AP DSC 2024 Telugu Content | Class 10 | Best notes

AP DSC 2024 Telugu Content | Class 10 | Best notes

10th తెలుగు 

Title

AP DSC 2024 Telugu Content | Class 10 | Best Notes – AP & TS TET & DSC

1. మాతృభావన

పాఠ్యభాగ నేపధ్యం :

కళ్యాణి దుర్గం జయించిన తర్వాత అబ్బాజి సోన్ దేవుడు విజయోత్సాహంతో శివాజీ వద్దకి వస్తాడు. సోన్ దేవుడు శివాజీతో దేవా మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి దాని సర్దారులని పట్టి తెచ్చి సర్వస్వాన్ని రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చాను అని మనవి  చేశాడు. ఇది విన్న శివాజీ పరస్త్రీలు తల్లులతో సమానం అని చెప్పి ఆమెకి అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ ఇలా చేయడం తగదని హితవు పలికిన సందర్భం లోది

పాఠ్యభాగ వివరాలు :

ఈ పాఠం చారిత్రక కావ్య ప్రక్రియకి చెందినది. చరిత్ర ఆధారంగా రచించిన కావ్యం. డా. గడియారం వెంకటశేష శాస్త్రి రచించిన శివభారతం తృతీయాశ్వాసం లోనిది

పర్యాయ పదాలు :

ఆజ్ఞ – ఆదేశము, ఆన, ఉత్తరువు, నిర్దేశము

కన్ను – అక్షి, చక్షువు, నేత్రము, నయనము

అనలము – అగ్ని, వహ్ని, జ్వలనము

సతి – మగువ, కొమ్మ, ఇంతి, పడతి

ప్రకృతి – వికృతి :

రాజ్ఞి – రాణి

ఆజ్ఞ – ఆన

ఛాయ – చాయ

రత్నము – రతనము

భక్తి – బత్తి

గౌరవము – గారవము

పుణ్యము – పున్నెం

రాశి – రాసి

అంబ – అమ్మ

దోషము – దోసము

బ్రహ్మ – బమ్మ

జ్యోతి – జోతి

గృహము – గీము

భాగ్యము – బగ్గేము

వ్యుత్పత్తి అర్ధాలు :

శివుడు – సాధువుల హృదయాన సయనించి ఉండువాడు, మంగళకరుడు – ఈశ్వరుడు 

పతివ్రత – పతిని సేవించుటయే వ్రతముగా కలది – సాధ్వి

పురంధ్రి – గృహమును ధరించునది – గృహిణి

అంగన – చక్కని అవయవముల అమరిక కలది – అందగత్తె

నానార్ధాలు :

వాసము – ఇల్లు, వస్త్రము

సూత్రము – నూలిపోగు, తీగె

చరణము – పాదము, కిరణము, పద్య పాదము

హరి – యముడు, సింహము, ఇంద్రుడు

రత్నము – మణి, స్త్రీ, ముంత

AP DSC 2024 Telugu Content | Class 10 | Best Notes – AP & TS TET & DSC

2. జానపదుని జాబు

ఉద్దేశ్యం :

భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. అందువల్ల భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అంటారు. గ్రామంలో ప్రతి  ఇల్లు విద్యాగంధంతో గుబాళించి అభివృద్ధి చెందితే మనదేశం సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంటుంది అని మహాత్మా గాంధీ అన్నారు. గ్రామాలు ఎలా ఉన్నాయి? వారి జీవితాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలు వివరిస్తూ గ్రామాల్లో పేదలు, దళితుల జీవితాలు చిత్రిస్తూ పల్లెటూరి లేఖలు పేరుతో 1932 లో జనవాణి పత్రికలో, 1933 లో జానపదుని జాబు పేరుతో ప్రజామిత్ర పత్రికలో బోయి భీమన్న ప్రచురించారు. చదువుకుని బీదతనం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరి పనుల్లో మునిగిపోయిన జనపదుడు పట్నంలో శ్రీమంతుడు అయిన తన మిత్రునికి తన అవస్థలను గ్రామాల్లో పరిస్థితులను లేఖల రూపంలో రాస్తాడు. గ్రామ పరిస్థితులు తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం.

పాఠ్యభాగ వివరాలు :

ప్రస్తుత పాఠం లేఖల రూపంలో ఉంది. జానపదుని జాబులు పేరుతో బోయి భీమన్న రాసిన లేఖల సంపుటి నుండి పాఠం ఎంపిక చేశారు. తూర్పు గోదావరి జిల్లా యాసలో లేఖ రచన సాగింది

పదాలు వివరణ :

పురిటి లోనే సంధి కొట్టడం – ప్రారంభంలో పాడైపోయిన పని గురించి వివరించడం

కలుపుదీయడం – సమాజంలో ఉంటూ సమాజాన్ని పాడు చేసే వారిని నివారించడం

గ్రామోద్దరణం – గ్రామ సమస్యలు పరిష్కరించడం (గ్రామోద్దరణమే దేశోద్ధారణం – గాంధీ)

ఉన్నదంతా ఊడ్చుకుపోవడం – పూర్తిగా నాశనం కావడం

3. వెన్నెల

నేపధ్యం :

హిరణ్యకశిపుడు వనవిహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును సాయం సమయాన్ని చంద్రోదయాన్ని కవి వర్ణించాడు. రోజంతా తీవ్ర ఎండ ప్రసరింపజేసిన సూర్యుడు ఇంకా ఉష్ణ తాపం పెంచితే అసుర నాయకుడైన హిరణ్యకశిపుడు సహింపడేమో అన్నట్లు నెమ్మదిగా పక్కకి తొలగిపోయాడు. తదనంతరం ప్రకృతిలో వచ్చే మార్పులు రమణీయంగా వర్ణించారు

పాఠ్యభాగ వివరాలు :

ఈ పాఠం కావ్య ప్రక్రియకి చెందినది. కావ్యం వర్ణన ప్రధానంగా సాగుతుంది. ప్రస్తుత పాఠం ఎర్రన నృసింహ పురాణం తృతీయాశ్వాసం లోనిది

అర్ధాలు :

స్మితకాంతి – నవ్వుల వెలుగు

దివి – ఆకాశం

మిక్కుటం – ఎక్కువ

రజనీకరబింబం – చంద్రబింబం

నానార్ధాలు :

వెల్లి – ప్రవాహము, పరంపర

కుండలి – పాము, నెమలి, వరుణుడు

నిట్టవోడుచు – ఉప్పొంగు, రోమాంచితమగు, విజృంబించు

పర్యాయ పదాలు :

చాడ్పు – పగది, విధము, వలె

వెల్లి – ప్రోతస్సు, వెల్లువ, ప్రవాహం

కైరవము – తెల్లకలువ, కుముదము, గార్ధబము, చంద్రకాంతము, శృకము, సోమబంధువు

కౌముది – వెన్నెల, జ్యోత్స్న, చంద్రిక

చంద్రుడు – శశి, నెలవంక, అబరి

తమస్సు – చీకటి, ధ్వంతము, తిమిరము 

ప్రకృతి – వికృతి :

సంధ్య – సంజ

దిశ – దెస

ధర్మము – దమ్మము

రాత్రి – రేయి, రాతిరి

నిశ – నిసి

గర్వము – గరువము

యత్నము – జతనము

దిశ – దెస

చంద్రుడు – చందురుడు

4. ధన్యుడు

ఉద్దేశ్యం :

మంచి మిత్రుల కలయిక మన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది. అందుకే ఎప్పుడు సన్మిత్రులను పొందాలని పెద్దవాళ్ళు చెప్తారు. సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిది అని చెప్పడం పాఠం ఉద్దేశ్యం

పాఠ్యభాగ వివరాలు :

ఈ పాఠం కధా ప్రక్రియకి చెందినది. సంస్కృతంలో విష్ణు శర్మ పంచతంత్రం విశ్వవిఖ్యాతి గాంచింది. దానిని అనుసరించి అనేక గ్రంధాలు వచ్చాయి. వాటిలో లక్ష్మీనారాయణ పండితుడు యొక్క హితోపదేశం ఒకటి. ఆది ఆధారంగా చిన్నయసూరి నీతిచంద్రిక తెలుగులో రచించాడు. ఇది గ్రాంధిక వచనంలో సాగుతుంది. పశుపక్ష్యాదులే పాత్రలుగా లోకరీతిని, నీతిని ప్రభోదిస్తూ కధనాలు సాగుతాయి. ప్రస్తుత పాఠ్యాంశం నీతిచంద్రికలో మిత్రలాభం నుండి గ్రహించినది.

పదాలు – అర్ధాలు :

బుద్ధిహీనత వల్ల సమస్త కార్యాలు నిదాఘ నదీపురములట్లు వినాశము నొందును

     నిదాఘము అనగా వేసవి కాలం. నదీ పురములు అంటే నది నీటి ప్రవహాలు. నిదాఘ నదీపురములు అంటే మండు వేసవిలో నదులలో నీటి ప్రవహాలు

ధనమున బాసిన క్షణముననే లాతివాడగును

     ధనం పోతే ఎవరూ పలకరించరు. పరిచయం లేనట్లు ఉంటారు. అందరికీ పరాయివాడు(లాతివాడు) అవుతాడు

పరాధనాపహరణము కంటే దిరియుట మంచిది

     పరధనం దొంగలించడం మంచిది కాదు. అంతకంటే యాచించడం మంచిది

ఉదరమనుకయి పరుల గోజక ప్రాప్తలాభమునకు సంతోషించు వాడొక్కడు లోకమందు ధన్యుడు

     మనం జీవించడం కోసం ఇతరులను పీడించకూడదు. దొరికిన దానితో సంతృప్తి పడుతూ ఆనందంగా జీవించేవాడు ధన్యుడు

ప్రకృతి – వికృతి :

బోజనము – బోనము

శబ్దము – సద్దు

కార్యము – కర్షము

గృహము – గీము

గౌరవము – గారవము

శాస్త్రము – చట్టము

ధర్మము – దమ్మము

సంతోషం – సంతసం

వ్యుత్పత్తి అర్ధాలు :

పుత్రుడు – పున్నామ నరకం నుండి రక్షించువాడు 

దేహి – దేహాన్ని ధరించువాడు

ఈశ్వరుడు – ఐశ్వర్యం ఉన్నవాడు

మూషికము – అన్నాదులను దొంగలించేది

నానార్ధాలు :

వివరము – వివరణము, దూషణము

వనము – అడవి, నీరు, గుంపు

ఫలము – పండు, ప్రయోజనం, సంతానం

అమృతము – సోమరసము, వసనాభి, పరబ్రహ్మము

పర్యాయ పదాలు :

జంతువు – పశువు, జింక, అన్వేషణము

మూర్ధము – పుస్తకం, శీర్షము, ఉత్తమంగం

బలము – అంబ, బిరుదు, సత్తువ

వివరము – రంధ్రము, బిలము, కలుగు 

5. శతక మధురిమ

ఉద్దేశ్యం :

శతకాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి. భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాలలో నైతిక విలువలు తెలపడమే పాఠం ఉద్దేశ్యం

పాఠ్యభాగ వివరాలు :

శతక పద్యాలలో మకుటం ప్రధానమైనది. ఈ పద్యాలలో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు. అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది.

పద్యాలు :

నీరము తప్తలోహమున ——————- సుత్తము గోల్చువారికిన్ – ఉత్పలమాల – ఏనుగు లక్ష్మణ కవి

కరిరాజున్ బిసతంతు ——————– సుధా ధారా నుకరోక్తులన్ – మత్తెబం – ఏనుగు లక్ష్మణ కవి

పట్టుగ నీశ్వరు౦డు ———————–దరిగొండ నృసింహ దాయాపయోనిధి – ఉత్పలమాల – వెంగమాంబ

తన దేశంబు —————————– భక్త చింతామణీ – మత్తెబం – వడ్డాది సుబ్బరాయ కవి

ఉరుగుణవంతు ————————– వెన్న భాస్కరా – చంపకమాల – మారద వెంకయ్య

స్థిరతర ధర్మవర్తన ————————- కొరంత భాస్కరా – చంపకమాల – మారద వెంకయ్య

చిక్కని పాలపై ————————— కరుణాపయోనిధీ – ఉత్పలమాల – కంచర్ల గోపన్న

జాతుల్సెప్పుట ————————– శ్రీకాళహస్తీశ్వర – శార్దూలం – ధూర్జటి 

వరదైన చేను ————————– బెట్టకు సుమతి – కందం – బద్దెన   

పదజాలం :

ఉత్తములు – గొప్పవారు

ముష్కరుడు – దుష్టుడు

లాలన – బుజ్జగించడం 

ఘనత – గొప్పతనం

మర్మము – రహస్యం

వ్యుత్పత్యర్ధాలు :

భాస్కరుడు – కాంతిని కలుగజేయువాడు – సూర్యుడు 

పయోనిధి – దీనియందు నీరు నిలిచి ఉంటుంది – సముద్రం

దాశరధి – దశరధుని యొక్క కుమారుడు – రాముడు

పర్యాయ పదాలు :

ఈశ్వరుడు – శివుడు, శంకరుడు

లక్ష్మీ – కమల, హరిప్రియ, పద్మ, ఇందిర

దేహం – శరీరం, కాయము, గాత్రము

నీరము – జలము, ఉదకము, పానీయము

పయోనిధి – సముద్రం, కడలి, సాగరము

ప్రకృతి – వికృతి :

మూర్ఖులు – మొరకులు

శ్రీ – సిరి

న్యాయము – నాయము  

6. మా ప్రయత్నం

ఉద్దేశ్యం :

ఒక పుస్తకం తాత్వికతను, అంతస్సారాన్ని, ఆశయాల్ని, శ్రమను తెలిపేది ముందుమాట. ముందుమాట వల్ల పుస్తకం చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. మంచి పుస్తకం ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుస్తుంది. అలాంటి ముందుమాట పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశ్యం

పాఠ్యభాగ వివరాలు :

ఒక గ్రంధాన్ని, ఆ గ్రంధ నేపద్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంధ రచయిత గాని వేరే రచయిత, విమర్శకుడుగానీ రాసే పరిశీలనాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. దీనికి ముందుమాట, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లు కలవు. మహిళావరణం అనే పుస్తకంలో ముందుమాట ప్రస్తుత పాఠ్యాంశం

పర్యాయ పదాలు :

స్త్రీ – పడతి, వనిత, ముదిత

పద్ధతి – విధానం, కరణి, చందము

స్మరణ – జ్ఞప్తి, గుర్తు, తలపు

జాతీయాలు :

గుండెలు బరువెక్కడం – విపరీతమైన మానసిక భాద కలగడం

నీరు కారిపోవడం – పాడైపోవడం, నిరుత్సాహపడడం, ఆశలు అడుగంటిపోవడం

కనువిప్పు – జ్ఞానం కలగడం

కాలధర్మం చెందడం – మరణించడం

తునాతునకలు – ముక్కలు ముక్కలవడం, పూర్తిగా దెబ్బ తినడం

పదాలు – వివరణ :

సామాజిక మార్పు – సమాజంలో కలిగే మార్పు

విజయోత్సవం – విజయం లభించినందుకు చేసుకునే పండగ

సామాజికాభివృద్ది – సమాజపరమైన అభివృద్ధి

సాంస్కృతిక వారసత్వం – సంస్కృతికి సంబందించిన వాటి కొనసాగింపు

అగ్రతాంబూలం – ఒక రంగానికి, గ్రామానికి లేదా సమాజంలో ఉన్నతునిగా గుర్తించడం  

7. సముద్ర లంఘనం

పాఠ్యాంశ నేపధ్యం :

సీతాన్వేషణలో రామలక్ష్మణులు కిష్కింద చేరుకుంటారు. సుగ్రీవునితో స్నేహం చేస్తారు. సుగ్రీవుడు సీతని వెతకడానికి వానర సైన్యాన్ని నఊగు దిక్కులు పంపుతాడు. అంజనేయుని బృందం దక్షిణ దిక్కుకి వెళుతుంది. జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు మహేంద్రగిరి నుండి సముద్ర లంఘనానికి సిద్ధం అవుతాడు. ప్రస్తుత పాఠ్యభాగం అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాబ్యూదయం అనే ప్రబంధం ఆరవ ఆశ్వాసం లోనిది

పాఠ్యభాగ వివరాలు :

వర్ణనా ప్రధానమైన కావ్యాలు ప్రబంధాలు. శ్రీకృష్ణ దేవరాయలు (16 వ శతాబ్దం) కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగం అంటారు. పురాణ ఇతిహాసల నుండి చిన్న కధ తీసుకుని వర్ణనలు కలిపి పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే దాన్ని ప్రబంధం అంటారు. వీటిలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి

సమానార్ధ పదాలు :

కొండ కొమ్మున – కూటాగ్రము  

వివరము – రంధ్రము

నభము – ఉప్పరము, ఆకాశం

ప్రకృతి – వికృతి :

సముద్రం – సంద్రం 

దిశ – దెస

గొనములు – గుణములు 

నిముసము – నిమిషం

అగ్గి – అగ్ని

వ్యుత్పత్తి అర్ధాలు :

కార్ముకం – కర్మకారునిచే చేయబడినది

అమరులు – మరణం లేనివారు

ఉదది – ఉదకము దీనియందు ధరించబడును

ప్రభంజనం – వృక్ష శాఖాదులను విరగగొట్టేది 

దానవులు – దనువు అనే స్త్రీ యందు పుట్టినవారు

కేసరి – జూలు కలిగినది

ధరాధరం – ధరను ధరించునది

పారావారాం – అపారమైన తీరం కలది

8. మాణిక్య వీణ

పాఠ్యాంశ ఉద్దేశ్యం :

ఆంధ్ర ప్రభ వార్తాపత్రికలో విద్వాన్ విశ్వం మాణిక్య వీణ శీర్షికన వ్యాసాలు కవితలు రచించారు. మాణిక్య వీణలో వీరు స్వీకరించని అంశం లేదని చెప్పవచ్చు. మానవ జీవన ప్రస్థానంతో కళ, కవిత్వం పెనవేసుకున్నాయి అని మనిషి నిరంతర జ్ఞాన అన్వేషి అని ఈ కవిత తెలుపుతుంది. మాణిక్య వీణను మీటి మానవీయ రాగాన్ని పలికించిన ఈ కవిత చారిత్రక ఘట్టాలని తరచి చూపి మనిషి శాశ్వతత్వాన్ని చూపుతుంది

సాంకేతిక రంగంలో అభివృద్ధి మాత్రమే అభివృద్ధి అనుకుంటూ కళలను సాహిత్యాన్ని ఉపేక్షిస్తుంది నేటితరం. మానవజీవితంతో ముడి వేసుకున్న కళలు సాహిత్యం అనాదిగా సంక్రమించిన ఆస్తి అని తెలుపుతూ విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడు అవుతాడాని తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం

పాఠ్యభాగ వివరాలు :

వచన కవిత అనే సాహిత్య ప్రక్రియ ఈ పాఠం. పద్య, గేయాల్లో ఉండే చందస్సుతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో రాసే కవిత వచన కవిత. చిన్న చిన్న పదాలు వాక్యాలతో ధ్వని గర్భితముగా ఉండే కవిత వచన కవిత. ఈ పాఠం విద్వాన్ విశ్వం రచనా సంపుటి లోది

అర్ధాలు :

రోదసీ – అంతరిక్షం

ఆయత్తమవుతున్నారు – సిద్ధపడుతున్నారు 

రుగ్మత – రోగం

కళవలపడడం – కలవర పడడం

ఒకరిని చూసి మరొకరు చేయడం – అనుకరించడం

పని చేయడానికి సిద్ధం అవ్వడం – ఆయత్తమవడం

అద్భుతంగా నాట్యమాడడం – తాండవమాడడం

పనిని మొదలుపెట్టడం – తిన్నగా ఎదగడం

జాతీయాలు :

మంత్రాలకి చింతకాయలు రాలడం – పని చేయకుండా కబుర్లు చెప్తే ప్రయోజనం లేదని చెప్పడం

మిన్నందుకోవడం – చాలా అభివృద్ధి చెందడం

గజ్జె కట్టడం – పనిలో చురుకుగా పాల్గొని అన్నీ తానై చేసేవారిని గూర్చి చెప్పడం

పర్యాయ పదాలు :

మిన్ను – ఆకాశం, నింగి

తాండవం – నాట్యం, నృత్యం

రుగ్మత – రోగం, జబ్బు

జ్ఞానం – తెలివి, మేధ

ప్రకృతి – వికృతి :

భాష – బాస

కవితలు – కైతలు

విజ్ఞానము – విన్నాణము

గుహ – గొబ

9. గోరంత దీపాలు

నేపధ్యం :

సమాజంలో ఎంతో మంది అనాధ బాలలను మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి పిల్లల కనీస అవసరాలు అయిన తిండి, బట్ట, చదువు మొదలైనవాటికి నోచుకోకుండా ఉంటారు. అనాధ బాలలను చేరదీసి వారి ఆకలి తీర్చి విద్యా బుద్ధులు చెప్పిస్తే వీరు కూడా మట్టిలో మాణిక్యాలలా వెలుగొందుతారు. సమాజానికి సేవ చేసే గొప్ప మనసున్న వ్యక్తులు తమ ఆస్తిపాస్తులలో సంబంధం లేకుండా అనాధాలను చేరదీసి చదివించేవారు ఎంతో మంది ఉన్నారు. అటువంటి ఒక వ్యక్తి చేసిన పనే ఈ కధ.

ఉద్దేశ్యం :

రైలు ప్రయాణంలో తటస్థ పడిన ఓ బాలుడిని చేరదీసి విద్యా బుద్ధులు చెప్పిస్తే ఎదిగిన ఆ వ్యక్తి చూపే కృతజ్ఞతా భావం వాళ్ళ మధ్య ఉండే మానవ సంబంధాలను తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం.

పాఠ్యభాగ వివరాలు :

ఈ పాఠ్యభాగం కధానిక ప్రక్రియకు చెందినది. ఇది మానవ సంబంధాలు, సామాజిక సేవ ఇతివృత్తంతో కళ్ళకు కట్టినట్లు మనోభావాలను పలికించేలా ఉంటుంది. ఈ పాఠం పులికంటి వారి కధా వాహిని లోనిది

అర్ధాలు :

సంజవెలుగు – సంధ్యా సమయంలో వెలువడే కాంతి

ఆశీర్వాదం – దీవెన

తదేకంగా – ఒకటే పనిగా అన్నట్లు

కాలక్షేపం – సమయం గడపడం

పులుము – పూసు

ఆకళింపు – అవగాహన

నానార్ధాలు :

రాజు – ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు

సమయం – బుద్ధి, సంకేతం, ప్రతిజ్ఞ

కృషి – స్త్రీ, సేద్యం, కరిసనము

కన్ను – ఏరు, వలిపము, తీరు

కొమ్మ – శాఖ, ఆడది, కోటకొమ్మ

ఆశ – దిక్కు, కోరిక

పర్యాయ పదాలు :

పక్షి – నీడజము, ద్విజము, పతగము

నేత్రం – అక్షి, చక్షువు, నయనం

శిరస్సు – తలకాయ, నెత్తి, మస్తకం

సూర్యుడు – అహిమకరుడు, భానుడు, భాస్కరుడు

చెట్టు – తరువు, భూరుట్టు, వృక్షం

కొండ – ఆచలము, శైల్యము, ఆహార్యము

వ్యుత్పత్తి అర్ధాలు :

అతిధి – తిధి, వార, నక్షత్ర నియమం లేకుండా ఇంటికి బోజనముకి వచ్చేవాడు

అక్షరము – నాశనము పొందనిది (వర్ణము)

పక్షి – పక్షములు కలది (విహంగం)

మౌని – మౌనము దాల్చి ఉండువాడు (ఋషి)

10. బిక్ష

నేపధ్యం :

వేద విభజన చేసి పంచమ వేదంగా పేరున్న మహాభారతం రచించి అష్టాదశ పురాణాలు రచించిన బ్రహ్మ జ్ఞాని వేద వ్యాసుడు. కాశీలో వ్యాసుడు తన పదివేల మంది శిష్యులుతో కొంతకాలం నివశించాడు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ప్రాతర్మధ్యాహస్నిక విధులు పూర్తి గావించి శిష్యులతో కూడా కాశీ నగర వీధుల్లో బిక్షాటన చేసేవాడు. శిష్యులు తాము తెచ్చిన బిక్షలో సగం అతిధి అభాగ్యులకు సమర్పించి మిగిలినది భుజించేవారు. ఒకరోజు కాశీ విశ్వనాధునికి వ్యాసున్ని పరీక్షించాలనే సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన ఘటన ఈ పాఠం

పాఠ్యభాగ వివరాలు :

ఈ పాఠ్యాంశం కావ్య ప్రక్రియకి చెందినది. ఇది కాశీ ఖండం సప్తమశ్వాసం లోనిది

పర్యాయ పదాలు :

ద్వాఃకవాటంబు – ద్వారబంధం, ద్వారం తలుపు

వనిత – స్త్రీ, పురంధి, అంగన, పడతి, నారీ

పసిడి – బంగారం, సువర్ణం, కనకం, హిరణ్యం

పారాశర్యుoడు – వ్యాసుడు, బాదరాయణుడు, సాత్యవతేయుడు

ఆగ్రహము – కోపం, క్రోధం, రోషం, కినుక

అహిమకరుడు – సూర్యుడు, రవి, ఆదిత్యుడు, భాస్కరుడు

అర్ధాలు :

ద్వాఃకవాటము – ద్వారం తలుపు

వీక్షించు – చూచు

అంగన – స్త్రీ

మచ్చెకంటి – చక్కని ఆడది

కుందాడుట – నిందించుట

భుక్తిశాల – బోజనశాల

నానార్ధాలు :

వీడు – ఈ మనుష్యుడు, పట్టణం, వదులుట

లెస్స – మేలు, చక్కన, మంచిది

గురుడు – ఉపాధ్యాయుడు, తండ్రి, బలీయం

ప్రకృతి – వికృతి :

విద్య – విద్దె 

బిక్షము – బిచ్చము

యాత్ర – జాతర

మత్స్యం – మచ్చెము

11. చిత్రగ్రీవం

ఉద్దేశ్యం / నేపధ్యం :

కలకత్తాలో ఓ పెంపుడు పావురం దానిని పెంచే ఓ బాలుడు వాళ్ళ కధను మనసుకి హత్తుకుపోయేలా చెప్పిన పుస్తకం చిత్రగ్రీవం. పావురాల జీవనానికి సంబంధించిన అతిసూక్ష్మ వివరాలు తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం

పాఠ్యభాగ వివరాలు :

ఈ పాఠ్యభాగం కధా ప్రక్రియకి చెందినది. ఇది అనువాద కధ. ప్రస్తుత పాఠ్యభాగం ధనగోపాల్ ముఖర్జీ రాసిన చిత్రగ్రీవం ఓ పావురం కధ అనే పుస్తకంలో స్వీకరించారు. దీనిని తెలుగులో అనువాదించినది దాసరి అమరేంద్ర. దీన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా సంస్థ ప్రచురించింది. చిత్రగ్రీవం ఓ పెంపుడు పావురం పేరు. ఈ పాఠం పక్షులకి సంబంధించి శాస్త్రీయ విజ్ఞానం అందిస్తుంది

పదాలు – వివరణ :

గద్దింపులు – కువకువ కూయడం

పావురాలు – రకరకాల రంగురంగుల పావురాలు

గువ్వలు – నీలికళ్ళతో కువకువలాడడం

పావురాల గుంపు – పెనుమేఘాలు

పావురం మెడ – హరివిల్లు

పుట్టిన పిల్ల పక్షి – బలహీనమైన, నిస్సహయమైన, అర్భకమైన

చిత్రగ్రీవం – ముక్కు – పొడవాటి, సూది లాంటి, బలమైన

చిత్రగ్రీవం ఒళ్ళు – సముద్ర నీలిరంగు

చిత్రగ్రీవం మెడ ప్రాంతం – ఇంద్రధనస్సు వర్ణాల పూసల గొలుసు        

6వ తరగతి కవి కాలాదులు

6వ తరగతి కవి కాలాదులు, for TET and DSC 2022 | నూతనం గా ప్రవేశ పెట్టిన ఆరవ తరగతి కవులు మరియు వారి విశేషాలు .

 

6వ తరగతి కవి కాలాదులు

పాఠం కవి కాలం బిరుదులు / అవార్డులు మూలాగ్రంధం ఇతర రచనలు
అమ్మవడి బాడిగ వెంకట నరసింహారావు 15.08.1913 – 06.01.1994 బాలబంధు బి.వి.నరసింహారావు సంపూర్ణ రచనలు రెండవ సంకలనం బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు-హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారిలోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు.
కృష్ణా జిల్లా కౌతారం లో జన్మించారు.

బాలసాహిత్యాన్ని ఉద్యమ స్పూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయం.

వింజమూరి లక్ష్మీనరసింహారావు రాసిన “అనార్కలి” నాటకంలో అనార్కలి పాత్ర ధరించి “అనార్కలి నరసింహారావు”గా ఖ్యాతి గడించారు.

తృప్తి సత్యం శంకరమంచి 03.03.1937 – 21.05.1987   అమరావతి కధలు అమరావతి కధలు, కార్తీక దీపాలు – కధా సంపూటాలు.

రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు – నవలలు

హారహారమహాదేవ నాటకం, దిన వార పత్రికలలో అనేక వ్యాసాలు

గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు.

1979 లో “అమరావతి కధలు” కు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

మాకొద్దీ తెల్లదొరతనం గరిమెళ్ళ సత్యన్నారాయణ 14.07.1893 – 18.12.1952     హరిజనుల పాటలు(1923), స్వరాజ్య గీతములు(1921), ఖండ కావ్యాలు(1926), భక్తి గీతాలు, బాల గీతాలు.

దండాలు దండాలు భరతమాత, మాకొద్దీ తెల్లదొరతనం – గేయాలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు లో జన్మించారు.

స్వాతంత్ర్య సమరయోధులు, కవి, రచయిత.

దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెళ్ళ.

సమయస్ఫూర్తి కందుకూరి వీరేశలింగం 16.04.1848 – 27.05.1919 గద్య తిక్కన పంచతంత్ర కధలు విగ్రహం అనే భాగంలో కధ రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత భోదిని, ఆంధ్రకవుల చరిత్ర,
రాజమండ్రిలో జన్మించారు.

వీరు సంఘసంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త

సుభాషితాలు నార్ల చిరంజీవి 20వ శతాబ్దం     తెలుగుపూలు శతకం
వేమన 17వ శతాబ్దం     వేమన శతకం
కరుణశ్రీ 20వ శతాబ్దం     తెలుగుబాల శతకం
తిక్కన 13వ శతాబ్దం     మహాభారతం
పక్కి అప్పలనరసింహం 17వ శతాబ్దం     కుమార, కుమారీ శతకాలు
పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం     కాళికాంబ సప్తసతి
మారద వెంకయ్య 16వ శతాబ్దం     భాస్కర శతకం
కంచర్ల గోపన్న 17వ శతాబ్దం     దాశరదీ శతకం
మమకారం చిలుకూరు దేవపుత్ర 24.04.1952 – 18.10.2016   ఆరుగ్లాసులు కదా సంపుటి ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, ఆరుగ్లాసులు మొ. కథాసంపుటాలు.

అద్దంలో చందమామ, పంచమం నవలలు

అనంతపురం జిల్లా కాల్వపల్లెలో జన్మించారు.

పంచమం నవలకి అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవల పోటీలో తృతీయ బహుమతి(1996), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం(2000), చా.సో.స్ఫూర్తి సాహితీ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించాయి.

మేలుకొలుపు కుసుమ ధర్మన్న 17.03.1900 – 1946   హరిజన శతకం అనుబంధం నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్లదొరతనం వంటి రచనలు
రాజమహేంద్రవరం లక్ష్మీవారపు పేట లో జన్మించారు.

తల్లిదండ్రులు – కుసుమ నాగమ్మ, వీరాస్వామి

వైద్య విద్వాన్, సంస్కృతం, ఆంధ్రం, ఆంగ్లం, హిందీ ఉర్దూలలో పాండిత్యం కలవారు.

కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యారు.

అంబెడ్కర్ స్ఫూర్తితో అంటరానితనం నిర్ములించాలని తపించిన తొలి దళిత కవి.

ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో రవీంద్రనాధ్ ఠాగూర్ 07.05.1861 – 07.08.1941   గీతాంజలి  
విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త.

బెంగాలీ, ఇంగ్లీష్ లలో అన్ని సాహిత్య ప్రక్రియల్లో విస్తృతంగా రచనలు చేశారు.

1913 లో గీతాంజలి రచనకు నోబెల్ బహుమతి వచ్చింది.

  గుడిపాటి వెంకట చలం 18.05.1894 – 04.05.1979 కవి, కధారచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త. తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత.

స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం గురించి పరితపించారు.

ఉపాధ్యాయునిగా, పాఠశాల పర్యవేక్షకునిగా తాను గమనించిన అంశాలు దృష్టిలో ఉంచుకొని “బిడ్డల శిక్షణ” అనే పుస్తకం రాశారు.

విద్యను, పిల్లల పెంపకాన్ని మేళవించవలసిన అవసరం గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు.

 

ధర్మ నిర్ణయం విశ్వనాధ సత్యనారాయణ “ఆంధ్ర ప్రశస్తి”, “శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహాత్మ్యం” ఈ పాఠానికి ఆధారం.
త్రిజట స్వప్నం ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దం   మొల్ల రామాయణం సుందరకాండ  
కడప జిల్లాలో గోపవరంలో జన్మించారు. రామభక్త కవయిత్రి.

మొల్ల రామాయణంలో 871 గద్య, పద్యాలు ఉన్నాయి.

తెలుగు సాహితీవనంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి.

డూ డూ బసవన్న రావూరి భరద్వాజ 05.07.1927 – 18.10.2013 కళాప్రపూర్ణ జీవన సమరం విమల (ఈయన రాసిన తొలికధ). అపరిచితులు, కదాసాగరం వంటి 37 కథాసంపుటాలు. ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కధలు. కరిమ్రింగిన వెలగపండు, జల ప్రళయం వంటి 17 నవలలు.
గుంటూరు జిల్లా తాడికొండ లో జన్మించారు.

వీరి “పాకుడురాళ్లు” నవలకి జ్ఞానపీఠ్ అవార్డు లభించింది.

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రు పురస్కారం, రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు. గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న(ఆంధ్రప్రదేశ్), లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు.

 

AP 3RD CLASS TELUGU 2021 Best Notes

AP 3RD CLASS TELUGU 2021

1. తెలుగు తల్లి

AP 3RD CLASS TELUGU 2021

AP 3RD CLASS TELUGU 2021  

పాఠ్యాంశం :   

ఇతివృత్తం – దేశభక్తి 

ప్రక్రియ – గేయం , 

కవి శ్రీ రంగం శ్రీనివాసరావు  

కాలం –  (14.04.1901 – 15.06.1983) 

రచనలు –  ప్రస్థానం , మరో ప్రస్థానంఖడ్గ సృష్టి. 

ఆత్మకథ – అనంతం   

అర్థాలు : 

తెనుంగు = తెలుగు 

అనుంగు = ప్రియమైన 

చనవొయ్ = వెళ్లవొయ్ 

రేడు = రాజు 

తల్లి భారతీ వందనం

 ప్రక్రియ – పాట  

వి –  దాశరథి కృష్ణమాచార్య  

రచనలు 

 అగ్నిధారరుధ్రవిణ , మహాంద్రోదయంతిమీరం తో సమరం 

ఆత్మకథ – యాత్రా స్మృతి 

ప్రత్యేకత –  ఆంధ్ర ప్రదేశ్ ఆస్థాన కవిగా సేవలందించారు. 

నిజాం వ్యతరేక ఉద్యమం లో పాల్గొన్నాడు.

ఐకమత్యం

ప్రక్రియ –  కథ 

రచయిత –   లియోటాల్ స్థాయి రష్యన్ కథ ఆధారం .  

రచనలు : సమరం – శాంతిఅనాకెరనీనా, 

2. మర్యాద చేద్దాం

 AP 3RD CLASS TELUGU 2021

కథ 

పాత్రలు – పరమాందయ్యపేరయ్య, 12 మంది శిష్యులు , దొంగలు  

AP 3RD CLASS TELUGU 2021

సంభాషణ :  

“ఓయ్ పరమానందం! ఒరేయ్ పరమా!” – పేరయ్య 

“సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారుగా, పరమా!” – పేరయ్య 

పాపం వీళ్ళకేమీ తెలియదు. ఒట్టి అమాయకులు. వారిని క్షమించు”. – పరమానందయ్య 

ఈసప్ కథలు గ్రీకు పురాతన కథలు. 2500 సం .క్రితం రాయబడ్డాయి. 

3. మంచి బాలుడు

 AP 3RD CLASS TELUGU 2021

గేయం 

కవిపరిచయం : 

కవి – ఆలూరి బైరాగి  

కాలం – 5.11. 1925 – 9.9.1978

20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. మానవుడి ఆస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు.

రచనలు – చీకటి మొదలు‘, ‘నూతిలో గొంతుకలు‘, ‘ఆగమగీతి‘, ‘దివ్యభవనం! ఆయన ప్రసిద్ధ రచనలు.

కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొందారు.  

అర్థాలు 

వీధులు -బజారులు 

జడిసి = భయపడి 

త్రోవ = దారి 

వడి = వేగం 

 

కలపండి చేయి చేయి 

గేయం 

కవిపరిచయం 

దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి (1.11.1897 – 24.2.1980) 

ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగుకవి. 

అక్షర రమ్మత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు. 

అందుకనే వీరి కవిత్వాన్ని శ్రీశ్రీ  ఇక్షూ సముద్రంతో పోల్చారు. 

కృష్ణపక్షం, ‘ఊర్వశి”, ప్రవాసమువీరి ప్రసిద్ధ రచనలు. పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 

భావిలో నీళ్ళు 

కథ 

పాత్రలు : రైతుజమీందారుఅక్బర్బీర్బల్ 

AP 3RD CLASS TELUGU 2021

సంభాషణ :  

 నేను నీకు బావిని అమ్మాను కానీ, అందులోని నీకు అమ్మలేదు. అవి నావి. ఆ నీళ్ళు కావాలంటే తగిన ధనం ఇచ్చి తోడుకో!”      – జమీందారు  

“సరే, రైతు బావిలో నీ నీళ్లు ఉన్నాయి. వెంటనే బానిలో కీళ్ళన్నీ తోడుకొని వెళ్ళిపో లేదా నీళ్ళు 

పెట్టుకున్నందుకు రైతుకు అద్దె చెల్లించు”    – బీర్బల్  

4. నా బాల్యం

 AP 3RD CLASS TELUGU 2021

కథ 

కవి పరిచయం

 

షేన్ నాజర్ నిరు పేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెనలు గ్రామంలో

1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబీ.

 

ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు.

పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం. అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతి వృత్తాలలో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు.

నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

నాజర్ 1997 ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు. 

షేక్ నాజర్ తన జీవితకథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి. 

చరిత్రాత్మకమైన ఈ కథకు పింజరిఅని పేరు పెట్టాడు. 

నాజరు / అబ్దుల్ అజీజ్. (తాతగారు పెట్టిన పేరు) 

పాఠశాలలో వేసిన నాటకం – ద్రోణాచార్య. 

సంగీతం నేర్పింది – హార్మోనిస్ట్ ఖాదర్ .

 

అర్థాలు 

గుంజ – రాట 

పామరులు   = చదువుకోనివారు 

ఆశ = కోరిక 

ఆరుగాలం = ఏడాది అంతా

పర్యాయ పదాలు 

గుంజ : రాట , నిట్టాడు ,స్తంభం 

బాబాయి : చిన్నన్నపినతండ్రిచిన్నాబ్బ 

బువ్వ : అన్నంకూడు ,మెతుకులు   

AP 3RD CLASS TELUGU 2021 

5. పొడుపు– విడుపు

AP 3RD CLASS TELUGU 2021

 ప్రక్రియ – సంభాషణ 

కవి పరిచయం : 

చింతా దీక్షితులు (26, 8, 1891 – 25, 8. 1960)

కవి, కథకులు, విద్యావేత్త, తెలుగులో బాలసాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు, గిరిజనుల గురించి సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత.

 

ఏకాదశి‘, ‘శబరి‘, ‘వటీరావు కథలు‘, ‘లక్కపిడతలు ఆయన రచనలు. 

పాత్రలు : సూరిసీతివెంకీ 

AP 3RD CLASS TELUGU 2021

పొడుపు కథలు 

తీస్ కొద్ది పెరిగేది – గొయ్యి 

వెండి గొలుసులు వెయ్యడమే కానీ తియలేము – ముగ్గు 

నూరు చిలుకలకు ఒకటే ముక్కు – పళ్ళ గుత్తి 

పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకుని నూతిలో పడ్డాడు.  – అరటి పండు 

ఇంట్లో కలి – రోకలి 

ఒంట్లో కలి – ఆకలి 

చందమామ 

గేయం 

కవి – నండూరి  రామమోహనరావు 

హరివిల్లు ఆయన రచించిన బాలగేయాల సంపుటం.

 

నరావతారం‘, ‘విశ్వరూపం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభశైలిలో పాఠకులకు పరిచయం చేశారు.  

విశ్వదర్శనం‘, ‘అక్షరయాత్రవంటి రచనలతో పాటు మార్కన్వయిన్ రచించిన టామ్ సాయర్‘, ‘హకల్ బేరిఫిన్లకు అనువాదాలు కూడా చేశారు.  

AP 3RD CLASS TELUGU 2021

వికటకవి 

నాయనా! ఇవిగో రెండు పాత్రలు. ఒక దానిలో పాలున్నాయి. మరొకదానిలో పెరుగు పాలు తాగితే గొప్ప పండితుడివవుతావు. పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడివవుతావు. నీకేం కావాలో కోరుకో

నీవు వికటకవివి అవుతావు ఫో”.        -.    కాళికా మాత తెనాలి రామకృష్ణుడు తో 

AP 3RD CLASS TELUGU 2021

[/et_pb_text][/et_pb_column]

6. మే మే మేకపిల్ల

AP 3RD CLASS TELUGU 2021

కథ

1949 లో బాపట్ల కు చెందిన అర్ . శకుంతల దేవి రచించిన చందమామ కథలు

పాత్రలు : మే మే మేకపిల్ల , మేక తల్లిఏరునిప్పువంటవాడుగాలి

AP 3RD CLASS TELUGU 2021

సంభాషణలు

ఢిల్లీ వెళదాం – రాజును చూద్దాం‘    మే మే

 ‘సరే వెళ్ళు, కాని ముందు ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది. ఆకులన్నీ తినేసెయ్యవా?”   ఏరు

“ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటా. నాతోరా చూపిస్తా‘  వంటవాడు

 

“చూశావా మరి. నీవు ఎవరికీ సాయం చేయలేదు. మరి నీకెవరు సాయం చేస్తారు?”.  గాలి

 

ఢిల్లీ వద్దు

రాజు వద్దు

అమ్మ మాటే వింటా

ఉండదు. నాడే తంటా.   మే మే

 

అర్థాలు

కాగు = పెద్ద బిందె

వాలకం = తీరు

 

తెలుగు తోట

గేయం 

కవి పరిచయం

 కవి – కందుకూరి రామభద్రు కవి.

 రచనలు – లేమొగ్గతరంగిణిగేయ మంజరి

AP 3RD CLASS TELUGU 2021

7. పద్య రత్నాలు

AP 3RD CLASS TELUGU 2021

కవిపరిచయాలు

కవి : వేమన

జననం : 17-18 శతాబ్దాల మధ్య కాలం

జన్మస్థలం : కడప జిల్లాకు చెందిన వారని చరిత్రకారులు భావిస్తున్నారు.

వేమన సమాధి : అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లె.

శతకం : వేమన శతకం

కవి : బద్దెన

కాలం : 13వ శతాబ్దం

శతకం : సుమతీ శతకం

 

కవి : గువ్వల చెన్నడు

కాలం : క్రీ.శ. 17-18 శతాబ్దాల

స్వస్థలం: కడప జిల్లా రాయచోటి 

శతకం : గువ్వల చెన్న శతకం

మకుటం : గువ్వల చెన్న

 

AP 3RD CLASS TELUGU 2021

కవి : పాపయ్య శాస్త్రి

జననం : 12-06-1992

స్వస్థలం : గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మం|| కొమ్మూరు. గ్రామంలో జన్మించారు.

ఇతర రచనలు : విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాలు రచించారు.

 

కవి : దువ్వూరి రామిరెడ్డి (9వ పద్యం)

కాలం : 9-11-1895 – 11-09-1947

స్వస్థలం: నెల్లూరు

రచనలు : కృషీవలుడు, జలదాంగన, గులాబితోట, పానశాల మొదలైనవి.

AP 3RD CLASS TELUGU 2021

అర్థాలు

ధర = భూమి , నేల

పరికించు = పరిశీలించు

అబ్బు = అలవాటు ఆగు

శబ్ద చయము = పదాల సమూహం

మర్మము = సారంభావంరహస్యం

సరసుడు = మంచిని గ్రహించ కలిగిన వాడు

AP 3RD CLASS TELUGU 2021

ఎప్డు = ఎల్లప్పుడూ

బలమి = బలం

కమళాప్తుడు = సూర్యుడు

రష్మి = కిరణంవేడి,

సోకి = తాకి ,తగిలి

గ్రావం = కొండ

లావు = బలం , శక్తి

మహి = భూమి

కలిమి = సంపద;

AP 3RD CLASS TELUGU 2021

లోభి – పిసినారి;

 విలసితముగ = చక్కగా;

పేద = బీదవాడు;

వితరణి = దాత;

చలిచెలమ – మంచినీటిగుంట;

కులనిధి = ఎక్కువ నీరు కలిగినది;

AP 3RD CLASS TELUGU 2021

అంభోధి = సముద్రం.

అర్చన – పూజ, సేవ;

ఇచ్చకములు – ప్రియమైన మాటలు;

ఆప్తవరులు – హితులు,

కాంచు = చూచు;

చెలిమికాండ్రు = స్నేహితులు,

 

AP 3RD CLASS TELUGU 2021

తెలుగు లో తొలి కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, – రచన సుభద్రా కళ్యాణం

 

అందమైన పాట

జీ.వీ సుబ్రమణ్యం – నవ్య సంప్రదాయ దృష్ఠిలో సాహితీ విమర్శ చేశారు.

 రచనలు –   వీరరసంరసోళ్ళాసంసాహితీ చరిత్రలో చర్చనీయాంశాలు 

AP 3RD CLASS TELUGU 2021

దిలీపునీ కథ

పాత్రలు : దిలీపుడునందిని అనే ఆవుసింహంభార్య సుధక్షిణాదేవి

“ఓ మహారాజా! నేను ఆకులు, గడ్డి తిని బతకలేను. నా అజంతువులే కదా! దేశాన్ని

ఏలే రాజువు. నీకు తెలియదా! మరి నన్ను ఏం తిని బతకమంటావు?   – సింహం దిలీపుడు తో

 

AP 3RD CLASS TELUGU 2021

 “ఈ గోమాతను  కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువుగారికి మాటిచ్చాను. దయ ఉంచి గోమాతను విడిచి పెట్టు. బదులు నన్ను నీ ఆహారంగా స్వీకరించు”.     – దిలీపుడు సింహం తో

 

 “ఒక గోమాతను కాపాడలేని, ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను.”.  – దిలీపుడు సింహం తో

 దిలీపుడుకి పుట్టిన కుమారుడు – రఘు మహారాణి.   ( శ్రీ రాముడు వంశం )

 

 

AP 3RD CLASS TELUGU 2021

 

8. మా ఊరిఏరు

AP 3RD CLASS TELUGU 2021

గేయం

మధురాంతకం రాజారాం.  – రాయలసీమ సంస్కృతి లై 400 పైగా కథలు రాశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నరు .

 

AP 3RD CLASS TELUGU 2021

పంట చెలు –

పాలగుమ్మి విశ్వనాథం  

 

9. తొలి పండుగ

AP 3RD CLASS TELUGU 2021

పాత్రలు – రవి , లత , ఆనంద్శ్యాముల్, , రంగయ్య తాత  

అబ్బా! పూర్ణంబూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇచ్చేమో!”    – ఆనంద్.

“ఈరోజు ఉగాది పండుగ కదా? మా అమ్మ చేసింది. వీటన్నింటికంటే ముందు ఉగాది పచ్చడి తినాలి”.  – రవి

“తాతా! చేతులు కదుక్కో నీకు ఉగాది పచ్చడి పెడతాను. తరువాత పూర్ణాలు,బ్గారెలు కూడా పెడతాను”     లత రంగయ్య తో

 

AP 3RD CLASS TELUGU 2021

అర్థాలు

నైవేద్యం – దేవుడికి పెట్టేది / నివేదన చేసేది

పంచాంగం – అయిదు అంగాలు కలది .

తెలుగు సంవత్సరాలు – 60

మొదటిది – ప్రభవచివరిది – అక్షయ

2020 – వికారి, 2021 – శార్వరి, 2022 – ప్లవ

మన తెలుగు వారికి ప్రత్యేకమైన  నెలలు

AP 3RD CLASS TELUGU 2021

1. చైత్రం

2. వైశాఖం

3. జ్యేష్టం

4. ఆషాఢం

5. శ్రావణం

6. భాద్రపదం

7. ఆశ్వయుజం

AP 3RD CLASS TELUGU 2021

8. కార్తికం

9. మార్గశిరం

10. పుష్యం

11. మాఘం

12. ఫాల్గుణం

 

అందాల తోటలో

కస్తూరి నరసింహా మూర్తి రచించిన పాపాయి సిరులు గేయ సంపుటి నుండి 

AP 3RD CLASS TELUGU 2021

నక్క యుక్తి

జంధ్యాల సుబ్రమణ్య శాస్త్రి

గద్వాల్ సంస్థానంలో సహస్రవదాని.

ఆంధ్రుల చరిత్రఆంధ్ర సామ్రాజ్యంరత్న లక్ష్మీ శతపత్రంకేనోపనిషత్తు

  “ ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు ఇదిఎవరు ఎక్కువ అయితే వచ్చే లాభం ఏముంది” – నక్క మొసలి తో  అంది

AP 3RD CLASS TELUGU 2021
[/et_pb_row][/et_pb_section]

AP 5TH CLASS TELUGU 2021 1st Lesson ఏ దేశమేగినా … Best Notes

AP 5TH CLASS TELUGU 2021 1st Lesson ఏ దేశమేగినా … Best Notes

AP 5TH CLASS TELUGU 2021 1st Lesson ఏ దేశమేగినా …
కవి పరిచయం:
రాయప్రోలు సుబ్బారావు (13-03-1892 – 30-06-1984)
రాయప్రోలు సుబ్బారావు అభినవ నన్నయ బిరుదాంకితుడిగా, నవ్య కవితా పితామహుడిగా పేరుపొందారు.
‘తృణకంకణం’, ‘స్నేహలత’, ‘స్వప్నకుమారం’, ‘కష్టకములు’, ‘ఆంధ్రావళి’, “జడకుచ్చులు’, ‘వనమాల’ మొదలైన కావ్యాలను రచించారు.
‘రమ్యాలోకం’, ‘మాధురీ దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాశారు.
వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించింది.
AP 5TH CLASS TELUGU 2021 1st Lesson ఏ దేశమేగినా … Best Notes
అర్థాలు 
తెన్గు తెలుగు
కాలిడు అడుగు పెట్టు
సోకు = తగులు
AP 5TH CLASS TELUGU 2021 1st Lesson ఏ దేశమేగినా … Best Notes
ఆంధ్రభాష యమృత మాంధ్రాక్షరంబులు
మురువు లొలుకు గుండ్ర ముత్తియములు
ఆంధ్రదేశ మాయురారోగ్య వర్ధకం
బాంధ్రజాతి నీతి ననుసరించు.         – వేటూరి ప్రభాకర శాస్త్రి

AP 5TH CLASS TELUGU 2021 1st Lesson ఏ దేశమేగినా … Best Notes

For more

My Class Notes

TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము

 TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి

అలంకారాలు Usefull for TS AND AP Best Notes

TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన

TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం

My Vijetha

Telugu e Tutor

AP 5TH CLASS TELUGU 2021 2nd Lesson సాయం Best Notes

AP 5TH CLASS TELUGU 2021 2nd Lesson సాయం

AP 5TH CLASS TELUGU 2021 2nd Lesson సాయం
రచయిత : జాప్ కొప్
పాత్ర : రవి , పిచ్చుక
అర్థాలు 
దృష్యం – చూడదగినవి
ఆత్రం = తొందర
అవధులు = హద్దులు
 
అనకు కనకు వినకు
రచయిత : జంధ్యాల పాపయ్య శాస్త్రి ,
రచనలు : ఉదయ శ్రీ,కరుణ శ్రీ,విజయ శ్రీ , అరుణ కిరణాలు , తెలుగు బాల శతకం
పాత్రలు : గాంధీ,మహదేవ్ దేశాయ్

AP 5TH CLASS TELUGU 2021 2nd Lesson సాయం

For more

My Class Notes

TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము

 TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి

అలంకారాలు Usefull for TS AND AP Best Notes

TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన

TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం

My Vijetha

Telugu e Tutor

AP 5TH CLASS TELUGU 2021 3rd Lesson కొండవాగు Best Notes

AP 5TH CLASS TELUGU 2021 3rd Lesson కొండవాగు Best Notes

aptet2022, apdsc 2022, ap tet 2021 syllabus, ap dsc 2021 notification, apdsc 2021, ap dsc 2021, ap dsc official website, ap dsc 2021 syllabus, ap dsc 2020 notification, ap tet 2022 syllabus, ap dsc website, ap dsc full form, ap dsc 2020 age limit, ap dsc books, ap tet notification 2021 date, ap dsc books online, aptet 2022 notification, ap dsc qualification, ap dsc jobs, ap dsc age limit 2021, ap tet age limit 2021, ap tet 2022 notification, ap tet 2022, ap dsc 2022, ap dsc vacancies 2021, aptet2022.in, ap tet 2021 exam date, ap dsc 2022 notification, aptet telugu, apdsc telugu, ap tet maths, apdsc maths , apdsc new content , aptet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes

AP 5TH CLASS TELUGU 2021 3rd Lesson కొండవాగు

రచయిత చెరుకుపల్లి జమదగ్ని శర్మ
రచనలు మహోదయం,చిలుకా గోరింక,అన్నదమ్ములు ధర్మధీక్ష ,
పాత్రలు జావేద్ రామం,సూర్య
జావేద్ వెంకట్ కు లేఖ రాశాడు
AP 5TH CLASS TELUGU 2021 3rd Lesson కొండవాగు
అర్థాలు
మేట = ఇసుక ప్రదేశం
వాగు = చిన్న ఎరు
జాలువారు = జారుతున్న
పొద్దు = రోజు, దినం
దృశ్యం  = సన్నివేశం, చూడదగినది
బారులు = వరుసలు
లంక – నదిలో పైకి లేచి ఉన్న భూభాగం
కదంతొక్కు = ఉత్సాహంతో ముందుకు వెళ్ళు
AP 5TH CLASS TELUGU 2021 3rd Lesson కొండవాగు

 

జననీ జనకుల గొలుచుట
తనయునకును ముఖ్యమైన ధర్మము జననీ
జనకుల గొల్చుట కంటెను
దనయున కభృధికమైన ధర్మం గలదే.         –  శ్రీనాథుడు
 

AP 5TH CLASS TELUGU 2021 3rd Lesson

 

 

 

వడగళ్ళు
కవి పరిచయం
ఏడిద కామేశ్వరరావు (12-09-1913 – 1984)
ఏడిద కామేశ్వరరావు ఆకాశవాణిలో పనిచేశారు. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు.
‘రామగీతం’, ‘జైలు రోజులు’, ‘ఇండోనేషియా చరిత్ర’ మొదలయిన రచనలు చేశారు.

AP 5TH CLASS TELUGU 2021 3rd Lesson కొండవాగు

aptet2022, apdsc 2022, ap tet 2021 syllabus, ap dsc 2021 notification, apdsc 2021, ap dsc 2021, ap dsc official website, ap dsc 2021 syllabus, ap dsc 2020 notification, ap tet 2022 syllabus, ap dsc website, ap dsc full form, ap dsc 2020 age limit, ap dsc books, ap tet notification 2021 date, ap dsc books online, aptet 2022 notification, ap dsc qualification, ap dsc jobs, ap dsc age limit 2021, ap tet age limit 2021, ap tet 2022 notification, ap tet 2022, ap dsc 2022, ap dsc vacancies 2021, aptet2022.in, ap tet 2021 exam date, ap dsc 2022 notification, aptet telugu, apdsc telugu, ap tet maths, apdsc maths , apdsc new content , aptet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes

 

For more

My Class Notes

TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము

 TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC

AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి

అలంకారాలు Usefull for TS AND AP Best Notes

TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన

TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం

My Vijetha

Telugu e Tutor