Class 9 Telugu Complete Notes for MEGA DSC

9th తెలుగు – పదజాలం

1. ధర్మబోధ

ఉద్దేశ్యం :

మానవులు చేసే ప్రతి పనికి ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైన సాక్షి. అంతరాత్మను చంపుకుంటే మనిషి తనని తాను వంచించుకున్నట్టే అవుతుంది. గృహస్త ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పదనాన్ని గురించి చెప్పడమే పాఠం ఉద్దేశ్యం.

నేపధ్యం :

విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేస్తున్నాడు. అతని తపస్సు భంగం చేయడానికి దేవతలు మేనకని పంపారు. వారిద్దరికీ ఒక బాలిక జన్మించింది. ఆ శిశువును శకుంత అనే జాతి పక్షులు కాపాడాయి. అందువల్ల ఆమెకి శకుంతల అని నామకరణం చేసి కణ్వ మహాముని పెంచుకున్నాడు. ఒక రోజు దుష్యంతుడు వేట కోసం వెళ్తూ కణ్వ మహాముని ఆశ్రమం దగ్గర ఆగాడు. శకుంతలని చూశాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. శకుంతలకి భరతుడు జన్మించాడు. తల్లి బిడ్డలను కణ్వ మహర్షి అత్తవారింటికి పంపాడు. నిండు కొలువులో దుష్యంతుడు ఆమెను తిరస్కరించాడు. దుష్యంతుడు మాటలు విని కలత చెందిన శకుంతల రాజుకి ధర్మబోధ చేయడమే ఈ పాఠం నేపధ్యం

ప్రక్రియ – ప్రాచీన పద్యం :

ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని అర్ధం. ఇతిహాసంలో కధకి అధిక ప్రాధాన్యం ఉంటుంది. రామాయణం, భారతం ఇతిహాసాలు. ఇతిహాసాల్లో మూలకధ తీసుకుని వర్ణనలతో ఛందోబద్దంగా పద్యాల రూపంలో కావ్యంగా మలచి రాయడమే ఇతిహాస కావ్యం. ఈ కావ్యాలు కవి ప్రతిభా విశేషాలుని వెల్లడిస్తాయి. అద్భుత కధాగమనంతో పాఠకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తాయి.

అర్ధాలు :

ఆచార్యుడు – గురువు

విపత్తు – ఆపద

నూనృత – సత్యం

హృద్యం – మనసుకి ఆహ్లాదం కలిగించడం

యశస్సు – కీర్తి

ఊత – ఆధారం

పర్యాయ పదాలు :

భూమి, వసుధ, పుడమి

ఆసరా, ఆధారం

భార్య, సతి, కళాత్రం, ధార

తనయుడు, పుత్రుడు, సుతుడు, కొడుకు

ఏనుగు, కరి, మాతంగం

నానార్ధాలు :

క్రమము, నీటిచాలు, వితరణ, కత్తి అంచు – ధార

పుణ్యం, స్వభావం, న్యాయం, ఆచారం, నీతి – ధర్మం

మానవుడు, అర్జునుడు – నరుడు

దిక్కు, కోరిక, నమ్మకం – ఆశ

కులం, వెదురు, పిల్లనగ్రోవి – వంశం

ప్రకృతి – వికృతి :

పుస్తకం – పొత్తం

నీరము – నీరు

యజ్ఞము – జన్నము

విద్య – విద్దె

గృహము – గీము

దీపము – దివ్వె

సత్యము – సత్తేము

ధర్మం – దమ్మము

రాజ – రేడు

కావ్యం – కబ్బం

వ్యుత్పత్తి అర్ధాలు :

పుత్రుడు – పున్నామ నరకము నుండి తప్పించేవాడు – కుమారుడు

ధర్మం – లోకం చేత ధరించబడేది

పతివ్రత – పతిని సేవించుటయే వ్రతముగా కలది – సాధ్వి

జ్యోత్స్న – కాంతిని కలిగి ఉండేది

వ్యతిరేక పదాలు :

చేసి – చేయక

వస్తాడు – రాడు

తింటే – తినకపోతే

వినండి – వినకండి

చెప్పి – చెప్పక

2. చైతన్యం

ఉద్దేశ్యం :

ప్రతి మానవ సమాజంలో అందరికీ అతీతంగా కొందరు ఉంటారు. వారు భవిష్యత్తును దర్శిస్తారు. ముందుచూపుతో ఆలోచిస్తారు. దారి దీపమై ముందుకు సాగుతారు. వారు తాత్వికులు. వారు తమ మాటల ద్వారా చేతల ద్వారా దిశానిర్ధేశం చేస్తారు. కవి కూడా ఈ కోవకి చెందినవాడే. అతని కవిత్వంలో సామాజిక చైతన్యం కలిగిస్తాడు. కవి తన రచనల ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తాడు. ఒక వంక మనిషిలో మంచితనం మెచ్చుకుంటూ కూటిలత్వాన్ని ఎండగడతాడు. ఆ నిబద్ధత తోనే కవి తన మనసులో భావాలు లోకానికి ఈ కవిత రూపంలో వెల్లడించారు. విధ్యార్ధులలో సామాజిక చైతన్యం కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడమే ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

కవిత్వానికి ఉండవలసిన ప్రధమ లక్షణం సామాజిక ప్రయోజనం. సమాజంలో అసమానతలు రూపుమాపడానికి కవి తన కలాన్ని కదిలించాలి. ప్రజల గొంతుకగా కవి వినబడాలి. తోటి మానవాళికి అండగా నిలవాలంటే గుండె నిండా ధైర్యం నింపుకోవాలి. సొంత లాభం కోసం కాకుండా పరుల మేలు కోరి పని చేయాలి అని ప్రేరణ ఇస్తూ కవి తన ఆకాంక్ష వ్యక్తం చేస్తున్న సందర్భంలో కవి కలం నుండి జాలువారినదే ఈ గేయకవిత

ప్రక్రియ – గేయ కవిత :

గేయ కవిత పాడుకోవడానికి అనువైనది. మాత్రా ఛందస్సు అనుసరించి నడుస్తుంది. లయాత్మకంగా సాగుతుంది. మానవాళి శ్రేయస్సును సమాజ పురోగమనాన్ని లోక కళ్యాణాన్ని కాంక్షించే గేయాన్ని అభ్యుదయ గేయం అంటారు

అర్ధాలు :

మారుతం – గాలి

చింత – భాద, దుఃఖం

స్థిరమైన – శాశ్వతమైన, నిలకడైన

మానసము – మనసు

క్రూరులు – చెడ్డవారు, దుర్మార్గులు

పర్యాయ పదాలు :

అభ్రములు, జలదరములు, మేఘములు

యుద్ధం, సమరం, పోరు

చుక్కలు, తారలు, నక్షత్రాలు

శోకం, దుఃఖం, ఏడుపు

నానార్ధాలు :

దిక్కు – దిశ, ఉపాయం, మార్గం

వర్షం – వాన, సంవత్సరం

నామం – పేరు, బొట్టు

వాహిని – నది, సైన్యం

లోకం – జగత్తు, చూపు, గుంపు

ప్రకృతి – వికృతి :

అగ్ని – అగ్గి

సింహం – సింగం

రాక్షసి – రక్కసి

కార్యము – కర్జము

మేఘము – మెయిలు

3. హరివిల్లు

ఉద్దేశ్యం :

మనిషికి ప్రకృతికి విడదీయరాని బంధం. ప్రకృతిని తరచి చూడడం మనిషి అలవాటు. ఉదయించే సూర్యుడు, రాలిపడే చినుకు, జల జల పారే నీరు, చిరుగాలి సవ్వడి, పూల పరిమళాలు, కిలకిలారావాలు, చిమ్మచీకటి, చల్లని వెన్నెల ఇలా ప్రతిదీ మనిషిని ఆకర్శించి ఆనందాశ్చర్యాలతో ఓలలాడిస్తుంది. ప్రకృతి అందాలకి పరవశించిన మనిషి మైమరిచిపోతాడు. ఆ తన్మయత్వంలో నుండి జరిగిన కావ్య సృష్టి ప్రకృతికి ప్రతిబింబం అవుతుంది. కవి తన మనసులో భావాలను అందంగా ఆకర్షణీయంగా చెప్పడమే వర్ణన. ఇది కవిలోని సృజనాత్మకతను వెలికి తీస్తుంది. ప్రకృతిలో అద్భుతాలు చూడడం అలవాటైతే మనిషి హృదయంలో సున్నితత్వం విరబుస్తుంది. మానవత్వం మొలకెత్తుతుంది. విచక్షణారహితంగా ప్రకృతిని ధ్వంసం చేసే ప్రవృత్తికి అడ్డుకట్ట పడుతుంది. రసార్ద్రరమైన కవి కలం లోనుంచి జాలువారిన భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ విధ్యార్ధులలో మానవీయత మేలుకొలపడం ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

మానవుడు కల్పనాశిల్పి. అతని సౌందర్య తృష్ణ వల్ల తన చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి పులకించి పునరవ్యక్తీకరించగలిగాడు. తన ఎద నుండి పాఠకుని ఎదకి చెరవేయడానికి సాహిత్యాన్ని హేతువుగా చేసుకున్నాడు కవి. నన్నయ్య మొదలుకుని నేటి వరకు కవులు తమ కావ్యాలతో ప్రకృతి వర్ణనలకే పెద్దపీట వేశారు. ప్రబంధాలలో వర్ణనలదే పై చేయి. వర్ణనలు రెండు రకాలు. స్వాభావిక వర్ణనలు, భావాత్మక వర్ణనలు. స్వాభావిక వర్ణనలలో వర్ణించే వస్తువు స్వరూప స్వభావాలు మాటల రూపంలో ఉంటే భావాత్మక వర్ణనలలో అలంకారాలతో కూడి ఉంటాయి. వివిధ సందర్భాలలో కవులు కధానుగుణంగా వర్ణించిన ప్రకృతి దృశ్యాలను పరిచయం చేయడంతో పాటు పద్య రచనా శైలిలో వైవిధ్యాలను పరిశీలించేందుకు అనువుగా ఈ పాఠం రూపొందింది.

ప్రక్రియ – వర్ణన :

రచనా ప్రక్రియ ఏదైనప్పటికి కవి చెప్పిన విషయం పాఠకుని మనసు తాకేదిగా ఉండాలి. అతనిలో భావసంచాలనాన్ని కలిగించాలి. కవి తన రచనతో పాఠకునికి లంకె వేసుకుని తనతో పాటూ నడిపించాలి. ఇందుకోసం కవి వివిధ పద ప్రయోగాలతో తన రచన రసాత్మకం చేస్తాడు. దీనిని వర్ణన అంటారు. విషయాన్ని కేవలం విషయంగా కాకుండా సరైన పోలీకలతో కలిపి వివరిస్తాడు. కావ్యాలలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. ప్రబంధాలు వర్ణనలకు పుట్టినిల్లు. భావ కవిత్వమయినా, అభ్యుదయ కవిత్వమయినా వర్ణనతోనే రచనకి భావాపుష్టి కలుగుతుంది.

అర్ధాలు :

భానుడు – సూర్యుడు

తాండవం – నృత్యం, నాట్యం

మిక్కిలి – అధికం, ఎక్కువ

తత్తరపాటు – కలవరపాటు, తొందరపాటు

కనుమరుగు అవ్వడం – కనబడకపోవడం, మాయమవడం

పర్యాయ పదాలు :

నభం – ఆకాశం, గగనం

ధనువు – ధనస్సు, చాపము, విల్లు, హరివిల్లు

పయోధరము – మేఘము, జలదరము, అంబుదం

కేదారం – పొలం, క్షేత్రం, వరిమడి

సస్యము – పంట, పైరు

వెల్లువ – ప్రవాహం

నెచ్చెలి – స్నేహితుడు, మిత్రుడు

నానార్ధాలు :

ధర – భూమి, వెల, రక్తనాళం

పంక్తి – వరుస, గుంపు

తారక – నక్షత్రం, కంటి గుడ్డు

చుక్క – నక్షత్రం, బిందువు

వ్యుత్పత్తి అర్ధాలు :

సూర్యుడు – వ్యాపారములందు జీవులను ప్రేరేపించువాడు – రవి

ధర – విశ్వమును ధరించినది – భూమి

తోయజము – తోయమందు (నీటి యందు) పుట్టినది – పద్మం

శైలము – శిలలు దీనియందు కలవు – పర్వతం

ప్రకృతి – వికృతి : 

సంధ్య – సందె

చంద్రుడు – చందురుడు

దిశ – దేస

ఆకాశం – ఆకసము

ముత్యము – ముత్తేము

మేఘము – మెయిలు

4. ఆత్మకధ

ఉద్దేశ్యం :

సామాజిక జీవితం సమస్యల వలయం. అందులో ఆటు పోట్లు ఉంటాయి. జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. తాము నమ్మిన జీవన సూత్రాలను అనుసరించి ఎదిగిన ఎందరో గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని వారి బాటలో నడిచి విజయ శిఖరాలు అధిరోహించిన వారిలో ఈ కవి ఒకడు. సమాజం అతని కృషిని గౌరవించి సమున్నతoగా సన్మానిస్తుంది. కానీ కవి ఆ సన్మానానికి పొంగిపోడు. గతంలో తన జాతి జనులకి జరిగిన అనేక అవమాన పరంపరలు అతని కళ్ల ముందు కదులుతూ ఉంటాయి. వాటి తాలూక దుఖం అతన్ని పట్టి భాదిస్తుంది. విద్య ద్వారానే వ్యక్తికి గౌరవం లభిస్తుంది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తాను ఎక్కడ నుండి వచ్చాడో గుర్తెరగాలి. తన మూలాలు మరువకూడదనే సత్యాన్ని తెలపడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశ్యం

నేపధ్యం :

స్వేచ్చ మానవ సహజాతం. వ్యక్తి తన స్వతంత్రానికి భంగం కలిగితే సహించడు. తన హక్కులను అణచవేయాలని ప్రయత్నిస్తే తిరగబడతాడు. పిల్లలు సైతం తమకి ఇష్టం లేకపోతే తల్లిపాలు తాగనంటారు. తల తిప్పుకుంటారు. ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. తనకి సాటి మనుషుల మధ్య గుర్తింపు కోరుకుంటాడు. సమాజంలో కొన్ని నిరంకుశ భావాలు, కట్టుబాట్లు మనిషి స్వేచ్చకీ సంకెళ్ళు వేస్తాయి. అతడు వాట్ని తెంచుకుని తనలో ఉన్న సృజనాత్మకత శక్తిని ప్రపంచానికి చాటుకుంటాడు. మనిషిలో మంచితనం మానవీయత ప్రపంచం గుర్తించి గౌరవిస్తుంది. అనేకానేక సమస్యలకు కుంగిపోక ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా జ్ఞాన శిఖరాలు అధిరోహించిన ఒకానొక కవి జీవితమే నేటి మన పాఠం

ప్రక్రియ – వచన కవిత :

ఈ పాఠం వచన కవిత అనే ప్రక్రియకి చెందినది. పద్య గేయాల్లో ఉండే ఛందో నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగే కవిత వచన కవిత. సరళమైన పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితముగా ఉండే కవిత వచన కవిత. రచయిత తాను చెప్పదలచుకున్న భావాన్ని సూటిగా స్పస్టంగా చెప్పడం వచన కవిత ప్రత్యేకత. ఆధునిక కవిత్వానికి కొత్త నెత్తురు ఎక్కించిన శ్రీ శ్రీ వచన కవితకి పట్టం కట్టారు. వారి బాటలో నడుస్తున్న ఆధునిక కవులందరు వచన కవితలోనే రచనలు చేస్తున్నారు.

అర్థాలు :

చౌరస్తా – కూడలి

అర్పణము – సమర్పించడం

చురకత్తులు – పదునైన కత్తులు

పర్యాయ పదాలు :

స్వర్ణం – బంగారం, పసిడి, హేమం, కనకం

సూర్యుడు – భాస్కరుడు, రవి, భానుడు, ఇనుడు

కళ్ళు – నేత్రాలు, నయనాలు, చక్షువులు

దేహం – తనువు, శరీరం, కాయం, మేను

నానార్థాలు :

తల – శిరస్సు, గుంపు, చోటు

కాలం – సమయం, మరణం, నలుపు

క్రియ – పని, చర్య

రామ – స్త్రీ, శ్రీరాముడు

ప్రకృతి – వికృతి :

బోజనము – బోనము

బ్రద్న – పొద్దు

కథ – కత

పుష్పం – పువ్వు

5. స్నేహం

ఉద్దేశ్యం :

విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అన్నారు గౌతమ బుద్ధుడు. మనిషికి అవసర కాలంలో ఆదుకున్న మిత్రుడు కన్నా ప్రియమైనది ఏది ఉండదు అన్నాడు గురునానక్. కష్టకాలంలో మనకి నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తుంది అన్నాడు గాంధీజీ. స్నేహం ప్రతి వ్యక్తి జీవితంలో మధురమైన అనుభూతిగా నిలుస్తుంది. ఆటపాటలు ఆడే వయసులో మొగ్గల ప్రారంభం అయ్యి మహావృక్షంలా ఎదిగి జీవితాంతం తోడుగా నిలుస్తుంది. కొందరితో స్నేహం మనల్ని అత్యున్నత శిఖరాలకి చేరిస్తే కొందరి స్నేహం అధః పాతాళానికి తొక్కేస్తుంది. ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది స్నేహం అయినప్పుడు మనం ఎలాంటి స్నేహం ఎంచుకోవాలి ఆ స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవో తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం

ప్రక్రియ – పద్యం :

సాహిత్య ప్రక్రియలో విశిస్టమైనది పద్యం. ఇది ఛందోబద్ధమైనది. లయాత్మకంగా, గాన యోగ్యముగా ఉంటుంది. ధారణకు అనువుగా ఉంటుంది. అందుకే మన ప్రాచీన కవులు మొదలు ఆధునిక కవుల వరకు పద్య రచనకి ప్రాధాన్యత ఇచ్చారు. కవి తన రచనలో భావ వ్యక్తీకరణకి అనువుగా కొన్ని ప్రత్యేక పద్య శైలులు ఎంచుకుంటాడు. ఉద్ధతికి విక్రీడిత పద్యాలు, సుకుమారతకు మాలా పద్యాలు, తాత్విక భావాలకు గీత పద్యాలు, పుష్పాపచయాది సందర్భాలకు రగడలు, పంచచామరాలు మొదలైన పద్య రీతులు కావ్యాలలో శోభిస్తాయి

అర్థాలు :

సంపద – ధనం

సౌధము – భవనము

తండులములు – అటుకులు

ప్రతిజ్ఞ – శపథం

సఖ్యత – స్నేహం

పర్యాయ పదాలు :

మిత్రులు, నేస్తాలు, స్నేహితులు

తల్పములు, శయ్యలు, పరుపులు

వసనములు, అంబరములు, వస్త్రాలు

ఉదకము, సలిలం, జలం

పత్రం, దళం, ఆకు

నానార్ధాలు :

విభుడు – ప్రభువు, శివుడు, బ్రహ్మ

కను – చూచు, వెదకు, జన్మనిచ్చి

దళం – ఆకు, భాగం, దండు

ఫలం – పండు, కార్యం, పరిణామం

వ్యుత్పత్తి అర్థాలు :

గురువు – అజ్ఞానం అనే అంధకారమును చేదించేవాడు – ఉపాధ్యాయుడు

మిత్రుడు – సర్వభుతాల పట్ల స్నేహభావం కలవాడు – సూర్యుడు

మోక్షం – జీవున్ని పాశం నుండి విడిపించేది – ముక్తి

పురంధ్రి – గృహాన్ని ధరించేది – ఇల్లాలు

అమృతం – మరణం లేనిది – సుధ

పదాలు – అర్థాలు :

బ్రహ్మానందం – అంతులేని ఆనందం

చక్రపాణి – చక్రము పాణి (చేయి) యందు కలవాడు

కుంభవృష్టి – కుంభం (కుండ) లతో కుమ్మరించినట్టు కురిసే వాన

తళతళలాడే – ప్రకాశించు

ప్రచండ వాయువు – తీవ్రమైన గాలి

ప్రకృతి – వికృతి :

కార్యము – కర్జము

గృహము – గీము

గౌరవం – గారవం

ధర్మము – దమ్మము

లక్ష్మి – లచ్చి

6. తీర్పు

ఉద్దేశ్యం :

బుద్ధుడు నడయాడిన భారతావని శాంతి, సహానాలకి పుట్టినిల్లు. పరోపకారం మనకి జీవనాడి. మనిషిగా జీవించడానికి కొన్ని విలువలు నియమ నిష్టాలు ఏర్పాటు చేసి దాన్ని మానవత్వం అన్నారు. మనిషి పురుషార్ధపరుడు కావాలి అంటారు పెద్దలు. ధర్మబద్ధంగా జీవితాలను కొనసాగిస్తూ జన్మ సాఫల్యం చేసుకోవాలన్నది దీని పరమ ఉద్దేశం. మనస్సు చంచలమైనది. చూచిన ప్రతీదీ తనకి కావాలని ప్రేరేపిస్తుంది. సాధనతో దీన్ని అదుపులో ఉంచుకోవాలి. కరుణ, సత్యం, ధర్మం, న్యాయం, భూతదయ, అహింస, క్షమాగుణం మొదలైన సాత్విక గుణాలను విధ్యార్ధులు అలవర్చుకుని ఉన్నతమైన జీవనం సాగిస్తూ మానవత్వం చాటుకోవాలని తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం.

నేపధ్యం :

ఒకరోజు సిద్ధార్ధుడు రాజకుమారులతో కలిసి వనవిహారానికి వెళ్ళాడు. సిద్ధార్ధుడు ప్రకృతి అందాన్ని సరోవరాలను పంటచేలను పశుకాపర్లను పశు పక్ష్యాదులను చూసి ఆనందిస్తున్నాడు. ఇంకో రాజకుమారుడు దేవదత్తుడు చేత ధనూర్భానాలు ధరించి జంతువుల వేటకి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో ఒక హంసల గుంపు క్రేంకారం చేస్తూ ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉండడాన్ని దేవదత్తుడు చూశాడు. బాణం సంధించి ఒక హంసను నేలకూల్చాడు. దీనిని చూసిన సిద్ధార్ధుడు మిక్కిలి వ్యధ చెంది ఆ హంసను రక్షించాడు. ఇది ఇద్దరి మధ్య వాదానికి దారి తీసింది. న్యాయం కోసం రాజస్థానానికి వెళ్లారు. చివరికి హంస ఇద్దరిలో ఎవరికి చెందిదో అనేది పాఠం ద్వారా తెలుస్తుంది

ప్రక్రియ – ఖండ కావ్యం :

చిన్న కధ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు గల రచన ఖండ కావ్యం. దీనిలో వ్యర్ధ పదాలకు, వర్ణనలకు అవకాశం ఉండదు. మహాకావ్యాల్లో రసవత్తరమైన ఘట్టాలను పాత్రలను చారిత్రక, దేశభక్తి సన్నివేశాలు మొదలైన వాటిని రమణీయంగా వ్యక్తీకరించడం దీని ప్రత్యేకత. దీనిలో పద్యాలు సంప్రదాయ వృత్తాలలో ఛందోబద్ధంగా ఉంటాయి.

అర్ధాలు :

అంకము – ఒడి 

వినుత్రోవ – ఆకాశ మార్గం

ఆస్య – ముఖం

మారాళము – హంస 

భాస్పములు – కన్నీళ్ళు

పర్యాయ పదాలు :

అంబరము – ఆకాశం, గగనం 

శరం – బాణం, అమ్ము

సరోవరం – సరస్సు, తటాకం

వాక్కులు – మాటలు, పలుకులు

కరములు – చేతులు, హస్తాలు

నానార్ధాలు :

శ్రీ – లక్ష్మీ, సంపద 

ఖగము – పక్షి, బాణం

మధు – తేనె, చైత్రం

ఘృతము – నెయ్యి, నీరు

సోమ – శ్రయము, పరాక్రమం

ప్రకృతి – వికృతి :

లక్ష్మీ – లచ్చీ

హంస – అంచ

న్యాయము – నాయము

రత్నము – రతనము

అంకము – అంకె

భీతి – బీతు

త్రోవ – తోవ

ప్రాణము – పానము

రాక్షసి – రక్కసి

సంతోషం – సంతసము

7. మాట మహిమ

ఉద్దేశ్యం :

నరం లేని నాలుక పరిపరివిధాల వదంతులు పుట్టిస్తుంది. దాని ఫలితంగా ధన, మాన, ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుంది. అవయవలన్నింటిలో ప్రధానమైనది మనకి గౌరవం తెచ్చి పెట్టేది నాలుక. విలువైన మాటలే బంధాలను స్నేహాలను పెంచుతాయి. వ్యక్తి సంస్కారానికి మాట గీటురాయి వంటిది. పెదవి దాటి వచ్చే మాటపై అదుపు, పొదుపు అవసరం. మాటతీరు బాగలేకపోతే ఎదురయ్యే కష్ట నష్టాలను తెలపడం, మాట విలువ తెలుసుకుని యోగ్యతతో కూడిన మాటలే మాట్లాడడం అలవరచుకునేలా చేయడం ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు. ఒక్కొక్కరి మాటతీరు ఒక్కోలా ఉంటుంది. కొందరి మాటలు ప్రేమని పంచితే, మరికొందరు మాటలు మనసు ముక్కలు చేస్తాయి. కొందరు మాటలు ధైర్యం నింపితే మరికొందరి మాటలు పిరికితనం నూరిపోస్తాయి. నాలుక అదుపులో ఉంచుకుని మాట్లాడే స్వభావం పెంపొందించుకోవడం ఎంత అవసరమో మోసపు మాటల మాయలో పడకుండా జగరుకతతో ఉండడం అంతే అవసరం

ప్రక్రియ – ఆధునిక పద్యం :

తెలుగు సాహిత్య ప్రక్రియలో విశిస్టమైన ప్రక్రియ పద్యం. పూర్వం సాహిత్య రచనలు అన్నీ పద్య ప్రక్రియలో జరిగేవి. పద్య ముఖ్య లక్షణం ఛందస్సు. పద్యాలలో వృత్తాలు, జాతులు, ఉపజాతులు ఉన్నాయి. ఆధునిక రచయితలపై కూడా ప్రాచీన పద్య ప్రభావం ఎంతైనా ఉంది. అందుకే ఆధునిక రచయితలు తమ భావాలను ప్రాచీన పద్య శైలిలో ఛందోబద్ధంగా రచించడం జరుగుతుంది. ఆధునిక పద్యంలో పద్యశైలి ప్రాచీన పద్య లక్షణాలతో ఉంటుంది. వస్తువు ఆధునికమైనది ఉంటుంది

అర్ధాలు :

పధమున – మార్గము 

మితము – కొద్దిగా

కులాలుడై – కుమ్మరివాడు

దుర్గుణాలు – చెడుగుణాలు

గరళం – విషం

పర్యాయ పదాలు :

నేస్తాలు, మిత్రులు

జిహ్వా – నాలుక, రసజ్ఞ

తిలకించు – చూచు, వీక్షించు

సిరి – లక్ష్మీ, సంపద

నానార్ధాలు :

పయనము – ప్రస్థానం, గమనం

అమృతము – సుధ, నెయ్యి

కాంచుట – చూచుట, పొందు

ప్రకృతి – వికృతి :

భాష – బాస

పుస్తకాలు – పొత్తములు

దూరము – దువ్వు

వర్ణం – వన్నె

హృదయం – ఎద

సహాయం – సాయం

జాతీయాలు :

కంకణం దాల్చు – కార్యం నెరవేర్చే శపధం పట్టడం

గిల్లి జోలబాడటం – మనిషి కింద మంట పెట్టి మీద నీళ్ళు చల్లడం

జుట్టు ముడిపెట్టడం – తగాదా పెట్టడం

వంట జీర్ణించుకోవడం – పూర్తిగా విషయం అవగాహన చేసుకోవడం

8. ఇల్లలకగానే

ఉద్దేశ్యం :

ప్రతి మనిషికి కొన్ని అభిరుచులు ఉంటాయి. ఆడవాళ్ళు పెళ్లవగానే ఇల్లు చక్కదిద్దడంలో లీనమైపోతారు. బరువు బాధ్యతలతో వంటింటి కుందేళ్ళు ఐపోతారు. ఇంటి పనుల్లో పడి కోరికలకు కళ్ళెం వేసుకుంటారు. అభిరుచులు ఆటకెక్కిస్తారు. భర్త, పిల్లలను చూసుకోవడం భాగ్యం అనుకుంటారు. చివరికి తమ అస్తిత్వం కోల్పోతారు. వివాహితకు కుటుంబం అండగా నిలిస్తే వారు విజయ బావుటా ఎగురవేస్తారు. స్త్రీల ఆత్మాభిమానం పెంపొందించుకోవాలి అని తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం

ప్రవేశిక :

వివాహం అయిన స్త్రీ తన చదువు, సృజనాత్మకత, నైపుణ్యాలు పక్కన పెట్టాల్సి వస్తుంది. యంత్రంలా పని చేస్తున్న క్రమంలో తనకో పేరు ఉంది అని మర్చిపోతుంది. ఇంటి పనిలో మునిగి స్వీయ చైతన్యం ఆత్మ గౌరవం కోల్పోవడంలో అనౌచిత్యాన్ని ఈ కధ ద్వారా తెలుసుకుందాం

ప్రక్రియ – కధ :

తెలుగు సాహిత్యంలో కధ ఒక ప్రధాన ప్రక్రియ. వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలు వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో గుండెకి హత్తుకునేలా చెప్పే వచన రచనే కధ. ప్రస్తుతం కధ, కధానిక అనే రెండు పదాలు ఒకే అర్ధంలో వాడుతున్నాం. ఎందరో రచయితలు తమ కధల ద్వారా తెలుగు సాహిత్యం పరిపుష్టం చేస్తున్నారు

అర్ధాలు :

నేర్పరి – నైపుణ్యం, ప్రావీణ్యం  

తీర్చి దిద్దిన – బాగుపరిచిన, రూపొందించిన

భుజం తట్టడం – ప్రోత్సహించడం, ప్రేరణ కలిగించడం

విధ్యార్జన – జ్ఞాన సంపాదన

పర్యాయ పదాలు :

గుర్తు – సంకేతం, జ్ఞాపకం, సంజ్ఞ

బట్టలు – వస్త్రాలు, వలములు, చెలములు

ఉత్తరాలు – జాబులు, లేఖలు

తపన – కోరిక, ఆశ, ఈప్పితం

ఇల్లాలు – భార్య, శ్రీమతి, సతి

ప్రకృతి – వికృతి :

తీరం – దారి

గౌరవం – గారవం

ప్రాణము – పానము

భాష – బాస

ఆశ్చర్యం – అచ్చెరువు

సామాన్య వాక్యాలు – సంయుక్త వాక్యాలు :

రాధ పాట పాడుతున్నది. రవి పాట పాడుతున్నాడు – రాధ, రవి పాట పాడుతున్నారు

సాందీపుడు గురువు. శ్రీకృష్ణుడు శిష్యుడు – సాందీపుడు, శ్రీకృష్ణుడు గురుశిష్యులు

రవి బజారుకి వెళ్ళాడు. రఘు బజారుకి వెళ్ళాడు – రవి, రఘు బజారుకి వెళ్లారు

భీముడు వీరుడు, అర్జునుడు వీరుడు – భీముడు, అర్జునుడు వీరులు

సామాన్య వాక్యాలు – సంశ్లిష్ట వాక్యాలు :

శైలజ నడుస్తున్నది. శైలజ పాట పాడుతున్నది – శైలజ నడుస్తూ పాట పాడుతున్నది

నెమలి వేగంగా వచ్చింది. నెమలి పాముని చూసింది – నెమలి వేగంగా వచ్చి పాముని చూసింది

నేను ఉదయాన్నే లేచాను, నేను వ్యాయామం చేశాను – నేను ఉదయాన్నే లేచి వ్యాయామం చేశాను

ఏనుగు తొండం ఎత్తింది, ఏనుగు ఘీంకరించింది – ఏనుగు తొండం ఎత్తి ఘీంకరించింది

9. రంగస్థలం

ఉద్దేశ్యం :

కళారూపాలు ఆస్వాదించే వారికి ఆనందం పంచుతాయి. మానవుడు సంఘ జీవనం మొదలు పెట్టిన నాటి నుండి మనోల్లాసం కలిగించే అనేక రకాల ఆటపాటలు జీవితంలో భాగం చేసుకున్నాడు. కాలక్రమంలో అవి కళారూపాలుగా రూపుదిద్దుకున్నాయి. హరికధ, బుర్రకధ, చిందు భాగవతం, యక్ష గానం మొదలైనవి అన్నీ ఈ కోవకి చెందినవే. అలాంటివాటిలో ఒకటైన నాటకం గురించి దాని ఔన్నత్యం గురించి వివరించడం ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

నాటకం ఒక కళారూపం మాత్రమే కాదు, ఒక గొప్ప సాహితీ ప్రక్రియ కూడా. ఎందరో లబ్ధ ప్రతీష్టులైన కవులు అనేక నాటకాలు రాశారు. నటీనటులు తమ అద్భుత నటనతో వాటికి దృశ్య రూపం కల్పించారు. అనేక నాటక సమాజాలు నాటకాలు ప్రదర్శిస్తూ వాటికి ఆదరణ కల్పించాయి. అత్యున్నత శిఖరాలు అధిరోహించిన నాటక రంగం సినిమా ప్రవేశంతో తన ప్రభావం కోల్పోయింది. కేవలం వినోదం పంచడంతో సరిపెట్టుకోకుండా సామాజిక సమస్యలు, సాంఘిక దురాచరాలని ఎత్తి చూపుతూ కొత్త పుంతలు తొక్కుతూ ఈనాటికీ తన ఉనికిని చాటుకుంటున్న నాటకం గురించి నేటి తరం తెలుసుకోవడం ఎంతో అవసరం

ప్రక్రియ – వ్యాసం :

ఒక విషయం గురించిన సమాచారం విశేషాలు పాఠకులకి అర్ధం అయ్యేలా సంగ్రహంగా రాసే ప్రక్రియను వ్యాసం అంటారు. వ్యాసానికి ఒక స్పష్టమైన ప్రారంభం, వివరణ, ముగింపు అనే లక్షణాలు ఉంటాయి. రచయిత విషయాన్ని కూలంకుశంగా పరిశీలించి అవసరం అయిన సమాచారం క్రోడీకరించి వ్యాసం రాస్తారు

నాటికలు – రచయితలు :

ఆత్మ వంచన – బుచ్చిబాబు

తేలుకుట్టిన దొంగలు – పొట్లూరి వేంకటేశ్వర రావు

కప్పలు – ఆత్రేయ

కంఠాభరణం – పానుగంటి

గృహప్రవేశం – మునిమాణిక్యం

సరిపడని సంగతులు – బళ్ళారి రాఘువ

సత్యం గారి ఇల్లు ఎక్కడ – గొల్లపూడి

అర్ధాలు :

కనుమరుగు – కనపడకపోవడం

హర్షధ్వనాలు – చప్పట్లు, కేరింతలు

నిత్యనూతనం – ఎల్లప్పుడూ కొత్తగా

సమ్మేళనం – కలయిక

ఆద్యంతం – మొదట నుండి చివర వరకు

పర్యాయ పదాలు :

స్త్రీలు, మహిళలు

గ్రామం, పల్లెటూరు

హాస్యం, నవ్వు

నృత్యం, నాట్యం

వీక్షకులు, ప్రేక్షకులు

నానార్ధాలు :

ఉల్లాసం – ఆనందం, ఉత్సాహం

చేరువ – దగ్గర, సాన్నిత్యం

నూతనం – కొత్త, వింత

కాలం – సమయం, మరణం, నలుపు

కృషి – ప్రయత్నం, వ్యవసాయం, పరిశ్రమ

10. ప్రియమైన నాన్నకు

ఉద్దేశ్యం :

మనిషి ప్రేమతో నిండిన ప్రేమకు పులకరిస్తాడు. ఆత్మీయంగా హత్తుకుంటే ఆనందిస్తాడు. ఆధునిక కాలంలో మనిషికి ఉరుకుల పరుగుల జీవనశైలి నిత్యకృత్యం అయింది. అమ్మ నాన్నలను అయిన వాళ్ళను ఆత్మీయులను పాలకరించుకుని మనసు విప్పి సుఖదుఃఖాలు పంచుకునే కాలమే నేడు కరువైంది. సాంకేతిక పరిజ్ఞానం మనిషిని యాంత్రికుని చేసి తన చుట్టూ తిప్పుకుంటుంది. ఈ నేపధ్యంలో మనసులో మాటలను మమతలను ఒకరినొకరు పంచుకునేలా చేయగల ఏకైక సాధనం ఉత్తరం. బాలలలో లేఖ రచన పట్ల ఆసక్తి పెంపొందించి కుటుంబ విలువలు కాపాడడం మానవ సంబంధాలు భాంధవ్యాలకు ప్రాణం పోయడమే ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

ఉత్తరం ద్వారా వాస్తవిక సంఘటనలు, అనుభవాలు, ఆలోచనలు ఆసక్తికరంగా వ్యక్తీకరించడం జరుగుతుంది. ఉత్తరం రాయడం ఒక కళ. మన అనుకున్నవారి బాగోగులు భావోద్వేగాలును ఉత్తరం రూపంలో అందుకుంటే కలిగే ఆనందానికి అవధులు ఉండవు. ఉత్తరం చదువుతుంటే రాసినవారు ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. ఆత్మీయ బంధం పెనవేసుకుంటుంది. అందుకే ఉత్తరం పదే పదే చదువుతూ గుండెకు హత్తుకుంటాం. పదిలంగా దాచుకుంటాం. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాలు అయిన వాట్సప్, మెయిల్ ఇలాంటి అనుభూతి ఇవ్వలేవు. ఆత్మీయతలు, ప్రేమనురాగాలు పెంపొందాలన్నా మనుషుల మధ్య దూరం తగ్గాలన్నా లేఖ అత్యుత్తమ సాధనం. పిల్లల ఎదుగుదల కోసం తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నిరంతరం తపించిన తండ్రిని తలచుకుంటూ ఒక కూతురు తండ్రికి రాసుకున్న ఉత్తరమే ఈ పాఠం

ప్రక్రియ – లేఖ :

తెలుగు సాహిత్యంలో లేఖా రచన ఒక అద్భుత ప్రక్రియ. వ్యక్తులు, సంస్థల మధ్య సమాచారం పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనమే లేఖ. లేఖల ద్వారా తమ భావాలు, అనుభవాలు, అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. కేవలం విషయ సమాచారమే కాకుండా ప్రముఖులు రాసిన లేఖల్లో సాహితీ విలువలు ఉంటాయి. అందువల్ల వచన రచనలో ఒక సాహిత్య ప్రక్రియగా లేఖను పేర్కొంటారు. ఎందరో రచయితలు లేఖల రూపంలో తన హృదయాన్ని ఆవిష్కరించారు. సంజీవ దేవ్ లేఖలు, నెహ్రూ లేఖలు, చలం లేఖలు, ఔరంగజేబు లేఖలు, అబ్రహం లింకన్ లేఖలు ఈ కోవకి చెందినవే. కొందరి లేఖలు ఆలోచింపజేస్తే మరికొందరి లేఖలు ఆనందింపజేస్తాయి. అందుకే లేఖలను చైతన్యానికి ప్రతీకలు అంటారు

అర్ధాలు :

ఉరకలు – పరిగెత్తడం, ప్రవహించడం

కరువు – దుర్భిక్షo, క్షామం   

స్మృతులు – జ్ఞాపకాలు

అస్తిత్వం – ఉనికి

పర్యాయ పదాలు :

ఎద, హృదయం

లేఖ, ఉత్తరం

జ్ఞాపకం, మననం

లేమి, వెలితి

ఆత్రుత, తొందర

పశువు, గొడ్డు

నానార్ధాలు :

భోగం – పాము పడగ, శుభం, కీర్తి,భోజనం, తపస్సు, భువనం, మరదలు (మేనమామ పుత్రిక)

ప్రకృతి – వికృతి :

కుమారుడు – కొమరుడు

శ్రీ – సిరి

పంక్తి – బంతి

క్షేమం – సేమము

ఆశ – ఆస

11. ఆశావాది

ఉద్దేశ్యం :

విధ్యార్జనకు పుట్టుపూర్వోత్తరాలు, ఆర్ధిక అసమానతలు అవరోధాలు కావు అని నిరూపించిన ధీశాలి ప్రకాశరావు. పట్టుదల, కృషి ఉంటే అక్షర సింహాసనం ఎక్కి సాహితీ సామ్రాజ్యం ఏలవచ్చు అని నిరూపించి చూపిన కార్యదక్షుడు. పద్య రచనలో పట్టు సాధించి కొందరికే పరిమితం అయిన అష్టావధాన ప్రక్రియలో రాణించడం ద్వారా అత్యున్నత పద్మ శ్రీ పురష్కారం అందుకుని నేటి తరానికి స్పూర్తి ప్రదాతగా నిలిచిన ఆ మహానీయుని సాహితీ జీవన ప్రస్థానం తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం.

ప్రక్రియ – ముఖాముఖి :

ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహనీయుల జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. మరెన్నో వెలుగునీడలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం ద్వారా మన జీవితం సుగమం చేసుకోవడానికి వీలు అవుతుంది. ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారం సేకరించడమే ముఖాముఖి. సేకరించిన సమాచారం ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా పాఠకులకు అందించడం జరుగుతుంది. ముఖాముఖి ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వం వారి అనుభవాలు, జీవిత విశేషాలను స్వయంగా వారి ద్వారా తెలుసుకునే వీలు ఉంటుంది

ప్రవేశిక :

సాహితీ వ్యవసాయంలో పద్య సేద్యం చేసిన ఓ భాషా పరిమళం, సుందర శబ్దాలతో అందమైన పద్యాలు అల్లిన ఓ అష్టవధాన రూపం ఆశావాది ప్రకాశరావు. నీదే కులం అని అడిగిన వారికి నాది కవికులం అని చాటిన కవితావాది ఆశావాది. అవధానం కొందరి సొత్తు. అది నీవెలా చేస్తావు ఆన్న అవహేళనలకు తన సాహిత్య పటిమతో సమాధానం ఇచ్చిన సౌజన్యమూర్తి. తెలుగు భాషకే సొంతం అయిన అవధాన ప్రక్రియలలో వారు అగ్రశ్రేణిలో నిలిచారు. తిరుపతి వెంకట కవులను ప్రేరణగా తీసుకుని సి వి సుబ్బన్న శతావధానిని గురువుగా నిలుపుకుని వారి సాహితీ ప్రస్థానం విశిష్ట పురష్కారాలకు వేదికైంది. అలనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారిచే బాలకవిగా పిలిపించుకుని మొన్నటి రాష్ట్రపతి రామనాధ్ కోవిoద్ చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న భాషాజీవి. ప్రస్తుత పాఠ్యభాగం ఆశావాది ప్రకాశరావు రచించిన “ప్రకాశ ప్రదీపనం” లోనిది

అర్ధాలు :

గోష్టి – చర్చ 

ఆశువు – అప్పటికి అప్పుడు చెప్పే కవిత్వం

పృచ్చకులు – అష్టవధానంలో ప్రశ్నించేవారు (8 మంది ఉంటారు)

పర్యాయ పదాలు :

నేత్రం – నయనం, కన్ను, అక్షి   

నాన్న – తండ్రి, జనకుడు

కౌముది – వెన్నెల, చంద్రిక

నానార్ధాలు :

కవి – కవిత్వం రాసేవాడు. నీటికాకి 

గురువు – ఉపాధ్యాయుడు, బృహస్పతి

కృషి – ప్రయత్నం, వ్యవసాయం

వ్యుత్పత్తి అర్ధాలు :

కృతులు –

పౌత్రుడు – పుత్రుని యొక్క పుత్రుడు 

ఆచార్యుడు – ధర్మ మార్గం ఆచరించి చూపువాడు

ప్రకృతి – వికృతి :

 దైవం – దయ్యం

కార్యం – కర్జము

పద్యం – పద్దెము

కీర్తి – కిరీతి

కవిత – కయిత

విజ్ఞానం – విన్నానం

అక్కరం – అక్షరం

సందియం – సందేహం

జాతీయాలు :

ఎత్తిపొడుపు – నిందించడం

కత్తి మీద సాము – చాలా దుర్లభం, కష్టతరం

తామరతంపర – కుప్పలు తెప్పలు, కోకొల్లాలు 

12. ఏ దేశమేగినా

ఉద్దేశ్యం :

తెలుగులో పద్యం, కధ, వచన కవిత మొదలైన ప్రక్రియలతో పాటు యాత్రా రచన కూడా ఒక సాహితీ ప్రక్రియ. దాని పట్ల విద్యార్ధులకు అవగాహన కలిగించడం, రచయిత్రి తన విదేశీ యాత్ర అనుభవాలను పరిచయం చేయడం, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలు తెలపడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.

నేపధ్యం :

“ఈనాడు ఊసుపోక ఊరికే తిరిగే లోక సంచారులు కాదు ప్రపంచానికి కావలసినది. తమ తిరుగుడుకి సార్ధకత కల్పించగల లోక సంచారులు కావాలి. అంటే దేశాలు తిరిగి తాము సంపాదించిన అనుభవాన్ని, చూసిన ప్రదేశాల వివరాల్ని ఏ కారణం వల్లనో దేశాలు తిరగలేక స్థిరవాసులయిన లక్షలాది మంది ప్రజలకు అందించగలిగి ఉండాలి లోకసంచారులు” అని లోకసంచారి అనే పుస్తకంలో ప్రముఖ చారిత్రక సాంస్కృతిక హిందీ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వెల్లడించారు

సరిగ్గా అలాంటి ఒక సదుద్దేశ్యంతో శ్రీమతి ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ గారు భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలు పర్యటించారు. ఆ పర్యటన సాగిన విధానం ఆమె పొందిన అనుభవాలు, విశేషాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం

ప్రక్రియ – యాత్రా రచన :

యాత్రికుడు తాను పొందిన యాత్రనుభవాలను గ్రంధస్థం చేయడం యాత్రా రచన. వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత గల దర్శించినపుడు అక్కడి విశేశాలను పొందిన అనుభూతిని అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా రాయడమే యాత్రా రచన.

నేటికీ ఏ తీర్ధ యాత్రకో, విహార యాత్రకో వెళ్ళి వచ్చిన వారు తమ స్నేహితులతో ఇరుగుపొరుగువారికో అక్కడ వింతలు, విశేషాలు కధలు కధలుగా చెప్పడం చూడవచ్చు. యాత్రా రచనలు చదువుతునప్పుడు పాఠకుడు తాను కూడా అక్కడ ఉన్నట్లు అనుభూతి చెందుతాడు. పిల్లలు కూడా తాము వెళ్ళిన ఊళ్ళ గురించి విజ్ఞాన యాత్రల గురించి యాత్రా రచన చేయడం అవసరం. ఇది తమ అనుభవాలకి అక్షర రూపం కల్పించడం

రచన – గ్రంధకర్త :

ఆటా జనికాంచె – ఎండ్లూరి సుధాకర్

ఇనుపతేరనెనుక – రావూరి భరద్వాజ

నవ భారతి – మాలతీ చందూర్

రష్యాలో స్నేహాయాత్ర – వసా ప్రభావతి

నేను చూసిన అమెరికా – అక్కినేని నాగేశ్వర రావు

కాశీ యాత్ర చరిత్ర – ఏనుగుల వీరాస్వామి

అర్ధాలు :

జోతలు – నమస్కారాలు

సమాగమం – కలయిక

సాధ్వి – పతివ్రత

కలగుండు – కలవరం

ఉత్కృష్టం – గొప్పగా

అధిరోహించిన – ఎక్కిన

పర్యాయ పదాలు :

జాబు, ఉత్తరం, లేఖలు

ఆదేశం, ఆజ్ఞ, అనుజ్ఞ

జ్ఞప్తి, స్మృతి, జ్ఞాపకం

ప్రకృతి – వికృతి :

దీపము – దివ్వె

మాణిక్యం – మానికం

యత్నం – జతనం

యాత్ర – జాతర

నిత్యం – నిచ్చెలు   

13. నా చదువు

ఉద్దేశ్యం :

విద్య వలన వినయం వినయం వలన పాత్రత కలుగుతుంది అనేది ఆర్ష వాక్యం. అంటే విద్య వ్యక్తి అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడుతుంది. విద్యాభ్యాసం కోసం ఎంతోమంది ఎన్ని ఆటంకాలు వచ్చిన ఎదురీది వివిధ ప్రయత్నాలు చేసి సఫలీకృతులయ్యారు. అలాగే కోరుకున్న రంగంలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. విద్యార్ధులకు అలాంటి వ్యక్తుల జీవిత విశేషాలు తెలిపి వారి బాటలో నడిచేలా చూడడం దేశాభివృద్ధికి పాటుపడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

తెలుగులో వచన కవిత్వానికి పట్టం కట్టిన ప్రముఖ రచయితలలో శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారు అగ్రగణ్యలు. ఆధునిక తెలుగు కధకి గురజాడ బీజం వేస్తే తరవాత శ్రీపాద వారు దానికి జవజీవాలు కల్పించారు. పద్య కవిత ప్రభావానికి ఎదురొడ్డి తెలుగు సాహిత్యాన్ని ఆధునిక వచన రచన వైపుకి చేయి పట్టి నడిపించిన వైతాళికుడు శ్రీపాద. వీరు చక్కని తెలుగుదనంతో గ్రామీణ నేపధ్యంతో కధలు, కావ్యాలు రాయడంలో సిద్ధహస్తులు. ఈయన తన చిన్నతనంలో చదువు సాగించిన తీరుకు ఒక ప్రత్యేకత ఉంది. నాడు తన విద్యాభ్యాసంలో ఎదురైన సమస్యలు వాటిని అధిగమించిన విధానం నేటి తరానికి మార్గదర్శకం. శ్రీపాద వారు తన చిన్ననాటి సామాజిక స్థితిగతులను అవకాశాలుగా మార్చుకుని రచయితగా కవిగా ఎదిగిన తీరు తన ఆత్మకధ “అనుభవాలు – జ్ఞాపకాలునూ” లో వివరించారు. అందులో తన బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలిపే నేపధ్యం లోనిది ఈ పాఠ్యాంశం.

ప్రక్రియ – ఆత్మకధ :

వ్యక్తి తన జీవిత అనుభవాలు, అభిప్రాయాలు కలబోసి తనకి తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకధ. తనకై తాను రాసుకున్న జీవిత చరిత్ర. అవి ఆత్మకధలే అయినా సామాజిక జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ఇది ఉత్తమ పురుష కధనంలో ఉంటుంది. ఆత్మకధలు చదవడం ద్వారా పాఠకుడు రచయితతో కలిసి పయనిస్తున్నట్లు అనుభూతి చెందుతాడు. అందుచేత ఎన్ని ఆత్మకధలు, జీవిత చరిత్రలు చదివితే అన్నీ జీవితాలను ఏకకాలంలో జీవించినవారమవుతాము అంటారు.

ఆత్మకధలు :

సత్య శోధన – మహాత్మా గాంధీ

నేను – నా దేశం – దరిశి చెంచయ్య

నా ఎరుక – అధిబట్ల నారాయణదాసు

పింజారి – షేక్ నాజర్

హంపి నుండి హరప్పా దాకా – తిరుమల రామచంద్ర

నా జీవిత యాత్ర – టంగుటూరి ప్రకాశం పంతులు

నా గొడవ – కాళోజీ నారాయణరావు

నా అంతరంగ కధనం – బుచ్చిబాబు

సాలగ్రామం – కపిలవాయి లింగమూర్తి

అర్ధాలు :

సఫలం – విజయవంతం

ప్రాప్యo – పొందదగినది

పారంగతుడు – నిష్ణాతుడు

ప్రవర్తన – నడవడిక

దీక్షాపరుడు – అనుకున్న కార్యం నెరవేర్చేవాడు

ఉడాయించడం – వెళ్ళిపోవడం

పర్యాయ పదాలు :

మార్గం, తోవ, దారి

రహస్యం, గుట్టు, మర్మం

గూడు, గృహం, సదనం, ఆవాసం

సీమ, ప్రాంతం, ప్రదేశం

మహిళ, వనిత, స్త్రీ

నానార్ధాలు :

పూనిక – యత్నం, సన్నాహం 

నిర్మాణం – ఆకృతి, కల్పన

దృక్పధం – అభిప్రాయం, మార్గం

పాదు – కుదురు, ఆవాసం

సుతరాం – ఏమాత్రం, కొంచెమైనా

ప్రకృతి – వికృతి :

విద్య – విద్దె

దేవళం – దేవాలయం

వీది – వీధి

నిదుర – నిద్ర 

చట్టం – శాస్త్రం

రాతిరి – రాత్రి

దిస్టి – దృష్టి 

14. ఆకుపచ్చశోకం

ఉద్దేశ్యం :

భూగోళం మీద జీవకోటికి ప్రాణవాయువు ఇచ్చి పచ్చదనం పెంచేవి చెట్లు. నాగరికత పేరుతో మనిషి ప్రకృతిని విచక్షణ లేకుండా కొల్లగొడుతున్నాడు. అవసరాన్ని మించి అడవులు ధ్వంసం చేస్తున్నాడు. ప్లాస్టిక్ భూతం ఒక వైపు అడవుల నరికివేత మరోవైపు పర్యావరణాన్ని ప్రమాదంలో పెడుతున్నాయి. ఈ ప్రమాదం గుర్తెరిగి పర్యావరణం కాపాడవలసిన అవసరం గూర్చి తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం.

ప్రక్రియ – పర్యావరణ కవిత్వం :

తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతికి పర్యావరణానికి కలుగుతున్న హానిని దానివల్ల కలిగే పర్యవసానాలను తెలపడమే పర్యావరణ కవిత్వం ఉద్దేశ్యం. పర్యావరణ భావనలను రచయిత కవిత రూపంలో వ్యాసరూపంలో వ్యక్తీకరిస్తారు. అందువల్ల దీనిని కవితా వ్యాసం అంటారు

అర్ధాలు :

హరితం – పచ్చదనం 

ఉపద్రవం – ప్రమాదం

బాహువులు – చేతులు

ఛాయ – నీడ

గరళం – విషం

పర్యాయ పదాలు :

చెట్లు – తరువులు, భుజములు

ముస్తాబు – అలంకరణ, అందంగా తయారు చేయడం

జాడ – గుర్తు, ఆనవాలు

తాపం – వేడి, ఉష్ణం, సెగ

సముద్రం – పయోధి, జలది

నానార్ధాలు :

ఎండ – వెలుగు, అతపం

కాలం – సమయం, నలుపు

కాయం – శరీరం, గురి, స్వభావం

జాడ – విధం, ఆచూకి, దారి

దాహం – దప్పిక, కాలడం

ప్రకృతి – వికృతి :

మనిషి – మానిసి

పట్టణం – పత్తనం

సముద్రం – సంద్రం

ఛాయ – చాయ

కధ – కత

జాతీయాలు :

పానకంలో పుడక – సందర్భానికి సంబంధం లేకుండా ఆటంకం కలిగించడం  

తామరతంపరగా – తొందరగా విస్తరించడం

కూర్చున్న కొమ్మను నరుక్కోవడం – ఆశ్రయం ఇచ్చిన వారినే చెడగొట్టడం

నిమ్మకు నీరెత్తినట్లు – ఎలాంటి సమస్య ఉన్నా నిబ్బరంగా ఉండడం

నడుం కట్టాలి – ఒక పని పూర్తి చేయడానికి పూర్తిగా సంసిద్ధం చేయడం

AP DSC 2024 Telugu Content | Class 10 | Best notes

AP DSC 2024 Telugu Content | Class 10 | Best notes

10th తెలుగు 

Title

AP DSC 2024 Telugu Content | Class 10 | Best Notes – AP & TS TET & DSC

1. మాతృభావన

పాఠ్యభాగ నేపధ్యం :

కళ్యాణి దుర్గం జయించిన తర్వాత అబ్బాజి సోన్ దేవుడు విజయోత్సాహంతో శివాజీ వద్దకి వస్తాడు. సోన్ దేవుడు శివాజీతో దేవా మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి దాని సర్దారులని పట్టి తెచ్చి సర్వస్వాన్ని రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చాను అని మనవి  చేశాడు. ఇది విన్న శివాజీ పరస్త్రీలు తల్లులతో సమానం అని చెప్పి ఆమెకి అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ ఇలా చేయడం తగదని హితవు పలికిన సందర్భం లోది

పాఠ్యభాగ వివరాలు :

ఈ పాఠం చారిత్రక కావ్య ప్రక్రియకి చెందినది. చరిత్ర ఆధారంగా రచించిన కావ్యం. డా. గడియారం వెంకటశేష శాస్త్రి రచించిన శివభారతం తృతీయాశ్వాసం లోనిది

పర్యాయ పదాలు :

ఆజ్ఞ – ఆదేశము, ఆన, ఉత్తరువు, నిర్దేశము

కన్ను – అక్షి, చక్షువు, నేత్రము, నయనము

అనలము – అగ్ని, వహ్ని, జ్వలనము

సతి – మగువ, కొమ్మ, ఇంతి, పడతి

ప్రకృతి – వికృతి :

రాజ్ఞి – రాణి

ఆజ్ఞ – ఆన

ఛాయ – చాయ

రత్నము – రతనము

భక్తి – బత్తి

గౌరవము – గారవము

పుణ్యము – పున్నెం

రాశి – రాసి

అంబ – అమ్మ

దోషము – దోసము

బ్రహ్మ – బమ్మ

జ్యోతి – జోతి

గృహము – గీము

భాగ్యము – బగ్గేము

వ్యుత్పత్తి అర్ధాలు :

శివుడు – సాధువుల హృదయాన సయనించి ఉండువాడు, మంగళకరుడు – ఈశ్వరుడు 

పతివ్రత – పతిని సేవించుటయే వ్రతముగా కలది – సాధ్వి

పురంధ్రి – గృహమును ధరించునది – గృహిణి

అంగన – చక్కని అవయవముల అమరిక కలది – అందగత్తె

నానార్ధాలు :

వాసము – ఇల్లు, వస్త్రము

సూత్రము – నూలిపోగు, తీగె

చరణము – పాదము, కిరణము, పద్య పాదము

హరి – యముడు, సింహము, ఇంద్రుడు

రత్నము – మణి, స్త్రీ, ముంత

AP DSC 2024 Telugu Content | Class 10 | Best Notes – AP & TS TET & DSC

2. జానపదుని జాబు

ఉద్దేశ్యం :

భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. అందువల్ల భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అంటారు. గ్రామంలో ప్రతి  ఇల్లు విద్యాగంధంతో గుబాళించి అభివృద్ధి చెందితే మనదేశం సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంటుంది అని మహాత్మా గాంధీ అన్నారు. గ్రామాలు ఎలా ఉన్నాయి? వారి జీవితాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలు వివరిస్తూ గ్రామాల్లో పేదలు, దళితుల జీవితాలు చిత్రిస్తూ పల్లెటూరి లేఖలు పేరుతో 1932 లో జనవాణి పత్రికలో, 1933 లో జానపదుని జాబు పేరుతో ప్రజామిత్ర పత్రికలో బోయి భీమన్న ప్రచురించారు. చదువుకుని బీదతనం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరి పనుల్లో మునిగిపోయిన జనపదుడు పట్నంలో శ్రీమంతుడు అయిన తన మిత్రునికి తన అవస్థలను గ్రామాల్లో పరిస్థితులను లేఖల రూపంలో రాస్తాడు. గ్రామ పరిస్థితులు తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం.

పాఠ్యభాగ వివరాలు :

ప్రస్తుత పాఠం లేఖల రూపంలో ఉంది. జానపదుని జాబులు పేరుతో బోయి భీమన్న రాసిన లేఖల సంపుటి నుండి పాఠం ఎంపిక చేశారు. తూర్పు గోదావరి జిల్లా యాసలో లేఖ రచన సాగింది

పదాలు వివరణ :

పురిటి లోనే సంధి కొట్టడం – ప్రారంభంలో పాడైపోయిన పని గురించి వివరించడం

కలుపుదీయడం – సమాజంలో ఉంటూ సమాజాన్ని పాడు చేసే వారిని నివారించడం

గ్రామోద్దరణం – గ్రామ సమస్యలు పరిష్కరించడం (గ్రామోద్దరణమే దేశోద్ధారణం – గాంధీ)

ఉన్నదంతా ఊడ్చుకుపోవడం – పూర్తిగా నాశనం కావడం

3. వెన్నెల

నేపధ్యం :

హిరణ్యకశిపుడు వనవిహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును సాయం సమయాన్ని చంద్రోదయాన్ని కవి వర్ణించాడు. రోజంతా తీవ్ర ఎండ ప్రసరింపజేసిన సూర్యుడు ఇంకా ఉష్ణ తాపం పెంచితే అసుర నాయకుడైన హిరణ్యకశిపుడు సహింపడేమో అన్నట్లు నెమ్మదిగా పక్కకి తొలగిపోయాడు. తదనంతరం ప్రకృతిలో వచ్చే మార్పులు రమణీయంగా వర్ణించారు

పాఠ్యభాగ వివరాలు :

ఈ పాఠం కావ్య ప్రక్రియకి చెందినది. కావ్యం వర్ణన ప్రధానంగా సాగుతుంది. ప్రస్తుత పాఠం ఎర్రన నృసింహ పురాణం తృతీయాశ్వాసం లోనిది

అర్ధాలు :

స్మితకాంతి – నవ్వుల వెలుగు

దివి – ఆకాశం

మిక్కుటం – ఎక్కువ

రజనీకరబింబం – చంద్రబింబం

నానార్ధాలు :

వెల్లి – ప్రవాహము, పరంపర

కుండలి – పాము, నెమలి, వరుణుడు

నిట్టవోడుచు – ఉప్పొంగు, రోమాంచితమగు, విజృంబించు

పర్యాయ పదాలు :

చాడ్పు – పగది, విధము, వలె

వెల్లి – ప్రోతస్సు, వెల్లువ, ప్రవాహం

కైరవము – తెల్లకలువ, కుముదము, గార్ధబము, చంద్రకాంతము, శృకము, సోమబంధువు

కౌముది – వెన్నెల, జ్యోత్స్న, చంద్రిక

చంద్రుడు – శశి, నెలవంక, అబరి

తమస్సు – చీకటి, ధ్వంతము, తిమిరము 

ప్రకృతి – వికృతి :

సంధ్య – సంజ

దిశ – దెస

ధర్మము – దమ్మము

రాత్రి – రేయి, రాతిరి

నిశ – నిసి

గర్వము – గరువము

యత్నము – జతనము

దిశ – దెస

చంద్రుడు – చందురుడు

4. ధన్యుడు

ఉద్దేశ్యం :

మంచి మిత్రుల కలయిక మన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది. అందుకే ఎప్పుడు సన్మిత్రులను పొందాలని పెద్దవాళ్ళు చెప్తారు. సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిది అని చెప్పడం పాఠం ఉద్దేశ్యం

పాఠ్యభాగ వివరాలు :

ఈ పాఠం కధా ప్రక్రియకి చెందినది. సంస్కృతంలో విష్ణు శర్మ పంచతంత్రం విశ్వవిఖ్యాతి గాంచింది. దానిని అనుసరించి అనేక గ్రంధాలు వచ్చాయి. వాటిలో లక్ష్మీనారాయణ పండితుడు యొక్క హితోపదేశం ఒకటి. ఆది ఆధారంగా చిన్నయసూరి నీతిచంద్రిక తెలుగులో రచించాడు. ఇది గ్రాంధిక వచనంలో సాగుతుంది. పశుపక్ష్యాదులే పాత్రలుగా లోకరీతిని, నీతిని ప్రభోదిస్తూ కధనాలు సాగుతాయి. ప్రస్తుత పాఠ్యాంశం నీతిచంద్రికలో మిత్రలాభం నుండి గ్రహించినది.

పదాలు – అర్ధాలు :

బుద్ధిహీనత వల్ల సమస్త కార్యాలు నిదాఘ నదీపురములట్లు వినాశము నొందును

     నిదాఘము అనగా వేసవి కాలం. నదీ పురములు అంటే నది నీటి ప్రవహాలు. నిదాఘ నదీపురములు అంటే మండు వేసవిలో నదులలో నీటి ప్రవహాలు

ధనమున బాసిన క్షణముననే లాతివాడగును

     ధనం పోతే ఎవరూ పలకరించరు. పరిచయం లేనట్లు ఉంటారు. అందరికీ పరాయివాడు(లాతివాడు) అవుతాడు

పరాధనాపహరణము కంటే దిరియుట మంచిది

     పరధనం దొంగలించడం మంచిది కాదు. అంతకంటే యాచించడం మంచిది

ఉదరమనుకయి పరుల గోజక ప్రాప్తలాభమునకు సంతోషించు వాడొక్కడు లోకమందు ధన్యుడు

     మనం జీవించడం కోసం ఇతరులను పీడించకూడదు. దొరికిన దానితో సంతృప్తి పడుతూ ఆనందంగా జీవించేవాడు ధన్యుడు

ప్రకృతి – వికృతి :

బోజనము – బోనము

శబ్దము – సద్దు

కార్యము – కర్షము

గృహము – గీము

గౌరవము – గారవము

శాస్త్రము – చట్టము

ధర్మము – దమ్మము

సంతోషం – సంతసం

వ్యుత్పత్తి అర్ధాలు :

పుత్రుడు – పున్నామ నరకం నుండి రక్షించువాడు 

దేహి – దేహాన్ని ధరించువాడు

ఈశ్వరుడు – ఐశ్వర్యం ఉన్నవాడు

మూషికము – అన్నాదులను దొంగలించేది

నానార్ధాలు :

వివరము – వివరణము, దూషణము

వనము – అడవి, నీరు, గుంపు

ఫలము – పండు, ప్రయోజనం, సంతానం

అమృతము – సోమరసము, వసనాభి, పరబ్రహ్మము

పర్యాయ పదాలు :

జంతువు – పశువు, జింక, అన్వేషణము

మూర్ధము – పుస్తకం, శీర్షము, ఉత్తమంగం

బలము – అంబ, బిరుదు, సత్తువ

వివరము – రంధ్రము, బిలము, కలుగు 

5. శతక మధురిమ

ఉద్దేశ్యం :

శతకాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి. భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాలలో నైతిక విలువలు తెలపడమే పాఠం ఉద్దేశ్యం

పాఠ్యభాగ వివరాలు :

శతక పద్యాలలో మకుటం ప్రధానమైనది. ఈ పద్యాలలో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు. అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది.

పద్యాలు :

నీరము తప్తలోహమున ——————- సుత్తము గోల్చువారికిన్ – ఉత్పలమాల – ఏనుగు లక్ష్మణ కవి

కరిరాజున్ బిసతంతు ——————– సుధా ధారా నుకరోక్తులన్ – మత్తెబం – ఏనుగు లక్ష్మణ కవి

పట్టుగ నీశ్వరు౦డు ———————–దరిగొండ నృసింహ దాయాపయోనిధి – ఉత్పలమాల – వెంగమాంబ

తన దేశంబు —————————– భక్త చింతామణీ – మత్తెబం – వడ్డాది సుబ్బరాయ కవి

ఉరుగుణవంతు ————————– వెన్న భాస్కరా – చంపకమాల – మారద వెంకయ్య

స్థిరతర ధర్మవర్తన ————————- కొరంత భాస్కరా – చంపకమాల – మారద వెంకయ్య

చిక్కని పాలపై ————————— కరుణాపయోనిధీ – ఉత్పలమాల – కంచర్ల గోపన్న

జాతుల్సెప్పుట ————————– శ్రీకాళహస్తీశ్వర – శార్దూలం – ధూర్జటి 

వరదైన చేను ————————– బెట్టకు సుమతి – కందం – బద్దెన   

పదజాలం :

ఉత్తములు – గొప్పవారు

ముష్కరుడు – దుష్టుడు

లాలన – బుజ్జగించడం 

ఘనత – గొప్పతనం

మర్మము – రహస్యం

వ్యుత్పత్యర్ధాలు :

భాస్కరుడు – కాంతిని కలుగజేయువాడు – సూర్యుడు 

పయోనిధి – దీనియందు నీరు నిలిచి ఉంటుంది – సముద్రం

దాశరధి – దశరధుని యొక్క కుమారుడు – రాముడు

పర్యాయ పదాలు :

ఈశ్వరుడు – శివుడు, శంకరుడు

లక్ష్మీ – కమల, హరిప్రియ, పద్మ, ఇందిర

దేహం – శరీరం, కాయము, గాత్రము

నీరము – జలము, ఉదకము, పానీయము

పయోనిధి – సముద్రం, కడలి, సాగరము

ప్రకృతి – వికృతి :

మూర్ఖులు – మొరకులు

శ్రీ – సిరి

న్యాయము – నాయము  

6. మా ప్రయత్నం

ఉద్దేశ్యం :

ఒక పుస్తకం తాత్వికతను, అంతస్సారాన్ని, ఆశయాల్ని, శ్రమను తెలిపేది ముందుమాట. ముందుమాట వల్ల పుస్తకం చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. మంచి పుస్తకం ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుస్తుంది. అలాంటి ముందుమాట పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశ్యం

పాఠ్యభాగ వివరాలు :

ఒక గ్రంధాన్ని, ఆ గ్రంధ నేపద్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంధ రచయిత గాని వేరే రచయిత, విమర్శకుడుగానీ రాసే పరిశీలనాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. దీనికి ముందుమాట, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లు కలవు. మహిళావరణం అనే పుస్తకంలో ముందుమాట ప్రస్తుత పాఠ్యాంశం

పర్యాయ పదాలు :

స్త్రీ – పడతి, వనిత, ముదిత

పద్ధతి – విధానం, కరణి, చందము

స్మరణ – జ్ఞప్తి, గుర్తు, తలపు

జాతీయాలు :

గుండెలు బరువెక్కడం – విపరీతమైన మానసిక భాద కలగడం

నీరు కారిపోవడం – పాడైపోవడం, నిరుత్సాహపడడం, ఆశలు అడుగంటిపోవడం

కనువిప్పు – జ్ఞానం కలగడం

కాలధర్మం చెందడం – మరణించడం

తునాతునకలు – ముక్కలు ముక్కలవడం, పూర్తిగా దెబ్బ తినడం

పదాలు – వివరణ :

సామాజిక మార్పు – సమాజంలో కలిగే మార్పు

విజయోత్సవం – విజయం లభించినందుకు చేసుకునే పండగ

సామాజికాభివృద్ది – సమాజపరమైన అభివృద్ధి

సాంస్కృతిక వారసత్వం – సంస్కృతికి సంబందించిన వాటి కొనసాగింపు

అగ్రతాంబూలం – ఒక రంగానికి, గ్రామానికి లేదా సమాజంలో ఉన్నతునిగా గుర్తించడం  

7. సముద్ర లంఘనం

పాఠ్యాంశ నేపధ్యం :

సీతాన్వేషణలో రామలక్ష్మణులు కిష్కింద చేరుకుంటారు. సుగ్రీవునితో స్నేహం చేస్తారు. సుగ్రీవుడు సీతని వెతకడానికి వానర సైన్యాన్ని నఊగు దిక్కులు పంపుతాడు. అంజనేయుని బృందం దక్షిణ దిక్కుకి వెళుతుంది. జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు మహేంద్రగిరి నుండి సముద్ర లంఘనానికి సిద్ధం అవుతాడు. ప్రస్తుత పాఠ్యభాగం అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాబ్యూదయం అనే ప్రబంధం ఆరవ ఆశ్వాసం లోనిది

పాఠ్యభాగ వివరాలు :

వర్ణనా ప్రధానమైన కావ్యాలు ప్రబంధాలు. శ్రీకృష్ణ దేవరాయలు (16 వ శతాబ్దం) కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగం అంటారు. పురాణ ఇతిహాసల నుండి చిన్న కధ తీసుకుని వర్ణనలు కలిపి పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే దాన్ని ప్రబంధం అంటారు. వీటిలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి

సమానార్ధ పదాలు :

కొండ కొమ్మున – కూటాగ్రము  

వివరము – రంధ్రము

నభము – ఉప్పరము, ఆకాశం

ప్రకృతి – వికృతి :

సముద్రం – సంద్రం 

దిశ – దెస

గొనములు – గుణములు 

నిముసము – నిమిషం

అగ్గి – అగ్ని

వ్యుత్పత్తి అర్ధాలు :

కార్ముకం – కర్మకారునిచే చేయబడినది

అమరులు – మరణం లేనివారు

ఉదది – ఉదకము దీనియందు ధరించబడును

ప్రభంజనం – వృక్ష శాఖాదులను విరగగొట్టేది 

దానవులు – దనువు అనే స్త్రీ యందు పుట్టినవారు

కేసరి – జూలు కలిగినది

ధరాధరం – ధరను ధరించునది

పారావారాం – అపారమైన తీరం కలది

8. మాణిక్య వీణ

పాఠ్యాంశ ఉద్దేశ్యం :

ఆంధ్ర ప్రభ వార్తాపత్రికలో విద్వాన్ విశ్వం మాణిక్య వీణ శీర్షికన వ్యాసాలు కవితలు రచించారు. మాణిక్య వీణలో వీరు స్వీకరించని అంశం లేదని చెప్పవచ్చు. మానవ జీవన ప్రస్థానంతో కళ, కవిత్వం పెనవేసుకున్నాయి అని మనిషి నిరంతర జ్ఞాన అన్వేషి అని ఈ కవిత తెలుపుతుంది. మాణిక్య వీణను మీటి మానవీయ రాగాన్ని పలికించిన ఈ కవిత చారిత్రక ఘట్టాలని తరచి చూపి మనిషి శాశ్వతత్వాన్ని చూపుతుంది

సాంకేతిక రంగంలో అభివృద్ధి మాత్రమే అభివృద్ధి అనుకుంటూ కళలను సాహిత్యాన్ని ఉపేక్షిస్తుంది నేటితరం. మానవజీవితంతో ముడి వేసుకున్న కళలు సాహిత్యం అనాదిగా సంక్రమించిన ఆస్తి అని తెలుపుతూ విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడు అవుతాడాని తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం

పాఠ్యభాగ వివరాలు :

వచన కవిత అనే సాహిత్య ప్రక్రియ ఈ పాఠం. పద్య, గేయాల్లో ఉండే చందస్సుతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో రాసే కవిత వచన కవిత. చిన్న చిన్న పదాలు వాక్యాలతో ధ్వని గర్భితముగా ఉండే కవిత వచన కవిత. ఈ పాఠం విద్వాన్ విశ్వం రచనా సంపుటి లోది

అర్ధాలు :

రోదసీ – అంతరిక్షం

ఆయత్తమవుతున్నారు – సిద్ధపడుతున్నారు 

రుగ్మత – రోగం

కళవలపడడం – కలవర పడడం

ఒకరిని చూసి మరొకరు చేయడం – అనుకరించడం

పని చేయడానికి సిద్ధం అవ్వడం – ఆయత్తమవడం

అద్భుతంగా నాట్యమాడడం – తాండవమాడడం

పనిని మొదలుపెట్టడం – తిన్నగా ఎదగడం

జాతీయాలు :

మంత్రాలకి చింతకాయలు రాలడం – పని చేయకుండా కబుర్లు చెప్తే ప్రయోజనం లేదని చెప్పడం

మిన్నందుకోవడం – చాలా అభివృద్ధి చెందడం

గజ్జె కట్టడం – పనిలో చురుకుగా పాల్గొని అన్నీ తానై చేసేవారిని గూర్చి చెప్పడం

పర్యాయ పదాలు :

మిన్ను – ఆకాశం, నింగి

తాండవం – నాట్యం, నృత్యం

రుగ్మత – రోగం, జబ్బు

జ్ఞానం – తెలివి, మేధ

ప్రకృతి – వికృతి :

భాష – బాస

కవితలు – కైతలు

విజ్ఞానము – విన్నాణము

గుహ – గొబ

9. గోరంత దీపాలు

నేపధ్యం :

సమాజంలో ఎంతో మంది అనాధ బాలలను మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి పిల్లల కనీస అవసరాలు అయిన తిండి, బట్ట, చదువు మొదలైనవాటికి నోచుకోకుండా ఉంటారు. అనాధ బాలలను చేరదీసి వారి ఆకలి తీర్చి విద్యా బుద్ధులు చెప్పిస్తే వీరు కూడా మట్టిలో మాణిక్యాలలా వెలుగొందుతారు. సమాజానికి సేవ చేసే గొప్ప మనసున్న వ్యక్తులు తమ ఆస్తిపాస్తులలో సంబంధం లేకుండా అనాధాలను చేరదీసి చదివించేవారు ఎంతో మంది ఉన్నారు. అటువంటి ఒక వ్యక్తి చేసిన పనే ఈ కధ.

ఉద్దేశ్యం :

రైలు ప్రయాణంలో తటస్థ పడిన ఓ బాలుడిని చేరదీసి విద్యా బుద్ధులు చెప్పిస్తే ఎదిగిన ఆ వ్యక్తి చూపే కృతజ్ఞతా భావం వాళ్ళ మధ్య ఉండే మానవ సంబంధాలను తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం.

పాఠ్యభాగ వివరాలు :

ఈ పాఠ్యభాగం కధానిక ప్రక్రియకు చెందినది. ఇది మానవ సంబంధాలు, సామాజిక సేవ ఇతివృత్తంతో కళ్ళకు కట్టినట్లు మనోభావాలను పలికించేలా ఉంటుంది. ఈ పాఠం పులికంటి వారి కధా వాహిని లోనిది

అర్ధాలు :

సంజవెలుగు – సంధ్యా సమయంలో వెలువడే కాంతి

ఆశీర్వాదం – దీవెన

తదేకంగా – ఒకటే పనిగా అన్నట్లు

కాలక్షేపం – సమయం గడపడం

పులుము – పూసు

ఆకళింపు – అవగాహన

నానార్ధాలు :

రాజు – ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు

సమయం – బుద్ధి, సంకేతం, ప్రతిజ్ఞ

కృషి – స్త్రీ, సేద్యం, కరిసనము

కన్ను – ఏరు, వలిపము, తీరు

కొమ్మ – శాఖ, ఆడది, కోటకొమ్మ

ఆశ – దిక్కు, కోరిక

పర్యాయ పదాలు :

పక్షి – నీడజము, ద్విజము, పతగము

నేత్రం – అక్షి, చక్షువు, నయనం

శిరస్సు – తలకాయ, నెత్తి, మస్తకం

సూర్యుడు – అహిమకరుడు, భానుడు, భాస్కరుడు

చెట్టు – తరువు, భూరుట్టు, వృక్షం

కొండ – ఆచలము, శైల్యము, ఆహార్యము

వ్యుత్పత్తి అర్ధాలు :

అతిధి – తిధి, వార, నక్షత్ర నియమం లేకుండా ఇంటికి బోజనముకి వచ్చేవాడు

అక్షరము – నాశనము పొందనిది (వర్ణము)

పక్షి – పక్షములు కలది (విహంగం)

మౌని – మౌనము దాల్చి ఉండువాడు (ఋషి)

10. బిక్ష

నేపధ్యం :

వేద విభజన చేసి పంచమ వేదంగా పేరున్న మహాభారతం రచించి అష్టాదశ పురాణాలు రచించిన బ్రహ్మ జ్ఞాని వేద వ్యాసుడు. కాశీలో వ్యాసుడు తన పదివేల మంది శిష్యులుతో కొంతకాలం నివశించాడు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ప్రాతర్మధ్యాహస్నిక విధులు పూర్తి గావించి శిష్యులతో కూడా కాశీ నగర వీధుల్లో బిక్షాటన చేసేవాడు. శిష్యులు తాము తెచ్చిన బిక్షలో సగం అతిధి అభాగ్యులకు సమర్పించి మిగిలినది భుజించేవారు. ఒకరోజు కాశీ విశ్వనాధునికి వ్యాసున్ని పరీక్షించాలనే సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన ఘటన ఈ పాఠం

పాఠ్యభాగ వివరాలు :

ఈ పాఠ్యాంశం కావ్య ప్రక్రియకి చెందినది. ఇది కాశీ ఖండం సప్తమశ్వాసం లోనిది

పర్యాయ పదాలు :

ద్వాఃకవాటంబు – ద్వారబంధం, ద్వారం తలుపు

వనిత – స్త్రీ, పురంధి, అంగన, పడతి, నారీ

పసిడి – బంగారం, సువర్ణం, కనకం, హిరణ్యం

పారాశర్యుoడు – వ్యాసుడు, బాదరాయణుడు, సాత్యవతేయుడు

ఆగ్రహము – కోపం, క్రోధం, రోషం, కినుక

అహిమకరుడు – సూర్యుడు, రవి, ఆదిత్యుడు, భాస్కరుడు

అర్ధాలు :

ద్వాఃకవాటము – ద్వారం తలుపు

వీక్షించు – చూచు

అంగన – స్త్రీ

మచ్చెకంటి – చక్కని ఆడది

కుందాడుట – నిందించుట

భుక్తిశాల – బోజనశాల

నానార్ధాలు :

వీడు – ఈ మనుష్యుడు, పట్టణం, వదులుట

లెస్స – మేలు, చక్కన, మంచిది

గురుడు – ఉపాధ్యాయుడు, తండ్రి, బలీయం

ప్రకృతి – వికృతి :

విద్య – విద్దె 

బిక్షము – బిచ్చము

యాత్ర – జాతర

మత్స్యం – మచ్చెము

11. చిత్రగ్రీవం

ఉద్దేశ్యం / నేపధ్యం :

కలకత్తాలో ఓ పెంపుడు పావురం దానిని పెంచే ఓ బాలుడు వాళ్ళ కధను మనసుకి హత్తుకుపోయేలా చెప్పిన పుస్తకం చిత్రగ్రీవం. పావురాల జీవనానికి సంబంధించిన అతిసూక్ష్మ వివరాలు తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం

పాఠ్యభాగ వివరాలు :

ఈ పాఠ్యభాగం కధా ప్రక్రియకి చెందినది. ఇది అనువాద కధ. ప్రస్తుత పాఠ్యభాగం ధనగోపాల్ ముఖర్జీ రాసిన చిత్రగ్రీవం ఓ పావురం కధ అనే పుస్తకంలో స్వీకరించారు. దీనిని తెలుగులో అనువాదించినది దాసరి అమరేంద్ర. దీన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా సంస్థ ప్రచురించింది. చిత్రగ్రీవం ఓ పెంపుడు పావురం పేరు. ఈ పాఠం పక్షులకి సంబంధించి శాస్త్రీయ విజ్ఞానం అందిస్తుంది

పదాలు – వివరణ :

గద్దింపులు – కువకువ కూయడం

పావురాలు – రకరకాల రంగురంగుల పావురాలు

గువ్వలు – నీలికళ్ళతో కువకువలాడడం

పావురాల గుంపు – పెనుమేఘాలు

పావురం మెడ – హరివిల్లు

పుట్టిన పిల్ల పక్షి – బలహీనమైన, నిస్సహయమైన, అర్భకమైన

చిత్రగ్రీవం – ముక్కు – పొడవాటి, సూది లాంటి, బలమైన

చిత్రగ్రీవం ఒళ్ళు – సముద్ర నీలిరంగు

చిత్రగ్రీవం మెడ ప్రాంతం – ఇంద్రధనస్సు వర్ణాల పూసల గొలుసు        

AP DSC 2024 Telugu Content | Class 10 | Best notes

9th తెలుగు – పదజాలం | Mega DSC Special I Telugu Content

9th తెలుగు – పదజాలం

9th తెలుగు – పదజాలం | Mega DSC Special I Telugu Content

1. ధర్మబోధ

ఉద్దేశ్యం :

మానవులు చేసే ప్రతి పనికి ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైన సాక్షి. అంతరాత్మను చంపుకుంటే మనిషి తనని తాను వంచించుకున్నట్టే అవుతుంది. గృహస్త ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పదనాన్ని గురించి చెప్పడమే పాఠం ఉద్దేశ్యం.

నేపధ్యం :

విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేస్తున్నాడు. అతని తపస్సు భంగం చేయడానికి దేవతలు మేనకని పంపారు. వారిద్దరికీ ఒక బాలిక జన్మించింది. ఆ శిశువును శకుంత అనే జాతి పక్షులు కాపాడాయి. అందువల్ల ఆమెకి శకుంతల అని నామకరణం చేసి కణ్వ మహాముని పెంచుకున్నాడు. ఒక రోజు దుష్యంతుడు వేట కోసం వెళ్తూ కణ్వ మహాముని ఆశ్రమం దగ్గర ఆగాడు. శకుంతలని చూశాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. శకుంతలకి భరతుడు జన్మించాడు. తల్లి బిడ్డలను కణ్వ మహర్షి అత్తవారింటికి పంపాడు. నిండు కొలువులో దుష్యంతుడు ఆమెను తిరస్కరించాడు. దుష్యంతుడు మాటలు విని కలత చెందిన శకుంతల రాజుకి ధర్మబోధ చేయడమే ఈ పాఠం నేపధ్యం

ప్రక్రియ – ప్రాచీన పద్యం :

ఇతిహాసం అనే పదానికి ఈ విధంగా జరిగింది అని అర్ధం. ఇతిహాసంలో కధకి అధిక ప్రాధాన్యం ఉంటుంది. రామాయణం, భారతం ఇతిహాసాలు. ఇతిహాసాల్లో మూలకధ తీసుకుని వర్ణనలతో ఛందోబద్దంగా పద్యాల రూపంలో కావ్యంగా మలచి రాయడమే ఇతిహాస కావ్యం. ఈ కావ్యాలు కవి ప్రతిభా విశేషాలుని వెల్లడిస్తాయి. అద్భుత కధాగమనంతో పాఠకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తాయి.

అర్ధాలు :

ఆచార్యుడు – గురువు

విపత్తు – ఆపద

నూనృత – సత్యం

హృద్యం – మనసుకి ఆహ్లాదం కలిగించడం

యశస్సు – కీర్తి

ఊత – ఆధారం

పర్యాయ పదాలు :

భూమి, వసుధ, పుడమి

ఆసరా, ఆధారం

భార్య, సతి, కళాత్రం, ధార

తనయుడు, పుత్రుడు, సుతుడు, కొడుకు

ఏనుగు, కరి, మాతంగం

నానార్ధాలు :

క్రమము, నీటిచాలు, వితరణ, కత్తి అంచు – ధార

పుణ్యం, స్వభావం, న్యాయం, ఆచారం, నీతి – ధర్మం

మానవుడు, అర్జునుడు – నరుడు

దిక్కు, కోరిక, నమ్మకం – ఆశ

కులం, వెదురు, పిల్లనగ్రోవి – వంశం

ప్రకృతి – వికృతి :

పుస్తకం – పొత్తం

నీరము – నీరు

యజ్ఞము – జన్నము

విద్య – విద్దె

గృహము – గీము

దీపము – దివ్వె

సత్యము – సత్తేము

ధర్మం – దమ్మము

రాజ – రేడు

కావ్యం – కబ్బం

వ్యుత్పత్తి అర్ధాలు :

పుత్రుడు – పున్నామ నరకము నుండి తప్పించేవాడు – కుమారుడు

ధర్మం – లోకం చేత ధరించబడేది

పతివ్రత – పతిని సేవించుటయే వ్రతముగా కలది – సాధ్వి

జ్యోత్స్న – కాంతిని కలిగి ఉండేది

వ్యతిరేక పదాలు :

చేసి – చేయక

వస్తాడు – రాడు

తింటే – తినకపోతే

వినండి – వినకండి

చెప్పి – చెప్పక

2. చైతన్యం

ఉద్దేశ్యం :

ప్రతి మానవ సమాజంలో అందరికీ అతీతంగా కొందరు ఉంటారు. వారు భవిష్యత్తును దర్శిస్తారు. ముందుచూపుతో ఆలోచిస్తారు. దారి దీపమై ముందుకు సాగుతారు. వారు తాత్వికులు. వారు తమ మాటల ద్వారా చేతల ద్వారా దిశానిర్ధేశం చేస్తారు. కవి కూడా ఈ కోవకి చెందినవాడే. అతని కవిత్వంలో సామాజిక చైతన్యం కలిగిస్తాడు. కవి తన రచనల ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తాడు. ఒక వంక మనిషిలో మంచితనం మెచ్చుకుంటూ కూటిలత్వాన్ని ఎండగడతాడు. ఆ నిబద్ధత తోనే కవి తన మనసులో భావాలు లోకానికి ఈ కవిత రూపంలో వెల్లడించారు. విధ్యార్ధులలో సామాజిక చైతన్యం కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడమే ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

కవిత్వానికి ఉండవలసిన ప్రధమ లక్షణం సామాజిక ప్రయోజనం. సమాజంలో అసమానతలు రూపుమాపడానికి కవి తన కలాన్ని కదిలించాలి. ప్రజల గొంతుకగా కవి వినబడాలి. తోటి మానవాళికి అండగా నిలవాలంటే గుండె నిండా ధైర్యం నింపుకోవాలి. సొంత లాభం కోసం కాకుండా పరుల మేలు కోరి పని చేయాలి అని ప్రేరణ ఇస్తూ కవి తన ఆకాంక్ష వ్యక్తం చేస్తున్న సందర్భంలో కవి కలం నుండి జాలువారినదే ఈ గేయకవిత

ప్రక్రియ – గేయ కవిత :

గేయ కవిత పాడుకోవడానికి అనువైనది. మాత్రా ఛందస్సు అనుసరించి నడుస్తుంది. లయాత్మకంగా సాగుతుంది. మానవాళి శ్రేయస్సును సమాజ పురోగమనాన్ని లోక కళ్యాణాన్ని కాంక్షించే గేయాన్ని అభ్యుదయ గేయం అంటారు

అర్ధాలు :

మారుతం – గాలి

చింత – భాద, దుఃఖం

స్థిరమైన – శాశ్వతమైన, నిలకడైన

మానసము – మనసు

క్రూరులు – చెడ్డవారు, దుర్మార్గులు

పర్యాయ పదాలు :

అభ్రములు, జలదరములు, మేఘములు

యుద్ధం, సమరం, పోరు

చుక్కలు, తారలు, నక్షత్రాలు

శోకం, దుఃఖం, ఏడుపు

నానార్ధాలు :

దిక్కు – దిశ, ఉపాయం, మార్గం

వర్షం – వాన, సంవత్సరం

నామం – పేరు, బొట్టు

వాహిని – నది, సైన్యం

లోకం – జగత్తు, చూపు, గుంపు

ప్రకృతి – వికృతి :

అగ్ని – అగ్గి

సింహం – సింగం

రాక్షసి – రక్కసి

కార్యము – కర్జము

మేఘము – మెయిలు

3. హరివిల్లు

ఉద్దేశ్యం :

మనిషికి ప్రకృతికి విడదీయరాని బంధం. ప్రకృతిని తరచి చూడడం మనిషి అలవాటు. ఉదయించే సూర్యుడు, రాలిపడే చినుకు, జల జల పారే నీరు, చిరుగాలి సవ్వడి, పూల పరిమళాలు, కిలకిలారావాలు, చిమ్మచీకటి, చల్లని వెన్నెల ఇలా ప్రతిదీ మనిషిని ఆకర్శించి ఆనందాశ్చర్యాలతో ఓలలాడిస్తుంది. ప్రకృతి అందాలకి పరవశించిన మనిషి మైమరిచిపోతాడు. ఆ తన్మయత్వంలో నుండి జరిగిన కావ్య సృష్టి ప్రకృతికి ప్రతిబింబం అవుతుంది. కవి తన మనసులో భావాలను అందంగా ఆకర్షణీయంగా చెప్పడమే వర్ణన. ఇది కవిలోని సృజనాత్మకతను వెలికి తీస్తుంది. ప్రకృతిలో అద్భుతాలు చూడడం అలవాటైతే మనిషి హృదయంలో సున్నితత్వం విరబుస్తుంది. మానవత్వం మొలకెత్తుతుంది. విచక్షణారహితంగా ప్రకృతిని ధ్వంసం చేసే ప్రవృత్తికి అడ్డుకట్ట పడుతుంది. రసార్ద్రరమైన కవి కలం లోనుంచి జాలువారిన భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ విధ్యార్ధులలో మానవీయత మేలుకొలపడం ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

మానవుడు కల్పనాశిల్పి. అతని సౌందర్య తృష్ణ వల్ల తన చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి పులకించి పునరవ్యక్తీకరించగలిగాడు. తన ఎద నుండి పాఠకుని ఎదకి చెరవేయడానికి సాహిత్యాన్ని హేతువుగా చేసుకున్నాడు కవి. నన్నయ్య మొదలుకుని నేటి వరకు కవులు తమ కావ్యాలతో ప్రకృతి వర్ణనలకే పెద్దపీట వేశారు. ప్రబంధాలలో వర్ణనలదే పై చేయి. వర్ణనలు రెండు రకాలు. స్వాభావిక వర్ణనలు, భావాత్మక వర్ణనలు. స్వాభావిక వర్ణనలలో వర్ణించే వస్తువు స్వరూప స్వభావాలు మాటల రూపంలో ఉంటే భావాత్మక వర్ణనలలో అలంకారాలతో కూడి ఉంటాయి. వివిధ సందర్భాలలో కవులు కధానుగుణంగా వర్ణించిన ప్రకృతి దృశ్యాలను పరిచయం చేయడంతో పాటు పద్య రచనా శైలిలో వైవిధ్యాలను పరిశీలించేందుకు అనువుగా ఈ పాఠం రూపొందింది.

ప్రక్రియ – వర్ణన :

రచనా ప్రక్రియ ఏదైనప్పటికి కవి చెప్పిన విషయం పాఠకుని మనసు తాకేదిగా ఉండాలి. అతనిలో భావసంచాలనాన్ని కలిగించాలి. కవి తన రచనతో పాఠకునికి లంకె వేసుకుని తనతో పాటూ నడిపించాలి. ఇందుకోసం కవి వివిధ పద ప్రయోగాలతో తన రచన రసాత్మకం చేస్తాడు. దీనిని వర్ణన అంటారు. విషయాన్ని కేవలం విషయంగా కాకుండా సరైన పోలీకలతో కలిపి వివరిస్తాడు. కావ్యాలలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. ప్రబంధాలు వర్ణనలకు పుట్టినిల్లు. భావ కవిత్వమయినా, అభ్యుదయ కవిత్వమయినా వర్ణనతోనే రచనకి భావాపుష్టి కలుగుతుంది.

అర్ధాలు :

భానుడు – సూర్యుడు

తాండవం – నృత్యం, నాట్యం

మిక్కిలి – అధికం, ఎక్కువ

తత్తరపాటు – కలవరపాటు, తొందరపాటు

కనుమరుగు అవ్వడం – కనబడకపోవడం, మాయమవడం

పర్యాయ పదాలు :

నభం – ఆకాశం, గగనం

ధనువు – ధనస్సు, చాపము, విల్లు, హరివిల్లు

పయోధరము – మేఘము, జలదరము, అంబుదం

కేదారం – పొలం, క్షేత్రం, వరిమడి

సస్యము – పంట, పైరు

వెల్లువ – ప్రవాహం

నెచ్చెలి – స్నేహితుడు, మిత్రుడు

నానార్ధాలు :

ధర – భూమి, వెల, రక్తనాళం

పంక్తి – వరుస, గుంపు

తారక – నక్షత్రం, కంటి గుడ్డు

చుక్క – నక్షత్రం, బిందువు

వ్యుత్పత్తి అర్ధాలు :

సూర్యుడు – వ్యాపారములందు జీవులను ప్రేరేపించువాడు – రవి

ధర – విశ్వమును ధరించినది – భూమి

తోయజము – తోయమందు (నీటి యందు) పుట్టినది – పద్మం

శైలము – శిలలు దీనియందు కలవు – పర్వతం

ప్రకృతి – వికృతి : 

సంధ్య – సందె

చంద్రుడు – చందురుడు

దిశ – దేస

ఆకాశం – ఆకసము

ముత్యము – ముత్తేము

మేఘము – మెయిలు

4. ఆత్మకధ

ఉద్దేశ్యం :

సామాజిక జీవితం సమస్యల వలయం. అందులో ఆటు పోట్లు ఉంటాయి. జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. తాము నమ్మిన జీవన సూత్రాలను అనుసరించి ఎదిగిన ఎందరో గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని వారి బాటలో నడిచి విజయ శిఖరాలు అధిరోహించిన వారిలో ఈ కవి ఒకడు. సమాజం అతని కృషిని గౌరవించి సమున్నతoగా సన్మానిస్తుంది. కానీ కవి ఆ సన్మానానికి పొంగిపోడు. గతంలో తన జాతి జనులకి జరిగిన అనేక అవమాన పరంపరలు అతని కళ్ల ముందు కదులుతూ ఉంటాయి. వాటి తాలూక దుఖం అతన్ని పట్టి భాదిస్తుంది. విద్య ద్వారానే వ్యక్తికి గౌరవం లభిస్తుంది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తాను ఎక్కడ నుండి వచ్చాడో గుర్తెరగాలి. తన మూలాలు మరువకూడదనే సత్యాన్ని తెలపడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశ్యం

నేపధ్యం :

స్వేచ్చ మానవ సహజాతం. వ్యక్తి తన స్వతంత్రానికి భంగం కలిగితే సహించడు. తన హక్కులను అణచవేయాలని ప్రయత్నిస్తే తిరగబడతాడు. పిల్లలు సైతం తమకి ఇష్టం లేకపోతే తల్లిపాలు తాగనంటారు. తల తిప్పుకుంటారు. ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. తనకి సాటి మనుషుల మధ్య గుర్తింపు కోరుకుంటాడు. సమాజంలో కొన్ని నిరంకుశ భావాలు, కట్టుబాట్లు మనిషి స్వేచ్చకీ సంకెళ్ళు వేస్తాయి. అతడు వాట్ని తెంచుకుని తనలో ఉన్న సృజనాత్మకత శక్తిని ప్రపంచానికి చాటుకుంటాడు. మనిషిలో మంచితనం మానవీయత ప్రపంచం గుర్తించి గౌరవిస్తుంది. అనేకానేక సమస్యలకు కుంగిపోక ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా జ్ఞాన శిఖరాలు అధిరోహించిన ఒకానొక కవి జీవితమే నేటి మన పాఠం

ప్రక్రియ – వచన కవిత :

ఈ పాఠం వచన కవిత అనే ప్రక్రియకి చెందినది. పద్య గేయాల్లో ఉండే ఛందో నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగే కవిత వచన కవిత. సరళమైన పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితముగా ఉండే కవిత వచన కవిత. రచయిత తాను చెప్పదలచుకున్న భావాన్ని సూటిగా స్పస్టంగా చెప్పడం వచన కవిత ప్రత్యేకత. ఆధునిక కవిత్వానికి కొత్త నెత్తురు ఎక్కించిన శ్రీ శ్రీ వచన కవితకి పట్టం కట్టారు. వారి బాటలో నడుస్తున్న ఆధునిక కవులందరు వచన కవితలోనే రచనలు చేస్తున్నారు.

అర్థాలు :

చౌరస్తా – కూడలి

అర్పణము – సమర్పించడం

చురకత్తులు – పదునైన కత్తులు

పర్యాయ పదాలు :

స్వర్ణం – బంగారం, పసిడి, హేమం, కనకం

సూర్యుడు – భాస్కరుడు, రవి, భానుడు, ఇనుడు

కళ్ళు – నేత్రాలు, నయనాలు, చక్షువులు

దేహం – తనువు, శరీరం, కాయం, మేను

నానార్థాలు :

తల – శిరస్సు, గుంపు, చోటు

కాలం – సమయం, మరణం, నలుపు

క్రియ – పని, చర్య

రామ – స్త్రీ, శ్రీరాముడు

ప్రకృతి – వికృతి :

బోజనము – బోనము

బ్రద్న – పొద్దు

కథ – కత

పుష్పం – పువ్వు

5. స్నేహం

ఉద్దేశ్యం :

విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అన్నారు గౌతమ బుద్ధుడు. మనిషికి అవసర కాలంలో ఆదుకున్న మిత్రుడు కన్నా ప్రియమైనది ఏది ఉండదు అన్నాడు గురునానక్. కష్టకాలంలో మనకి నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తుంది అన్నాడు గాంధీజీ. స్నేహం ప్రతి వ్యక్తి జీవితంలో మధురమైన అనుభూతిగా నిలుస్తుంది. ఆటపాటలు ఆడే వయసులో మొగ్గల ప్రారంభం అయ్యి మహావృక్షంలా ఎదిగి జీవితాంతం తోడుగా నిలుస్తుంది. కొందరితో స్నేహం మనల్ని అత్యున్నత శిఖరాలకి చేరిస్తే కొందరి స్నేహం అధః పాతాళానికి తొక్కేస్తుంది. ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది స్నేహం అయినప్పుడు మనం ఎలాంటి స్నేహం ఎంచుకోవాలి ఆ స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవో తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం

ప్రక్రియ – పద్యం :

సాహిత్య ప్రక్రియలో విశిస్టమైనది పద్యం. ఇది ఛందోబద్ధమైనది. లయాత్మకంగా, గాన యోగ్యముగా ఉంటుంది. ధారణకు అనువుగా ఉంటుంది. అందుకే మన ప్రాచీన కవులు మొదలు ఆధునిక కవుల వరకు పద్య రచనకి ప్రాధాన్యత ఇచ్చారు. కవి తన రచనలో భావ వ్యక్తీకరణకి అనువుగా కొన్ని ప్రత్యేక పద్య శైలులు ఎంచుకుంటాడు. ఉద్ధతికి విక్రీడిత పద్యాలు, సుకుమారతకు మాలా పద్యాలు, తాత్విక భావాలకు గీత పద్యాలు, పుష్పాపచయాది సందర్భాలకు రగడలు, పంచచామరాలు మొదలైన పద్య రీతులు కావ్యాలలో శోభిస్తాయి

అర్థాలు :

సంపద – ధనం

సౌధము – భవనము

తండులములు – అటుకులు

ప్రతిజ్ఞ – శపథం

సఖ్యత – స్నేహం

పర్యాయ పదాలు :

మిత్రులు, నేస్తాలు, స్నేహితులు

తల్పములు, శయ్యలు, పరుపులు

వసనములు, అంబరములు, వస్త్రాలు

ఉదకము, సలిలం, జలం

పత్రం, దళం, ఆకు

నానార్ధాలు :

విభుడు – ప్రభువు, శివుడు, బ్రహ్మ

కను – చూచు, వెదకు, జన్మనిచ్చి

దళం – ఆకు, భాగం, దండు

ఫలం – పండు, కార్యం, పరిణామం

వ్యుత్పత్తి అర్థాలు :

గురువు – అజ్ఞానం అనే అంధకారమును చేదించేవాడు – ఉపాధ్యాయుడు

మిత్రుడు – సర్వభుతాల పట్ల స్నేహభావం కలవాడు – సూర్యుడు

మోక్షం – జీవున్ని పాశం నుండి విడిపించేది – ముక్తి

పురంధ్రి – గృహాన్ని ధరించేది – ఇల్లాలు

అమృతం – మరణం లేనిది – సుధ

పదాలు – అర్థాలు :

బ్రహ్మానందం – అంతులేని ఆనందం

చక్రపాణి – చక్రము పాణి (చేయి) యందు కలవాడు

కుంభవృష్టి – కుంభం (కుండ) లతో కుమ్మరించినట్టు కురిసే వాన

తళతళలాడే – ప్రకాశించు

ప్రచండ వాయువు – తీవ్రమైన గాలి

ప్రకృతి – వికృతి :

కార్యము – కర్జము

గృహము – గీము

గౌరవం – గారవం

ధర్మము – దమ్మము

లక్ష్మి – లచ్చి

6. తీర్పు

ఉద్దేశ్యం :

బుద్ధుడు నడయాడిన భారతావని శాంతి, సహానాలకి పుట్టినిల్లు. పరోపకారం మనకి జీవనాడి. మనిషిగా జీవించడానికి కొన్ని విలువలు నియమ నిష్టాలు ఏర్పాటు చేసి దాన్ని మానవత్వం అన్నారు. మనిషి పురుషార్ధపరుడు కావాలి అంటారు పెద్దలు. ధర్మబద్ధంగా జీవితాలను కొనసాగిస్తూ జన్మ సాఫల్యం చేసుకోవాలన్నది దీని పరమ ఉద్దేశం. మనస్సు చంచలమైనది. చూచిన ప్రతీదీ తనకి కావాలని ప్రేరేపిస్తుంది. సాధనతో దీన్ని అదుపులో ఉంచుకోవాలి. కరుణ, సత్యం, ధర్మం, న్యాయం, భూతదయ, అహింస, క్షమాగుణం మొదలైన సాత్విక గుణాలను విధ్యార్ధులు అలవర్చుకుని ఉన్నతమైన జీవనం సాగిస్తూ మానవత్వం చాటుకోవాలని తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం.

నేపధ్యం :

ఒకరోజు సిద్ధార్ధుడు రాజకుమారులతో కలిసి వనవిహారానికి వెళ్ళాడు. సిద్ధార్ధుడు ప్రకృతి అందాన్ని సరోవరాలను పంటచేలను పశుకాపర్లను పశు పక్ష్యాదులను చూసి ఆనందిస్తున్నాడు. ఇంకో రాజకుమారుడు దేవదత్తుడు చేత ధనూర్భానాలు ధరించి జంతువుల వేటకి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో ఒక హంసల గుంపు క్రేంకారం చేస్తూ ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉండడాన్ని దేవదత్తుడు చూశాడు. బాణం సంధించి ఒక హంసను నేలకూల్చాడు. దీనిని చూసిన సిద్ధార్ధుడు మిక్కిలి వ్యధ చెంది ఆ హంసను రక్షించాడు. ఇది ఇద్దరి మధ్య వాదానికి దారి తీసింది. న్యాయం కోసం రాజస్థానానికి వెళ్లారు. చివరికి హంస ఇద్దరిలో ఎవరికి చెందిదో అనేది పాఠం ద్వారా తెలుస్తుంది

ప్రక్రియ – ఖండ కావ్యం :

చిన్న కధ, కొన్ని పాత్రలు, పరిమిత పద్యాలు గల రచన ఖండ కావ్యం. దీనిలో వ్యర్ధ పదాలకు, వర్ణనలకు అవకాశం ఉండదు. మహాకావ్యాల్లో రసవత్తరమైన ఘట్టాలను పాత్రలను చారిత్రక, దేశభక్తి సన్నివేశాలు మొదలైన వాటిని రమణీయంగా వ్యక్తీకరించడం దీని ప్రత్యేకత. దీనిలో పద్యాలు సంప్రదాయ వృత్తాలలో ఛందోబద్ధంగా ఉంటాయి.

అర్ధాలు :

అంకము – ఒడి 

వినుత్రోవ – ఆకాశ మార్గం

ఆస్య – ముఖం

మారాళము – హంస 

భాస్పములు – కన్నీళ్ళు

పర్యాయ పదాలు :

అంబరము – ఆకాశం, గగనం 

శరం – బాణం, అమ్ము

సరోవరం – సరస్సు, తటాకం

వాక్కులు – మాటలు, పలుకులు

కరములు – చేతులు, హస్తాలు

నానార్ధాలు :

శ్రీ – లక్ష్మీ, సంపద 

ఖగము – పక్షి, బాణం

మధు – తేనె, చైత్రం

ఘృతము – నెయ్యి, నీరు

సోమ – శ్రయము, పరాక్రమం

ప్రకృతి – వికృతి :

లక్ష్మీ – లచ్చీ

హంస – అంచ

న్యాయము – నాయము

రత్నము – రతనము

అంకము – అంకె

భీతి – బీతు

త్రోవ – తోవ

ప్రాణము – పానము

రాక్షసి – రక్కసి

సంతోషం – సంతసము

7. మాట మహిమ

ఉద్దేశ్యం :

నరం లేని నాలుక పరిపరివిధాల వదంతులు పుట్టిస్తుంది. దాని ఫలితంగా ధన, మాన, ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుంది. అవయవలన్నింటిలో ప్రధానమైనది మనకి గౌరవం తెచ్చి పెట్టేది నాలుక. విలువైన మాటలే బంధాలను స్నేహాలను పెంచుతాయి. వ్యక్తి సంస్కారానికి మాట గీటురాయి వంటిది. పెదవి దాటి వచ్చే మాటపై అదుపు, పొదుపు అవసరం. మాటతీరు బాగలేకపోతే ఎదురయ్యే కష్ట నష్టాలను తెలపడం, మాట విలువ తెలుసుకుని యోగ్యతతో కూడిన మాటలే మాట్లాడడం అలవరచుకునేలా చేయడం ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు. ఒక్కొక్కరి మాటతీరు ఒక్కోలా ఉంటుంది. కొందరి మాటలు ప్రేమని పంచితే, మరికొందరు మాటలు మనసు ముక్కలు చేస్తాయి. కొందరు మాటలు ధైర్యం నింపితే మరికొందరి మాటలు పిరికితనం నూరిపోస్తాయి. నాలుక అదుపులో ఉంచుకుని మాట్లాడే స్వభావం పెంపొందించుకోవడం ఎంత అవసరమో మోసపు మాటల మాయలో పడకుండా జగరుకతతో ఉండడం అంతే అవసరం

ప్రక్రియ – ఆధునిక పద్యం :

తెలుగు సాహిత్య ప్రక్రియలో విశిస్టమైన ప్రక్రియ పద్యం. పూర్వం సాహిత్య రచనలు అన్నీ పద్య ప్రక్రియలో జరిగేవి. పద్య ముఖ్య లక్షణం ఛందస్సు. పద్యాలలో వృత్తాలు, జాతులు, ఉపజాతులు ఉన్నాయి. ఆధునిక రచయితలపై కూడా ప్రాచీన పద్య ప్రభావం ఎంతైనా ఉంది. అందుకే ఆధునిక రచయితలు తమ భావాలను ప్రాచీన పద్య శైలిలో ఛందోబద్ధంగా రచించడం జరుగుతుంది. ఆధునిక పద్యంలో పద్యశైలి ప్రాచీన పద్య లక్షణాలతో ఉంటుంది. వస్తువు ఆధునికమైనది ఉంటుంది

అర్ధాలు :

పధమున – మార్గము 

మితము – కొద్దిగా

కులాలుడై – కుమ్మరివాడు

దుర్గుణాలు – చెడుగుణాలు

గరళం – విషం

పర్యాయ పదాలు :

నేస్తాలు, మిత్రులు

జిహ్వా – నాలుక, రసజ్ఞ

తిలకించు – చూచు, వీక్షించు

సిరి – లక్ష్మీ, సంపద

నానార్ధాలు :

పయనము – ప్రస్థానం, గమనం

అమృతము – సుధ, నెయ్యి

కాంచుట – చూచుట, పొందు

ప్రకృతి – వికృతి :

భాష – బాస

పుస్తకాలు – పొత్తములు

దూరము – దువ్వు

వర్ణం – వన్నె

హృదయం – ఎద

సహాయం – సాయం

జాతీయాలు :

కంకణం దాల్చు – కార్యం నెరవేర్చే శపధం పట్టడం

గిల్లి జోలబాడటం – మనిషి కింద మంట పెట్టి మీద నీళ్ళు చల్లడం

జుట్టు ముడిపెట్టడం – తగాదా పెట్టడం

వంట జీర్ణించుకోవడం – పూర్తిగా విషయం అవగాహన చేసుకోవడం

8. ఇల్లలకగానే

ఉద్దేశ్యం :

ప్రతి మనిషికి కొన్ని అభిరుచులు ఉంటాయి. ఆడవాళ్ళు పెళ్లవగానే ఇల్లు చక్కదిద్దడంలో లీనమైపోతారు. బరువు బాధ్యతలతో వంటింటి కుందేళ్ళు ఐపోతారు. ఇంటి పనుల్లో పడి కోరికలకు కళ్ళెం వేసుకుంటారు. అభిరుచులు ఆటకెక్కిస్తారు. భర్త, పిల్లలను చూసుకోవడం భాగ్యం అనుకుంటారు. చివరికి తమ అస్తిత్వం కోల్పోతారు. వివాహితకు కుటుంబం అండగా నిలిస్తే వారు విజయ బావుటా ఎగురవేస్తారు. స్త్రీల ఆత్మాభిమానం పెంపొందించుకోవాలి అని తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం

ప్రవేశిక :

వివాహం అయిన స్త్రీ తన చదువు, సృజనాత్మకత, నైపుణ్యాలు పక్కన పెట్టాల్సి వస్తుంది. యంత్రంలా పని చేస్తున్న క్రమంలో తనకో పేరు ఉంది అని మర్చిపోతుంది. ఇంటి పనిలో మునిగి స్వీయ చైతన్యం ఆత్మ గౌరవం కోల్పోవడంలో అనౌచిత్యాన్ని ఈ కధ ద్వారా తెలుసుకుందాం

ప్రక్రియ – కధ :

తెలుగు సాహిత్యంలో కధ ఒక ప్రధాన ప్రక్రియ. వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంఘటనలు వివిధ పాత్రల ద్వారా గొప్ప శిల్ప నైపుణ్యంతో గుండెకి హత్తుకునేలా చెప్పే వచన రచనే కధ. ప్రస్తుతం కధ, కధానిక అనే రెండు పదాలు ఒకే అర్ధంలో వాడుతున్నాం. ఎందరో రచయితలు తమ కధల ద్వారా తెలుగు సాహిత్యం పరిపుష్టం చేస్తున్నారు

అర్ధాలు :

నేర్పరి – నైపుణ్యం, ప్రావీణ్యం  

తీర్చి దిద్దిన – బాగుపరిచిన, రూపొందించిన

భుజం తట్టడం – ప్రోత్సహించడం, ప్రేరణ కలిగించడం

విధ్యార్జన – జ్ఞాన సంపాదన

పర్యాయ పదాలు :

గుర్తు – సంకేతం, జ్ఞాపకం, సంజ్ఞ

బట్టలు – వస్త్రాలు, వలములు, చెలములు

ఉత్తరాలు – జాబులు, లేఖలు

తపన – కోరిక, ఆశ, ఈప్పితం

ఇల్లాలు – భార్య, శ్రీమతి, సతి

ప్రకృతి – వికృతి :

తీరం – దారి

గౌరవం – గారవం

ప్రాణము – పానము

భాష – బాస

ఆశ్చర్యం – అచ్చెరువు

సామాన్య వాక్యాలు – సంయుక్త వాక్యాలు :

రాధ పాట పాడుతున్నది. రవి పాట పాడుతున్నాడు – రాధ, రవి పాట పాడుతున్నారు

సాందీపుడు గురువు. శ్రీకృష్ణుడు శిష్యుడు – సాందీపుడు, శ్రీకృష్ణుడు గురుశిష్యులు

రవి బజారుకి వెళ్ళాడు. రఘు బజారుకి వెళ్ళాడు – రవి, రఘు బజారుకి వెళ్లారు

భీముడు వీరుడు, అర్జునుడు వీరుడు – భీముడు, అర్జునుడు వీరులు

సామాన్య వాక్యాలు – సంశ్లిష్ట వాక్యాలు :

శైలజ నడుస్తున్నది. శైలజ పాట పాడుతున్నది – శైలజ నడుస్తూ పాట పాడుతున్నది

నెమలి వేగంగా వచ్చింది. నెమలి పాముని చూసింది – నెమలి వేగంగా వచ్చి పాముని చూసింది

నేను ఉదయాన్నే లేచాను, నేను వ్యాయామం చేశాను – నేను ఉదయాన్నే లేచి వ్యాయామం చేశాను

ఏనుగు తొండం ఎత్తింది, ఏనుగు ఘీంకరించింది – ఏనుగు తొండం ఎత్తి ఘీంకరించింది

9. రంగస్థలం

ఉద్దేశ్యం :

కళారూపాలు ఆస్వాదించే వారికి ఆనందం పంచుతాయి. మానవుడు సంఘ జీవనం మొదలు పెట్టిన నాటి నుండి మనోల్లాసం కలిగించే అనేక రకాల ఆటపాటలు జీవితంలో భాగం చేసుకున్నాడు. కాలక్రమంలో అవి కళారూపాలుగా రూపుదిద్దుకున్నాయి. హరికధ, బుర్రకధ, చిందు భాగవతం, యక్ష గానం మొదలైనవి అన్నీ ఈ కోవకి చెందినవే. అలాంటివాటిలో ఒకటైన నాటకం గురించి దాని ఔన్నత్యం గురించి వివరించడం ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

నాటకం ఒక కళారూపం మాత్రమే కాదు, ఒక గొప్ప సాహితీ ప్రక్రియ కూడా. ఎందరో లబ్ధ ప్రతీష్టులైన కవులు అనేక నాటకాలు రాశారు. నటీనటులు తమ అద్భుత నటనతో వాటికి దృశ్య రూపం కల్పించారు. అనేక నాటక సమాజాలు నాటకాలు ప్రదర్శిస్తూ వాటికి ఆదరణ కల్పించాయి. అత్యున్నత శిఖరాలు అధిరోహించిన నాటక రంగం సినిమా ప్రవేశంతో తన ప్రభావం కోల్పోయింది. కేవలం వినోదం పంచడంతో సరిపెట్టుకోకుండా సామాజిక సమస్యలు, సాంఘిక దురాచరాలని ఎత్తి చూపుతూ కొత్త పుంతలు తొక్కుతూ ఈనాటికీ తన ఉనికిని చాటుకుంటున్న నాటకం గురించి నేటి తరం తెలుసుకోవడం ఎంతో అవసరం

ప్రక్రియ – వ్యాసం :

ఒక విషయం గురించిన సమాచారం విశేషాలు పాఠకులకి అర్ధం అయ్యేలా సంగ్రహంగా రాసే ప్రక్రియను వ్యాసం అంటారు. వ్యాసానికి ఒక స్పష్టమైన ప్రారంభం, వివరణ, ముగింపు అనే లక్షణాలు ఉంటాయి. రచయిత విషయాన్ని కూలంకుశంగా పరిశీలించి అవసరం అయిన సమాచారం క్రోడీకరించి వ్యాసం రాస్తారు

నాటికలు – రచయితలు :

ఆత్మ వంచన – బుచ్చిబాబు

తేలుకుట్టిన దొంగలు – పొట్లూరి వేంకటేశ్వర రావు

కప్పలు – ఆత్రేయ

కంఠాభరణం – పానుగంటి

గృహప్రవేశం – మునిమాణిక్యం

సరిపడని సంగతులు – బళ్ళారి రాఘువ

సత్యం గారి ఇల్లు ఎక్కడ – గొల్లపూడి

అర్ధాలు :

కనుమరుగు – కనపడకపోవడం

హర్షధ్వనాలు – చప్పట్లు, కేరింతలు

నిత్యనూతనం – ఎల్లప్పుడూ కొత్తగా

సమ్మేళనం – కలయిక

ఆద్యంతం – మొదట నుండి చివర వరకు

పర్యాయ పదాలు :

స్త్రీలు, మహిళలు

గ్రామం, పల్లెటూరు

హాస్యం, నవ్వు

నృత్యం, నాట్యం

వీక్షకులు, ప్రేక్షకులు

నానార్ధాలు :

ఉల్లాసం – ఆనందం, ఉత్సాహం

చేరువ – దగ్గర, సాన్నిత్యం

నూతనం – కొత్త, వింత

కాలం – సమయం, మరణం, నలుపు

కృషి – ప్రయత్నం, వ్యవసాయం, పరిశ్రమ

10. ప్రియమైన నాన్నకు

ఉద్దేశ్యం :

మనిషి ప్రేమతో నిండిన ప్రేమకు పులకరిస్తాడు. ఆత్మీయంగా హత్తుకుంటే ఆనందిస్తాడు. ఆధునిక కాలంలో మనిషికి ఉరుకుల పరుగుల జీవనశైలి నిత్యకృత్యం అయింది. అమ్మ నాన్నలను అయిన వాళ్ళను ఆత్మీయులను పాలకరించుకుని మనసు విప్పి సుఖదుఃఖాలు పంచుకునే కాలమే నేడు కరువైంది. సాంకేతిక పరిజ్ఞానం మనిషిని యాంత్రికుని చేసి తన చుట్టూ తిప్పుకుంటుంది. ఈ నేపధ్యంలో మనసులో మాటలను మమతలను ఒకరినొకరు పంచుకునేలా చేయగల ఏకైక సాధనం ఉత్తరం. బాలలలో లేఖ రచన పట్ల ఆసక్తి పెంపొందించి కుటుంబ విలువలు కాపాడడం మానవ సంబంధాలు భాంధవ్యాలకు ప్రాణం పోయడమే ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

ఉత్తరం ద్వారా వాస్తవిక సంఘటనలు, అనుభవాలు, ఆలోచనలు ఆసక్తికరంగా వ్యక్తీకరించడం జరుగుతుంది. ఉత్తరం రాయడం ఒక కళ. మన అనుకున్నవారి బాగోగులు భావోద్వేగాలును ఉత్తరం రూపంలో అందుకుంటే కలిగే ఆనందానికి అవధులు ఉండవు. ఉత్తరం చదువుతుంటే రాసినవారు ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. ఆత్మీయ బంధం పెనవేసుకుంటుంది. అందుకే ఉత్తరం పదే పదే చదువుతూ గుండెకు హత్తుకుంటాం. పదిలంగా దాచుకుంటాం. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాలు అయిన వాట్సప్, మెయిల్ ఇలాంటి అనుభూతి ఇవ్వలేవు. ఆత్మీయతలు, ప్రేమనురాగాలు పెంపొందాలన్నా మనుషుల మధ్య దూరం తగ్గాలన్నా లేఖ అత్యుత్తమ సాధనం. పిల్లల ఎదుగుదల కోసం తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నిరంతరం తపించిన తండ్రిని తలచుకుంటూ ఒక కూతురు తండ్రికి రాసుకున్న ఉత్తరమే ఈ పాఠం

ప్రక్రియ – లేఖ :

తెలుగు సాహిత్యంలో లేఖా రచన ఒక అద్భుత ప్రక్రియ. వ్యక్తులు, సంస్థల మధ్య సమాచారం పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనమే లేఖ. లేఖల ద్వారా తమ భావాలు, అనుభవాలు, అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. కేవలం విషయ సమాచారమే కాకుండా ప్రముఖులు రాసిన లేఖల్లో సాహితీ విలువలు ఉంటాయి. అందువల్ల వచన రచనలో ఒక సాహిత్య ప్రక్రియగా లేఖను పేర్కొంటారు. ఎందరో రచయితలు లేఖల రూపంలో తన హృదయాన్ని ఆవిష్కరించారు. సంజీవ దేవ్ లేఖలు, నెహ్రూ లేఖలు, చలం లేఖలు, ఔరంగజేబు లేఖలు, అబ్రహం లింకన్ లేఖలు ఈ కోవకి చెందినవే. కొందరి లేఖలు ఆలోచింపజేస్తే మరికొందరి లేఖలు ఆనందింపజేస్తాయి. అందుకే లేఖలను చైతన్యానికి ప్రతీకలు అంటారు

అర్ధాలు :

ఉరకలు – పరిగెత్తడం, ప్రవహించడం

కరువు – దుర్భిక్షo, క్షామం   

స్మృతులు – జ్ఞాపకాలు

అస్తిత్వం – ఉనికి

పర్యాయ పదాలు :

ఎద, హృదయం

లేఖ, ఉత్తరం

జ్ఞాపకం, మననం

లేమి, వెలితి

ఆత్రుత, తొందర

పశువు, గొడ్డు

నానార్ధాలు :

భోగం – పాము పడగ, శుభం, కీర్తి,భోజనం, తపస్సు, భువనం, మరదలు (మేనమామ పుత్రిక)

ప్రకృతి – వికృతి :

కుమారుడు – కొమరుడు

శ్రీ – సిరి

పంక్తి – బంతి

క్షేమం – సేమము

ఆశ – ఆస

11. ఆశావాది

ఉద్దేశ్యం :

విధ్యార్జనకు పుట్టుపూర్వోత్తరాలు, ఆర్ధిక అసమానతలు అవరోధాలు కావు అని నిరూపించిన ధీశాలి ప్రకాశరావు. పట్టుదల, కృషి ఉంటే అక్షర సింహాసనం ఎక్కి సాహితీ సామ్రాజ్యం ఏలవచ్చు అని నిరూపించి చూపిన కార్యదక్షుడు. పద్య రచనలో పట్టు సాధించి కొందరికే పరిమితం అయిన అష్టావధాన ప్రక్రియలో రాణించడం ద్వారా అత్యున్నత పద్మ శ్రీ పురష్కారం అందుకుని నేటి తరానికి స్పూర్తి ప్రదాతగా నిలిచిన ఆ మహానీయుని సాహితీ జీవన ప్రస్థానం తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం.

ప్రక్రియ – ముఖాముఖి :

ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహనీయుల జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. మరెన్నో వెలుగునీడలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం ద్వారా మన జీవితం సుగమం చేసుకోవడానికి వీలు అవుతుంది. ప్రశ్నలు అడగడం ద్వారా సమాచారం సేకరించడమే ముఖాముఖి. సేకరించిన సమాచారం ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా పాఠకులకు అందించడం జరుగుతుంది. ముఖాముఖి ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వం వారి అనుభవాలు, జీవిత విశేషాలను స్వయంగా వారి ద్వారా తెలుసుకునే వీలు ఉంటుంది

ప్రవేశిక :

సాహితీ వ్యవసాయంలో పద్య సేద్యం చేసిన ఓ భాషా పరిమళం, సుందర శబ్దాలతో అందమైన పద్యాలు అల్లిన ఓ అష్టవధాన రూపం ఆశావాది ప్రకాశరావు. నీదే కులం అని అడిగిన వారికి నాది కవికులం అని చాటిన కవితావాది ఆశావాది. అవధానం కొందరి సొత్తు. అది నీవెలా చేస్తావు ఆన్న అవహేళనలకు తన సాహిత్య పటిమతో సమాధానం ఇచ్చిన సౌజన్యమూర్తి. తెలుగు భాషకే సొంతం అయిన అవధాన ప్రక్రియలలో వారు అగ్రశ్రేణిలో నిలిచారు. తిరుపతి వెంకట కవులను ప్రేరణగా తీసుకుని సి వి సుబ్బన్న శతావధానిని గురువుగా నిలుపుకుని వారి సాహితీ ప్రస్థానం విశిష్ట పురష్కారాలకు వేదికైంది. అలనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారిచే బాలకవిగా పిలిపించుకుని మొన్నటి రాష్ట్రపతి రామనాధ్ కోవిoద్ చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న భాషాజీవి. ప్రస్తుత పాఠ్యభాగం ఆశావాది ప్రకాశరావు రచించిన “ప్రకాశ ప్రదీపనం” లోనిది

అర్ధాలు :

గోష్టి – చర్చ 

ఆశువు – అప్పటికి అప్పుడు చెప్పే కవిత్వం

పృచ్చకులు – అష్టవధానంలో ప్రశ్నించేవారు (8 మంది ఉంటారు)

పర్యాయ పదాలు :

నేత్రం – నయనం, కన్ను, అక్షి   

నాన్న – తండ్రి, జనకుడు

కౌముది – వెన్నెల, చంద్రిక

నానార్ధాలు :

కవి – కవిత్వం రాసేవాడు. నీటికాకి 

గురువు – ఉపాధ్యాయుడు, బృహస్పతి

కృషి – ప్రయత్నం, వ్యవసాయం

వ్యుత్పత్తి అర్ధాలు :

కృతులు –

పౌత్రుడు – పుత్రుని యొక్క పుత్రుడు 

ఆచార్యుడు – ధర్మ మార్గం ఆచరించి చూపువాడు

ప్రకృతి – వికృతి :

 దైవం – దయ్యం

కార్యం – కర్జము

పద్యం – పద్దెము

కీర్తి – కిరీతి

కవిత – కయిత

విజ్ఞానం – విన్నానం

అక్కరం – అక్షరం

సందియం – సందేహం

జాతీయాలు :

ఎత్తిపొడుపు – నిందించడం

కత్తి మీద సాము – చాలా దుర్లభం, కష్టతరం

తామరతంపర – కుప్పలు తెప్పలు, కోకొల్లాలు 

12. ఏ దేశమేగినా

ఉద్దేశ్యం :

తెలుగులో పద్యం, కధ, వచన కవిత మొదలైన ప్రక్రియలతో పాటు యాత్రా రచన కూడా ఒక సాహితీ ప్రక్రియ. దాని పట్ల విద్యార్ధులకు అవగాహన కలిగించడం, రచయిత్రి తన విదేశీ యాత్ర అనుభవాలను పరిచయం చేయడం, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలు తెలపడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.

నేపధ్యం :

“ఈనాడు ఊసుపోక ఊరికే తిరిగే లోక సంచారులు కాదు ప్రపంచానికి కావలసినది. తమ తిరుగుడుకి సార్ధకత కల్పించగల లోక సంచారులు కావాలి. అంటే దేశాలు తిరిగి తాము సంపాదించిన అనుభవాన్ని, చూసిన ప్రదేశాల వివరాల్ని ఏ కారణం వల్లనో దేశాలు తిరగలేక స్థిరవాసులయిన లక్షలాది మంది ప్రజలకు అందించగలిగి ఉండాలి లోకసంచారులు” అని లోకసంచారి అనే పుస్తకంలో ప్రముఖ చారిత్రక సాంస్కృతిక హిందీ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వెల్లడించారు

సరిగ్గా అలాంటి ఒక సదుద్దేశ్యంతో శ్రీమతి ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ గారు భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలు పర్యటించారు. ఆ పర్యటన సాగిన విధానం ఆమె పొందిన అనుభవాలు, విశేషాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం

ప్రక్రియ – యాత్రా రచన :

యాత్రికుడు తాను పొందిన యాత్రనుభవాలను గ్రంధస్థం చేయడం యాత్రా రచన. వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత గల దర్శించినపుడు అక్కడి విశేశాలను పొందిన అనుభూతిని అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా రాయడమే యాత్రా రచన.

నేటికీ ఏ తీర్ధ యాత్రకో, విహార యాత్రకో వెళ్ళి వచ్చిన వారు తమ స్నేహితులతో ఇరుగుపొరుగువారికో అక్కడ వింతలు, విశేషాలు కధలు కధలుగా చెప్పడం చూడవచ్చు. యాత్రా రచనలు చదువుతునప్పుడు పాఠకుడు తాను కూడా అక్కడ ఉన్నట్లు అనుభూతి చెందుతాడు. పిల్లలు కూడా తాము వెళ్ళిన ఊళ్ళ గురించి విజ్ఞాన యాత్రల గురించి యాత్రా రచన చేయడం అవసరం. ఇది తమ అనుభవాలకి అక్షర రూపం కల్పించడం

రచన – గ్రంధకర్త :

ఆటా జనికాంచె – ఎండ్లూరి సుధాకర్

ఇనుపతేరనెనుక – రావూరి భరద్వాజ

నవ భారతి – మాలతీ చందూర్

రష్యాలో స్నేహాయాత్ర – వసా ప్రభావతి

నేను చూసిన అమెరికా – అక్కినేని నాగేశ్వర రావు

కాశీ యాత్ర చరిత్ర – ఏనుగుల వీరాస్వామి

అర్ధాలు :

జోతలు – నమస్కారాలు

సమాగమం – కలయిక

సాధ్వి – పతివ్రత

కలగుండు – కలవరం

ఉత్కృష్టం – గొప్పగా

అధిరోహించిన – ఎక్కిన

పర్యాయ పదాలు :

జాబు, ఉత్తరం, లేఖలు

ఆదేశం, ఆజ్ఞ, అనుజ్ఞ

జ్ఞప్తి, స్మృతి, జ్ఞాపకం

ప్రకృతి – వికృతి :

దీపము – దివ్వె

మాణిక్యం – మానికం

యత్నం – జతనం

యాత్ర – జాతర

నిత్యం – నిచ్చెలు   

13. నా చదువు

ఉద్దేశ్యం :

విద్య వలన వినయం వినయం వలన పాత్రత కలుగుతుంది అనేది ఆర్ష వాక్యం. అంటే విద్య వ్యక్తి అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడుతుంది. విద్యాభ్యాసం కోసం ఎంతోమంది ఎన్ని ఆటంకాలు వచ్చిన ఎదురీది వివిధ ప్రయత్నాలు చేసి సఫలీకృతులయ్యారు. అలాగే కోరుకున్న రంగంలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. విద్యార్ధులకు అలాంటి వ్యక్తుల జీవిత విశేషాలు తెలిపి వారి బాటలో నడిచేలా చూడడం దేశాభివృద్ధికి పాటుపడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశ్యం

నేపధ్యం :

తెలుగులో వచన కవిత్వానికి పట్టం కట్టిన ప్రముఖ రచయితలలో శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారు అగ్రగణ్యలు. ఆధునిక తెలుగు కధకి గురజాడ బీజం వేస్తే తరవాత శ్రీపాద వారు దానికి జవజీవాలు కల్పించారు. పద్య కవిత ప్రభావానికి ఎదురొడ్డి తెలుగు సాహిత్యాన్ని ఆధునిక వచన రచన వైపుకి చేయి పట్టి నడిపించిన వైతాళికుడు శ్రీపాద. వీరు చక్కని తెలుగుదనంతో గ్రామీణ నేపధ్యంతో కధలు, కావ్యాలు రాయడంలో సిద్ధహస్తులు. ఈయన తన చిన్నతనంలో చదువు సాగించిన తీరుకు ఒక ప్రత్యేకత ఉంది. నాడు తన విద్యాభ్యాసంలో ఎదురైన సమస్యలు వాటిని అధిగమించిన విధానం నేటి తరానికి మార్గదర్శకం. శ్రీపాద వారు తన చిన్ననాటి సామాజిక స్థితిగతులను అవకాశాలుగా మార్చుకుని రచయితగా కవిగా ఎదిగిన తీరు తన ఆత్మకధ “అనుభవాలు – జ్ఞాపకాలునూ” లో వివరించారు. అందులో తన బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలిపే నేపధ్యం లోనిది ఈ పాఠ్యాంశం.

ప్రక్రియ – ఆత్మకధ :

వ్యక్తి తన జీవిత అనుభవాలు, అభిప్రాయాలు కలబోసి తనకి తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకధ. తనకై తాను రాసుకున్న జీవిత చరిత్ర. అవి ఆత్మకధలే అయినా సామాజిక జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ఇది ఉత్తమ పురుష కధనంలో ఉంటుంది. ఆత్మకధలు చదవడం ద్వారా పాఠకుడు రచయితతో కలిసి పయనిస్తున్నట్లు అనుభూతి చెందుతాడు. అందుచేత ఎన్ని ఆత్మకధలు, జీవిత చరిత్రలు చదివితే అన్నీ జీవితాలను ఏకకాలంలో జీవించినవారమవుతాము అంటారు.

ఆత్మకధలు :

సత్య శోధన – మహాత్మా గాంధీ

నేను – నా దేశం – దరిశి చెంచయ్య

నా ఎరుక – అధిబట్ల నారాయణదాసు

పింజారి – షేక్ నాజర్

హంపి నుండి హరప్పా దాకా – తిరుమల రామచంద్ర

నా జీవిత యాత్ర – టంగుటూరి ప్రకాశం పంతులు

నా గొడవ – కాళోజీ నారాయణరావు

నా అంతరంగ కధనం – బుచ్చిబాబు

సాలగ్రామం – కపిలవాయి లింగమూర్తి

అర్ధాలు :

సఫలం – విజయవంతం

ప్రాప్యo – పొందదగినది

పారంగతుడు – నిష్ణాతుడు

ప్రవర్తన – నడవడిక

దీక్షాపరుడు – అనుకున్న కార్యం నెరవేర్చేవాడు

ఉడాయించడం – వెళ్ళిపోవడం

పర్యాయ పదాలు :

మార్గం, తోవ, దారి

రహస్యం, గుట్టు, మర్మం

గూడు, గృహం, సదనం, ఆవాసం

సీమ, ప్రాంతం, ప్రదేశం

మహిళ, వనిత, స్త్రీ

నానార్ధాలు :

పూనిక – యత్నం, సన్నాహం 

నిర్మాణం – ఆకృతి, కల్పన

దృక్పధం – అభిప్రాయం, మార్గం

పాదు – కుదురు, ఆవాసం

సుతరాం – ఏమాత్రం, కొంచెమైనా

ప్రకృతి – వికృతి :

విద్య – విద్దె

దేవళం – దేవాలయం

వీది – వీధి

నిదుర – నిద్ర 

చట్టం – శాస్త్రం

రాతిరి – రాత్రి

దిస్టి – దృష్టి 

14. ఆకుపచ్చశోకం

ఉద్దేశ్యం :

భూగోళం మీద జీవకోటికి ప్రాణవాయువు ఇచ్చి పచ్చదనం పెంచేవి చెట్లు. నాగరికత పేరుతో మనిషి ప్రకృతిని విచక్షణ లేకుండా కొల్లగొడుతున్నాడు. అవసరాన్ని మించి అడవులు ధ్వంసం చేస్తున్నాడు. ప్లాస్టిక్ భూతం ఒక వైపు అడవుల నరికివేత మరోవైపు పర్యావరణాన్ని ప్రమాదంలో పెడుతున్నాయి. ఈ ప్రమాదం గుర్తెరిగి పర్యావరణం కాపాడవలసిన అవసరం గూర్చి తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం.

ప్రక్రియ – పర్యావరణ కవిత్వం :

తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ. మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతికి పర్యావరణానికి కలుగుతున్న హానిని దానివల్ల కలిగే పర్యవసానాలను తెలపడమే పర్యావరణ కవిత్వం ఉద్దేశ్యం. పర్యావరణ భావనలను రచయిత కవిత రూపంలో వ్యాసరూపంలో వ్యక్తీకరిస్తారు. అందువల్ల దీనిని కవితా వ్యాసం అంటారు

అర్ధాలు :

హరితం – పచ్చదనం 

ఉపద్రవం – ప్రమాదం

బాహువులు – చేతులు

ఛాయ – నీడ

గరళం – విషం

పర్యాయ పదాలు :

చెట్లు – తరువులు, భుజములు

ముస్తాబు – అలంకరణ, అందంగా తయారు చేయడం

జాడ – గుర్తు, ఆనవాలు

తాపం – వేడి, ఉష్ణం, సెగ

సముద్రం – పయోధి, జలది

నానార్ధాలు :

ఎండ – వెలుగు, అతపం

కాలం – సమయం, నలుపు

కాయం – శరీరం, గురి, స్వభావం

జాడ – విధం, ఆచూకి, దారి

దాహం – దప్పిక, కాలడం

ప్రకృతి – వికృతి :

మనిషి – మానిసి

పట్టణం – పత్తనం

సముద్రం – సంద్రం

ఛాయ – చాయ

కధ – కత

జాతీయాలు :

పానకంలో పుడక – సందర్భానికి సంబంధం లేకుండా ఆటంకం కలిగించడం  

తామరతంపరగా – తొందరగా విస్తరించడం

కూర్చున్న కొమ్మను నరుక్కోవడం – ఆశ్రయం ఇచ్చిన వారినే చెడగొట్టడం

నిమ్మకు నీరెత్తినట్లు – ఎలాంటి సమస్య ఉన్నా నిబ్బరంగా ఉండడం

నడుం కట్టాలి – ఒక పని పూర్తి చేయడానికి పూర్తిగా సంసిద్ధం చేయడం

5వ తరగతి  | EVS Short Notes for DSC 2024 | Most IMP Bits

5వ తరగతి | EVS Short Notes for DSC 2024 | Most IMP Bits

  5వ తరగతి  | EVS Short Notes for DSC 2024 | Most IMP Bits 
5వ తరగతి  

5వ తరగతి  | EVS Short Notes for DSC 2024 | Most IMP Bits



వలసలు
 

  • ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళడాన్ని వలస అంటారు .
  • వలస వలన కొన్ని సార్లు కుటుంబాలలో మార్పులు జరుగుతాయి .
  • వలసకు ప్రధానంగా 2 కారణాలున్నాయి
  • 1. సహజ కారణాలు 2. ఆర్థిక కారణాలు
  • వరదలు, తుఫానులు, భూకంపాలు మొదలయిన ప్రకృతి వైపరీత్యాలు వలసలకు సహజ కారణాలు.
  • ఉద్యోగ బదిలీలు, పేదరికం అనునది వలసలకు ఆర్థిక కారణాలు .
  • ప్రకాశం జిల్లాలో ప్రధాన పంట – పొగాకు
  • ప్రకాశం జిల్లాలోని పొగాకు వలస కూలీలు (పచ్చాకు కూలీలు) కాలానుగుణంగా వలస వెళ్ళే కూలీలు కు ఉదాహరణ .
  • పల్లెలనుండి పట్టణాలకు వలస పెరగడంవలన తాత్కాలిక నివాసాలు, వనరుల కొరత, జనసాంద్రత పెరిగిపోతున్నాయి .
  • పేదరికం, ఆర్థిక నియంత్రణ లేకపోవడం, ప్రణాళకాలోపం పట్టణ ప్రంతాలలో మురికి వాడలు ఏర్పడుటకు కారణం అవుతున్నాయి .
  • ఉమ్మడి కుటుంబంలో కుటుంబ పెద్ద ఆ కుటుంబాన్ని ముందుండి నడిపిస్తాడు .
  • కుటుంబ పద్దు (బడ్జెట్‌ అనునది ఆ కుటుంబం తన ఆదాయాన్ని ఏఏ అంశాలకోసం ఖర్చు చేశారో తెలియచేయు పట్టిక .
  • పై చార్జ్‌ వృత్తాకారంలో గీయబడిన ఒక రేఖాచిత్రం .
  • పై చార్జ్‌ అంకెలను భాగాల రూపంలో సూచించుటకు సహయపడుతుంది .
  • కుటుంబ పద్దు అనునది కుటుంబ సభ్యులకు డబ్బు యొక్క విలువను తెలియ చేస్తుంది.
  • కుటుంబ పద్దు డబ్బులను ఏ విధంగా ఖర్చు చేయాలో గుర్తించుటకు సహకరిస్తుంది .
  • అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి కుటుంబ పద్దు సహయపడుతుంది .
  • రక్త హీనతను తగ్గించేవి – ఐరన్‌ , ఫోలిక్‌ మాత్రలు
  • విజయం సాధించడానికి పేదరికం అడ్డంకాదు అన్నది – గనం కలాం
  • APJ కలాం పూర్తిపేరు – అవూల్‌ ఫకీర్‌ జైనులాబ్దిన్‌ అబ్బుల్‌ కలాం
  • APJ కలాం 1931 అక్టోబర్‌ 15 న జన్మించారు
  • APJ కలాం తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు .
  • APJ కలాం నాన్న పేరు – జైనులాబ్బిన్‌
  • APJ కలాం సముద్రం ఒడ్డున ఎగురుతున్న పక్షిని చూసి తాను కూడా అలా ఎగరాలని కలగన్నాడు.
  • మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా ఎవరు – APJ కలాం
  • APJ కలాం భారత దేశానికి 11వ రాష్ట్ర పతి.
  • APJ కలాం రాష్ట్ర పతిగా పనిచేసిన కాలం – 2002 – 2007
  • APJ కలాం మరణించిన రోజు – 2015 జులై 27.
  • మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ లో ౧౮ కలాం విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడుతూ మరణించారు .
  • వాతావరణ మార్చు
  • సాధారణంగా ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలోని తేమ మొదలయిన పరిస్థితులను వాతావరణం అంటారు .
  • భూమి సుందరమైన ఒక నీలిగ్రహం .
  • ఆక్సిజన్‌ ఇవ్వడం ద్వారా , సూర్యకాంతి నుండి రక్షించడం ద్వారా అడవులు మనకు సహాయపడుతున్నాయి.
  • ధృవ ప్రాంతాలలో మంచు కరగడం వలన సముద్ర మట్టం పెరిగి సముద్ర తీరాలలోని ప్రాంతాలు సముద్రంలో కలసి పోతాయి .
  • సముద్ర జలాల ఉష్టోగ్రతలు పెరిగిపోవడం వలన సముద్రంలో పెరిగే మొక్కలు, జంతువులు చనిపోతాయి.
  • ప్లాస్టిక్‌ కప్పులలో వేడి ద్రవాలు తాగడం , ప్లాస్టిక్‌ ప్లేట్లలో ఆహర పదార్థాలు తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం .
  • భూమి రోజు రోజుకూ వేడెక్కడాన్ని గ్లోబల్‌ వార్మింగ్‌ అంటారు.
  • వాతావరణంలో పెరిగిపోతున్న వేడి వలన అప్పుడప్పుడు అడవులు కాలిపోతున్నాయి .
  • గ్లోబల్‌ వార్మింగ్‌ కు కారణం అవుతున్న వాయువు — కార్డన్‌ డై ఆక్సైడ్‌ ,
  • శీతోష్టస్థితిలో కలుగుతున్న మార్పులుకు కారణం — అభివృద్ధి చెందిన దేశాలు .
  • నీరు, బొగ్గు అనునవి సహజవనరులు .
  • రిఫ్రీజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్లు మోటారు వాహనాలు హానికర రసాయనాలు విడుదల చేయడం ద్వారా గ్లోబల్‌ వార్మింగ్‌ కు కారణం అవుతున్నాయి .
  • భూమికి ఊపిరితిత్తుల లాంటివి – అడవులు .
  • సకల జీవరాశులకు ప్రాధమిక ఆహారవనరులు — మొక్కలు
  • జీవావరణ సమతుల్యత కాపాడుతూ నేలకోతను అరికట్టేవి – మొక్కలు .
  • గ్రెటా ధన్‌ బర్గ్‌ పర్యావరణ వేత్త .
  • గ్రెటా ధన్‌ బర్గ్‌ ఏ దేశం — స్వీడన్‌ .
  • గెటా ధన్‌ బర్గ్‌ వాతావరణ మార్పులపై చేపట్టిన ఉద్యమం అంతర్జాతీయ గుర్తింపు పొందింది .
  • గెటా ధన్‌ బర్గ్‌ 2018 వ సంవత్సరంలో ౮110 వాతావరణ మార్పు సదస్సులో తన ప్రసంగం వినిపించింది.
  • 1970 మధ్య కాలంలో అడవులు నరకవద్దని మొదలయిన ఉధ్యమం — చిప్కో ఉధ్యమం .
  • చిప్కో అనగా హిందీ భాషలో అర్థం — హత్తుకొనుట .
  • వినాయక చవితి నాడు ప్లాస్టర్‌ ఆప్‌ పారిస్‌ తో చేసిన విగ్రహాలు వాడడం మానేసి మట్టితో చేసిన విగ్రహాలు వాడాలి .
  • కిస్మస్‌ సందర్భంగా కొనిఫర్‌ చెట్లు నరకడం ఆపివేయాలి
  • అరటి ఆకుల్లో భోజనం ఆరోగ్యానికి మంచిది. అరటి ఆకు ఖనిజ లవణాలను కలిగి ఉంది.
  • వాతావరణంలో కలిగే అసాధారణ మార్పులను వాతావరణ మార్పు అంటారు.
  • వాతావరణ మార్చు ప్రభావాలు – వరదలు, మంచు కరగడం , అడవులు తగలబడడం, కరవు మొదలయినవి .
  • భూమి మీద ఉష్టోగ్రతలు వాతావరణ మార్పుల వలన ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి.
  • మనం ధరించే దుస్తులు
  •  
  • తయారు చేయు విధానం బట్టి దుస్తులు రకరకాలుగా ఉంటాయి
  • బట్టలు తయారు చేయడానికి వాడే ముడి సరకు మనకు ప్రధానంగా మొక్కలు, జంతువుల నుండి లభిస్తుంది .
  • మొక్కలు, జంతువులు నుండి లభించే దారాలు – సహజాదారాలు.
  • రసాయనాలు ఉపయోగించి యంత్రముల ద్వారా తయారు చేయు దారాలు – కృత్తిమ దారాలు
  • నూలు, జనపనార అనునవి మొక్కల నుండి తయారయ్యే సహజ దారాలు కు ఉదాహరణ .
  • పట్టు మరియు ఉన్ని అనునవి జంతువుల నుండి తయారయ్యే సహజదారాలుకు ఉదాహరణ .
  • నూలు మెత్తగా, తెల్లగా ఉంటుంది .
  • నూలు దారాలు దేని నుండి సేకరిస్తారు – పత్తి మొక్కలు .
  • పత్తి మొక్కల కాయలనుండి ముడి దారా . తీస్తారు
  • ముడిదారాలను చరఖా పై వడికి నాణ్యమైన దారాలు చేస్తారు
  • ఈ దారపు కండెలను మగ్గంపై నేస్తారు. వీటిని నూలు వస్త్రములు అంటారు
  • నూలు వస్త్రములు చెమటను పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి
  • నూలు వస్త్రములు మన వాతావరాణానికి అనుకూలమైనవి
  • లెనిన్‌ దుస్తులు ఏ మొక్కల నుండి తయారు చేస్తారు – అవిసె మొక్కలు
  • జనపనార సంచులు, తాళ్ళు, డిజైనర్‌ దుస్తులు జనపనార నుండి తయారు చేస్తారు .
  • పట్టు మృదువైనది, అందమైనది .
  • పట్టుపురుగు యొక్క గొంగళి పురుగులు మల్టరీ ఆకులను తింటూ కకూన్‌ గా మారుతుంది
  • నాణ్యమైన పట్టు తయారు చేయడానికి కకూన్‌ లను ఉడికిస్తారు
  • శీతాకాలంలో ఉన్ని దుస్తులు ధరిస్తాము
  • గొర్రె బొచ్చు కత్తిరించి ఉన్నిని దారాలుగా వాడుకుతారు
  • పరిశ్రమలలో రసాయనాల ద్వారా తయారయ్యే వస్త్రలను సింధటిక్‌ వస్తల లేదా కృత్తిమ వస్తలు అంటారు
  • Ex: పాలీస్టర్‌, రేయాన్‌, నైలాన్‌, టెర్లిన్‌
  • గొడుగులు, రెయాన్‌ కోట్లు జలనిరోధిత గుడ్డతో తయారు చేస్తారు
  • మనం ధరించే దుస్తులు మన శరీరాన్ని కాపాడడమే కాకుండా మన సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తాయి.
  • కేరళలో మగవాళ్ళు లుంగీ ధరిస్తారు
  • తమిళనాడులో మగవాళ్ళు చొక్కా, ధోతి ధరిస్తారు
  • రాజస్థాన్‌ లో మగవాళ్ళు కుర్తా ధరిస్తారు
  • చలి ప్రదేశాలలో నివసించే ప్రజలు ఉన్నితో తయారైన దుస్తులు ధరిస్తారు
  • వేడి ప్రదేశాలలో నూలు వస్త్రములు వాడతారు
  • రంగు దుస్తులను నీడలో ఆరవేయాలి. లేకపోతే అవి రంగును కోల్పోతాయి
  • గాలిని మనం చూడలేము. కానీ అనుభూతి చెందగలం
  • వీచే గాలిని పవనం అంటారు
  • తేలికపాటి పవనాన్ని బ్రీజ్‌ అంటారు
  • బలమైన పవనాన్ని గేల్‌ అంటారు
  • గాలికి బరువు ఉంది. ఒత్తిడి కలిగిస్తుంది స్థలాన్ని ఆక్రమిస్తుంది. శబ్దాలు, వాసనలు మోసుకెళుతుంది .
  • గాలి జత్తిడి (పీడనం) కారణంగా పువ్వుల పరిమళం మనం ఆస్వాదించగలం
  • గాలి జత్తిడి (పీడనం) కారణంగా గొట్టాలతో పండ్ల రసాలు తాగగలము .
  • గాలి జత్తిడి (పీడనం) వలన పవర్‌ హెడ్‌ టాంక్‌ నుండి నీళ్ళు తీసుకోగలుగుతున్నాం .
  • మన అవయువ వ్యవస్థల గురించి తెలుసుకుందాం
  • మన శరీరం వివిధ భాగాలలో నిర్మితమై ఉంటుంది
  • బాహ్య అవయువాలు — చేతులు, కాళ్ళు, కళ్ళు మొదలయినవి
  • అంతర్గత అవయువాలు — గుండె, ఊపిరితిత్తులు, కాలేయం , మూత్రపిండాలు మొదలయినవి
  • పెద్దవారిలో 206 ఎముకలుంటాయి
  • ఈ ఎముకలు ఒక చట్రంలా అమర్హబడి ఉంటాయి . ఈ చటాన్ని అస్థిపంజర వ్యవస్థ అంటారు
  • కండరాలు ఎముకలకు అతకబడి ఉంటాయి
  • ఎముకల పెరుగుదల, శరీరం పొడవు ఎదగడంలో సహాయపడును .
  • అస్థిపంజర వ్యవస్థ , కండరాలు కలసి శరీరానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇస్తాయి
  • మెదడును రక్షించేది – కపాలం
  • ఊపిరితిత్తులు, గుండెను రక్షించేవి – ఉరః పంజరం
  • మానవుని శరీరంలో 12 జతల ప్రక్కటేముకలు ఉంటాయి
  • మన శరీరాన్ని నిటారుగా ఉండేలా చేసేది – వెన్నెముక
  • మృదులాస్థి అనే మెత్తని ఎముకతో తయారయ్యే మన శరీరంలోని భాగం – బాహ్యచెవి (పన్నా), ముక్కు చివరి భాగం
  • మన శరీరంలో అతి పెద్ద ఎముక — తొడఎముక (ఫీమర్‌
  • మన శరీరంలో చిన్న ఎముక — చెవి ఎముక (స్టెప్స్‌ )
  • ఎముకలు కాల్షియం, ఫాస్ఫరస్‌ తో తయారవుతాయి .
  • మనం తీసుకున్న ఆహారం నోటిలోని దంతాల సహాయంతో నమలబడి లాలాజలంతో కలసి మెత్తగా చూర్ణంగా చేయబడును
  • నమలబడిన ఆహారం ఏ భాగం ద్వారా జీర్దాశయం లోనికి ప్రవేశిస్తుంది – ఆహారావాహిక
  • ఆహారం జీర్ణాశయంలో జీర్ణరసాలతో కలుస్తుంది
  • జీర్ణాశయం నుండి ఆహారం చిన్న పేగులోకి చెరీ పూర్తిగా జీర్ణం అవుతుంది
  • పూర్తిగా జీర్ణమైన ఆహారం ఎచట రక్తంలోనికి శోషించబడుతుంది — చిన్న పేగు
  • జీర్ణంకాని ఆహారం పెద్ద పేగులోనికి చేరుతుంది
  • జీరం కానీ ఆహారంలోని కొంత నీరు పెద్ద పేగులో శోషించబడుతుంది
  • పెద్ద పేగులో జీర్ణం కానీ ఆహారం ఏ భాగం ద్వారా బయటకు విసర్జించబడుతుంది – పాయువు
  • సంక్లిష్టమైన ఆహార పదార్థాలు జీర్ణరసాలలో ఉండే ఎంజైమ్‌ ల సహాయంతో రక్తంలోనికి శోషించబడి సరళ పదార్ధాలుగా మారడాన్ని జీర్ణక్రియ అంటారు
  • చిన్న పేగు 6 మీటర్ల పొడవు ఉండి, ముడుతలు పడి ఉంటుంది
  • చిన్న పేగులో ఆహారం జీర్ణమై రక్తంలో శోషించబడే దాకా ఉండడానికి ఈ ముడతలు సహాయపడతాయి .
  • నిరంతరం గాలిని పీల్లుకుంటూ, విడిచి పెడుతూ ఉండే ప్రక్రియను శ్వాస క్రియ అంటారు.
  • గాలి పీల్లడాన్ని ఉచ్చాసం అంటారు
  • గాలి విడిచి పెట్టడాని నిచ్చ్వాసం అంటారు.
  • శ్వాస వ్యవస్థలో భాగాలు — ముక్కు, గాలిగొట్టం, ఊపిరిత్తులు
  • ముక్కుతో పిల్లుకున్న గాలి, గాలి గొట్టం ద్వారా ఊపిరితిత్తులు ఏ కుహరంలో ఉంటాయి — ఉరః కుహరం
  • ఒక జత ఊపిరితిత్తులు స్పాంజీ ఆకారంలో ఉరః కుహరంలో ఉంటాయి .
  • మనం పీల్చే గాలిలో ఉన్న ఆక్సిజన్‌ ఆహార పదార్ధాలను విచ్చిన్నం చేసి, శక్తిని విడుదల చేయడంలో సహాయపడుతుంది .
  • ఉచ్చ్వాస సమయంలో ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి .
  • నిశ్వాస సమయంలో ఊపిరితిత్తులు సంకోచిస్తాయి
  • ఉచ్చ్వాస సమయంలో పీల్దే గాలిలో ఉన్న ఆక్సిజన్‌ ఊపిరితిత్తులలో చేరి ,రక్తంతో కలసి, కణాలను చేరి శక్తిని విడుదల చేస్తుంది
  • ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే కార్టన్‌ డై ఆక్సైడ్‌, నీటి ఆవిరి ఊపిరితిత్తుల నుండి బయటకు రావడాన్ని నిశ్వాసం అంటారు
  • రక్త ప్రసరణ వ్యవస్థలో భాగాలు — గుండె, రక్తం, రక్తనాళాలు
  • రక్తాన్ని రక్తనాళాల ద్వారా శరీరంలోని అన్నీ భాగాలకు పంపు చేసేది మరియు స్వీకరించేది – గుండె
  • రక్తనాళాలు ధమనులు, సిరలుగా ఉంటాయి .
  • మంచి రక్తాన్ని గుండె నుండి ఇతర శరీర భాగాలకు తీసుకుని వెళ్ళేవి – ధమనులు
  • పుపస ధమనులలో చెడు రక్తం ఉంటుంది
  • శరీర భాగాలు నుండి ఆక్సిజన్‌ లేని రక్తాన్ని గుండెకు చేరవేసేవి – సిరలు
  • పుపుస సిరలలో మంచి రక్తం ప్రవహిస్తుంది .
  • గుండె ఛాతిలో ఎడమ వైపు ఉంటుంది
  • గుండెలో గల గదులు – 4
  • గుండెలో పైన ఉన్న 2 గదులను కర్ణికలు, కింద ఉన్న రెండు గదులను జఠరికలు అంటారు.
  • గుండె మోటారు పంపు వలె పనిచేస్తుంది .
  • గుండె రక్తాన్ని పంపు చేసేటపుడు లబ్‌ – డబ్‌ ఆన్‌ శబ్దం వస్తుంది
  • ఆక్సిజన్‌ మరియు ఇతరపోషకాలను శరీర భాగాలకు సరఫరా చేసేది – రక్తం
  • రక్తం శరీర ఉష్ణోగ్రతను నియంతిస్తుంది
  • రక్తం రోగకారక క్రిములతో పోరాడుతుంది .
  • కార్టన్‌ డై ఆక్సైడ్‌ లాంటి వ్యర్ద పదార్ధాలను శరీరం నుండి తొలగించడంలో రక్తం సహాయపడుతుంది
  • రక్తంలో 3 రకాల కణాలుంటాయి
  • 1. ఎర్ర రక్త కణాలు
  • 2. తెల్ల రక్తకణాలు
  • 3. రక్త ఫలకికలు
  • రక్తం నకు ఎరుపు రంగు కలిగించే వర్ణకదార్థం – హిమో గ్లోబిన్‌
  • రక్తంలో హిమోగ్లోబిన్‌ తక్కువ అవడం వలన పిల్లలు రక్త హీనతతో బాధపడుతారు .
  • పల్లీలు , చిక్కిలు తినడం వలన శరీరానికి తగినంత రక్తం వస్తుంది .
  • AP ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో పిల్లలకు హిమోగ్లోబిన్‌ పెంచడానికి పల్లీ చిక్కిలు సరఫరా చేస్తుంది
  • మన శరీరంలో అధికమైన, అనవసరమైన పదార్ధాలను బయటకు పంపిచే వ్యవస్థను విసర్జన వ్యవస్థ అంటారు
  • మన శరీరంలో 3 రకాల విసర్జక అవయువాలు కలవు — 1. చర్మం 2.మూత్రపిండాలు 3.ఊపిరితిత్తులు
  • మన శరీరంలో రెండు మూత్రపిండాలు ఉదరకుహరంలో వెన్నెముకకు ఇరుప్రక్కలా ఉంటాయి .
  • మూత్ర పిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి
  • మూత్ర పిండాలు రక్తాన్ని వడగొట్టి రక్తంలోని మలినాలను తొలగిస్తాయి
  • ఈ మలినాలు మూత్రం రూపంలో బయటకు విసర్జించబడతాయి
  • ఊపిరితిత్తులు స్పాంజీ వంటి నిర్మాణాలు .
  • శ్వాసకియలో పీల్లుకున్న గాలిలోని ఆక్సిజన్‌ ఊపిరితిత్తులకు చేరి రక్తంలో కలుస్తుంది .
  • నిచ్చ్వాస క్రియలో కార్టన్‌ డై ఆక్సైడ్‌ ఊపిరితిత్తులనుండి బయటకు పంపి వేయబడుతుంది
  • మన శరీరంలో పైకి కనిపించే అతిపెద్ద విసర్ణ్ణో అవయువం — చర్మం
  • చర్మం చెమట గ్రంథులని కలిగి ఉంటుంది .
  • మన శరీరంలోని అదనపు నీటిని, లవణాలను చెమట రూపంలో బయటకు విసర్జించేది – చర్మం
  • చెమట చర్మంలో స్వేద రంధ్రముల ద్వారా బయటకువస్తుంది
  • మెదడు నాడుల ద్వారా మన శరీరాన్నినియం త్రిస్తుంది .
  • నాడీ వ్యవస్థలో భాగాలు — మెదడు, వెన్నెముక, నాడులు
  • శరీర భాగాల నుండి మెదడుకు, మెదడు నుండి శరీర భాగాలకు సమాచారాన్ని తీసుకు వెళ్ళేవి – నాడులు
  • జ్ఞానేంద్రియాలన్నీ నాదుల ద్వారా మెదడుతో కలుపబడతాయి
  • చంద్ర శేఖర్‌ వెంకట్రమన్‌ – 1888 – 1970
  • ASK the right questions and nature will open the doors to her secrets
  • CV రామన్‌ తమిళనాడులోని తిరచిరాపల్లిలో 1888 నవంబర్‌ 7న జనించారు
  • మద్రాసు విశ్వవిద్యాలయంలో చదివారు.
  • 1928 ఫిభ్రవరి 28న రామన్‌ ఎఫెక్ట్‌ కనుగొన్నారు
  • 1930 వ సంవత్రంలో CV రామన్‌ కు భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది
  • ప్రతిసంవత్సరం ఫిభ్రవరి 28న జాతీయ సైన్స్‌ దినోత్సవం జరుపుకుంటారు
  • CV రామన్‌ గారికి 1954 వ సంవత్సరంలో భారతరత్న లభించింది
  • 1970 నవంబర్‌ 21 న 6౪ రామన్‌ గారు బెంగుళూరులో మరణించారు
  • వ్యవసాయం
  • వరిసాగులోని వివిధ దశలు:-
  • 1. పొలాన్ని దుక్కిదున్నడం:- మొదట రైతులు పొలాన్ని వ్యవసాయానికి సిద్దం చేస్తారు. ఎడ్లతో గాని, టాక్టర్‌ తో గాని పొలాన్ని దున్నుతారు
  • 2. చదును చేయడం :- దున్నిన పొలాన్ని నీటితో నింపి నాట్లు వేయడానికి చదును చేస్తారు
  • 3. నాట్లు వేయడం: రైతులు వారి మదుల నుండి తెచ్లి చదును చేసిన పొలంలో నాటుతారు
  • 4. నీరు పెట్టడం :
  • 5. ఎరువులు వేయడం
  • 6. సస్వరక్షణ:. మొక్కలకు వ్యాధులు సోకుండా నివారించడానికి కిమీ సంహారక మందులు వాడతారు
  • 7. పంటకోత
  • 8. నూర్చడం
  • 9. తూర్చారబట్టడం :- తూర్పార బట్టడం ద్వారా గింజలను ఊకను వేరు చేస్తారు
  • 10. నిల్వచేయడం
  • 11. మర పట్టించడం :
  • పొలానికి నీటి సరఫరా చేయడాన్ని నీటి పారుదల అంటారు.
  • వరిని నీటి ఆధారిత పంటగా చెపుతారు…
  • వ్యవసాయానికి నీటి సరఫరా 4 రకాలుగా చేస్తారు
  • 1. క్షేత్ర నీటి పారుదల :- వర్ష పాఠం తగినంతగాలేనపుడు ఈ విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు
  • 2.చాళ్ళు నీటి పారుదల :. చాళ్ళు మరియు కందకాలు తవ్వివాటి ద్వారా పొలానికి నీటి పారుదల చేస్తారు
  • 3. స్రింక్లర్‌ నీటి పారుదల :. నియంత్రిత పద్దతిలో ప్రత్యక్ష పైపుల ద్వారా వర్షం వలె నీటిని చల్లుతారు
  • 4.బిందు సేద్యం:- నీటి గొట్టానికి చిన్న రంధ్రములు చేసి నేలపై ఉంచి నీరు ఆ రంధ్రముల ద్వారా నేరుగా మొక్కల వేర్లకు చేరే ఏర్పాటు చేస్తారు
  • వ్యవసాయంలో ఉపయోగించే సాంప్రదాయ పనిముట్లకు ఉదా:- నాగలి, గడ్డపార, కొడవలి, విత్తనాలు చల్లు గొర్రు.
  • ఆధునాతన వ్యవసాయ పనిముట్లకు దాహరణ — వరినాట్ల యంత్రం, వరి కోత యంత్రం
  • మొక్కల పెరుగుదల పంట దిగుబడి, నేల సారంపై ఆధారపడి ఉంటుంది
  • ఎరువులు ఉపయోగించడం వలన పంట పెరుగుదల, దిగుబడి పెంచవచ్చు .
  • సహజ ఎరువులకు ఉదాహరణ :- కంపోస్ట్‌, మొక్కల అవశేషాలు, ఆవుపేడ, జంతువుల విసర్జితాలు
  • రసాయన ఎరువులు నేలలో ఉండిపోయి నేల సారాన్ని తగ్గిస్తాయి
  • గొంగళి పురుగు మాత్‌ గా మారి పంటను నాశనం చేస్తుంది
  • గొంగళి పురుగు వివిధ దశలలో పంటను నాశనం చేస్తుంది .
  • పరాగసంపర్కం మరియు విత్తనాలు పర్పడడంలో ప్రముఖపాత్రవహించేవి – సీతాకోకచిలుక, తేనెటీగ
  • సీతాకొక చిలుక జీవిత చరిత్ర :- గుడ్డు – లార్వా – ప్యూపా – ఇమాగో
  • కప్ప లార్వాను ఏమని పిలుస్తారు – టాడ్‌ పోల్స్‌ (తోక కప్పలు)
  • టాడ్‌ పోల్‌ చిన్న చేపను పోలి ఉంటుంది
  • టాడ్‌ పోల్‌ తరువాత కప్పగా మారుతుంది
  • కప్ప జీవిత చక్రం:- గుడ్ల సమూహం — టాడ్‌ పోల్‌ – కాళ్ళు కలిగిన టాడ్‌ పోల్‌ – చిరుకప్ప – కప్ప
  • కప్ప టాడ్‌ పోల్‌ గా ఉన్నపుడు శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుంది
  • కప్పగా మారిన తరువాత కీటకాలను తిని ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుతాయి
  • పర్యావరణం దెబ్బతినడం గురించి తలియచేయడంలో మంచి సూచికలు — కప్పలు, సీతాకొక చిలుకలు
  • కిమిసంహరక మందుల అధిక వాడకం అనునది కాన్సర్‌ వంటి రోగాలకు కారణం అవుతుంది
  • రైతులు సేంద్రీయ వ్యవసాయ పద్దతులు ఉపయోగించాలి
  • సేంద్రీయ వ్యవసాయంలో ఉపయోగించే ఎరువులు – పశువులవ్యర్దాలు , వర్షి కంపోస్ట్‌, నూనె మరియు జీవవ్యర్జాలు
  • సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం చేయడాన్ని – ZBNF అంటారు
  • ZBNF అనగా జీరోబడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌
  • సేంద్రీయ వ్యవసాయం వలన లాభాలు
  • 1. పర్యావరణ పరిరక్షణ
  • 2. కాలుష్యం తగ్గిస్తుంది
  • 3. నీటిని పొదుపు చేస్తుంది
  • 4. నేల కోత తగ్గిస్తుంది
  • 5. నేల సారం పెంచుతుంది
  • ధాన్యాన్ని ఎండబెట్టి గాలి, వెలుతురు ఉన్న గదులలో నిలువచేస్తారు.
  • ధాన్యాన్ని గదిలో నిలువచేసే ముందు పురుగు మందులు చల్లి గదిని శుభ్రం చేస్తారు .
  • ఆధునిక నిలువ చేయు పద్ధతిలో ధాన్యాన్ని గోదాములలో, శీతలీకరణ గోదాములలో నిల్వ చేస్తారు
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమైన పంట వరి
  • మన రాష్ట్రంలో 62 శాతం మండి వ్యవసాయం ముఖ్యమైన వృత్తిగా కలిగి ఉన్నారు
  • శ్రీకాకుళంలో ప్రధాన పంట — వరి
  • విశాఖపట్టణంలో ప్రధాన పంట — పసుపు
  • విజయ నగరంలో ప్రధాన పంట — అరటి
  • తూర్పు గోదావరి ప్రధాన పంట — వరి
  • పశ్చిమ గోదావరి ప్రధాన పంట — వరి, అరటి
  • కృష్ణలో ప్రధాన పంట — వరి, పశు గ్రాసం , పసుపు
  • గుంటూరులో ప్రధాన పంట — వరి, పశుగ్రసం, జొన్న, పసుపు, టమాటా
  • ప్రకాశంలో ప్రధాన పంట — పశుగ్రసం, జొన్న, కమలాలు
  • నెల్లూరులో ప్రధాన పంట — వరి
  • కడపలో ప్రధాన పంట — అరటి, టమాటా, కమలా, జొన్నలు
  • కర్నూలులో ప్రధాన పంట – టమాటా, కమలా, కీర, పసుపు, అరటి, జొన్న
  • చిత్తూరులో ప్రధానపంట — టమాటా, పశుగ్రసం, కీర
  • అనంతపురంలో ప్రధానపంట – టమాటా, అరటి, కమల, వరి, కీర
  • చిరుధాన్యాలకు ఉదాహరణ — కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఉదలు
  • వరి, గోధుమ, చిరుధాన్యాలు ఉత్వత్తి చేయడంలో భారత దేశం ఎన్నవ స్థానంలో ఉంది – 2వ
  • మన ఆరోగ్యం మన ఆహార అలవాట్ల పై ఆధారపడి ఉంటుంది
  • మన ఆహారంలో పిండిపదార్థాలు, ప్రోటి లు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండాలి
  • నీరు ఎంతో విలువైనది
  • గ్రామాలలో చెరువులు, నూతులు, బోరుబావులు ప్రధానమైన నీటి వనరులు
  • నీటికి ప్రధాన వనరు – వర్షపు నీరు
  • వర్షపు నీటిని నిల్వచేయుటకు చెరువులు నిర్మిస్తాం
  • నదులలో నీరు నిల్వ చేయుటకు ఆనకట్టలు, జలాశయాలు నిర్మిస్తాం
  • జలాశయాలలో నీటి మట్టం పెంచడానికి నాదివాలుకి అడ్డుగా నీటిని నిలువ చేయుటకు నిర్మించబడిన అడ్డుకట్ట ను ఆనకట్ట అంటారు
  • మన రాష్ట్రంలో ముఖ్య నదులు – గోదావరి, వంశధార, పెన్నా
  • మన రాష్ట్రంలో ఉన్న జలాశయాలు — పులిచింతల, తెలుగుగంగ, తోటతల్లి బ్యారేజ్‌, కండలేరు జలాశయం, వెలుగొండ
  • నాగార్జున సాగర్‌ , శ్రీశైలం ఆనకట్టలు ఏ నదిపై నిర్మించారు – కృష్ణానది
  • సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారెజ్‌ గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద నిర్మించబడింది
  • సర్‌ ఆర్థర్‌ థామస్‌ కాటన్‌ బ్రిటీష్‌ దేశానికి చెందిన నీటి పారుదల శాఖ ఇంజనీరు
  • గోదావరి నదిపై తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం మరియు పచ్చిమ గోదావరి జిల్లా విజ్ణేశ్వరం మధ్యలో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించింది – సర్‌ ఆర్థర్‌ థామస్‌ కాటన్‌
  • భారతదేశంలో పొడవైన నదులలో కృష్ణానది 4వ స్థానంలో ఉంది
  • కృష్ణానది మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం వద్ద జన్మించింది
  • కృష్ణానది పొడవు సుమారు 1400 km
  • కృష్ణానదికి మరొకపేరు – కృష్ణవేణి
  • కృష్ణ నది మహారాష్ట్ర, AP, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలకు నీటి వనరు .
  • కృష్ణానది ఉపనదులు = భీమ , గాయతి, ఘటప్రభ, కోయన , మలప్రభ, మున్నేరు, నీర, పాలెం, పంచగంగ, తుంగబథ్ర, వేమన, వ్యర
  • కృష్ణానది కృష్ణాజిల్లా లోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది
  • నాగార్జున సాగర్‌ అనే బహళార్ధక ప్రజెక్ట్‌ కృష్ణా నదిపై ఏ సంవత్సరంలో నిర్మించబడింది – 1967
  • నాగార్జున సాగర్‌ ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లా నాగార్జున కొండ, తెలంగాణా రాష్ట్రంలో నల్గొండ జిల్లా మధ్యలో నిర్మించారు
  • నాగార్జున సాగర్‌ కు 2 కాలువలు ఉన్నాయి
  • 1. కుడికాలువ         2. ఎడమ కాలువ
  • నాగార్జున సాగర్‌ కుడి కాలువను పమంటారు – జవహర్‌ కాలువ
  • నాగార్జున సాగర్‌ ఎడమ కాలువను ఏమంటారు — లాల్‌ బహుదూర్‌ కాలువ
  • ప్రకాశం బ్యారేజ్‌ విజయవాడలో కృష్ణా నదిపై నిర్మించారు .
  • ప్రకాశం బ్యారేజ్‌ పొడవు – 1.2 km
  • ప్రకాశం బ్యారేజ్‌ ఏ రెండు జిల్లాల మధ్య ఉంది – కృష్ణా, గుంటూరు
  • ప్రకాశం బ్యారేజ్‌ ప్రారంభమైన సంవత్సరం — 1957
  • ప్రకాశం బ్యారేజ్‌ ప్రారంభించింది — ప్రకాశం పంతులు
  • ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి – శ్రీ టంగుటూరి ప్రకాశం
  • కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలాలు – మహాబళేశ్వరం , ఆలంపూర్‌ జోగులాంబ , విజవాడ
  • కనకదుర్గ , అమరావతి అమరలింగేశ్వరుడు
  • కృష్ణానది ఒడ్డున గల నగరాలు — విజయవాడ (AP) ,సింగిలి , కరడ (మహారాష్ట్ర
  • వంశధార నది ప్రవహించే జిల్లా – శ్రీకాకుళం
  • నాగావళి నది ప్రవహించే జిల్లా – శ్రీకాకుళం, విజయనగరం
  • గోదావరి నది ప్రవహించే జిల్లాలు — తూర్పు, పశ్చిమ గోదావరి
  • పెన్నా నది ప్రవహించే జిల్లాలు – అనంతపురం, కడప, నెల్లూరు
  • కృష్ణానది చేపలు పట్టేవారికి జీవనాధారం .
  • AP టూరిజం శాఖ శ్రీశైలం వద్ద కృష్ణానది నిలువ జలాలతో బోట్‌ రైడింగ్‌ సౌకర్యం ఏర్పరచింది
  • విజయవాడలో భవానీ బ్వీపం ఒక పర్యాటక ప్రదేశం
  • 2009 కర్నూలు నగరంలో ఏ నది వలన వరద వచ్చింది – తుంగభథ్ర
  • కర్నూలు వరదలలో 30 అడుగుల ఎత్తు వరకు మునిగిపోయారు
  • కర్నూలులో నీరు తొలగించుటకు ౩ రోజుల సమయం పట్టింది
  • 2019 కృష్ణానది వరదల వలన కృష్ణా, గుంటూరు జిల్లా లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి.
  • పాముల లంక గ్రామం వరదలకు లోనయ్యే ప్రాంతం . ఇది తోట్లవల్లూరు మండలం, కృష్ణాజిల్లాలో గలదు
  • వర్షాభావ పరిస్థితులకు ఉదాహరణ — అనంతపురం జిల్లా
  • మనకు ఎవరు సేవ చేస్తారు
  • ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించే ఒక సేవాసంస్థ — ప్రభుత్వం
  • మనదేశంలో 3 స్థాయిలలో ప్రభుత్వాలు ఉన్నాయి
  • 1. స్థానిక ప్రభుత్వం
  • 2. రాష్ట్ర ప్రభుత్వం
  • 3. కేంద్ర ప్రభుత్వం
  • స్థానిక ప్రభుత్వం : గ్రామాలు, పట్టణాలలో, నగరంలో ఉండే స్థానిక ప్రభుత్వాన్ని స్థానిక ప్రభుత్వం అంటారు.
  • ఉదాహరణ: గ్రామపంచాయితీ, మండల పరిషత్‌,జిల్లా పరిషత్‌, పురపాలక మరియు నగర పాలక సంస్థలు
  • గ్రామపంచాయితీ :
  • గ్రామపంచాయితీ గ్రామంలో నివసించే ప్రజల బాగోగులు చూసుకుంటుంది.
  • 18 సంవత్సరాలు పైబడిన గ్రామస్తులచే గ్రామపంచాయితీ సభ్యులు ఎన్నుకోబడతారు .
  • పంచాయితీ సభ్యులను 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకొంటారు
  • గ్రామపంచాయితీ పెద్దను ఏమంటారు – సర్పంచ్‌
  • సర్పంచ్‌ పదవీ కాలం – 5 సంవత్సరాలు
  • గ్రామీణ ప్రాంత ప్రజలకు వారికి కావలసిన సేవలు పారదర్శకతతో అందించడానికి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులచే ఏర్పాటు చేసిన వ్యవస్థ — గ్రామ సచివాలయం
  • గ్రామ సచివాలయంలోని ఉద్యోగుల సంఖ్య – 11
  • మండల పరిషత్‌ :
  • కొన్ని గ్రామాలు కలసి ఒక మండలం ఏర్పడుతుంది
  • మన రాష్ట్రంలో గల మండలాలు – 676
  • మండల స్థాయిలోని అన్నీ సంక్షేమ, అబివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేది – మండల అబివృద్ధి అధికారులు
  • మండల పరిషత్‌ అధ్యక్షుడు మండల పరిషత్‌ సభ్యులచే ఎన్నుకోబడతారు
  • MPTC అనగా  – mandal parishath territoriyal council
  • MPTC పదవీకాలం – 5 సంవత్సరాలు
  • మండల పరిషత్‌ కార్యాలయం — విధులు:
  • మండల పరిషత్‌ కార్యాలయానికి అధిపతి – మండల అభివృద్ధి అధికారి (MPDO)
  • ప్రాధమిక విద్య అందేలా చూస్తుంది
  • వ్యవసాయం, పశువుల పెంపకం, చేపల పెంపకం, కోళ్ళ పరిశ్రమల అబివృద్ధిలో పాల్గొంటుంది .
  • రోడ్డు, నీటిపారుదల నిర్మాణం మరియు మరమత్తులు చేస్తుంది
  • రక్షిత మంచినీరు అందించడం, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, మురికి నీటి పారుదల సౌకర్యం వంటివి కల్పిస్తుంది .
  • పోలీస్‌ స్టేషన్‌ – విధులు:
  • దీనికి అధిపతి – సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ (SI)
  • శాంతి భధ్రతలు కాపాడుతుంది
  • ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి , నమోదు చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తుంది .
  • మండల రెవిన్యూ కార్యాలయం — విధులు:
  • దీనికి అధిపతి — తహసీల్డార్‌
  • గ్రామరెవిన్యూ అధికారుల (VRO) పనితీరు పర్యవేక్షిస్తారు .
  • MPDO తో కలసి అవసరం ఉన్నవారికి సంక్షేమ కార్యక్రమాలు అందచేస్తారు .
  • కులధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రము అందచేస్తారు.
  • వెట్టి చాకిరీ చేయు ప్రజలకు విముక్తి కలిగిస్తారు .
  • రైతులకు పట్టుదారు పాస్‌ పుస్తకాలు మంజూరు చేస్తారు .
  • భూ సంబంధిత సమస్యలు పరిష్కరిస్తారు .
  • ఎన్నికలు నిర్వహిస్తారు.
  • ప్రాధమిక ఆరోగ్య కేంద్రం — విధులు:
  • దీని అధిపతి – ఆరోగ్య అధికారి .
  • ఉప ఆరోగ్య కేంద్రములు నిర్వహించి వాటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు.
  • మండలంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేస్తారు .
  • తల్లి బిడ్ద సంక్షేమం – పథకంలో భాగంగా సురక్షిత మైన కాన్సులకు బాధ్యత వహిస్తారు .
  • బ్యాంక్‌ – విధులు:
  • దీని అధిపతి – బ్యాంక్‌ నిర్వహణ అధికారి (Bank Manager)
  • ప్రజలనుండి సొమ్ము సేకరించి ఖాతాలో జమచేయడం, అవసరమైన వారికి రుణాలు అందజేస్తారు.
  • పొదువు మరియు డిజిటల్‌ లావాదేవీలు చూస్తారు.
  • మండల విద్యా వనరుల కేంద్రం:
  • దీని అధిపతి – మండల విద్యాశాఖాధికారి (MEO)
  • బడి ఈడు గల పిల్లలను పాఠశాలలో నమోదు చేస్తారు .
  • బడిలో పిల్లలకు మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య ఇతర కార్యక్రమాల అమలు పర్యవేక్షిస్తారు.
  • పశు వైద్యశాల:
  • దీని అధిపతి – పశువైద్యాధికారి
  • పశువుల ఆరోగ్యం సంరక్షణ, గాయపడిన జంతువులకు వైద్యం అందిస్తారు
  • జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధులను గుర్తించి వాటికి నివారణ, వాటికి ఇవ్వవలసిన బలవర్జకం అయిన ఆహారంపై రైతులకు అవగాహన కల్పిస్తారు
  • జిల్లా పరిషత్‌:
  • కొన్ని మండలాలు కలసి జిల్లా ఏర్పడుతుంది
  • మన రాష్ట్రంలో గల జిల్లాలు – 13
  • ప్రజల సంక్షేమం కొరకు జిల్లాన్ధాయిలో అనేక కార్యక్రమాలు అమలు పరచేది – జిల్లా పరిషత్‌
  • ZPTC సభ్యులను ఎన్నుకునేది – మండలంలోని ఓటర్లు
  • ZPTC అనగా  – zilla parishath territorial council
  • ZPTC సభ్యులు అందరూ కలిసి జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు
  • జిల్లాలోని అన్నీ ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించేది – జిల్లా కలెక్టర్‌
  • పురపాలక మరియు నగర పాలకసంస్థలు:
  • పట్టణాలలో గల స్థానిక ప్రభుత్వం – పురపాలక సంస్థ
  • నగరాలలో గల స్థానిక ప్రభుత్వం – నగర పాలక సంస్థ
  • మన రాష్ట్రంలో గల పురపాలక సంస్థలు – 74
  • మన రాష్ట్రంలో గల నగరపాలక సంస్థలు – 16
  • పురపాలక సంఘ అధిపతి — చైర్మన్
  • నగరపాలక సంస్థ అధిపతి – మేయర్‌
  • వగరపాలక పురపాలక సంస్థ విధులు:
  • 1. వీధి దీపాల ఏర్పాటు
  • 2. జనన,మరణాల నమోదు
  • 3. గృహాలు,పార్కుల నిర్మాణం
  • 4. ఆసుపత్రుల ఏర్పాటు
  • 5. రోడ్ల నిర్మాణం, మరమ్మతులు నిర్వహణ
  • 6. రక్షిత మంచి నీటి సౌకర్యం కల్పించడం
  • 7. చెత్తను శుభ్రం చేయడం, వ్యర్థ పదార్థాలు తొలగించడం
  • రాష్ట్ర ప్రభుత్వం:
  • ప్రతి రాష్ట్రానికి సొంత ప్రభుత్వం ఉంటుంది.
  • రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి మరియు మంత్రి మండలి కలిగి ఉంటుంది.
  • AP గవర్నర్‌ – శ్రీ బిశ్వఛందన్‌ హరిభూషన్‌ గారు
  • AP ముఖ్యమంతిరి – శ్రీ ys జగన్మోహన్‌ రెడ్డి గారు
  • AP విద్యాశాఖామంత్రి — శ్రీ బొత్స సత్యనారాయణ .
  • రాష్ట్రంలో చట్టాలు రూపోందించుకోవడంలో, వాటిని అమలు పరచడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది.
  • మంత్రి మండలిని ఎవరు నియమిస్తారు – ముఖ్యమంత్రి సలహామేరకు గవర్నర్‌.
  • కేంద్ర ప్రభుత్వం:
  • కేంద్ర ప్రభుత్వానికి అధిపతి – రాష్ట్ర పతి
  • ప్రధాన మంత్రి నియమించేది – రాష్ట్ర పతి
  • కేంద్ర మంత్రి మండలిని ఎవరు నియమిస్తారు – ప్రధాన మంత్రి సలహామేరకు రాష్ట్రపతి .
  • తపాలా, రైల్వేలు, టెలికాం,విమానాశ్రయాలు,ప్రకృతి విపత్తులు నిర్వహణ వంటి సేవలు అందించేది – కేంద్ర ప్రభుత్వం
  • రాష్ట్రాలలో అత్యున్నత న్యాయ వ్యవస్థ — హైకోర్టు
  • దేశంలో అత్యున్నత న్యాయవ్యవస్థ – సుప్రీం కోర్టు
  • ప్రభుత్వ సంస్థలు ప్రజలు ప్రాధమిక అవసరాలు తీరుస్తాయి.
  • పప్రపంచాన్ని చుసివద్దాం
  • రాయచోటి ఏ జిల్లాలో గలదు – కడప .
  • విశాఖపట్టణంలో అంతర్జాతీయ విమానాశ్రయం కలదు .
  • కృష్ణపట్నం ఓడరేవు ఏ జిల్లాలో గలదు — నెల్లూరు
  • ఒకదేశం నుండి ఇంకొక దేశానికి వెళ్లడానికి అంతర్జాతీయ రవాణా వ్యవస్థ ఉపయోగిస్తాం .
  • విదేశాలకు వెళ్లడానికి ప్రధాన మార్గాలు – వాయుమారాలు, జలమార్గాలు .
  • జలప్రయాణానికి వాయు మార్గంతో పొలిస్తే ఖర్లు తక్కువ, సమయం ఎక్కువ పడుతుంది .
  • శ్రీకాకుళం జిల్లా కింతలి గ్రామంలో రైతులు పండ్లుకూరగాయలు, ఆకుకూరలు పండించి మార్కెట్‌ లలో అమ్ముతారు .
  • మన ప్రదేశంలో తయారు చేయు ఉత్పత్తులు అధికంగా ఉంటే ఇతర ప్రదేశాలకు పంపబడతాయి. ఈ పద్ధతిని ఎగుమతి అంటారు.
  • ఎగుమతుల ద్వారా లభించేది – విదేశీ కరెన్సీ
  • విదేశీ కరెన్సీ ఆయాదేశాల ఆర్థిక వృద్ధికి సహాయపడును.
  • మనకు అవసరమైన ఉత్పత్తులు ఇతర ప్రాంతముల నుండి దిగుమతి చేసుకుంటారు .
  • పూసర్ల వెంకట సింధు బ్యాట్మింటన్‌ క్రీడాకారిణి.
  • 2016 లో PV సింధు ప్రపంచ బ్యాట్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ లో స్వర్ణ పథకం గెలుచుకుంది.
  • PV సింధు ఆటలలో పాల్గొనడం కోసం స్విట్టర్లాండ్‌, మలేషియా, రియోడి జెనీరో వంటి ప్రదేశాలు దర్శించింది .
  • PV సింధు భారత ప్రభుత్వం నుండి పొందిన పురస్కారాలు – పద్మ భూషణ్‌, పద్మశ్రీ, రాజీవ్‌ ఖల్‌ రత్న
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ౧౪ సింధు ఏ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి సత్కరించింది – డిప్యూటీ కలెక్టర్‌
  • ఆంధ్రా కాశ్మీర్‌ గా పిలవబడే ప్రదేశం – లంబసింగి
  • లంబసింగి విశాఖపట్టణం జిల్లాలో ఉన్న గిరిజన ప్రాంతం. .
  • గ్లోబల్‌ విలేజ్‌ అనగా ప్రపంచం ఒక కుగ్రామం అని అర్థం .
  • సమాచార వ్యవస్థ మరియు రవాణా వ్యవస్థలు కలిసి ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేశాయి.కావున మొత్తం ప్రపంచాన్ని గ్లోబల్‌ విలేజ్‌ అంటున్నాం.
  • సమాచార, రవాణా వ్యవస్థలను ఇంటర్నెట్‌ విపరీతంగా ప్రభావితం చేసి ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్షి వేసింది .
  • గ్లోబలైజేషన్‌ వలన ప్రజల మధ్య దూరం తగ్గించబడింది. ప్రపంచంలో ఏ ప్రదేశంలో ప్రజలైనా చేరుకోదగ్గ విధంగా కనెక్ట్‌ చేయబడింది .
  • ప్రమాదాలు –  ప్రధమ చికిత్స
  • పాఠశాలలో అగ్ని ప్రమాదాలు నివారించడానికి ప్రతి పాఠశాల యందు మంటలను ఆర్పే యంత్రము ఏర్పాటు చేయాలి.
  • గోడలపై 6 అడుగుల కంటే ఎత్తులో స్విచ్‌ బోర్డ్‌ లు ఏర్పాటు చేయాలి .
  • వైకల్యం ఉన్న విద్యార్థుల కోసం ర్యాంప్‌ నిర్మించాలి .
  • రోడ్లను దాటడానికి zebra crossing ఉపయోగించాలి .
  • హాస్పిటల్‌ కు వెళ్ళే లోపు బాధితుడుకు అందచేయు తక్షణ చికిత్సను ప్రధమ చికిత్స అంటారు.
  • ప్రధమ చికిత్స పెట్టె (+) ఆకారపు గుర్తు కలిగిఉంటుంది .
  • ప్రధమ చికిత్స పెట్టెలో ఉండేవి – దూది, టింక్షర్‌, అయోడిన్‌, అయింట్‌ మెంట్‌ , మెడికేటెడ్‌ ప్లాస్టర్‌, కత్తెర, బ్యాండెజ్‌ క్లాత్‌, యాంటీసెప్టిక్‌ క్రీం, పెట్రోలియం జెల్లీ, సబ్బు, జ్వరమానిని .
  • అ) గాయాలకు ప్రధమ చికిత్స
  • 1. తడి దూదిని ఉపయోగించి గాయాన్ని సబ్బు నీటితో గాని, సెప్టిక్‌ లోషన్‌ తో గాని శుభ్రం చేయాలి.
  • 2. దూదితో టింక్షర్‌ ఆయోడిన్‌ ను గానీ, యాంటీసెప్టిక్‌ క్రీము గాని రాయాలి.గాజు గుడ్డతో కట్టుకట్టి పైన ప్లాస్టర్‌ వేయాలి
  • ఆ) కాలిన గాయాలకు ప్రధమ చికిత్స
  • 1. కాలిన గాయం పై కొంత సేపు చల్లని నీరు పోయాలి
  • 2. కాలిన గాయం తీవ్రమైనది అయితే లేపనం పూయాలి
  • 3. కాలిన గాయం పైన ఏర్పడిన నీటి బొబ్బలను చిదమకూడదు,కట్టు కట్టకూడదు, రుద్దకూడదు, ఐస్‌ ఉపయోగించకూడదు
  • ఇ) కుక్క కాటుకు ప్రధమ చికిత్స
  • 1. కుక్క కరిచిన ప్రదేశమును సబ్బు లేదా యాంటీసెప్టిక్‌ లోషన్‌ కడగాలి .
  • 2. గాయాన్ని ప్లాస్టర్‌ తో గానీ గాజుగుడ్డతో కానీ కట్టుకట్టకూడదు .
  • ఈ) పాము కాటుకు ప్రధమ చికిత్స
  • 1. మొదట కాటు వేయబడిన భాగాన్ని నిశితంగా పరిశీలించి,విష సర్పమో కాదో నిర్ధారించుకోవాలి .
  • 2. సాధారణంగా పాము కాటుకు గురైన వ్యక్తి భయంతో స్పృహ తప్పి పడిపోతాడు అతని భయం తగ్గించేలా మాట్లాడాలి.
  • 3. విషం శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా ఒక గుడ్డతో గాయం పై భాగంలో గట్టిగా కట్టుకట్టాలి .
  • 4. పాము కరిచిన వ్యక్తి అచేతనంలోకి పోకుండా చూడాలి .
  • 5. వెంటనే బాధితుడిని డాక్టరు వద్దకు తీసుకువెళ్లాలి
  • ఉ) తేలు కుట్టినప్పుడు ప్రధమ చికిత్స
  • 1. సబ్బునీళ్లతో గాయాన్ని కడగాలి .
  • 2. గాయం భాగం పై నొప్పి తగ్గేటట్లు మెల్లగా ఒత్తాలి .
  • 3. వెంటనే బాధితుడిని డాక్టరు వద్దకు తీసుకువెళ్లాలి
  • ఊ) నీళ్ళలో మునిగినప్పుడు — ప్రధమ చికిత్స
  • సాధారణంగా నీళ్ళలో మునిగిన వ్యక్తి ఎక్కువ నీళ్ళను మింగివేస్తాడు.అందువలన అచేతన అవస్థలోనికి వెళ్ళిపోతాడు.శ్వాస నాళాలు నీటితో మూసుకుపోతాయి .
  • 1. తాగిన నీరు బయటకు వచ్చేలా రెండు చేతులతో పొట్టపై ఒత్తాలి.
  • 2. శిక్షణ తీసుకున్నవారైతే నోటితో శ్వాస మార్గంలో నీళ్ళను తొలగించి మళ్ళీ శ్వాస ఆడేలా చేస్తారు.
  • భారత ప్రభుత్వం ఎవరైన ఒక వ్యక్తికి ఏదయినా అత్యవసర సేవ అవసరం అయినప్పుడు సహాయ చర్యల కోసం కొన్ని ఉచిత ఫోన్‌ సేవలు కల్పించింది .
  • వైద్య సేవల కొరకు , పోలీసు, అగ్ని ప్రమాదాలు నివారణ కొరకు 24 గంటలు అందుబాటులో ఉండే సేవలను అత్యవసర సేవలు అంటారు.
  • ఉచిత వైద్య సలహాలు అందించే సేవ – 104
  • 104 వారు ఫోన్‌ ద్వారా ఉచిత వైద్య సలహాలు అందిస్తారు
  • గ్రామీణ ప్రాంతాల వారికి ఈ సేవలు బాగా ఉపయోగపడతాయి .
  • పోలీసుల నుండి లభించే అత్యవసర సేవ phone no – 100
  • ఎవరైనా వ్యక్తికి ఏదైనా అత్యవసర సేవ అవసరం అయినప్పుడు సంప్రదించవలసిన నంబర్‌ – 108
  • భారత స్వాతంత్ర్య  ఉద్యమం
  • 1947 ఆగప్ట్‌ 15 న మన దేశం బ్రిటీష్‌ వాళ్ళ నుండి స్వాతంత్రం పొందింది .
  • చంద్ర గుప్త మౌర్యుడు , అక్టర్‌ , షాజహాన్‌ , సముద్ర గుప్తుడు వంటి గొప్ప రాజులు భారతదేశాన్ని గొప్ప దేశంగా తీర్చి దిద్దారు .
  • భారతదేశంలో వీరి కాలంలో నలందా , తక్షశిల వంటి గొప్ప విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి.
  • భారతదేశాన్ని అరబ్బుల దండయాత్రలు , ఐరోపా వారు బలహీనపరచి భారతదేశాన్ని వారి పాలన కిందకు తెచ్చుకున్నారు.
  • ఒక వ్యక్తి లేదా ఒక సందర్భానికి గౌరవసూచనగా నిర్మించబడిన ఒక విగ్రహం లేదా భవనాన్ని చారిత్రక కట్టడం అంటారు .
  • చారిత్రక కట్టడాలకు ఉదాహరణ : తాజ్‌ మహల్‌ , ఎర్ర కోట, సాంచీ స్తూపం .
  • భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం — 1498
  • భారతదేశానికి సముద్రమార్గం కనుగొన్న పోర్టుగీసు నావికుడు – వాస్కోడిగామా .
  • పోర్చుగీస్‌ వారు, డచ్చివారు, French వారు, British వారు ఒకరి తర్వాత ఒకరు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు .
  • బ్రిటీష్‌ వారు ఈస్ట్‌ ఇండియా కంపెనీ స్థాపించి 1757 నుండి భారతీయ రాజ్యాలను పాలించడం మొదలు పెట్టారు .
  • 1857 లో భారత దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రజలు 8149 వారిపై తిరిగుబాటు చేశారు .
  • ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగిన సంవత్సరం – 1857 .
  • భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పడిన సంవత్సరం — 1885 .
  • భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపకుడు – ఉ౦ హ్యూమ్‌
  • గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత దేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం – 1915
  • మహాత్మాగాంధీ 1919 వ సంవత్సరంలో స్వాతంత్ర పోరాటంలో చేరారు .
  • గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం చేపట్టారు .
  • 1942 వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్‌ భారతదేశాన్ని వదిలి వెళ్లాలని బ్రిటిష్‌ వారిని డిమాండ్‌ చేసింది .
  • బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా గాంధీజీ ఇచ్చిన నినాదం – డూ ఆర్‌ డై.
  • 1947 ఆగప్ట్‌ 14 అర్థరాత్రి బ్రిటిష్‌ వారు భారతదేశం వదిలి వెళ్లారు .
  • ఆగష్ట్‌ 15 న మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు .
  • ౫భారత రాజ్యాంగాన్ని రచించే బాధ్యత ను రాజ్యాంగ పరిషత్‌ ఎవరికి అప్పగించింది – 8గ అంబేడ్కర్‌ .
  • భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది – 1950 జనవరి 26
  • గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు – జనవరి 26
  • యూరోపియన్‌ లు భారత సముద్రమార్గం కనుగొన్న సంవత్సరం -1498
  • భారతదేశంలో బ్రిటిష్‌ పాలన స్థాపన జరిగిన సంవత్సరం — 1757
  • బ్రిటిష్‌ పాలనపై ప్రజల తిరుగుబాటు – 1857
  • భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన – 1885
  • బెంగాల్‌ విభజన జరిగిన సంవత్సరం – 1905
  • వందేమాతర ఉద్యమం ప్రారంభం అయిన సంవత్వరం -1905
  • సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభం అయింది -1920
  • ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభం అయ్యింది – 1930
  • స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ నాయకత్వం ప్రారంభం అయిన సంవత్సరం – 1919
  • క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభం అయింది – 1942
  • ఆంధ్రప్రదేశ్‌ నుండి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులకు ఉదాహరణ : అల్లూరి సీతారామరాజు , దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, దువ్వ్వూరి సుబ్బమ్మ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కొండా వెంకటప్పయ్య, పోనాక కనకమ్మ, శ్రీ పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు…
  • భారత దేశం రిపబ్లిక్‌ గా మారిన సంవత్సరం – 1950 జనవరి 26
  • జనవరి 26 న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు
  • అవని నుండి అంతరిక్షానికి
  • సముద్ర ప్రయాణం ద్వారా భూమి గుండ్రంగా ఉందని నిరూపించింది – ఫెర్దినాండ్‌ మాజిలాన్‌ .
  • మాజిలాన్‌ ఏ దేశానికి చెందిన నావికుడు – పోర్టుగీస్‌
  • భూమికి నమూనా — గ్లోబ్‌
  • భూమి మీద ఉన్న వివిధ రకాల ప్రాంతాలను గుర్తించడానికి సహాయపడేది — గ్లోబ్‌
  • గ్లోబ్‌ మీద అడ్డంగా నీయబడిన ఊహారేఖలు — అక్షాంశాలు
  • గ్లోబ్‌ మీద నిలువు గా గీయబడిన ఊహా రేఖలు – రేఖాంశాలు
  • అక్షాంశాలు ,రేఖాంశాలు రెండూ ఊహారేఖలే .
  • గ్లోబ్‌ ను అడ్డంగా రెండు సమాన భాగాలుగా విభజించే అక్షాంశం – భూమధ్య రేఖ.
  • గ్లోబ్‌ ను నిలువుగా విభజించు రేఖాంశాన్ని పమంటారు – ప్రైమ్‌ మెరిడియన్‌.
  • భూమి ఒక ఊహాజనిత అక్షం ఆధారంగా కొద్దిగా వంగి తిరుగుతుంది .
  • భూమి తన చుట్టూ తాను తిరగడాని ఏమంటారు – భూ భ్రమణం .
  • భూ భ్రమణానికి పట్టే సమయం — 24 గంటలు.
  • భూ భ్రమణం వలన రాత్రి ,పగల్లు ఏర్పడతాయి .
  • భూమి తన అక్షం పై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు .
  • భూ పరిభ్రమణానికి పట్టే సమయం – 365 రోజులు.
  • భ్రూ పరిభ్రమణం వలన బుతువులు ఏర్పడడం ,బుతువులలో మార్చులు గమనించవచ్చు ం
  • ఖగోళ దూరదర్శిని తో మనం నక్షత్రాలు , గ్రహాలు , ఉపగ్రహాలను పరిశీలించవచ్చు .
  • సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గేయహాలను కలిపి సౌర కుటుంబం అంటారు .
  • సూర్యుని కక్ష్య లో ష్లానెట్స్‌, ఆస్ట రాయిడ్స్‌, తోక చుక్కలు ఇతర పదార్ధాలు ఉంటాయి .
  • సూర్యుని నుండి దూరంలో భూమి స్థానం – 3౩ వది.
  • సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం — బుధుడు.
  • సూర్యునికి అతి దూరంగా ఉన్న గ్రహం -నెప్యూన్‌ .
  • భూమికి గల ఒకే ఒక సహజ ఉపగ్రహం — చంద్రుడు .
  • చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది .
  • భూమి చుట్టూ ఒకసారి చంద్రుడు తిరగడానికి పట్టే సమయం — 27 రోజులు.
  • సౌర కుటుంబంలో ఉన్న మొత్తం గ్రహాలు -8 , అవి — బుధుడు , శుక్రుడు , భూమి ,కుజుడు ,గురుడు, శని, యురేనస్‌, నెప్ట్యూన్‌ .
  • రాకెట్లను ఉపయోగించి అంతరిక్షంలోని ప్రవేశ పెట్టిన మానవ నిర్మిత ఉపగ్రహాన్ని కృత్రిమ ఉపగ్రహం అంటారు.
  • భారతదేశం ప్రయోగించిన మొదటి కృత్రిమ ఉపగ్రహం — ఆర్యభట్ట .
  • ఆర్య భట్ట ఉపగ్రహాన్ని భారత్‌ ప్రయోగించిన సంవత్సరం – 1975 .
  • చంద్రయాన్‌ -2 అను కృత్రిమ ఉపగ్రహాన్ని (2019) july 22 న ప్రయోగించారు .
  • చంద్రయాన్‌ -2 ఉపగ్రహాన్ని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వద్ద గల సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుండి GSLV-MK11-M1 ద్వారా ప్రయోగించారు .
  • చంద్రయాన్‌ -1 తర్వాత తర్వాత ప్రయోగించిన రెండవ ఉపగ్రహం — చంద్రయాన్‌ -2
  • చంద్రయాన్‌ -2 లో అమర్హిన పరికరాలు — ఆర్టిటార్‌, విక్రమ్‌ లాండర్‌, ప్రగ్యాన్‌ రోవర్‌ .
  • కమ్యూనికేషన్‌ ప్రసారం , వాతావరణ శాస్త్రం ,సముద్ర శాస్త్రం ,వనరుల సేవ మొదలైన వాటి సేవలను కృత్రిమ ఉపగ్రహాలు అందచేస్తాయి .
AP Mega DSC: మెగా డీఎస్సీపైనే తొలి సంతకం Total Posts @16347

AP Mega DSC: మెగా డీఎస్సీపైనే తొలి సంతకం Total Posts @16347

 

 AP Mega DSC: మెగా డీఎస్సీపైనే తొలి సంతకం, 

AP Mega DSC: మెగా డీఎస్సీపైనే తొలి సంతకం,

మొత్తం 16,347 టీచర్ పోస్టులు, కేటగిరీల వారీగా వివరాలివీ

Mega DSC Category Wise Details: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన మెగా డీఎస్సీ అంశంపై కీలక ముందడుగు వేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే తొలి సంతకం సంబంధిత దస్త్రంపైనే పెట్టారు. ఈ మెగా డీఎస్సీలో భాగంగా 16,347 టీచర్‌ పోస్టుల భర్తీ జరగనుంది. కేటగిరిల వారీగా పోస్టుల వివరాలను పరిశీలిస్తే ఎస్‌జీటీ : 6,371; పీఈటీ : 132; స్కూల్‌ అసిస్టెంట్స్‌: 7725; టీజీటీ: 1781; పీజీటీ: 286; ప్రిన్సిపల్స్‌: 52 ఉన్నాయి. 

మెగా డియస్సీ పోస్టుల వివరాలు

మొత్తం పోస్డులు  – 16347

స్కూల్ అసిస్టెంట్ – 7725

యస్.జి.టి – 6371

టి.జి.టి – 1781 

పి.జి.టి – 286 

ప్రిన్సిపల్స్ – 52

పి.ఇ.టి – 132

గత  ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి  ప్రభుత్వం కొత్తగా ప్రకటన విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖలో ఖాళీలపై గత రెండు, మూడు రోజులుగా అధికారులు వివరాలు సేకరించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో 16 వేలకుపైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. ఆ ప్రకారం.. మెగా డీఎస్సీ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు.

ఈ క్రమములో మా తరుపున మీకు ఉచితం గా ప్రాక్టీస్ పరీక్షలు ఇవ్వడం జరుగు తుంది 

SS ACADEMY RAJAPURAM

60 DAYS EXAMS SCHEDULE FOR DSC 2024

 

15/06 to 24/06 – 10 DAYS   

15/06/24

10th Telugu – మాతృభావన, జానపదుని జాబు, వెన్నెల, ధన్యుడు

3rd Evs  total textbook

3rd maths  total textbook

16/06/24

10th Telugu – శతక మధురిమ, మా ప్రయత్నం, సముద్ర లంఘనం, మాణిక్య వీణ

4th Evs  total textbook

4th maths  total textbook

17/06/24

10th Telugu – గోరంత దీపాలు, బిక్ష, చిత్రగ్రీవం

5th Evs  total textbook

Method – గణిత శాస్త్ర స్వభావం పరిధి   

18/06/24

9th Telugu – ధర్మబోధ, చైతన్యం, హరివిల్లు

6th Social – సౌరకుటుంబంలో మనభూమి, గ్లోబు భూమికి నమూనా, పటములు

Method – విజ్ఞాన శాస్త్ర స్వభావం, పరిధి

19/06/24

9th Telugu – ఆత్మకధ, స్నేహం, తీర్పు

6th Social – ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు, సంచార జీవనం నుండి స్థిర జీవనం, తొలి నాగరికతలు

Method – సాంఘిక శాస్త్ర స్వభావం, పరిధి  

20/06/24

9th Telugu – మాట మహిమ, ఇల్లలకగానే

6th Social – సామ్రాజ్యాలు గణతంత్రాలు ఆవిర్భావం, రాజ్యాలు & సామ్రాజ్యాలు, ప్రభుత్వం

Method – ఉద్దేశ్యాలు, విలువలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు

21/06/24

9th Telugu – రంగస్థలం, ప్రియమైన నాన్నకి

6th Social – స్థానిక స్వపరిపాలన, భారతీయ సంస్కృతి, భాషలు, మతాలు, సమానత్వం వైపు

Method – గణిత భోదనా పద్దతులు

22/06/24

9th Telugu – ఆశావాది, ఏ దేశమేగినా

7th Social – విశ్వం భూమి, అడవులు, పటాల ద్వారా అధ్యయనం

Method – విజ్ఞాన శాస్త్ర భోదనా పద్దతులు

23/06/24

9th Telugu – నా చదువు, ఆకుపచ్చ శోకం

7th Social – ఢిల్లీ సుల్తానులు, కాకతీయ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం

Method – సాంఘిక శాస్త్ర భోదనా పద్దతులు

24/06/24

8th Telugu – ఆంధ్ర వైభవం, మాతృభూమి

7th Social – మొఘల్ సామ్రాజ్యం, భక్తి – సూఫీ, భారత రాజ్యాంగ పరిచయం

Method – భోదనోపకరణాలు  


  

మా WhatsApp జాయిన్ అవ్వడానికి క్రింది లింకు ను క్లిక్ చేయండి 

క్లిక్ హియర్            


7 వ తరగతి కవి కాలాదులు | DSC Telugu Content

7 వ తరగతి కవి కాలాదులు | DSC Telugu Content

 

Prepare for TET & DSC exams with free mock tests, study materials, and expert guidance at www.tetdsc.com. Ace your teaching career with quality resources!


7 వ తరగతి కవి కాలాదుల పట్టిక

1. అక్షరం

కవి పేరు : రావినూతల ప్రేమకిషోర్
కాలం : 01.08.1965 – 07.10.2019
జన్మ స్థలం : ప్రకాశం జిల్లా కొండపి గ్రామం
తల్లి దండ్రులు : మరియమ్మ, అంకయ్య
మూల గ్రంధం : నలుగురమవుదాం కవితా సంపుటి
ఇతర రచనలు : శ్రమవద్గీత, అజమాయిషీ, నిశి, రెక్కల పుడమి, ఇంకు చుక్క, నిశ్శబ్ద గాయం, టామి, కల్లం దిబ్బ
ఇతర అంశాలు : వీరు రాసి నటించిన అనేక నాటికలకి రాష్ట్ర, రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు, ప్రశంశలు లభించాయి

2. మాయా కంబళి

కవి పేరు : కలువకోలను సదానందా
కాలం : 22.02.1939 – 25.08.2020
జన్మ స్థలం : చిత్తూరు జిల్లా పాకాల
మూల గ్రంధం : మాయా కంబళి సంపుటి
ఇతర రచనలు : పిల్లల కధలు – శివానంద లహరి, విందు బోజనం, చల్లని తల్లి, నీతి కధామంజరి, తుస్సన్న మహిమలు, పరాగ భూమి, చందమామ కధలు వార్తాపత్రికల్లో కధానికలు రాశారు
ఇతర అంశాలు : “బంగారు నడిచిన బాట” నవలకి కేంద్ర సాహిత్య విద్యా శాఖ బహుమతి – 1966 “నవ్వే పెదవులు – ఏడ్చే కళ్ళు” కధా సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డ్ – 1976 “అడవి తల్లి” పిల్లల నవలకి కేంద్ర సాహిత్య బాలసాహితీ అవార్డు – 2010 1992 లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక

3. చిన్ని శిశువు

కవి పేరు : తాళ్ళపాక అన్నమయ్య
కాలం : 09.05.1408 – 23.02.1503
జన్మ స్థలం : కడప జిల్లా తాళ్ళపాక
తల్లి దండ్రులు : లక్కమాంబ, నారాయనసూరి
బిరుదులు : పద కవితా పితామహుడు
ఇతర రచనలు : అన్నమయ్య వేంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32 వేల సంకీర్తనలు రాశారు, 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వేంకటాచల మహాత్మ్యం ఇందులో కొన్ని అలభ్య రచనలు ఉన్నాయి
ఇతర అంశాలు : అన్నమయ్య తన రచనలు వేంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చాడు

4. మర్రి చెట్టు

కవి పేరు : త్రిపురనేని గోపీచంద్
కాలం : 08.09.1910 – 02.11.1962
జన్మ స్థలం : కృష్ణా జిల్లా అంగలూరు
తల్లి దండ్రులు : రామస్వామి పున్నమంబ
ఇతర రచనలు : ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు
ఇతర అంశాలు : పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది

5. పద్య పరిమళం

కవి పేరు కాలం రచన
పోతన
పక్కి అప్పల నరసయ్య
మారద వెంకయ్య
పోతులూరి వీరబ్రహ్మం
గువ్వల చెన్నడు
ఏనుగు లక్ష్మణ కవి
చుక్కా కోటి వీరభద్రమ్మ
గద్దల శామ్యూల్
జెండామన్ ఇస్మయిల్
15 వ శతాబ్దం
16 వ శతాబ్దం
16 వ శతాబ్దం
17 వ శతాబ్దం
17 వ శతాబ్దం
18 వ శతాబ్దం
20 వ శతాబ్దం
20 వ శతాబ్దం
20 వ శతాబ్దం
భాగవతం
కుమార శతకం
భాస్కర శతకం
కాళికాంబ సప్తశతి
గువ్వల చెన్న శతకం
సుభాషిత రత్నావళి
నగజా శతకం
హితోక్తి శతకం
ఆంధ్ర పుత్ర శతకం

7. కప్పతల్లి పెళ్లి

కవి పేరు : చావలి బంగారమ్మ
కాలం : 1897 – 1970
జన్మ స్థలం : తు. గో. జిల్లా కొత్తపేట మండలం మోడెకర్రు గ్రామం
ఇతర అంశాలు : 1930 లో ముద్దు కృష్ణ “వైతాళికులు” ద్వారా వీరి రచనలు వెలుగులోకి వచ్చాయి బంగారమ్మ కవితలు తెలుగు కవిత్వంలో కొత్త ఒరవడిని, సరికొత్త భావవ్యక్తీకరణ తీసుకొచ్చాయి 1958 లో 42 కవితలతో “కాంచన విపంచి” పేరుతో సంకలనం చేశారు

8. ఎద

కవి పేరు : బోనం నాగభూషణం
కాలం : 01.07.1938 – 21.05.1999
జన్మ స్థలం : విజయనగరం జిల్లా మేరంగి గ్రామం
మూల గ్రంధం : కొత్త గాలి కధా సంకలనం
ఇతర రచనలు : భూషణం కధలు, ఏది సత్యం – ఎద సత్యం, కొండగాలి, ఆడవంటుకుంది
ఇతర అంశాలు : ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారు, రచనలు ప్రవృత్తిగా ఎంచుకున్నారు వీరి తొలికధ చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది కలం పేర్లు – శూలపాణి, భూషణం

9. హితోక్తులు

కవి పేరు : రాళ్ళపల్లి ఆనంతకృష్ణ శర్మ
కాలం : 23.01.1893 – 11.03.1979
జన్మ స్థలం : అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్ళపల్లి గ్రామం
తల్లి దండ్రులు : అలివేలు మంగమ్మ, కృష్ణమాచార్యులు
బిరుదులు : గానకళా సింధు, సంగీత కళారత్న
మూల గ్రంధం : శ్రీ శాలివాహన గాధా సప్తశతి సారం
ఇతర రచనలు : సారస్వత లోకం, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శ గ్రంధం
ఇతర అంశాలు : కేంద్ర సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ – 1970 లో సంగీత సాహిత్యాలలో ప్రసిద్ధులు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితులు రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచే పెనుగొండ పాట రాశారు

10. ప్రియమిత్రునికి

కవి పేరు : డా. సూర్యదేవర సంజీవ దేవ్
కాలం : 03.07.1914 – 25.08.1999
జన్మ స్థలం : గుంటూరు జిల్లా తుమ్మపూడి
మూల గ్రంధం : లేఖల్లో సంజీవ దేవ్
ఇతర రచనలు : తెగిన జ్నపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపారుపాలు
ఇతర అంశాలు : వీరు కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు పద్నాలుగు భాషలు చదవగలరు, రాయగలరు

11. బాలచంద్రుని ప్రతిజ్ఞ

కవి పేరు : శ్రీనాధుడు
కాలం : 1385 – 1475
బిరుదులు : కవి సార్వభౌముడు
మూల గ్రంధం : పల్నాటి వీర చరిత్ర
ఇతర రచనలు : మరుత్తరట్ చరిత్ర, శృంగార నైషదం, కాశీ ఖండం, హరవిలాసం, పల్నాటి వీర చరిత్రం, క్రీడాభిరామం
ఇతర అంశాలు : వీరు కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు పద్నాలుగు భాషలు చదవగలరు, రాయగలరు
తొలి తెలుగు రచనలు
తొలి తెలుగు ఇతిహాసం
తొలి తెలుగు రామాయణం
తొలి తెలుగు శతకం
తొలి తెలుగు పురాణం
తొలి తెలుగు ప్రబంధం
తొలి తెలుగు యక్షగానం
తొలి తెలుగు అచ్చ తెనుగు కావ్యం
తొలి తెలుగు నాటకం
తొలి తెలుగు నవల
తొలి తెలుగు కధానిక
తొలి తెలుగు యాత్రా చరిత్ర
ఆంధ్ర మహాభారతం
రంగనాధ రామాయణం
వృషాదీప శతకం
మార్కండేయ పురాణం
మనుచరిత్ర
సుగ్రీవ విజయం
యయాతి చరిత్ర
మంజరీ మధుకరీయం
రాజశేఖర చరిత్ర
దిద్దుబాటు
కాశీయాత్ర చరిత్ర
నన్నయ్య, తిక్కన, ఎర్రన
గోన బుద్దారెడ్డి
పాల్కురికి సోమనాధుడు
మారన
అల్లసాని పెద్దన
కందుకూరి రుద్రకవి
పొన్నగంటి తెలగనార్యుడు
కోరాడ రామచంద్ర శాస్త్రి
కందుకూరి వీరేశలింగం
గురజాడ అప్పారావు
ఏనుగుల వీరాస్వామి
     
తెలుగులో జ్ఞానపీఠ పురష్కార గ్రహీతలు
విశ్వనాధ సత్యనారాయణ
సి. నారాయణ రెడ్డి
రావూరి భరద్వాజ
1970
1988
2012
శ్రీ మద్రామాయణ కల్పవృక్షం
విశ్వంభర
పాకుడురాళ్ళు
     

Written By

Prepare for TET & DSC exams with free mock tests, study materials, and expert guidance at www.tetdsc.com. Ace your teaching career with quality resources!

A.B.Rao

SS Academy ,

Senior Content Writer
 

పదవ తరగతి కవి – కాలాదులు | DCS 2024 – Telugu Content

పదవ తరగతి కవి – కాలాదులు | DCS 2024 – Telugu Content

 పదవ తరగతి కవి – కాలాదులు | DCS 2024 – Telugu Content

మీరు DSC 2024 పరీక్షకు తెలుగు కంటెంట్ కోసం చూస్తున్నారని అర్థం చేసుకున్నాను. DSC (District Selection Committee) పరీక్షకు ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సన్నద్ధం కావాలి. ఇక్కడ మీకోసం తెలుగు సబ్జెక్ట్‌కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను, సిలబస్‌ను మరియు ముఖ్యమైన టాపిక్స్‌ను అందిస్తున్నాను.

DSC 2024 – తెలుగు సిలబస్ మరియు కంటెంట్

1. తెలుగు వ్యాకరణం (Grammar):

  • సందర్భాలు: నామవాచకాలు, సర్వనామాలు, క్రియలు, విశేషణాలు
  • వాక్య నిర్మాణం: సరళ వాక్యాలు, సమాసాలు, సమాసాల రకాలు
  • పదాల రూపాలు: విశేషణం, విశేష్యాలు, కర్త, కర్మ
  • సమస్యల పరిష్కారం: అర్ధవంతమైన వాక్యాలు, సముచిత పదం
  • అలంకారాలు: ఉపమాలంకారం, రూపకాలంకారం, అనన్వయాలంకారం
  • సమస్యాపూరణం: వ్యాకరణ పరమైన ప్రశ్నలు

2. సాహిత్యం (Literature):

  • కవులు మరియు రచయితలు
  • Prepare for TET & DSC exams with free mock tests, study materials, and expert guidance at www.tetdsc.com. Ace your teaching career with quality resources!

    పదవ తరగతి కవి - కాలాదులు | DCS 2024 - Telugu Content

    పదవ తరగతి కవి - కాలాదులు | DCS 2024 - Telugu Content

     

 

Day advantages end sufficient eat towards

Day advantages end sufficient eat towards

Together happy feelings continue juvenile had off one. Unknown may service subject her letters one bed. Down has rose feel find man. Learning day desirous informed expenses material returned six the. Sometimes her behaviour are contented. Do listening am eagerness oh objection collected.

Me unpleasing impossible

Oh acceptance apartments up sympathize astonished delightful. Waiting him new lasting towards. Continuing melancholy especially so to. Me unpleasing impossible in attachment announcing so astonished. Mean are sons too sold nor said. Son share three men power boy you

The future belongs to those who believe in the beauty of their dreams.

Eleanor Roosevelt

Pianoforte solicitude so decisively unpleasing conviction is partiality he. Or particular so diminution entreaties oh do. Real he me fond show gave shot plan. Mean are sons too sold nor said. Son share three men power boy you

Me unpleasing impossible

Assure polite his really and others figure though. Of the day age advantages end sufficient eat expression travelling

Prepare for TET & DSC exams with free mock tests, study materials, and expert guidance at www.tetdsc.com. Ace your teaching career with quality resources!
Own handsome delicate its property mistress her end appetite

Assure polite his really and others figure though. Day age advantages end sufficient eat expression travelling. Of on am father by agreed supply rather either. Own handsome delicate its property mistress her end appetite.

  • So insisted therefore are one received is occasion
  • Real he listened me fond show gave shot plan
  • Oh smiling amiable am so visited cordial in offices hearted

Its sometimes her behaviour are contented. Do listening am eagerness oh objection collected. Together happy feelings continue juvenile had off one. Unknown may service subject her letters one bed.

However distant she request behaved

At ourselves direction believing do he departure. Celebrated her had sentiments understood are projection set. Possession ye no mr unaffected remarkably at. Wrote house in never fruit up. Pasture imagine my garrets an he.

At ourselves direction believing do he departure. Celebrated her had sentiments understood are projection set. Possession ye no mr unaffected remarkably at. Wrote house in never fruit up.

Or particular so diminution entreaties

Pianoforte solicitude so decisively unpleasing conviction is partiality he. Or particular so diminution entreaties oh do. Real he me fond show gave shot plan. Mean are sons too sold nor said. Son share three men power boy you

Down has rose feel find man. Learning day desirous informed expenses material returned six the. She enabled invited exposed him another. Reasonably conviction solicitude me mr at discretion reasonable. Age out full gate bed day lose.

Day advantages end sufficient eat towards

Own handsome delicate its property mistress

Together happy feelings continue juvenile had off one. Unknown may service subject her letters one bed. Down has rose feel find man. Learning day desirous informed expenses material returned six the. Sometimes her behaviour are contented. Do listening am eagerness oh objection collected.

Me unpleasing impossible

Oh acceptance apartments up sympathize astonished delightful. Waiting him new lasting towards. Continuing melancholy especially so to. Me unpleasing impossible in attachment announcing so astonished. Mean are sons too sold nor said. Son share three men power boy you

The future belongs to those who believe in the beauty of their dreams.

Eleanor Roosevelt

Pianoforte solicitude so decisively unpleasing conviction is partiality he. Or particular so diminution entreaties oh do. Real he me fond show gave shot plan. Mean are sons too sold nor said. Son share three men power boy you

Me unpleasing impossible

Assure polite his really and others figure though. Of the day age advantages end sufficient eat expression travelling

Prepare for TET & DSC exams with free mock tests, study materials, and expert guidance at www.tetdsc.com. Ace your teaching career with quality resources!
Own handsome delicate its property mistress her end appetite

Assure polite his really and others figure though. Day age advantages end sufficient eat expression travelling. Of on am father by agreed supply rather either. Own handsome delicate its property mistress her end appetite.

  • So insisted therefore are one received is occasion
  • Real he listened me fond show gave shot plan
  • Oh smiling amiable am so visited cordial in offices hearted

Its sometimes her behaviour are contented. Do listening am eagerness oh objection collected. Together happy feelings continue juvenile had off one. Unknown may service subject her letters one bed.

However distant she request behaved

At ourselves direction believing do he departure. Celebrated her had sentiments understood are projection set. Possession ye no mr unaffected remarkably at. Wrote house in never fruit up. Pasture imagine my garrets an he.

At ourselves direction believing do he departure. Celebrated her had sentiments understood are projection set. Possession ye no mr unaffected remarkably at. Wrote house in never fruit up.

Or particular so diminution entreaties

Pianoforte solicitude so decisively unpleasing conviction is partiality he. Or particular so diminution entreaties oh do. Real he me fond show gave shot plan. Mean are sons too sold nor said. Son share three men power boy you

Down has rose feel find man. Learning day desirous informed expenses material returned six the. She enabled invited exposed him another. Reasonably conviction solicitude me mr at discretion reasonable. Age out full gate bed day lose.

error: Content is protected !!