటివాటిలో ఒకటైన నాటకం గురించి దాని ఔన్నత్యం గురించి వివరించడం ఈ పాఠం ఉద్దేశ్యం
నేపధ్యం :
నాటకం ఒక కళారూపం మాత్రమే కాదు, ఒక గొప్ప సాహితీ ప్రక్రియ కూడా. ఎందరో లబ్ధ ప్రతీష్టులైన కవులు అనేక నాటకాలు రాశారు. నటీనటులు తమ అద్భుత నటనతో వాటికి దృశ్య రూపం కల్పించారు. అనేక నాటక సమాజాలు నాటకాలు ప్రదర్శిస్తూ వాటికి ఆదరణ కల్పించాయి. అత్యున్నత శిఖరాలు అధిరోహించిన నాటక రంగం సినిమా ప్రవేశంతో తన ప్రభావం కోల్పోయింది. కేవలం వినోదం పంచడంతో సరిపెట్టుకోకుండా సామాజిక సమస్యలు, సాంఘిక దురాచరాలని ఎత్తి చూపుతూ కొత్త పుంతలు తొక్కుతూ ఈనాటికీ తన ఉనికిని చాటుకుంటున్న నాటకం గురించి నేటి తరం తెలుసుకోవడం ఎంతో అవసరం
ప్రక్రియ – వ్యాసం :
ఒక విషయం గురించిన సమాచారం విశేషాలు పాఠకులకి అర్ధం అయ్యేలా సంగ్రహంగా రాసే ప్రక్రియను వ్యాసం అంటారు. వ్యాసానికి ఒక స్పష్టమైన ప్రారంభం, వివరణ, ముగింపు అనే లక్షణాలు ఉంటాయి. రచయిత విషయాన్ని కూలంకుశంగా పరిశీలించి అవసరం అయిన సమాచారం క్రోడీకరించి వ్యాసం రాస్తారు
నాటికలు – రచయితలు :
ఆత్మ వంచన – బుచ్చిబాబు
తేలుకుట్టిన దొంగలు – పొట్లూరి వేంకటేశ్వర రావు
కప్పలు – ఆత్రేయ
కంఠాభరణం – పానుగంటి
గృహప్రవేశం – మునిమాణిక్యం
సరిపడని సంగతులు – బళ్ళారి రాఘువ
సత్యం గారి ఇల్లు ఎక్కడ – గొల్లపూడి
అర్ధాలు :
కనుమరుగు – కనపడకపోవడం
హర్షధ్వనాలు – చప్పట్లు, కేరింతలు
నిత్యనూతనం – ఎల్లప్పుడూ కొత్తగా
సమ్మేళనం – కలయిక
ఆద్యంతం – మొదట నుండి చివర వరకు
పర్యాయ పదాలు :
స్త్రీలు, మహిళలు
గ్రామం, పల్లెటూరు
హాస్యం, నవ్వు
నృత్యం, నాట్యం
వీక్షకులు, ప్రేక్షకులు
నానార్ధాలు :
ఉల్లాసం – ఆనందం, ఉత్సాహం
చేరువ – దగ్గర, సాన్నిత్యం
నూతనం – కొత్త, వింత
కాలం – సమయం, మరణం, నలుపు
కృషి – ప్రయత్నం, వ్యవసాయం, పరిశ్రమ
10. ప్రియమైన నాన్నకు
ఉద్దేశ్యం :
మనిషి ప్రేమతో నిండిన ప్రేమకు పులకరిస్తాడు. ఆత్మీయంగా హత్తుకుంటే ఆనందిస్తాడు. ఆధునిక కాలంలో మనిషికి ఉరుకుల పరుగుల జీవనశైలి నిత్యకృత్యం అయింది. అమ్మ నాన్నలను అయిన వాళ్ళను ఆత్మీయులను పాలకరించుకుని మనసు విప్పి సుఖదుఃఖాలు పంచుకునే కాలమే నేడు కరువైంది. సాంకేతిక పరిజ్ఞానం మనిషిని యాంత్రికుని చేసి తన చుట్టూ తిప్పుకుంటుంది. ఈ నేపధ్యంలో మనసులో మాటలను మమతలను ఒకరినొకరు పంచుకునేలా చేయగల ఏకైక సాధనం ఉత్తరం. బాలలలో లేఖ రచన పట్ల ఆసక్తి పెంపొందించి కుటుంబ విలువలు కాపాడడం మానవ సంబంధాలు భాంధవ్యాలకు ప్రాణం పోయడమే ఈ పాఠం ఉద్దేశ్యం
నేపధ్యం :
ఉత్తరం ద్వారా వాస్తవిక సంఘటనలు, అనుభవాలు, ఆలోచనలు ఆసక్తికరంగా వ్యక్తీకరించడం జరుగుతుంది. ఉత్తరం రాయడం ఒక కళ. మన అనుకున్నవారి బాగోగులు భావోద్వేగాలును ఉత్తరం రూపంలో అందుకుంటే కలిగే ఆనందానికి అవధులు ఉండవు. ఉత్తరం చదువుతుంటే రాసినవారు ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. ఆత్మీయ బంధం పెనవేసుకుంటుంది. అందుకే ఉత్తరం పదే పదే చదువుతూ గుండెకు హత్తుకుంటాం. పదిలంగా దాచుకుంటాం. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాలు అయిన వాట్సప్, మెయిల్ ఇలాంటి అనుభూతి ఇవ్వలేవు. ఆత్మీయతలు, ప్రేమనురాగాలు పెంపొందాలన్నా మనుషుల మధ్య దూరం తగ్గాలన్నా లేఖ అత్యుత్తమ సాధనం. పిల్లల ఎదుగుదల కోసం తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నిరంతరం తపించిన తండ్రిని తలచుకుంటూ ఒక కూతురు తండ్రికి రాసుకున్న ఉత్తరమే ఈ పాఠం
ప్రక్రియ – లేఖ :
తెలుగు సాహిత్యంలో లేఖా రచన ఒక అద్భుత ప్రక్రియ. వ్యక్తులు, సంస్థల మధ్య సమాచారం పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనమే లేఖ. లేఖల ద్వారా తమ భావాలు, అనుభవాలు, అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. కేవలం విషయ సమాచారమే కాకుండా ప్రముఖులు రాసిన లేఖల్లో సాహితీ విలువలు ఉంటాయి. అందువల్ల వచన రచనలో ఒక సాహిత్య ప్రక్రియగా లేఖను పేర్కొంటారు. ఎందరో రచయితలు లేఖల రూపంలో తన హృదయాన్ని ఆవిష్కరించారు. సంజీవ దేవ్ లేఖలు, నెహ్రూ లేఖలు, చలం లేఖలు, ఔరంగజేబు లేఖలు, అబ్రహం లింకన్ లేఖలు ఈ కోవకి చెందినవే. కొందరి లేఖలు ఆలోచింపజేస్తే మరికొందరి లేఖలు ఆనందింపజేస్తాయి. అందుకే లేఖలను చైతన్యానికి ప్రతీకలు అంటారు
విధ్యార్జనకు పుట్టుపూర్వోత్తరాలు, ఆర్ధిక అసమానతలు అవరోధాలు కావు అని నిరూపించిన ధీశాలి ప్రకాశరావు. పట్టుదల, కృషి ఉంటే అక్షర సింహాసనం ఎక్కి సాహితీ సామ్రాజ్యం ఏలవచ్చు అని నిరూపించి చూపిన కార్యదక్షుడు. పద్య రచనలో పట్టు సాధించి కొందరికే పరిమితం అయిన అష్టావధాన ప్రక్రియలో రాణించడం ద్వారా అత్యున్నత పద్మ శ్రీ పురష్కారం అందుకుని నేటి తరానికి స్పూర్తి ప్రదాతగా నిలిచిన ఆ మహానీయుని సాహితీ జీవన ప్రస్థానం తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం.
ప్రక్రియ – ముఖాముఖి :
ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహనీయుల జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. మరెన్నో వెలుగునీడలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం ద్వారా మన జీవితం సుగమం చేసుకోవడానికి వీలు అవుతుంది. ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారం సేకరించడమే ముఖాముఖి. సేకరించిన సమాచారం ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా పాఠకులకు అందించడం జరుగుతుంది. ముఖాముఖి ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వం వారి అనుభవాలు, జీవిత విశేషాలను స్వయంగా వారి ద్వారా తెలుసుకునే వీలు ఉంటుంది
ప్రవేశిక :
సాహితీ వ్యవసాయంలో పద్య సేద్యం చేసిన ఓ భాషా పరిమళం, సుందర శబ్దాలతో అందమైన పద్యాలు అల్లిన ఓ అష్టవధాన రూపం ఆశావాది ప్రకాశరావు. నీదే కులం అని అడిగిన వారికి నాది కవికులం అని చాటిన కవితావాది ఆశావాది. అవధానం కొందరి సొత్తు. అది నీవెలా చేస్తావు ఆన్న అవహేళనలకు తన సాహిత్య పటిమతో సమాధానం ఇచ్చిన సౌజన్యమూర్తి. తెలుగు భాషకే సొంతం అయిన అవధాన ప్రక్రియలలో వారు అగ్రశ్రేణిలో నిలిచారు. తిరుపతి వెంకట కవులను ప్రేరణగా తీసుకుని సి వి సుబ్బన్న శతావధానిని గురువుగా నిలుపుకుని వారి సాహితీ ప్రస్థానం విశిష్ట పురష్కారాలకు వేదికైంది. అలనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారిచే బాలకవిగా పిలిపించుకుని మొన్నటి రాష్ట్రపతి రామనాధ్ కోవిoద్ చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న భాషాజీవి. ప్రస్తుత పాఠ్యభాగం ఆశావాది ప్రకాశరావు రచించిన “ప్రకాశ ప్రదీపనం” లోనిది
అర్ధాలు :
గోష్టి – చర్చ
ఆశువు – అప్పటికి అప్పుడు చెప్పే కవిత్వం
పృచ్చకులు – అష్టవధానంలో ప్రశ్నించేవారు (8 మంది ఉంటారు)
పర్యాయ పదాలు :
నేత్రం – నయనం, కన్ను, అక్షి
నాన్న – తండ్రి, జనకుడు
కౌముది – వెన్నెల, చంద్రిక
నానార్ధాలు :
కవి – కవిత్వం రాసేవాడు. నీటికాకి
గురువు – ఉపాధ్యాయుడు, బృహస్పతి
కృషి – ప్రయత్నం, వ్యవసాయం
వ్యుత్పత్తి అర్ధాలు :
కృతులు –
పౌత్రుడు – పుత్రుని యొక్క పుత్రుడు
ఆచార్యుడు – ధర్మ మార్గం ఆచరించి చూపువాడు
ప్రకృతి – వికృతి :
దైవం – దయ్యం
కార్యం – కర్జము
పద్యం – పద్దెము
కీర్తి – కిరీతి
కవిత – కయిత
విజ్ఞానం – విన్నానం
అక్కరం – అక్షరం
సందియం – సందేహం
జాతీయాలు :
ఎత్తిపొడుపు – నిందించడం
కత్తి మీద సాము – చాలా దుర్లభం, కష్టతరం
తామరతంపర – కుప్పలు తెప్పలు, కోకొల్లాలు
12. ఏ దేశమేగినా
ఉద్దేశ్యం :
తెలుగులో పద్యం, కధ, వచన కవిత మొదలైన ప్రక్రియలతో పాటు యాత్రా రచన కూడా ఒక సాహితీ ప్రక్రియ. దాని పట్ల విద్యార్ధులకు అవగాహన కలిగించడం, రచయిత్రి తన విదేశీ యాత్ర అనుభవాలను పరిచయం చేయడం, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలు తెలపడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.
నేపధ్యం :
“ఈనాడు ఊసుపోక ఊరికే తిరిగే లోక సంచారులు కాదు ప్రపంచానికి కావలసినది. తమ తిరుగుడుకి సార్ధకత కల్పించగల లోక సంచారులు కావాలి. అంటే దేశాలు తిరిగి తాము సంపాదించిన అనుభవాన్ని, చూసిన ప్రదేశాల వివరాల్ని ఏ కారణం వల్లనో దేశాలు తిరగలేక స్థిరవాసులయిన లక్షలాది మంది ప్రజలకు అందించగలిగి ఉండాలి లోకసంచారులు” అని లోకసంచారి అనే పుస్తకంలో ప్రముఖ చారిత్రక సాంస్కృతిక హిందీ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వెల్లడించారు
సరిగ్గా అలాంటి ఒక సదుద్దేశ్యంతో శ్రీమతి ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ గారు భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలు పర్యటించారు. ఆ పర్యటన సాగిన విధానం ఆమె పొందిన అనుభవాలు, విశేషాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం
ప్రక్రియ – యాత్రా రచన :
యాత్రికుడు తాను పొందిన యాత్రనుభవాలను గ్రంధస్థం చేయడం యాత్రా రచన. వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత గల దర్శించినపుడు అక్కడి విశేశాలను పొందిన అనుభూతిని అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా రాయడమే యాత్రా రచన.
నేటికీ ఏ తీర్ధ యాత్రకో, విహార యాత్రకో వెళ్ళి వచ్చిన వారు తమ స్నేహితులతో ఇరుగుపొరుగువారికో అక్కడ వింతలు, విశేషాలు కధలు కధలుగా చెప్పడం చూడవచ్చు. యాత్రా రచనలు చదువుతునప్పుడు పాఠకుడు తాను కూడా అక్కడ ఉన్నట్లు అనుభూతి చెందుతాడు. పిల్లలు కూడా తాము వెళ్ళిన ఊళ్ళ గురించి విజ్ఞాన యాత్రల గురించి యాత్రా రచన చేయడం అవసరం. ఇది తమ అనుభవాలకి అక్షర రూపం కల్పించడం
రచన – గ్రంధకర్త :
ఆటా జనికాంచె – ఎండ్లూరి సుధాకర్
ఇనుపతేరనెనుక – రావూరి భరద్వాజ
నవ భారతి – మాలతీ చందూర్
రష్యాలో స్నేహాయాత్ర – వసా ప్రభావతి
నేను చూసిన అమెరికా – అక్కినేని నాగేశ్వర రావు
కాశీ యాత్ర చరిత్ర – ఏనుగుల వీరాస్వామి
అర్ధాలు :
జోతలు – నమస్కారాలు
సమాగమం – కలయిక
సాధ్వి – పతివ్రత
కలగుండు – కలవరం
ఉత్కృష్టం – గొప్పగా
అధిరోహించిన – ఎక్కిన
పర్యాయ పదాలు :
జాబు, ఉత్తరం, లేఖలు
ఆదేశం, ఆజ్ఞ, అనుజ్ఞ
జ్ఞప్తి, స్మృతి, జ్ఞాపకం
ప్రకృతి – వికృతి :
దీపము – దివ్వె
మాణిక్యం – మానికం
యత్నం – జతనం
యాత్ర – జాతర
నిత్యం – నిచ్చెలు
13. నా చదువు
ఉద్దేశ్యం :
విద్య వలన వినయం వినయం వలన పాత్రత కలుగుతుంది అనేది ఆర్ష వాక్యం. అంటే విద్య వ్యక్తి అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడుతుంది. విద్యాభ్యాసం కోసం ఎంతోమంది ఎన్ని ఆటంకాలు వచ్చిన ఎదురీది వివిధ ప్రయత్నాలు చేసి సఫలీకృతులయ్యారు. అలాగే కోరుకున్న రంగంలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. విద్యార్ధులకు అలాంటి వ్యక్తుల జీవిత విశేషాలు తెలిపి వారి బాటలో నడిచేలా చూడడం దేశాభివృద్ధికి పాటుపడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశ్యం
నేపధ్యం :
తెలుగులో వచన కవిత్వానికి పట్టం కట్టిన ప్రముఖ రచయితలలో శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారు అగ్రగణ్యలు. ఆధునిక తెలుగు కధకి గురజాడ బీజం వేస్తే తరవాత శ్రీపాద వారు దానికి జవజీవాలు కల్పించారు. పద్య కవిత ప్రభావానికి ఎదురొడ్డి తెలుగు సాహిత్యాన్ని ఆధునిక వచన రచన వైపుకి చేయి పట్టి నడిపించిన వైతాళికుడు శ్రీపాద. వీరు చక్కని తెలుగుదనంతో గ్రామీణ నేపధ్యంతో కధలు, కావ్యాలు రాయడంలో సిద్ధహస్తులు. ఈయన తన చిన్నతనంలో చదువు సాగించిన తీరుకు ఒక ప్రత్యేకత ఉంది. నాడు తన విద్యాభ్యాసంలో ఎదురైన సమస్యలు వాటిని అధిగమించిన విధానం నేటి తరానికి మార్గదర్శకం. శ్రీపాద వారు తన చిన్ననాటి సామాజిక స్థితిగతులను అవకాశాలుగా మార్చుకుని రచయితగా కవిగా ఎదిగిన తీరు తన ఆత్మకధ “అనుభవాలు – జ్ఞాపకాలునూ” లో వివరించారు. అందులో తన బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలిపే నేపధ్యం లోనిది ఈ పాఠ్యాంశం.
ప్రక్రియ – ఆత్మకధ :
వ్యక్తి తన జీవిత అనుభవాలు, అభిప్రాయాలు కలబోసి తనకి తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకధ. తనకై తాను రాసుకున్న జీవిత చరిత్ర. అవి ఆత్మకధలే అయినా సామాజిక జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ఇది ఉత్తమ పురుష కధనంలో ఉంటుంది. ఆత్మకధలు చదవడం ద్వారా పాఠకుడు రచయితతో కలిసి పయనిస్తున్నట్లు అనుభూతి చెందుతాడు. అందుచేత ఎన్ని ఆత్మకధలు, జీవిత చరిత్రలు చదివితే అన్నీ జీవితాలను ఏకకాలంలో జీవించినవారమవుతాము అంటారు.
ఆత్మకధలు :
సత్య శోధన – మహాత్మా గాంధీ
నేను – నా దేశం – దరిశి చెంచయ్య
నా ఎరుక – అధిబట్ల నారాయణదాసు
పింజారి – షేక్ నాజర్
హంపి నుండి హరప్పా దాకా – తిరుమల రామచంద్ర
నా జీవిత యాత్ర – టంగుటూరి ప్రకాశం పంతులు
నా గొడవ – కాళోజీ నారాయణరావు
నా అంతరంగ కధనం – బుచ్చిబాబు
సాలగ్రామం – కపిలవాయి లింగమూర్తి
అర్ధాలు :
సఫలం – విజయవంతం
ప్రాప్యo – పొందదగినది
పారంగతుడు – నిష్ణాతుడు
ప్రవర్తన – నడవడిక
దీక్షాపరుడు – అనుకున్న కార్యం నెరవేర్చేవాడు
ఉడాయించడం – వెళ్ళిపోవడం
పర్యాయ పదాలు :
మార్గం, తోవ, దారి
రహస్యం, గుట్టు, మర్మం
గూడు, గృహం, సదనం, ఆవాసం
సీమ, ప్రాంతం, ప్రదేశం
మహిళ, వనిత, స్త్రీ
నానార్ధాలు :
పూనిక – యత్నం, సన్నాహం
నిర్మాణం – ఆకృతి, కల్పన
దృక్పధం – అభిప్రాయం, మార్గం
పాదు – కుదురు, ఆవాసం
సుతరాం – ఏమాత్రం, కొంచెమైనా
ప్రకృతి – వికృతి :
విద్య – విద్దె
దేవళం – దేవాలయం
వీది – వీధి
నిదుర – నిద్ర
చట్టం – శాస్త్రం
రాతిరి – రాత్రి
దిస్టి – దృష్టి
14. ఆకుపచ్చశోకం
ఉద్దేశ్యం :
భూగోళం మీద జీవకోటికి ప్రాణవాయువు ఇచ్చి పచ్చదనం పెంచేవి చెట్లు. నాగరికత పేరుతో మనిషి ప్రకృతిని విచక్షణ లేకుండా కొల్లగొడుతున్నాడు. అవసరాన్ని మించి అడవులు ధ్వంసం చేస్తున్నాడు. ప్లాస్టిక్ భూతం ఒక వైపు అడవుల నరికివేత మరోవైపు పర్యావరణాన్ని ప్రమాదంలో పెడుతున్నాయి. ఈ ప్రమాదం గుర్తెరిగి పర్యావరణం కాపాడవలసిన అవసరం గూర్చి తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం.
ప్రక్రియ – పర్యావరణ కవిత్వం :
తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతికి పర్యావరణానికి కలుగుతున్న హానిని దానివల్ల కలిగే పర్యవసానాలను తెలపడమే పర్యావరణ కవిత్వం ఉద్దేశ్యం. పర్యావరణ భావనలను రచయిత కవిత రూపంలో వ్యాసరూపంలో వ్యక్తీకరిస్తారు. అందువల్ల దీనిని కవితా వ్యాసం అంటారు
అర్ధాలు :
హరితం – పచ్చదనం
ఉపద్రవం – ప్రమాదం
బాహువులు – చేతులు
ఛాయ – నీడ
గరళం – విషం
పర్యాయ పదాలు :
చెట్లు – తరువులు, భుజములు
ముస్తాబు – అలంకరణ, అందంగా తయారు చేయడం
జాడ – గుర్తు, ఆనవాలు
తాపం – వేడి, ఉష్ణం, సెగ
సముద్రం – పయోధి, జలది
నానార్ధాలు :
ఎండ – వెలుగు, అతపం
కాలం – సమయం, నలుపు
కాయం – శరీరం, గురి, స్వభావం
జాడ – విధం, ఆచూకి, దారి
దాహం – దప్పిక, కాలడం
ప్రకృతి – వికృతి :
మనిషి – మానిసి
పట్టణం – పత్తనం
సముద్రం – సంద్రం
ఛాయ – చాయ
కధ – కత
జాతీయాలు :
పానకంలో పుడక – సందర్భానికి సంబంధం లేకుండా ఆటంకం కలిగించడం
తామరతంపరగా – తొందరగా విస్తరించడం
కూర్చున్న కొమ్మను నరుక్కోవడం – ఆశ్రయం ఇచ్చిన వారినే చెడగొట్టడం
నిమ్మకు నీరెత్తినట్లు – ఎలాంటి సమస్య ఉన్నా నిబ్బరంగా ఉండడం
నడుం కట్టాలి – ఒక పని పూర్తి చేయడానికి పూర్తిగా సంసిద్ధం చేయడం
కప్ప జీవిత చక్రం:- గుడ్ల సమూహం — టాడ్ పోల్ – కాళ్ళు కలిగిన టాడ్ పోల్ – చిరుకప్ప – కప్ప
కప్ప టాడ్ పోల్ గా ఉన్నపుడు శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుంది
కప్పగా మారిన తరువాత కీటకాలను తిని ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుతాయి
పర్యావరణం దెబ్బతినడం గురించి తలియచేయడంలో మంచి సూచికలు — కప్పలు, సీతాకొక చిలుకలు
కిమిసంహరక మందుల అధిక వాడకం అనునది కాన్సర్ వంటి రోగాలకు కారణం అవుతుంది
రైతులు సేంద్రీయ వ్యవసాయ పద్దతులు ఉపయోగించాలి
సేంద్రీయ వ్యవసాయంలో ఉపయోగించే ఎరువులు – పశువులవ్యర్దాలు , వర్షి కంపోస్ట్, నూనె మరియు జీవవ్యర్జాలు
సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం చేయడాన్ని – ZBNF అంటారు
ZBNF అనగా జీరోబడ్జెట్ నేచురల్ ఫార్మింగ్
సేంద్రీయ వ్యవసాయం వలన లాభాలు
1. పర్యావరణ పరిరక్షణ
2. కాలుష్యం తగ్గిస్తుంది
3. నీటిని పొదుపు చేస్తుంది
4. నేల కోత తగ్గిస్తుంది
5. నేల సారం పెంచుతుంది
ధాన్యాన్ని ఎండబెట్టి గాలి, వెలుతురు ఉన్న గదులలో నిలువచేస్తారు.
ధాన్యాన్ని గదిలో నిలువచేసే ముందు పురుగు మందులు చల్లి గదిని శుభ్రం చేస్తారు .
ఆధునిక నిలువ చేయు పద్ధతిలో ధాన్యాన్ని గోదాములలో, శీతలీకరణ గోదాములలో నిల్వ చేస్తారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన పంట వరి
మన రాష్ట్రంలో 62 శాతం మండి వ్యవసాయం ముఖ్యమైన వృత్తిగా కలిగి ఉన్నారు
శ్రీకాకుళంలో ప్రధాన పంట — వరి
విశాఖపట్టణంలో ప్రధాన పంట — పసుపు
విజయ నగరంలో ప్రధాన పంట — అరటి
తూర్పు గోదావరి ప్రధాన పంట — వరి
పశ్చిమ గోదావరి ప్రధాన పంట — వరి, అరటి
కృష్ణలో ప్రధాన పంట — వరి, పశు గ్రాసం , పసుపు
గుంటూరులో ప్రధాన పంట — వరి, పశుగ్రసం, జొన్న, పసుపు, టమాటా
ప్రకాశంలో ప్రధాన పంట — పశుగ్రసం, జొన్న, కమలాలు
నెల్లూరులో ప్రధాన పంట — వరి
కడపలో ప్రధాన పంట — అరటి, టమాటా, కమలా, జొన్నలు
కర్నూలులో ప్రధాన పంట – టమాటా, కమలా, కీర, పసుపు, అరటి, జొన్న
చిత్తూరులో ప్రధానపంట — టమాటా, పశుగ్రసం, కీర
అనంతపురంలో ప్రధానపంట – టమాటా, అరటి, కమల, వరి, కీర
చిరుధాన్యాలకు ఉదాహరణ — కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఉదలు
వరి, గోధుమ, చిరుధాన్యాలు ఉత్వత్తి చేయడంలో భారత దేశం ఎన్నవ స్థానంలో ఉంది – 2వ
మన ఆరోగ్యం మన ఆహార అలవాట్ల పై ఆధారపడి ఉంటుంది
మన ఆహారంలో పిండిపదార్థాలు, ప్రోటి లు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండాలి
నీరు ఎంతో విలువైనది
గ్రామాలలో చెరువులు, నూతులు, బోరుబావులు ప్రధానమైన నీటి వనరులు
నీటికి ప్రధాన వనరు – వర్షపు నీరు
వర్షపు నీటిని నిల్వచేయుటకు చెరువులు నిర్మిస్తాం
నదులలో నీరు నిల్వ చేయుటకు ఆనకట్టలు, జలాశయాలు నిర్మిస్తాం
జలాశయాలలో నీటి మట్టం పెంచడానికి నాదివాలుకి అడ్డుగా నీటిని నిలువ చేయుటకు నిర్మించబడిన అడ్డుకట్ట ను ఆనకట్ట అంటారు
మన రాష్ట్రంలో ముఖ్య నదులు – గోదావరి, వంశధార, పెన్నా
మన రాష్ట్రంలో ఉన్న జలాశయాలు — పులిచింతల, తెలుగుగంగ, తోటతల్లి బ్యారేజ్, కండలేరు జలాశయం, వెలుగొండ
నాగార్జున సాగర్ , శ్రీశైలం ఆనకట్టలు ఏ నదిపై నిర్మించారు – కృష్ణానది
సర్ ఆర్థర్ కాటన్ బ్యారెజ్ గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద నిర్మించబడింది
సర్ ఆర్థర్ థామస్ కాటన్ బ్రిటీష్ దేశానికి చెందిన నీటి పారుదల శాఖ ఇంజనీరు
గోదావరి నదిపై తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం మరియు పచ్చిమ గోదావరి జిల్లా విజ్ణేశ్వరం మధ్యలో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించింది – సర్ ఆర్థర్ థామస్ కాటన్
భారతదేశంలో పొడవైన నదులలో కృష్ణానది 4వ స్థానంలో ఉంది
కృష్ణానది మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం వద్ద జన్మించింది
కృష్ణానది పొడవు సుమారు 1400 km
కృష్ణానదికి మరొకపేరు – కృష్ణవేణి
కృష్ణ నది మహారాష్ట్ర, AP, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలకు నీటి వనరు .
1. తడి దూదిని ఉపయోగించి గాయాన్ని సబ్బు నీటితో గాని, సెప్టిక్ లోషన్ తో గాని శుభ్రం చేయాలి.
2. దూదితో టింక్షర్ ఆయోడిన్ ను గానీ, యాంటీసెప్టిక్ క్రీము గాని రాయాలి.గాజు గుడ్డతో కట్టుకట్టి పైన ప్లాస్టర్ వేయాలి
ఆ) కాలిన గాయాలకు ప్రధమ చికిత్స
1. కాలిన గాయం పై కొంత సేపు చల్లని నీరు పోయాలి
2. కాలిన గాయం తీవ్రమైనది అయితే లేపనం పూయాలి
3. కాలిన గాయం పైన ఏర్పడిన నీటి బొబ్బలను చిదమకూడదు,కట్టు కట్టకూడదు, రుద్దకూడదు, ఐస్ ఉపయోగించకూడదు
ఇ) కుక్క కాటుకు ప్రధమ చికిత్స
1. కుక్క కరిచిన ప్రదేశమును సబ్బు లేదా యాంటీసెప్టిక్ లోషన్ కడగాలి .
2. గాయాన్ని ప్లాస్టర్ తో గానీ గాజుగుడ్డతో కానీ కట్టుకట్టకూడదు .
ఈ) పాము కాటుకు ప్రధమ చికిత్స
1. మొదట కాటు వేయబడిన భాగాన్ని నిశితంగా పరిశీలించి,విష సర్పమో కాదో నిర్ధారించుకోవాలి .
2. సాధారణంగా పాము కాటుకు గురైన వ్యక్తి భయంతో స్పృహ తప్పి పడిపోతాడు అతని భయం తగ్గించేలా మాట్లాడాలి.
3. విషం శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా ఒక గుడ్డతో గాయం పై భాగంలో గట్టిగా కట్టుకట్టాలి .
4. పాము కరిచిన వ్యక్తి అచేతనంలోకి పోకుండా చూడాలి .
5. వెంటనే బాధితుడిని డాక్టరు వద్దకు తీసుకువెళ్లాలి
ఉ) తేలు కుట్టినప్పుడు ప్రధమ చికిత్స
1. సబ్బునీళ్లతో గాయాన్ని కడగాలి .
2. గాయం భాగం పై నొప్పి తగ్గేటట్లు మెల్లగా ఒత్తాలి .
3. వెంటనే బాధితుడిని డాక్టరు వద్దకు తీసుకువెళ్లాలి
ఊ) నీళ్ళలో మునిగినప్పుడు — ప్రధమ చికిత్స
సాధారణంగా నీళ్ళలో మునిగిన వ్యక్తి ఎక్కువ నీళ్ళను మింగివేస్తాడు.అందువలన అచేతన అవస్థలోనికి వెళ్ళిపోతాడు.శ్వాస నాళాలు నీటితో మూసుకుపోతాయి .
1. తాగిన నీరు బయటకు వచ్చేలా రెండు చేతులతో పొట్టపై ఒత్తాలి.
2. శిక్షణ తీసుకున్నవారైతే నోటితో శ్వాస మార్గంలో నీళ్ళను తొలగించి మళ్ళీ శ్వాస ఆడేలా చేస్తారు.
భారత ప్రభుత్వం ఎవరైన ఒక వ్యక్తికి ఏదయినా అత్యవసర సేవ అవసరం అయినప్పుడు సహాయ చర్యల కోసం కొన్ని ఉచిత ఫోన్ సేవలు కల్పించింది .
వైద్య సేవల కొరకు , పోలీసు, అగ్ని ప్రమాదాలు నివారణ కొరకు 24 గంటలు అందుబాటులో ఉండే సేవలను అత్యవసర సేవలు అంటారు.
ఉచిత వైద్య సలహాలు అందించే సేవ – 104
104 వారు ఫోన్ ద్వారా ఉచిత వైద్య సలహాలు అందిస్తారు
గ్రామీణ ప్రాంతాల వారికి ఈ సేవలు బాగా ఉపయోగపడతాయి .
పోలీసుల నుండి లభించే అత్యవసర సేవ phone no – 100
ఎవరైనా వ్యక్తికి ఏదైనా అత్యవసర సేవ అవసరం అయినప్పుడు సంప్రదించవలసిన నంబర్ – 108
భారత స్వాతంత్ర్య ఉద్యమం
1947 ఆగప్ట్ 15 న మన దేశం బ్రిటీష్ వాళ్ళ నుండి స్వాతంత్రం పొందింది .
చంద్ర గుప్త మౌర్యుడు , అక్టర్ , షాజహాన్ , సముద్ర గుప్తుడు వంటి గొప్ప రాజులు భారతదేశాన్ని గొప్ప దేశంగా తీర్చి దిద్దారు .
భారతదేశంలో వీరి కాలంలో నలందా , తక్షశిల వంటి గొప్ప విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి.
భారతదేశాన్ని అరబ్బుల దండయాత్రలు , ఐరోపా వారు బలహీనపరచి భారతదేశాన్ని వారి పాలన కిందకు తెచ్చుకున్నారు.
ఒక వ్యక్తి లేదా ఒక సందర్భానికి గౌరవసూచనగా నిర్మించబడిన ఒక విగ్రహం లేదా భవనాన్ని చారిత్రక కట్టడం అంటారు .
చారిత్రక కట్టడాలకు ఉదాహరణ : తాజ్ మహల్ , ఎర్ర కోట, సాంచీ స్తూపం .
భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం — 1498
భారతదేశానికి సముద్రమార్గం కనుగొన్న పోర్టుగీసు నావికుడు – వాస్కోడిగామా .
పోర్చుగీస్ వారు, డచ్చివారు, French వారు, British వారు ఒకరి తర్వాత ఒకరు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు .
బ్రిటీష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించి 1757 నుండి భారతీయ రాజ్యాలను పాలించడం మొదలు పెట్టారు .
1857 లో భారత దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రజలు 8149 వారిపై తిరిగుబాటు చేశారు .
ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగిన సంవత్సరం – 1857 .
భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం — 1885 .
భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు – ఉ౦ హ్యూమ్
గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత దేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం – 1915
మహాత్మాగాంధీ 1919 వ సంవత్సరంలో స్వాతంత్ర పోరాటంలో చేరారు .
గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం చేపట్టారు .
1942 వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశాన్ని వదిలి వెళ్లాలని బ్రిటిష్ వారిని డిమాండ్ చేసింది .
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా గాంధీజీ ఇచ్చిన నినాదం – డూ ఆర్ డై.
1947 ఆగప్ట్ 14 అర్థరాత్రి బ్రిటిష్ వారు భారతదేశం వదిలి వెళ్లారు .
ఆగష్ట్ 15 న మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు .
౫భారత రాజ్యాంగాన్ని రచించే బాధ్యత ను రాజ్యాంగ పరిషత్ ఎవరికి అప్పగించింది – 8గ అంబేడ్కర్ .
భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది – 1950 జనవరి 26
గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు – జనవరి 26
యూరోపియన్ లు భారత సముద్రమార్గం కనుగొన్న సంవత్సరం -1498
భారతదేశంలో బ్రిటిష్ పాలన స్థాపన జరిగిన సంవత్సరం — 1757
బ్రిటిష్ పాలనపై ప్రజల తిరుగుబాటు – 1857
భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన – 1885
బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం – 1905
వందేమాతర ఉద్యమం ప్రారంభం అయిన సంవత్వరం -1905
సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభం అయింది -1920
ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభం అయ్యింది – 1930
స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ నాయకత్వం ప్రారంభం అయిన సంవత్సరం – 1919
క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభం అయింది – 1942
ఆంధ్రప్రదేశ్ నుండి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులకు ఉదాహరణ : అల్లూరి సీతారామరాజు , దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, దువ్వ్వూరి సుబ్బమ్మ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కొండా వెంకటప్పయ్య, పోనాక కనకమ్మ, శ్రీ పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు…
భారత దేశం రిపబ్లిక్ గా మారిన సంవత్సరం – 1950 జనవరి 26
జనవరి 26 న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు
అవని నుండి అంతరిక్షానికి
సముద్ర ప్రయాణం ద్వారా భూమి గుండ్రంగా ఉందని నిరూపించింది – ఫెర్దినాండ్ మాజిలాన్ .
మాజిలాన్ ఏ దేశానికి చెందిన నావికుడు – పోర్టుగీస్
భూమికి నమూనా — గ్లోబ్
భూమి మీద ఉన్న వివిధ రకాల ప్రాంతాలను గుర్తించడానికి సహాయపడేది — గ్లోబ్
గ్లోబ్ మీద అడ్డంగా నీయబడిన ఊహారేఖలు — అక్షాంశాలు
గ్లోబ్ మీద నిలువు గా గీయబడిన ఊహా రేఖలు – రేఖాంశాలు
అక్షాంశాలు ,రేఖాంశాలు రెండూ ఊహారేఖలే .
గ్లోబ్ ను అడ్డంగా రెండు సమాన భాగాలుగా విభజించే అక్షాంశం – భూమధ్య రేఖ.
గ్లోబ్ ను నిలువుగా విభజించు రేఖాంశాన్ని పమంటారు – ప్రైమ్ మెరిడియన్.
భూమి ఒక ఊహాజనిత అక్షం ఆధారంగా కొద్దిగా వంగి తిరుగుతుంది .
భూమి తన చుట్టూ తాను తిరగడాని ఏమంటారు – భూ భ్రమణం .
భూ భ్రమణానికి పట్టే సమయం — 24 గంటలు.
భూ భ్రమణం వలన రాత్రి ,పగల్లు ఏర్పడతాయి .
భూమి తన అక్షం పై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు .
భూ పరిభ్రమణానికి పట్టే సమయం – 365 రోజులు.
భ్రూ పరిభ్రమణం వలన బుతువులు ఏర్పడడం ,బుతువులలో మార్చులు గమనించవచ్చు ం
ఖగోళ దూరదర్శిని తో మనం నక్షత్రాలు , గ్రహాలు , ఉపగ్రహాలను పరిశీలించవచ్చు .
సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గేయహాలను కలిపి సౌర కుటుంబం అంటారు .
సూర్యుని కక్ష్య లో ష్లానెట్స్, ఆస్ట రాయిడ్స్, తోక చుక్కలు ఇతర పదార్ధాలు ఉంటాయి .
సూర్యుని నుండి దూరంలో భూమి స్థానం – 3౩ వది.
సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం — బుధుడు.
సూర్యునికి అతి దూరంగా ఉన్న గ్రహం -నెప్యూన్ .
భూమికి గల ఒకే ఒక సహజ ఉపగ్రహం — చంద్రుడు .
చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది .
భూమి చుట్టూ ఒకసారి చంద్రుడు తిరగడానికి పట్టే సమయం — 27 రోజులు.
సౌర కుటుంబంలో ఉన్న మొత్తం గ్రహాలు -8 , అవి — బుధుడు , శుక్రుడు , భూమి ,కుజుడు ,గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ .
రాకెట్లను ఉపయోగించి అంతరిక్షంలోని ప్రవేశ పెట్టిన మానవ నిర్మిత ఉపగ్రహాన్ని కృత్రిమ ఉపగ్రహం అంటారు.
భారతదేశం ప్రయోగించిన మొదటి కృత్రిమ ఉపగ్రహం — ఆర్యభట్ట .
ఆర్య భట్ట ఉపగ్రహాన్ని భారత్ ప్రయోగించిన సంవత్సరం – 1975 .
చంద్రయాన్ -2 అను కృత్రిమ ఉపగ్రహాన్ని (2019) july 22 న ప్రయోగించారు .
చంద్రయాన్ -2 ఉపగ్రహాన్ని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వద్ద గల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి GSLV-MK11-M1 ద్వారా ప్రయోగించారు .
చంద్రయాన్ -1 తర్వాత తర్వాత ప్రయోగించిన రెండవ ఉపగ్రహం — చంద్రయాన్ -2
చంద్రయాన్ -2 లో అమర్హిన పరికరాలు — ఆర్టిటార్, విక్రమ్ లాండర్, ప్రగ్యాన్ రోవర్ .
కమ్యూనికేషన్ ప్రసారం , వాతావరణ శాస్త్రం ,సముద్ర శాస్త్రం ,వనరుల సేవ మొదలైన వాటి సేవలను కృత్రిమ ఉపగ్రహాలు అందచేస్తాయి .
మొత్తం 16,347 టీచర్ పోస్టులు, కేటగిరీల వారీగా వివరాలివీ
Mega DSC Category Wise Details: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన మెగా డీఎస్సీ అంశంపై కీలక ముందడుగు వేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే తొలి సంతకం సంబంధిత దస్త్రంపైనే పెట్టారు. ఈ మెగా డీఎస్సీలో భాగంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీ జరగనుంది. కేటగిరిల వారీగా పోస్టుల వివరాలను పరిశీలిస్తే ఎస్జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్ అసిస్టెంట్స్: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్: 52 ఉన్నాయి.
మెగా డియస్సీ పోస్టుల వివరాలు
మొత్తం పోస్డులు – 16347
స్కూల్ అసిస్టెంట్ – 7725
యస్.జి.టి – 6371
టి.జి.టి – 1781
పి.జి.టి – 286
ప్రిన్సిపల్స్ – 52
పి.ఇ.టి – 132
గత ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి ప్రభుత్వం కొత్తగా ప్రకటన విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖలో ఖాళీలపై గత రెండు, మూడు రోజులుగా అధికారులు వివరాలు సేకరించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో 16 వేలకుపైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. ఆ ప్రకారం.. మెగా డీఎస్సీ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు.
ఈ క్రమములో మా తరుపున మీకు ఉచితం గా ప్రాక్టీస్ పరీక్షలు ఇవ్వడం జరుగు తుంది
వీరు రాసి నటించిన అనేక నాటికలకి రాష్ట్ర, రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు, ప్రశంశలు లభించాయి
2. మాయా కంబళి
కవి పేరు
:
కలువకోలను సదానందా
కాలం
:
22.02.1939 – 25.08.2020
జన్మ స్థలం
:
చిత్తూరు జిల్లా పాకాల
మూల గ్రంధం
:
మాయా కంబళి సంపుటి
ఇతర రచనలు
:
పిల్లల కధలు – శివానంద లహరి, విందు బోజనం, చల్లని తల్లి, నీతి కధామంజరి, తుస్సన్న మహిమలు, పరాగ భూమి, చందమామ కధలు వార్తాపత్రికల్లో కధానికలు రాశారు
ఇతర అంశాలు
:
“బంగారు నడిచిన బాట” నవలకి కేంద్ర సాహిత్య విద్యా శాఖ బహుమతి – 1966“నవ్వే పెదవులు – ఏడ్చే కళ్ళు” కధా సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డ్ – 1976“అడవి తల్లి” పిల్లల నవలకి కేంద్ర సాహిత్య బాలసాహితీ అవార్డు – 20101992 లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక
3. చిన్ని శిశువు
కవి పేరు
:
తాళ్ళపాక అన్నమయ్య
కాలం
:
09.05.1408 – 23.02.1503
జన్మ స్థలం
:
కడప జిల్లా తాళ్ళపాక
తల్లి దండ్రులు
:
లక్కమాంబ, నారాయనసూరి
బిరుదులు
:
పద కవితా పితామహుడు
ఇతర రచనలు
:
అన్నమయ్య వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32 వేల సంకీర్తనలు రాశారు, 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వేంకటాచల మహాత్మ్యంఇందులో కొన్ని అలభ్య రచనలు ఉన్నాయి
ఇతర అంశాలు
:
అన్నమయ్య తన రచనలు వేంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చాడు
4. మర్రి చెట్టు
కవి పేరు
:
త్రిపురనేని గోపీచంద్
కాలం
:
08.09.1910 – 02.11.1962
జన్మ స్థలం
:
కృష్ణా జిల్లా అంగలూరు
తల్లి దండ్రులు
:
రామస్వామి పున్నమంబ
ఇతర రచనలు
:
ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు
ఇతర అంశాలు
:
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది
5. పద్య పరిమళం
కవి పేరు
కాలం
రచన
పోతన పక్కి అప్పల నరసయ్య మారద వెంకయ్య పోతులూరి వీరబ్రహ్మం గువ్వల చెన్నడు ఏనుగు లక్ష్మణ కవి చుక్కా కోటి వీరభద్రమ్మ గద్దల శామ్యూల్ జెండామన్ ఇస్మయిల్
15 వ శతాబ్దం 16 వ శతాబ్దం 16 వ శతాబ్దం 17 వ శతాబ్దం 17 వ శతాబ్దం 18 వ శతాబ్దం 20 వ శతాబ్దం 20 వ శతాబ్దం 20 వ శతాబ్దం
1930 లో ముద్దు కృష్ణ “వైతాళికులు” ద్వారా వీరి రచనలు వెలుగులోకి వచ్చాయిబంగారమ్మ కవితలు తెలుగు కవిత్వంలో కొత్త ఒరవడిని, సరికొత్త భావవ్యక్తీకరణ తీసుకొచ్చాయి1958 లో 42 కవితలతో “కాంచన విపంచి” పేరుతో సంకలనం చేశారు
8. ఎద
కవి పేరు
:
బోనం నాగభూషణం
కాలం
:
01.07.1938 – 21.05.1999
జన్మ స్థలం
:
విజయనగరం జిల్లా మేరంగి గ్రామం
మూల గ్రంధం
:
కొత్త గాలి కధా సంకలనం
ఇతర రచనలు
:
భూషణం కధలు, ఏది సత్యం – ఎద సత్యం, కొండగాలి, ఆడవంటుకుంది
ఇతర అంశాలు
:
ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారు, రచనలు ప్రవృత్తిగా ఎంచుకున్నారువీరి తొలికధ చిత్రగుప్త పత్రికలో ముద్రితమైందికలం పేర్లు – శూలపాణి, భూషణం
కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ – 1970 లోసంగీత సాహిత్యాలలో ప్రసిద్ధులుతెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితులురాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచే పెనుగొండ పాట రాశారు
వీరు కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడుపద్నాలుగు భాషలు చదవగలరు, రాయగలరు
11. బాలచంద్రుని ప్రతిజ్ఞ
కవి పేరు
:
శ్రీనాధుడు
కాలం
:
1385 – 1475
బిరుదులు
:
కవి సార్వభౌముడు
మూల గ్రంధం
:
పల్నాటి వీర చరిత్ర
ఇతర రచనలు
:
మరుత్తరట్ చరిత్ర, శృంగార నైషదం, కాశీ ఖండం, హరవిలాసం, పల్నాటి వీర చరిత్రం, క్రీడాభిరామం
ఇతర అంశాలు
:
వీరు కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడుపద్నాలుగు భాషలు చదవగలరు, రాయగలరు
తొలి తెలుగు రచనలు
తొలి తెలుగు ఇతిహాసం తొలి తెలుగు రామాయణం తొలి తెలుగు శతకం తొలి తెలుగు పురాణం తొలి తెలుగు ప్రబంధం తొలి తెలుగు యక్షగానం తొలి తెలుగు అచ్చ తెనుగు కావ్యం తొలి తెలుగు నాటకం తొలి తెలుగు నవల తొలి తెలుగు కధానిక తొలి తెలుగు యాత్రా చరిత్ర
ఆంధ్ర మహాభారతం రంగనాధ రామాయణం వృషాదీప శతకం మార్కండేయ పురాణం మనుచరిత్ర సుగ్రీవ విజయం యయాతి చరిత్ర మంజరీ మధుకరీయం రాజశేఖర చరిత్ర దిద్దుబాటు కాశీయాత్ర చరిత్ర
Why TETDSC.com is a Game-Changer for Telugu Aspirants
1. **Free Practice Exams in Telugu** TETDSC.com is renowned for its extensive collection of free practice exams tailored specifically for Telugu-medium students. These mock tests are designed to simulate the actual TET and DSC exams, helping aspirants get a feel for the question patterns, difficulty levels, and time constraints. By offering these resources in Telugu, the platform ensures that language is no longer a barrier to effective preparation.
2. **Comprehensive Coverage of the Syllabus** The platform covers all the essential subjects and topics required for TET and DSC exams, including: - Child Development and Pedagogy (CDP) - Mathematics - Environmental Studies (EVS) - Telugu Language and Literature - English Language Each practice test is meticulously crafted by subject matter experts to align with the latest exam patterns and syllabi.
3. **Designed for Telugu-Medium Students** Understanding the unique needs of Telugu-medium students, TETDSC.com provides all its resources in simple and easy-to-understand Telugu. This ensures that students can grasp complex concepts without struggling with language barriers.
4. **User-Friendly Interface** Navigating TETDSC.com is a breeze, even for those who are not tech-savvy. The platform’s intuitive design allows users to access practice exams, study materials, and results with just a few clicks.
5. **Regular Updates and New Content** The team behind TETDSC.com is committed to keeping the platform updated with the latest exam trends and patterns. New practice tests and study materials are added regularly, ensuring that aspirants always have access to the most relevant resources.
-How TETDSC.com Helps You Succeed**
1. **Builds Exam Confidence** By taking regular practice tests, students can identify their strengths and weaknesses. This helps them focus on areas that need improvement, ultimately boosting their confidence for the actual exam.
2. **Improves Time Management Skills** One of the biggest challenges in competitive exams is managing time effectively. TETDSC.com’s timed practice tests help students develop the ability to answer questions quickly and accurately.
3. **Accessible Anytime, Anywhere** The platform is accessible on both desktop and mobile devices, allowing students to practice on the go. Whether you’re at home, commuting, or taking a break at work, TETDSC.com is always at your fingertips.
4. **Completely Free of Cost** Unlike many other platforms that charge hefty fees for practice exams, TETDSC.com offers all its resources for free. This makes it an invaluable tool for students from all economic backgrounds.
-What Users Are Saying About TETDSC.com
Thousands of aspirants have already benefited from TETDSC.com’s free practice exams. Here’s what some of them have to say:
- *"TETDSC.com has been a lifesaver for me. The Telugu practice tests helped me understand concepts better and improved my speed and accuracy."* – Rajesh, TET Aspirant - *"I couldn’t afford expensive coaching, but TETDSC.com gave me everything I needed to crack the DSC exam. Thank you!"* – Lakshmi, DSC Aspirant - *"The platform is so easy to use, and the practice tests are just like the real exam. Highly recommended!"* – Srinivas, TET Aspirant
---ap dsc sgt online mock test free -
How to Get Started with TETDSC.com
1. Visit the website: [www.tetdsc.com](http://www.tetdsc.com) 2. Create a free account to access all the resources. 3. Choose your desired practice test or study material. 4. Start practicing and track your progress.